ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల విభజన అంశంపై కమలనాథన్ కమిటీ గురువారం సచివాలయంఓ భేటీ అయ్యింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల విభజన అంశంపై కమలనాథన్ కమిటీ గురువారం సచివాలయంఓ భేటీ అయ్యింది. ఉద్యోగుల శాశ్వత విభజన మార్గదర్శకాలపై కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశానికి కేంద్ర కార్యదర్శి అర్చనా వర్మ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు హాజరయ్యారు. అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.