తండ్రిని చంపిన తనయుడు | Father killed by son | Sakshi
Sakshi News home page

తండ్రిని చంపిన తనయుడు

Feb 21 2014 3:11 AM | Updated on Sep 2 2018 4:37 PM

తనయుడి చేతితో తండ్రి హత్యకు గురయ్యాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహావేశానికి గురైన కొడుకు బండరాయితో తండ్రిని మోదాడు.

 తాండూరు రూరల్, న్యూస్‌లైన్:
 తనయుడి చేతితో తండ్రి హత్యకు గురయ్యాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహావేశానికి గురైన కొడుకు బండరాయితో తండ్రిని మోదాడు. దీంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం మండల పరిధిలో వెలుగుచూసింది.  పోలీసుల కథనం ప్రకారం.. మల్కాపూర్ గ్రామానికి చెందిన మంగళి నర్సయ్య(68) రమేష్ తండ్రీకొడుకులు. రమేష్(22)కు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. రెండు నెలల్లో వివాహం ఉంది. పెళ్లి ఖర్చులకు డబ్బులు కావాలని రమేష్ తండ్రిని బుధవారం రాత్రి అడిగాడు.
     తన దగ్గర  లేవని నర్సయ్య చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో ఘర్షణ పడ్డారు. రమేష్ తండ్రిని తోసేయడంతో కిందపడిపోయాడు. అనంతరం బండరాయితో తండ్రి తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన నర్సయ్యను స్థానికులు 108 వాహనంలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వృద్ధుడు గురువారం ఉదయం మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. నర్సయ్య కూతూరు నాగమ్మ ఫిర్యాదుతో నిందితుడు రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement