నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1.84 లక్షల మంది ఓటర్లున్నారు. 200 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరిన్ని విశేషాలు..
- తంగిరాల సౌమ్య (టీడీపీ), బోడపాటి బాబూరావు (కాంగ్రెస్) ఎన్నికల బరిలో ఉన్నారు.
- తంగిరాల సౌమ్య, బోడపాటి బాబూరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- పోలింగ్ మందకొడిగా సాగుతోంది.
- నందిగామ 80వ పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం, నిలిచిపోయిన పోలింగ్