
టీడీపీ ఎంపీ జేసీపై నిషేధం
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి.
ముంబై/విశాఖపట్నం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. గురువారం తమ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి నందుకు జేసీని తమ విమానాల్లో ప్రయాణానికి అనుమతించబోమని ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఆ వెంటనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, స్పైస్జెట్, జెట్ఎయిర్వేస్లు కూడా జేసీపై నిషేధం విధించాయి. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గతంలో ఎయిరిండియా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించి నిషేధానికి గురైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత ఎయిరిండియా ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది.