పాలకొండ (శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. శుక్రవారం పాలకొండ మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ పంక్షన్ హాల్లో నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు శిరీష, నియోజకవర్గ ఇన్చార్జ్ జైకృష్ణ ఇతర పార్టీ నాయకులు హాజరయ్యారు.
కాగా నియోజకవర్గ ఇన్చార్జ్ ఏకపక్ష తీరును ఆ పార్టీ కార్యకర్తలు అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షురాలి సమక్షంలోనే జైకృష్ణ వర్గం..ఇతర పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల తెలుగు తమ్ముళ్లను శాంతపరిచారు.
పాలకొండలో తెలుగుతమ్ముళ్ల బాహాబాహీ
Published Fri, Aug 14 2015 3:46 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
Advertisement
Advertisement