చిత్తూరులో వ్యక్తి ఆత్మహత్య | man suicides in chittor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో వ్యక్తి ఆత్మహత్య

Published Mon, Aug 31 2015 9:46 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

man suicides in chittor

చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని రామ్‌నగర్ కాలనీలో డిఎన్.శివప్రసాద్ (48) అనే వ్యక్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక రవాణాశాఖ కార్యాలయం  ఆవరణంలో ఏజెంటుగా పనిచేస్తున్న అతడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో భార్య పని చేసుకుంటుండగా పడక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.

సీలింగ్ ఫ్యాన్ కొక్కీకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపు తర్వాత గమనించిన అతడి భార్య చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే శివప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement