అనుమానంతో భార్య గొంతు కోసి పరారీ | person Cut the throat of his wife on suspicion | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్య గొంతు కోసి పరారీ

Jan 12 2016 11:50 AM | Updated on Oct 20 2018 6:19 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై అనుమానాన్ని పెంచుకుని కిరాతకంగా గొంతుకోశాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై అనుమానాన్ని పెంచుకుని కిరాతకంగా గొంతుకోశాడు. నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డు శాంతినగర్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన వెంకటేశ్వర్లు ఒడిశా రాష్ట్రానికి చెందిన పుష్పలతను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. శాంతినగర్‌లో కాపురం పెట్టాడు.

ఏమైందోగానీ మంగళవారం తెల్లవారుజామున పుష్పలత గొంతుకోసి అతడు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు రక్తపు మడుగులో పడి ఉన్న పుష్పలతను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న పుష్పలతకు ప్రాణం పోసేందుకు వైద్యులు శస్త్రచికిత్స ప్రారంభించారు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ కిరాతకానికి పాల్పడినట్టు స్థానికుల కథనం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement