వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు మండలంలోని సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో కోరారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు మండలంలోని సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో కోరారు. కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో 13 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీపైనే ఆధారపడి ఉన్నారన్నారు. చక్కెర కర్మాగారం ఉద్యోగులకు మూడేళ్లుగా జీతాలు కూడా చెల్లించటం లేదని, వారు దుర్భర పరిస్థితిలో ఉన్నారని రవీంద్రనాథ్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఇప్పటికైనా తక్షణం రైతులను ఆదుకోవాలంటూ ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.