మనస్తాపంతో రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో రైతు ఆత్మహత్య

Published Sat, Sep 19 2015 2:03 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmer commits suicide

తనకు జీవనాధారమైన వ్యవసాయ భూమిని కొల్లగొట్టేందుకు బంధువులు ప్రయత్నాలు చేస్తుండడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులో మస్తానయ్య (70) అనే రైతు శనివారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మస్తానయ్యకు 3 ఎకరాల వరకు పొలం ఉంది. అయితే, ఆ భూమి తమదంటూ బంధువులు పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించారు. అధికారులు కూడా వారికి సహకరిస్తుండడంతో మస్తానయ్య మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపింస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement