venkateswarlu
-
విద్యార్థులకు ఇంత ద్రోహమా?
సాక్షి, అమరావతి: వైద్య విద్య చదవాలని ఆశించే రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉచిత వైద్యం అందకుండా పేదవర్గాలకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న ద్రోహం మరే రాష్ట్ర ప్రభుత్వమూ చేయదని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు వైద్య విద్య, ఉచిత వైద్యం అందకుండా చేయాలన్న లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పులివెందుల కళాశాలకు 50 సీట్లు ఇస్తామన్న సీట్లను కూడా వద్దని లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. ఇలా ఏ ప్రభుత్వమైనా చేస్తుందా అని నిలదీశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతించి, సీట్లు కేటాయించగా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీపై ఆధారపడిన పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కేంద్రంతో కొట్లాడి కొత్త కళాశాలలు, సీట్లు రాబట్టాల్సింది పోయి.. ఇలా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించలేకపోవడం వల్ల విద్యార్థులు 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య ఆశావహులకు తీరని అన్యాయం జరిగిందని డాక్టర్ వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం గత ప్రభుత్వంలో కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ వర్గాల్లోని మెరిట్ విద్యార్థులపై ప్రభావం చూపుతున్న ఈ విధానాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి0ది. దీంతో వైద్య విద్య ఆశావహులు, మెడికోలు టీడీపీపై నమ్మకం పెట్టుకున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలోనే 300 ఎంబీబీఎస్ సీట్లు కన్వినర్ కోటాలోకి కొత్తగా వచ్చేవి. అయితే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయకుండా టీడీపీ నమ్మక ద్రోహం చేసింది. మరోవైపు ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభిస్తే కన్వినర్ కోటాలో మరిన్ని సీట్లు వస్తాయని పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా తీరని నష్టం కలిగించింది. పులివెందుల కళాశాలకు 50 సీట్లు మంజూరు చేసినా, కళాశాల నిర్వహించలేమని ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసి రద్దు చేయించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా చేయదు. కేవలం ఏయూ రీజియన్లో పాడేరుకు 50 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో 22 సీట్లు మాత్రమే కన్వినర్ కోటాకు, 11 ఓపెన్ కాంపిటీషన్కు పోగా 11 సీట్లే రిజర్వేషన్ వర్గాలకు లభిస్తున్నాయి. ఎస్వీ రీజియన్లో ఒక్క సీటు కూడా పెరగలేదు. పులివెందులకు 50 సీట్లు తిరస్కరించకపోయి ఉంటే కన్వినర్ కోటాలో రిజర్వేషన్ వర్గాలకు 11, ఓపెన్ కాంపిటీషన్లో 11 సీట్లు అయినా దక్కేవి. వాస్తవానికి కొత్త కళాశాలలు ప్రారంభమై సీట్లు పెరుగుతాయని చాలా మంది మెరిట్ విద్యార్థులు యాజమాన్య కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడేమో కటాఫ్లు అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాంటి విద్యార్థులకు అన్యాయం జరుగకుండా కనీసం యాజమాన్య కోటాలో దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పించాలి. ఇలాగైతే సామాన్యులకు వైద్య విద్య దూరమవుతుంది కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి వస్తుంది. పేదలు సైతం బోధనాస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో రోగులకంటే వైద్య విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. సరిపడా ఫ్యాకల్టీ, రోగులు ఉండరు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెబితే వాటిలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అక్కడ రోగులు కిటకిటలాడుతున్నారు. ఎందుకంటే వాటిలో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టే. అదే ప్రైవేట్కు కట్టబెడితే డబ్బు పెట్టి పేదలు వైద్యం పొందే అవకాశం ఉంటుందా? ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కడుతోంది. ఇంత దారుణం మరే రాష్ట్రంలోనూ ఉండదు. సీఎం చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టి, పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేయాలన్నదే ఆయన లక్ష్యమని స్పష్టమవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్య కోర్సుల్లో ఫీజులను విచ్చలవిడిగా పెంచారు. డబ్బున్న వారికే వైద్య పట్టా అన్నట్టుగా తయారు చేశారు. 2014–19 మధ్య ప్రైవేట్లో యాజమాన్య కోటాలో మెడికల్ పీజీ ఫీజును రూ.5.25 లక్షల నుంచి ఏకంగా రూ.24.20 లక్షలకు పెంచారు. రూ.5.25 లక్షల ఫీజు అంటే బ్యాంక్ లోన్ తీసుకొనో, బయట అప్పులు చేసో పేద, మధ్య తరగతి వైద్యులు పీజీ చేయడానికి సాహసిస్తారు. పీజీలో చేరాక వారికి వచ్చే స్టైఫండ్తో అప్పు తీర్చుకోవచ్చనే నమ్మకం ఉంటుంది. ఐదింతలు పెంచే సరికి ఆ అవకాశం కూడా లేక, అంత ఫీజు కట్టలేక చాలా మంది పీజీ చదవలేకపోయారు. అంతే కాదు టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, మెడిసిన్ సీట్లు తెచ్చిన దాఖలాలూ లేవు.ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ఇదే తీరు ఈడబ్ల్యూఎస్ కోటా పైనా చంద్రబాబు ప్రభుత్వం తీరు ఇలానే ఉంది. ఎంబీబీఎస్ సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ సీట్లు పెంచకుండా కోటా అమలుకు జీవో ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. కోర్టులో కేసులు వేస్తే జీవో రద్దు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిందే గానీ సీట్లు పెంచడానికి కృషి చేస్తామని మాత్రం చెప్పలేదు. అంటే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కొరత సృష్టించి, ప్రైవేట్ వైద్య కళాశాలలకు డిమాండ్ పెరిగేలా చేస్తున్నారు. -
ముందుబాబులతో చిందులేసిన ఏఎస్ఐపై చర్యలు
ఒంగోలు: విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్సై ఓ గ్రామంలో మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లారు. దీంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్(వీఆర్)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల కోసం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలుస్తోంది.ఒకవైపు కారులో హోరెత్తుతున్న మూజ్యిక్.. మరోవైపు నిషా నెత్తికెక్కి మత్తులో హుషారుగా చిందులేస్తున్న మందుబాబు. అయితే వారితో జతకట్టాడు ఓ ఏఎస్సై. తనలోని కళా పోషకుడిని తట్టి నిద్ర లేపాడు. మందుబాబు చిందులకు చేతిలో గ్లాసుతోనే ఈలలేసి గోల చేస్తూ మరింత ఉత్సాహపరిచాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. వివరాలు.. ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.దీంతో పోలీసులు అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. దీంతో ఆయన విధి నిర్వహణను విస్మరించి.. గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు.కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఎస్ఐ ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది.… pic.twitter.com/PkTVwJAH6n— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024 -
గుట్టలెక్కి.. పోలియో చుక్కలు వేసి..
వాజేడు: ఇద్దరే ఇద్దరు పిల్లలున్న గ్రామమది. అయితేనేం.. దారిలేని ఆ గ్రామానికి వైద్య సిబ్బంది గుట్టలెక్కి నడిచి వెళ్లారు. పోలియో చుక్కలు వేసి వచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జీపీ పరిధి పెనుగోలు గ్రామం గుట్టలపై ఉంది. అక్కడికి వెళ్లాలంటే మండల కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరం. అంతా రాళ్ల దారి. ఈ గ్రామంలో అయిదేళ్లలోపు పిల్లలు ఇద్దరున్నారు. పల్స్ పోలియోలో భాగంగా ఆ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి వాజేడు పీహెచ్సీ హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, లఖాన్, ధర్మయ్య ఆదివారం కాలినడకన అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు పిల్లలకు పోలియో చుక్కలు వేసి భోజనం చేసి తిరిగి పీహెచ్సీకి చేరుకున్నారు. -
Hyderabad: గుండెపోటుతో డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు మృతి
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్ (20) మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్లగొండ జిల్లాకు తరలించారు. కాగా చంద్రతేజ్ ఓ ప్రైవేటు కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. స్వతహాగా వ్యాపరంలో రానిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లుకు కారును కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఈ లోపే చిన్న కుమారుడు మృతితో చంద్రతేజ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణం
-
కామాంధులకు 20 ఏళ్ల జైలు, జరిమానా
కామంతో కళ్లు మూసుకు పోయి అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు కామాం ధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పులిచ్చాయి. కర్నూలు(లీగల్)/పార్వతీపురంటౌన్/అనంతపురం: కామంతో కళ్లు మూసుకుపోయి వేర్వేరు ప్రాంతాలకు చెందిన అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు కామాంధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పునిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామానికి చెందిన పెరుమాళ్ల వెంకటేశ్వర్లు కుమార్తె (17) నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉండేది. 2019 నవంబర్ 12వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను భయపెట్టి మధ్యాహ్నం సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పదిరోజుల అనంతరం తన తండ్రి చేసిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది. దీంతో తల్లి, కుమార్తె నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుపై పోక్సో చట్టం, ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలు జిల్లా పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసలోని ఓ పాఠశాలలో నాలుగోతరగతి చదువుతున్న చిన్నారిని విడిచిపెట్టి తల్లి ఎటో వెళ్లిపోయింది. చిన్నారి ఐరన్ షాపులో పనిచేస్తున్న తండ్రి వద్దనే ఉంటూ చదువుకుంటోంది. 2022 సంవత్సరం జూలై నెలలో చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల తరువాత చిన్నారి పుట్టినరోజు సందర్భంగా నిందితుడు కేక్ తెచ్చాడు. దీంతో చిన్నారి తన స్నేహితురాలిని ఇంటికి ఆహ్వానించింది. బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాలు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిద్రపోతుండగా ఇద్దరిపైనా కసాయి తండ్రి లైంగికదాడికి యత్నించాడు. చిన్నారులు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టాడు. విషయాన్ని బాధితురాలి స్నేహితురాలు తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమె ఇద్దరు బాలికలను తీసుకెళ్లి రెండు ఘటనలపైనా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ కేసు నమోదు చేశారు. రెండు కేసుల్లోనూ నేరం రుజువు కావడంతో ఎస్సీ, ఎస్టీ పోక్సోకోర్టు ఇన్చార్జి జడ్జి షేక్సికిందర్ బాషా ముద్దాయికి ఒక్కో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత చిన్నారులు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ వివరాలను పార్వతీపురం మన్యం జిల్లాఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామంలో తల్లిదండ్రులతో కలసి 13 ఏళ్ల బాలిక ఉండేది. 2019 ఆగస్టు 7వ తేదీన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పూజారి ఈశ్వరయ్య అనే వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు గోరంట్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్దాయిపై అభియోగాలు రుజువు కావడంతో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.5 వేల జరిమానా విధిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. -
బత్తాయి..భలే భలే..
సాక్షి, అమరావతి: మోసంబిగా పిలిచే బత్తాయి పండ్లకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. ఏపీలో సాగవుతున్న బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు సైతం ఏపీ నుంచే వెళ్తున్నాయి. కొంతకాలంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి నేపాల్కు ఎగుమతి చేస్తున్న వ్యాపారులు ఇకనుంచి సింగపూర్, మలేషియా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ తదితర దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బత్తాయి పండ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ ఏడాది పెద్దఎత్తున ఎగుమతి చేసేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జ్యూస్ ఎక్కువగా వచ్చే సాతుగుడి రకం బత్తాయిలను బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ నుంచి విదేశాలకు పంపించనున్నారు. ఏపీలోనే సాగు అధికం బత్తాయి సాగు, దిగుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ పండే బత్తాయి పండ్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సాగు విస్తీర్ణంలో సగానికి పైగా రాయలసీమ జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో సాతుగుడి, చీని రకాల బత్తాయి సాగవుతుండగా.. రైతులు ఏటా రెండు పంటలు తీస్తున్నారు. 2018–19లో రాష్ట్రవ్యాప్తంగా 2.14 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సాగు విస్తీర్ణం 2.85 లక్షల ఎకరాలకు విస్తరించింది. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు తోట బడుల పేరిట శిక్షణ ఇస్తుండటంతో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో పండే పంటలో 85 శాతం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. 15 శాతం మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు వెళుతోంది. మొదలైన ఎగుమతులు రాష్ట్రంలో సాగయ్యే బత్తాయిల్లో సగానికి పైగా ఢిల్లీలోని ఆజాద్పూర్ మార్కెట్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతోంది. ప్రస్తుతం బత్తాయి కోతలు ప్రారంభం కాగా.. కళ్లాల నుంచే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఢిల్లీ మార్కెట్ నుంచి ఆర్డర్లు కూడా మొదలయ్యాయని అనంతపురానికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు తెలిపారు. ఈసారి విదేశాలకు సైతం బత్తాయిల ఎగుమతికి వ్యాపారులు పూనుకోవడంతో ధర కూడా మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ధర బాగుంది ఈసారి బత్తాయి పంట బాగుంది. రికార్డు స్థాయిలోనే దిగుబడి నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్య పలుకుతోంది. గతంలో ఎప్పుడూ ఈ సమయంలో ఇంత రేటు పలికిన సందర్భాలు లేవు. ఈసారి టన్ను రూ.లక్ష మార్క్ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
టీడీపీ కార్యాలయం వద్ద ప్రమాదం
మంగళగిరి: గుంటూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద శుక్రవారం బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ర్యాలీగా ఇక్కడకి వచ్చారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు మద్యం మత్తులో ఇష్టానుసారంగా బాణసంచా కాల్చారు. దీంతో అక్కడ ఉన్న బాణసంచాకు అంతటికీ నిప్పు రవ్వలు అంటుకుని ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంగళగిరిలోని మార్కండేయ కాలనీకి చెందిన తాడిశెట్టి చెన్నయ్య, తాడిశెట్టి వెంకటేశ్వర్లు, నంబూరుకు చెందిన కారు డ్రైవర్ కొడాలి షణ్ముఖ, కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కేసర గ్రామానికి చెందిన ఎస్కే హుస్సేన్ సాహెబ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం చినకాకాని ఎన్నారై వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో చెన్నయ్య, వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కార్యాలయం వద్ద ర్యాలీ అదుపుతప్పడం, కార్యకర్తలు మద్యం సేవించి ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. -
తోరణాలైనా వాడకముందే కడతేర్చాడు
వనపర్తి: పెళ్లిచేసుకున్న రెండు వారాలకే అనుమానంతో భార్యను, అత్తను కడతేర్చాడు ఓ యువకుడు. వనపర్తి జిల్లాకేంద్రంలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వెంకటేశ్వర్లు, రమాదేవి అలియాస్ జ్యోతి(45)ల కుమార్తె రుక్మిణి(21), ఏపీలోని కర్నూలుకు చెందిన శ్రావణ్ వివాహం ఈ నెల 1వ తేదీన వనపర్తిలో జరిగింది. పెళ్లి అయిన 13 రోజుల వ్యవధిలోనే భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్యను కాపురానికి తీసుకెళ్లడానికి శ్రావణ్ వనపర్తికి వచ్చాడు. రుక్మిణితోపాటు అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్లును కూడా మంగళవారం కర్నూలు నగరంలోని చింతలమునినగర్లో ఉన్న తమ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే తల్లీకూతుళ్లపై కూరగాయలు కోసే కత్తితో శ్రావణ్ దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతి, రుక్మిణి అక్కడికక్కడే మృతిచెందగా, అడ్డుకోబోయిన వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు స్పందించి వెంకటేశ్వర్లును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లి చేసుకున్న రెండు వారాలకే భార్యపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. -
సీపీఐ సీనియర్ నేత వెంకటేశ్వర్లు కన్నుమూత
దిల్సుఖ్నగర్: సీపీఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు ఆదివారం రాత్రి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న ఆయన ఆర్కేపురం డివిజన్ గ్రీన్హిల్స్కాలనీలో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లాలో జన్మించిన వెంకటేశ్వర్లు విద్యార్థి, యువజనోద్యమాల్లో కీలకపాత్రతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కొంతకాలంగా క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సరళ న్యాయమూర్తిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, పశ్య పద్మ తదితరులు సోమవారం ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ ఉత్తమ నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. చైత్యన్యపురి కాలనీలోని వీవీనగర్లో ఉన్న స్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
చెరువులో ఈతకొడుతూ.. టీఆర్ఎస్ నాయకుడి కన్నుమూత
సాక్షి,ఇల్లెందు (ఖమ్మం): పట్టణంలోని కాకతీయ నగర్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు గండమళ్ల వెంకటేశ్వర్లు(55) చెరువులో ఈత కొడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం మండలంలోని లలితాపురం చెరువుకు ఈతకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతున్న క్రమంలో అకస్మాత్తుగా నీట మునిగిపోయాడు. గమనించి సహచరులు ఒడ్డుకు చేర్చారు. చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుదీర్ఘ కాలం ఏఐటీయూసీలో పనిచేసిన ఆయన కార్మిక నాయకుడిగా పట్టణ ప్రజలకు పరిచితుడు. అనంతరం టీఆర్ఎస్లో చేరాడు. మృతదేహాన్ని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్నాయక్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సందర్శించారు. చదవండి: యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే.. -
ఎమ్మెల్సీ సతీమణి కన్నుమూత
జనగామ/హైదరాబాద్: శాసన మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి(62) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీ బోడకుంటి సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి బోడకుంటిని పరామర్శించారు. -
రైతు కూలీగా మారిన జిల్లా కలెక్టర్
సాక్షి, భూపాలపల్లి : ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడు బిజీగా ఉండే అధికారి రైతు కూలీగా మారి పొలంలో వరినాట్లు వేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. ఆ అధికారి పేరు వాసం వెంకటేశ్వర్లు. ఈయన భూపాలపల్లి కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రైతుల సమస్యలే ఎజెండాగా తీసుకొని వాటిని పరిష్కరిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు. భూ పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏన్నో ఏళ్లుగా రైతులు పడుతున్న సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపించారు. తాజాగా జిల్లాలోని ఘనపురం మండలంలో రైతు సమస్యల పరిష్కారం కోసం వెళుతున్న క్రమంలో దారి మధ్యలో రైతు కూలీగా మారి పొలంలో నాట్లు వేశారు. ఒక జిల్లాకు కలెక్టర్ అయి ఉండి ఎలాంటి బేషజాలకు పోకుండా మాతో కలిసి వరినాట్లు వేయడం తమకెంతో ఆనందం కలిగించదని అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
టీఎస్టీఏ అధ్యక్షునిగా వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్టీఏ) నూతన కార్యవర్గం సోమవారం కొలువుదీరింది. ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాబోయే నాలుగేళ్ల కాలానికి గానూ టీఎస్టీఏ అధికారుల్ని ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా టెన్నిస్ సంఘానికి చెందిన మద్దినేని వెంకటేశ్వర్లు టీఎస్టీఏ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జగిత్యాల జిల్లా టెన్నిస్ సంఘానికి చెందిన అశోక్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా వి. నారాయణ్ దాస్ (మేడ్చల్ జిల్లా టెన్నిస్ సంఘం), కోశాధికారిగా డి. చంద్రశేఖర్ (రంగారెడ్డి జిల్లా లాన్ టెన్నిస్ సంఘం) నియమితులయ్యారు. కేఆర్ రామన్ (రంగారెడ్డి జిల్లా లాన్టెన్నిస్ సంఘం), టి. నరసింగా రెడ్డి (వరంగల్ జిల్లా టెన్నిస్ సంఘం), పుల్లారావు (నల్లగొండ జిల్లా లాన్టెన్నిస్ సంఘం), పి. బాల కిషన్ రావు (ఖమ్మం జిల్లా టెన్నిస్ సంఘం) ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇతర సభ్యులుగా ఎస్. సతీశ్ రెడ్డి (నాగర్ కర్నూల్), ఎస్. ముకుంద్ రావు (ఆదిలాబాద్), డీఆర్సీ కిరణ్ (మేడ్చల్), జి. యుగంధర్ రెడ్డి (భద్రాద్రి కొత్తగూడెం), సుల్తాన్ ఆసిఫ్ ఇక్బాల్ (మెదక్) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అఖిల భారత టెన్నిస్ సంఘం సంయుక్త కార్యదర్శి అనిల్ ధూపర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. -
కలెక్టర్ ఔదార్యం
సంగారెడ్డి టౌన్: నిస్సహాయులకు మానవతా దృక్పథంతో చేతనైన సాయం చేసి చేయూతనివ్వాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి కలెక్టర్ సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఎంఎన్ఆర్ ఆస్పత్రి పరిసరాలు, బైపాస్రోడ్డు, పోతిరెడ్డిపల్లి ఎక్స్రోడ్, బాలాజీ నర్సింగ్ హోం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై ఒంటిమీద సరైన దుస్తులు లేకుండా, పెరిగిన జుట్టు, అపరిశుభ్రంగా, మతిస్థితిమితం లేని, కుటుంబ సభ్యుల నిరాధరణకు గురైన ఎనిమిది మందిని గుర్తించి వారిని అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని ఇన్సెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ (మానసిక దివ్యాంగుల వార్డు)కు తరలించారు. అక్కడ జట్టు కత్తిరించి, శుభ్రంగా స్నానం చేయించిన తర్వాత కలెక్టర్ వారికి కొత్త దుస్తులు, దుప్పట్లను అందజేశారు. అల్పాహారాన్ని తెప్పించి ఇచ్చారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి వారికి వైద్య చికిత్సలు నిర్వహించారు. మళ్లీ రోడ్ల మీదకు రాకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మనోహర్కు కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో నిరాధరణకు గురైన, మతిస్థిమితం లేని వారు ఎవరైనా తారసపడితే వారిని ఇన్సెడ్ స్వచ్ఛంద సేవా సంస్థలో అప్పగించాలని అన్నారు. వారికి చేయూత నివ్వడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి, సంగారెడ్డి, కంది తహసీల్దారులు విజయ్కుమార్, గోవర్థన్ ఉన్నారు. -
దాడి కేసులో యువకుడి అరెస్టు
పామూరు: వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఊసా సాంబశివయ్య తెలిపారు. పట్టణానికి చెందిన గద్దే గోపీని వ్యక్తిగత కలహాలతో గత నెల 7వ తేదీన తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలో క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుకాగా శనివారం దాడికి పాల్పడిన వెంకటేశ్వర్లును అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఊసా సాంబశివయ్య తెలిపారు. -
ప్రధానోపాధ్యాయుడికి అరెస్ట్ వారెంట్
గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని మైలారం గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చీటింగ్ కేసుకు సంబంధించి కరీంనగర్ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ రావడంలో ఆ పాఠశాలలో అలజడి నెలకొంది. వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయుడిగా 2009లో మైలారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈయనపై ఒక చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, వాయిదా ప్రకారం కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ను కోర్టు జారీ చేసిందని పోలీసులు తెలిపారు. ఈనెల 6తో గడువు ముగుస్తుండడంతో సోమవారం ఎస్సై వంశీకృష్ణ పాఠశాలకు వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు అందుబాటులో లేవపోవడంతో.. మండల ఇన్చార్జి విద్యాధికారి లక్ష్మణ్రావును ఎస్సై ఫోన్లో సంప్రదించగా పాఠశాలకు చేరుకున్నారు. ప్రధానోపాధ్యాయుడిపై ఎంఈవో విచారణ చేపట్టారు. గత నెల 24 సాయంత్రం నుంచి 27 ఉదయం పూట పాఠశాలకు అధికారికంగా సెలవు తీసుకున్నారని తెలిపారు. సెలవులు ముగిసిన నుంచి తిరిగి పాఠశాలకు రావడం లేదని ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, గ్రామస్తులు ఎంఈవోకు తెలిపారు. దీనిపై జిల్లా విద్యాధికారికి సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
హైదరాబాద్లో టీవీఎస్ నకిలీ పార్ట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉప్పు, పప్పులే కాదండోయ్.. వాహన విడిభాగాల్లోనూ నకిలీలున్నాయ్! అవి కూడా హైదరాబాద్లో. ఇటీవల వాహన తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ జరిపిన దాడిలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్ రాంకోఠికి చెందిన ఓ ప్రముఖ విక్రయశాలలో రూ.6 లక్షల విలువ చేసే ద్విచక్ర, త్రిచక్ర వాహనాల నకిలీ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నామని.. సంబంధిత స్టోర్ యజమాని మీద కేసులు కూడా నమోదు చేశామని టీవీఎస్ మోటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (పార్ట్స్ బిజినెస్) కె.వెంకటేశ్వర్లు గురువారమిక్కడ చెప్పారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... నకిలీ బ్రేకులు, క్లచ్లు.. మూడు నెలలుగా హైదరాబాద్తో సహా బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, కోయంబత్తూరు నగరాల్లోని 55 ప్రాంతాల్లో దాడులు నిర్వహించాం. వీటిలో రూ.55 లక్షల విలువ చేసే నకిలీ విడిభాగాల్ని గుర్తించాం. బ్రేకులు, చెయిన్, కేబుల్స్, క్లచ్ ప్యాడ్స్ వంటి ఎక్కువ విక్రయాలు జరిగే విడిభాగాలే నకిలీలున్నాయి. ఇవి బెంగళూరు, ఢిల్లీ, కోల్కతాల్లోని 8 కేంద్రాల్లో తయారవుతున్నాయి. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు సరఫరా అవుతున్నాయి. సంబంధిత తయారీ కేంద్రాలు, యాజమాన్యం మీద కాపీ రైట్స్ చట్టం కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్లో మాత్రం తయారీ కేంద్రం ఉన్నట్లు గుర్తించలేదు. అయితే దాడులింకా పూర్తవ్వలేదు. ఈ ఏడాదంతా కొనసాగుతాయి. నకిలీ విడిభాగాలను గుర్తించేందుకు, దాడులు చేసేందుకు 12 ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నాం. అవి గుర్తించిన ఉత్పత్తులను కంపెనీ పరిశోధన బృందం పరీక్షించి అవి నకిలీ ఉత్పత్తులేనని తేలాక.. సంబంధిత ప్రాంతాల్లో పోలీసు, ఏజెన్సీలతో కలసి దాడులు చేస్తాం. ఏప్రిల్లో హెచ్అండ్ఎస్ కేంద్రాలు.. హబ్ అండ్ స్పోక్ (హెచ్అండ్ఎస్) విధానంలో విడిభాగాలను విక్రయించాలని నిర్ణయించాం. ఈ కేంద్రాలేం చేస్తాయంటే.. కంపెనీ నుంచి హబ్కు బల్క్లో టీవీఎస్ ఉత్పత్తులను పంపిస్తాం. అక్కడి నుంచి 150 కి.మీ. పరిధిలోని డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరుతాయి. ప్రతి హబ్ 2 నెలలకొకసారి ప్రతి రిటైలర్లతో సంప్రతించడం, పర్యవేక్షించడం వంటివి చేయాలి. ఇదంతా టెక్నాలజీతో కలిసి ఉంటుంది. ప్రతి రిటైల్ స్టోర్, ఉత్పత్తులు ట్రాక్ అవుతాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఏడాదిన్నర క్రితం నుంచి తమిళనాడులో 10 హెచ్అండ్ఎస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 9 మంది గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూషన్లున్నాయి. వీటినే హెచ్అండ్ఎస్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏప్రిల్లో అధికారికంగా ప్రారంభిస్తాం. ఏడాది ముగిసే నాటికి మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఈ విధానాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాం. విపణిలోకి అదనపు ఫీచర్లతో ఉత్పత్తులు.. ప్రతి విడిభాగం గరిష్ట అమ్మకం ధర (ఎంఆర్పీ) మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే అది నకిలీనా? ఒరిజినలా? అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ క్యూఆర్ కోడ్ను ఒకసారి స్కాన్ చేస్తే రెండోసారి చేసేటప్పుడు గతంలో వినియోగించారని వస్తోంది. అందుకే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న విడిభాగాల్లో అదనపు ఫీచర్లను జోడిస్తున్నాం. ప్రతి ఉత్పత్తి మీద సూక్ష్మ అక్షరాలతో టీవీఎస్ అని ఉంటుంది. ఇది చూసేందుకు రంగుతో ఉంటుంది కానీ, పరీక్ష చేస్తే కంపెనీ పేరు కనిపిస్తుంది. ఇలాంటి ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను విపణిలోకి ప్రవేశపెడుతున్నాం. -
మంచి పారిశ్రామిక విధానంతో పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ పారిశ్రామిక విధానంతోనే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని శాసన మండలి ప్రభు త్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రి కేటీఆర్కు ప్రశం సలు దక్కుతున్నాయనే కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తన అక్కసును వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్తో కలసి విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ మంత్రిగా విఫలమైన షబ్బీర్.. మంత్రి కేటీఆర్ను మిస్టర్ ఫెయిల్యూర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. గల్ఫ్ బాధితుల కోసం కాంగ్రెస్ హయాంలో చేసిందేమీ లేదని, కేవలం ట్వీటర్లో వచ్చిన ఒక్క ట్వీట్కే కేటీఆర్ స్పందించి ఎందరో బాధితులను కాపాడారన్నారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయనే అక్కసుతో కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని, నాలుగైదు బతుకమ్మ చీరలు కాల్చి మహిళలు అసంతృప్తిగా ఉన్నారని దుష్ప్రచారం సాగించిందని మండిపడ్డారు. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్ ప్రభుత్వ పథకాల సమా చారం తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతానంటే కుదరదని ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్ అన్నారు. -
మెట్రో పిల్లర్ను ఢీకొన్న కారు
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీ కొట్టిన ఘటనలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట అష్టలక్ష్మీ దేవాలయ కమాన్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నుంచి కొత్తపేటకు కారులో వస్తున్న సీఐ వెంకటేశ్వర్లు కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీ కొట్టడంతో ఆయనకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ధలికి చేరుకుని సీఐను కొత్తపేట ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు. -
ఇద్దరు రైతుల బలవన్మరణం
సంతమాగులూరు/పుల్లలచెరువు: ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు, పుల్లలచెరువు మండలాల్లో అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు బాగా పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక మంగళవారం తెల్లవారుజామున పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పుల్లలచెరువు మండలం ఐటీవరంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డి అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు -
ఏసీబీ వలలో హెడ్కానిస్టేబుల్
నెల్లూరు: జిల్లాలో పోలీసు శాఖ ఉద్యోగుల అవినీతి బట్టబయలైంది. కిందిస్ధాయి నుంచి అధికారుల వరకూ అవినీతికి పాల్పడుతున్నారు. వైన్ షాపుల నుంచి లంచాలను తీసుకుంటున్న బుచ్చిరెడ్డిపాలెం హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చిరెడ్డిపాలెంలో వంశీ, పద్మా వైన్షాపుల యజమాని చల్లా వెంకటేశ్వర రెడ్డి పోలీసులు లంచం ఇవ్వమని తనను వేధిస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతికి పాల్పడుతున్న పోలీసులను పట్టుకునేందుకు పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు.. వెంకటేశ్వరరెడ్డితో అతని భార్య పద్మ వద్ద నుంచి డబ్బులు తీసుకోవాలని పోలీసులకు చెప్పించారు. దీంతో డబ్బును తీసుకోవడానికి బుచ్చిరెడ్డిపాలెం పోలీసుస్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు మద్యం షాపుల యజమాని ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ నిఘా వేసిన ఏసీబీ అధికారులు రూ.26 వేల నగదును తీసుకుంటుండగా వెంకటేశ్వర్లును పట్టుకున్నారు. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు.... లంచం తీసుకుంటూ పట్టుబడిన హెడ్కానిస్టేబుల్ను ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ విచారించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి నుంచి సీఐ సుబ్బారావు, ఎస్సై సుధాకర్ రెడ్డి, ఏఎస్సైలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ అందరికీ నెలసరి మామూళ్లలో భాగం ఉందని హెడ్ కానిస్టేబుల్ విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. రైటర్గా చేరినప్పటి నుంచి తానే నగదు తీసుకెళ్లి అందరికీ పంచుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అంగీకరించారని చెప్పారు. అధికారులు చెబితేనే తాను లంచం తీసుకోవడానికి వచ్చినట్లు కూడా చెప్పారని వివరించారు. మండలంలోని పది దుకాణాలు రూ.13వేల చొప్పున ప్రతి నెలా మామూళ్లు ఇస్తారని విచారణలో వెల్లడైందని ప్రభాకర్ తెలిపారు. విచారణ జరుపుతున్నాం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సేకరించిన మొత్తంలో అధికారుల భాగస్వామ్యం ఉన్నందున విచారణ జరుపుతున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఎస్సైను విచారించేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేరని.. పూర్తి విచారణ జరిపిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 25 లక్షలు నష్టపోయాను బుచ్చిరెడ్డిపాలెంలో వంశీ, పద్మ మద్యం దుకాణాలు పెట్టి 25 లక్షలు నష్టపోయామని ఫిర్యాదుదారుడు చల్లా వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. మద్యం దుకాణాల నుంచి ప్రతి నెలా పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్, మద్యం డిపో తదితరులందరికీ లంచం ఇవ్వాలని చెప్పారు. అలా తాను రూ.25 లక్షలు నష్టపోయానని వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. పోలీసులు లంచం ఇవ్వాలని వేధిస్తుండడంతో తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించానని వివరించారు. -
ఏసీబీకి చిక్కి.. మనస్తాపంతో ఈఈ ఆత్మహత్య
నిజామాబాద్: అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డానని మనస్తాపానికి గురై ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ)గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు శనివారం ఉదయం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే ఈ సంఘటనతో మనస్తాపం చెందిన ఆయన సాయంత్రం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ వ్యక్తి వద్ద రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా ఈఈని పట్టుకున్నారు. అయితే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఏసీబీ అధికారుల తీరును నిరసిస్తూ ఏసీబీ డీఎస్పీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగులు ఆస్పత్రిని ముట్టడించారు. ఏసీబీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
డ్యూటీలోనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
-
డ్యూటీలోనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కొత్తపేట: ఉన్నతాధికారి వేధింపులు తాళలేక విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్స్టేషన్లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు గురువారం ఉదయం డ్యూటీలో ఉండగానే నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన తోటి పోలీసులు చికిత్స నిమిత్తం కానిస్టేబుల్ను జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సీఐ శ్రీకాంత్ వేధిపుల వల్లే వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం అయ్యప్పనగర్కు చెందిన నాగిడి వెంకటేశ్వర్లు(25) అనే యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల్ల మనస్తాపానికి గురై తనువు చాలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా ‘సిద్ధార్థ’ ఫ్రెషర్స్ డే
చిన్న ఆవుటపల్లి(గన్నవరం రూరల్) : మండలంలోని చిన్న ఆవుటపల్లి డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాల ఫ్రెషర్స్డే వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. హాజÆ హనుమార గ్యాలరీలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైన సిద్థార్థ అకాడమీ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉత్తమ వైద్యులుగా పనిచేయాలని సూచించారు. వైద్యుడి గొప్పదనాన్ని రోగులు మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రచారం చేస్తారని అన్నారు. నైపుణ్యాన్ని పెంచుకుంటూ, రోగులతో సేవాభావం, మంచి మాటలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కిల్స్ నిరంతరం పెంచుకునే వైద్య రంగంలో దంత వైద్య విద్యార్థులుగా చేరిన బీడీఎస్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామోజీరావు మాట్లాడుతూ అత్యుత్తమ ప్రమాణాలతో కళాశాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మూర్తి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ¯Œæవీ కృష్ణారావు, అకాడమీ ప్రతినిధి చక్రధరరావు, దంత వైద్య కళాశాల ఎవో వై.మధుసూదనరావు, మెడికల్ కళాశాల ఎవో కిరణ్ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
విద్యుదాఘాతంతో పత్తి రైతు మృతి
పొలంలో దున్నుతున్న రైతు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్నకు గురై మృతి చెందాడు. వివరాలివీ... ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన తెల్లబోయిన వెంకటేశ్వర్లు(53) రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. మంగళవారం మధ్యాహ్నం కలుపు తీతలో భాగంగా దున్నుతున్నాడు. నాగలికి పక్కనే స్తంభం నుంచి ఉన్న జీ వైర్ తాకటంతో షాక్తో వెంకటేశ్వర్లు పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. -
చెరువులు నిండితేనే ఉపాధి
మత్స్యకార్మికుల సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్వర్లు దుబ్బాక రూరల్: వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండితేనే మత్స్య కార్మికులకు ఉపాధి లభిస్తుందని జాతీయ మత్స్యకార్మికుల సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కురిసిన వర్షాలకు దుబ్బాకలోని పెద్ద చెరువు, రామసముద్రం చెరువులలోనికి కొంత మేరకు నీళ్లు చేరుకున్నాయి. చెరువులను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెరువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మిషన్కాకతీయ ద్వారా అభివృద్ది చేశారన్నారు. చెరువులు నిండితే మత్స్య కార్మిలకులే కాకుండా రైతులు కూడా సుఖసంతోషాలతో జీవిస్తారన్నారు. చెరువు ఊరికి తల్లి లాంటిదన్నారు. చెరువులు నిండితే మత్స్య కార్మికులు వలస బాట పట్టకుండా సొంత ఊర్లోనే ఉపాధి లభిస్తుందన్నారు. సీఎం కేసిఆర్ పాలన బంగారు తెలంగాణాకు బాటలు వేస్తోంన్నారు. కురుసిన వర్షాలకు చెరువులకు నీరు చేరడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ భోగేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు గన్నె భూంరెడ్డి తదతరులు పాల్గొన్నారు. -
మర్రిగూడెంలో పోడు రైతు ఆత్మహత్య
-పంట నాశనం చేశారని మనస్తాపం? చండ్రుగొండ ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం మర్రిగూడెంకు చెందిన పోడు రైతు మడకం వెంకటేశ్వర్లు(30) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు తనకున్న ఐదెకరాల పోడుభూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. దీని కోసం రూ.లక్ష వరకు అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు. ఇటీవల అటవీశాఖ అధికారులు ఆ పంటను నాశనం చేయడంతో మనస్తాపం చెంది ఇంటి వెనుక భాగంలో కండువతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు ఉరివేసుకున్న తీరు అనుమానాస్పందంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, వెంకటేశ్వర్లు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోలేదని ఏఎస్సై హుస్సేన్ అంటున్నారు. అతను గుంటూరు జిల్లాలో పని చేసుకుంటున్నాడని, వెంకటేశ్వరుల సోదరుడు శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, కర్మకాండల కోసం వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. -
తిరుపతి అర్బన్ తహశీల్దార్పై అట్రాసిటీ కేసు
తిరుపతి అర్బన్ తహశీల్దార్పై ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలిపిరి ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి ఆటోనగర్లో నివాసం ఉంటున్న శ్రీరాములు ఈ సంవత్సరం మార్చి 18వ తేదీన అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ భూములను కేటాయించాలని ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో అక్కడున్న అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు మరో 11మంది వీఆర్వోలు, ఆర్ఐలు చూస్తుండగా ఆందోళన చేస్తున్న తనను కులం పేరుతో దూషించారని శ్రీరాములు డీజీపీ జేవీ రాముడుకు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు అర్బన్ తహశీల్దార్పై ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటన జరిగింది ముత్యాలరెడ్డిపల్లె పోలీస్స్టేషన్ పరిధిలో కావడంతో ఈ కేసును ఎమ్మార్పల్లి స్టేషన్కు బదిలీ చేస్తామని ఎస్సై తెలిపారు. -
‘చుక్క’లకు దక్కిన గౌరవం!
‘గిన్నె’ చిత్రాలకు జాతీయ గుర్తింపు బాల్ పాయింట్ పెన్ను చుక్కలతో చిత్రాలు దేశవ్యాప్తంగా లెక్కకు మించి ప్రదర్శనలు ప్రముఖులతో అభినందనలు, సన్మానాలు అడ్డాకుల : రంగులతో చిత్రాలు వేయడం.. పెన్సిల్తో బొమ్మలు గీయడం మాములే. కానీ బాల్ పాయింట్ పెన్నుతో చుక్కలు పెడుతూ బొమ్మలువేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక చిత్రానికి లక్షల చుక్కలు క్రమ పద్ధతిలో పెట్టాలి. ఒక్కచుక్క అనుకున్న క్రమంలో లేకపోయినా రావాల్సిన భావంరాదు. కానీ బాల్ పాయింట్ పెన్నుతో అలవొకగా అనుకున్న భావం వచ్చేలా చిత్రాలు వేస్తున్నాడు గిన్నె వెంకటేశ్వర్లుసాగర్. తద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతని ప్రతిభను చూసి రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు అభినందించారు..ప్రశంసించారు. అంతేనా జాతీయస్థాయిలో పలురికార్డుల్లో తనదైన స్థానం పొందిన గిన్నె వెంకటేశ్వర్లుసాగర్ది అడ్డాకుల మండలం మూసాపేట. ఆయన ప్రస్థానం ఇలా సాగింది.. సాధారణ పెయింటింగ్తో మొదలై.. మూసాపేటకు చెందిన గిన్నె రాములు, భీసమ్మ దంపతుల రెండో కుమారుడు వెంకటేశ్వర్లు. సాధారణ చిత్రకారుడు. నిరుపేద కుటుంబం కావడంతో హైదరాబాద్లోని జగద్గీరి గుట్టలో ఫొటో స్టూడియో నడుపుతూ జీవనం సాగించేవాడు. పెయింటింగ్పై ఉన్న ఆసక్తితో బీఎఫ్ఏ పూర్తి చేశాడు. అదే సమయంలో పెన్సిల్తో వెలుగునీడల చిత్రాలు వేస్తూ మధ్యలో బ్లాక్ బాల్పాయింట్ రీఫిల్తో చుక్కలు వేశాడు. పెన్సిల్ చిత్రాలు కొంతకాలం తర్వాత పాడైపోతాయని, పెన్నుతో వేస్తే ఎక్కువ కాలం మన్నిక ఉంటాయన్న ఆలోచన ఈసమయంలోనే కలిగింది. దీంతో చుక్కలతో చిత్రాలు వేయడం ప్రారంభించాడు. రంగురంగుల బాల్పాయింట్ పెన్నులతో ప్రయత్నించడం అతన్ని బాగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి చుక్కలతో పాటు టీ డికాషన్, రంగులను కలుపుతూ రకరకాల చిత్రాలు వేయడం కొనసాగించాడు. తిరుపతిలో ఉద్యోగం రావడంతో.. 1984లో వెంకటేశ్వర్లుకు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర శిల్పకళాశాలలో బోధకుడిగా ఉద్యోగం లభించింది. అక్కడ చుక్కల చిత్రాల్లో మరింత పరిణతిసాధించాడు. జాతీయ స్థాయిలో లెక్కకు మించి ప్రదర్శనలు ఇచ్చాడు. నాగ్పూర్, జైపూర్, బెంగళూర్, ఢిల్లీ, ఖజురహో, ఉదయ్పూర్, హైదరాబాద్, విశాఖపట్నం, భీమవరం, తిరుపతి, మహబూబ్నగర్, వరంగల్, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో దాదాపు 20వన్మెన్ షోలు, 10 గ్రూప్ షోలు, 6 ఆర్ట్క్యాంప్లలో పాల్గొన్నాడు. రికార్డుల్లో ‘చుక్క’లకు స్థానం ఈక్రమంలోనే చుక్కల చిత్రాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. గ్లోబల్ వరల్డ్ రికార్డు(2011), ఇండియా బుక్ ఆఫ్ రికార్డు(2011)లో స్థానం సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా మహాత్మాపూలే టాలెంట్ రీసెర్చ్ నేషనల్ అవార్డు(2012), న్యూఢిల్లీ స్కాలర్షిప్ అవార్డు(1997)లనూ అందుకున్నాడు. ప్రముఖుల అభినందనలు ఇతని చుక్కల చిత్రాలు దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని కూడా ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్, ప్రధాన మంత్రి మన్మోçßæన్సింగ్, లోక్సభ స్పీకర్ బాలయోగి, గవర్నర్లు రంగరాజన్, అమోలక్ రతన్కోహిల్(మిజోరాం), సుశీల్కుమార్ షిండే, సుర్జిత్సింగ్ బర్నాలా, ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి, చంద్రబాబునాయుడు పదవుల్లో ఉన్నప్పుడు చుక్కలతో వారి చిత్రాలు వేసి వారికే బహూకరించాడు. దీంతో వారంతా వెంకటేశ్వర్లుసాగర్ను అభినందించారు. -
‘చుక్క’లకు దక్కిన గౌరవం!
‘గిన్నె’ చిత్రాలకు జాతీయ గుర్తింపు బాల్ పాయింట్ పెన్ను చుక్కలతో చిత్రాలు దేశవ్యాప్తంగా లెక్కకు మించి ప్రదర్శనలు ప్రముఖులతో అభినందనలు, సన్మానాలు అడ్డాకుల : రంగులతో చిత్రాలు వేయడం.. పెన్సిల్తో బొమ్మలు గీయడం మాములే. కానీ బాల్ పాయింట్ పెన్నుతో చుక్కలు పెడుతూ బొమ్మలువేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక చిత్రానికి లక్షల చుక్కలు క్రమ పద్ధతిలో పెట్టాలి. ఒక్కచుక్క అనుకున్న క్రమంలో లేకపోయినా రావాల్సిన భావంరాదు. కానీ బాల్ పాయింట్ పెన్నుతో అలవొకగా అనుకున్న భావం వచ్చేలా చిత్రాలు వేస్తున్నాడు గిన్నె వెంకటేశ్వర్లుసాగర్. తద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతని ప్రతిభను చూసి రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు అభినందించారు..ప్రశంసించారు. అంతేనా జాతీయస్థాయిలో పలురికార్డుల్లో తనదైన స్థానం పొందిన గిన్నె వెంకటేశ్వర్లుసాగర్ది అడ్డాకుల మండలం మూసాపేట. ఆయన ప్రస్థానం ఇలా సాగింది.. సాధారణ పెయింటింగ్తో మొదలై.. మూసాపేటకు చెందిన గిన్నె రాములు, భీసమ్మ దంపతుల రెండో కుమారుడు వెంకటేశ్వర్లు. సాధారణ చిత్రకారుడు. నిరుపేద కుటుంబం కావడంతో హైదరాబాద్లోని జగద్గీరి గుట్టలో ఫొటో స్టూడియో నడుపుతూ జీవనం సాగించేవాడు. పెయింటింగ్పై ఉన్న ఆసక్తితో బీఎఫ్ఏ పూర్తి చేశాడు. అదే సమయంలో పెన్సిల్తో వెలుగునీడల చిత్రాలు వేస్తూ మధ్యలో బ్లాక్ బాల్పాయింట్ రీఫిల్తో చుక్కలు వేశాడు. పెన్సిల్ చిత్రాలు కొంతకాలం తర్వాత పాడైపోతాయని, పెన్నుతో వేస్తే ఎక్కువ కాలం మన్నిక ఉంటాయన్న ఆలోచన ఈసమయంలోనే కలిగింది. దీంతో చుక్కలతో చిత్రాలు వేయడం ప్రారంభించాడు. రంగురంగుల బాల్పాయింట్ పెన్నులతో ప్రయత్నించడం అతన్ని బాగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి చుక్కలతో పాటు టీ డికాషన్, రంగులను కలుపుతూ రకరకాల చిత్రాలు వేయడం కొనసాగించాడు. తిరుపతిలో ఉద్యోగం రావడంతో.. 1984లో వెంకటేశ్వర్లుకు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర శిల్పకళాశాలలో బోధకుడిగా ఉద్యోగం లభించింది. అక్కడ చుక్కల చిత్రాల్లో మరింత పరిణతిసాధించాడు. జాతీయ స్థాయిలో లెక్కకు మించి ప్రదర్శనలు ఇచ్చాడు. నాగ్పూర్, జైపూర్, బెంగళూర్, ఢిల్లీ, ఖజురహో, ఉదయ్పూర్, హైదరాబాద్, విశాఖపట్నం, భీమవరం, తిరుపతి, మహబూబ్నగర్, వరంగల్, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో దాదాపు 20వన్మెన్ షోలు, 10 గ్రూప్ షోలు, 6 ఆర్ట్క్యాంప్లలో పాల్గొన్నాడు. రికార్డుల్లో ‘చుక్క’లకు స్థానం ఈక్రమంలోనే చుక్కల చిత్రాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. గ్లోబల్ వరల్డ్ రికార్డు(2011), ఇండియా బుక్ ఆఫ్ రికార్డు(2011)లో స్థానం సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా మహాత్మాపూలే టాలెంట్ రీసెర్చ్ నేషనల్ అవార్డు(2012), న్యూఢిల్లీ స్కాలర్షిప్ అవార్డు(1997)లనూ అందుకున్నాడు. ప్రముఖుల అభినందనలు ఇతని చుక్కల చిత్రాలు దేశ అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని కూడా ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్, ప్రధాన మంత్రి మన్మోçßæన్సింగ్, లోక్సభ స్పీకర్ బాలయోగి, గవర్నర్లు రంగరాజన్, అమోలక్ రతన్కోహిల్(మిజోరాం), సుశీల్కుమార్ షిండే, సుర్జిత్సింగ్ బర్నాలా, ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి, చంద్రబాబునాయుడు పదవుల్లో ఉన్నప్పుడు చుక్కలతో వారి చిత్రాలు వేసి వారికే బహూకరించాడు. దీంతో వారంతా వెంకటేశ్వర్లుసాగర్ను అభినందించారు. -
ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి
విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ. 500 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాలులో సంఘం సమావేశం ఆదివారం జరిగింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నంబర్ 85 ద్వారా విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేసినప్పటికీ తర్వాతి కాలంలో దానిని ఫెడరేషన్గా మార్చారని చెప్పారు. నూతన రాజధాని అమరావతిలో కాలజ్ఞానకర్త వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని కోరారు. విశ్వబ్రాహ్మణుల్లో అర్హులైన నిరుపేద విద్యార్థులకు ఎల్కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. యాభై ఏళ్లు పైబడిన విశ్వకర్మలకు రూ. 2వేలు పింఛను ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ గృహకల్ప పథకం ద్వారా నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి నాగులకొండ అశ్లేషాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాతినిధ్యం లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం త్వరలో విశాఖపట్నంలో 50 వేల మందితో విశ్వబ్రాహ్మణ గర్జన ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం నాయకులు ధనాలకోట కామేశ్వరరావు, యువజన విభాగం అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్, శ్రీనివాసాచారి 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఆయుధాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్
న్యూడెమొక్రసీ దళానికి ఆయుధాలు విక్రయిస్తోన్న ఓ ముఠాను ఇల్లందు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మూకమామిడి గ్రామానికి వెంకన్న, మల్లేపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, బయ్యారం మండలం కాచనపల్లికి చెందిన ఐలయ్యను అరెస్ట్ చేసి వారి నుంచి 3 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సీఐలు నరేందర్, రవి, రమేశ్, ఎస్ఐలు అనిల్, రమేశ్బాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. -
ఆర్ఎంపీది సుపారీ హత్య
మిస్టరీని ఛేదించిన పోలీసులు కన్నకొడుకే సూత్రధారి నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు దుగ్గొండి : ఆస్తి పంచి ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్న ఓ వ్యక్తి కన్నతండ్రినే హత్య చేరుుంచాడు. సుఫారీ ఇచ్చి కిరాయి రౌడీలతో మట్టుబెట్టించాడు. మండలంలోని గిర్నిబావిలో ఇటీవల జరిగిన ఆర్ఎంపీ గడుదాసు వెంకటేశ్వర్లు హత్య కేసులో హతుడి కుమారుడు, అతడి మిత్రుడు, ఇద్దరు కిరాయి రౌడీలను పోలీ సులు అరెస్ట్ చేసి కేసు మిస్టరీని ఛేదించారు. నర్సంపేట రూరల్ సీఐ బోనాల కిషన్ కథంన ప్రకారం.. మండలంలోని గిర్నిబావి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ గడుదాసు వెంకటేశ్వర్లు(75) స్థాని కంగా గత 45 ఏళ్లుగా ఆర్ఎంపీగా సేవలందిస్తున్నాడు. ఆయనకు కుమారులు నమస్కారం అలియూస్ శ్రీను, నమస్తే అలి యూస్ రవి, కుమార్తెలు ప్రతిజ్ఞ, ప్రార్థన ఉన్నారు. ఆయన స్థాని కంగా నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారి వెంట విలువైన ఆస్తులు సంపాదించాడు. ఆస్తి పంచాలని కుమారులు కొన్నాళ్లుగా అడిగినా పంచిఇవ్వడం లేదు. దీంతో చిన్నకుమారుడు గడుదాసు నమస్తే అలియాస్ రవి హత్య చేయడానికి పథక రచన చేశాడు. ఎంజీఎంలో పథక రచన.. గిర్నిబావిలో హత్య కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నమస్తే ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. అతడి చికిత్సకు తండ్రి డబ్బులు ఇవ్వలేదు. అప్పటికే నమస్తేకు సంగెం మండలం గుంటూరుపల్లికి చెందిన అతడి మిత్రుడు శాఖమూరి రమేష్బాబు రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అసలు, వడ్డీ కలిపి రూ.6 లక్షలకు చేరింది. దీంతోపాటు అప్పులు పెరిగిపోయూరుు. తండ్రి ఆస్తి ఇవ్వడం లేదు. దీంతో ఎలాగైనా తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆస్పత్రికి వచ్చిన తన మిత్రుడు రమేష్బాబు, తన తండ్రికి పరిచయస్తుడు అయిన గిర్నిబావి గ్రామానికి చెందిన రాయపురి రాజుతో మంతనాలు జరిపాడు. రూ.8 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నారు. రాయపురి రాజుకు రమేష్బాబు రూ.10 వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. వెంకటేశ్వర్లుతో రాజు మాట్లాడడానికి ఓ బినామీ వ్యక్తి పేరున సిమ్ కార్డు, ఓ ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి రాయపురి రాజు గడుదాసు వెంకటేశ్వర్లుతో స్నేహం చేశాడు. 10 తులాల దొంగ బంగారం రూ.2 లక్షలకే ఇస్తానని వెంకటేశ్వర్లు చెప్పడంతో బయానాగా అతడికి కొంతడబ్బు ఇచ్చి రాజు నమ్మించాడు. ఇలా స్నేహం కొనసాగుతున్న క్రమంలో మే 19న రాయపురి రాజు గీసుగొండ మండల ఎలుకుర్తి గ్రామానికి చెందిన తన బాబాయి రాయపురి జనార్దన్కు ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు. 20న జనార్దన్ రావడంతో విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి వెంకటేశ్వర్లును చంపాలని నిర్ణయించుకున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రూ.20 వేలు ఇచ్చే వ్యక్తి వచ్చాడని స్థానికంగా ఉన్న పాఠశాలకు రావాలని రాజు వెంకటేశ్వర్లుకు ఫోన్ చేయడంతో వె ంకటేశ్వర్లు వెళ్లాడు. ముగ్గురు మద్యం తాగారు. అనంతరం రాజు ముందుగానే సిద్ధం చేసుకున్న గునపంలాంటి రాడుతో వెంకటేశ్వర్లు మెడపై కొట్టాడు. అతడు కిందిపడిపోవడంతో ప్రాణం పోయేంతవరకు చాతిభాగంపై కొట్టాడు. మరణించాడని నిర్ధారించుకున్న అనంతరం ఖమ్మం రోడ్డు వద్దకు వెళ్లి రమేష్బాబుకు సమాచారమిచ్చాడు. అతడు వచ్చి రూ.25 వేలు ఇవ్వగా అందులో రూ.5 వేలు బాబాయి జనార్దన్కు ఇచ్చి పంపాడు. సిమ్కార్డును విరిచి దేశాయిపేట బ్యాంక్ సమీపంలో పడేసి, చెత్త కుప్పలో ఫోన్ విసిరేశాడు. తొలుత మిస్సింగ్ కేసు నమోదు.. ఇంట్లో నుంచి వెళ్లిన వెంకటేశ్వర్లు తిరిగి రాకపోవడంతో మే 25న అతడి కూతురు తుమ్మ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై నల్లగట్ల వెంకటేశ్వర్లు దర్యాప్తులో భాగంగా మే 27న వందన గార్డెన్ సమీపంలోని ముళ్ల చెట్ల మధ్యన గడుదాసు వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కనుగొన్నారు. చంపి ఏడు రోజులు కావడంతో శవం పూర్తిగా ఎండిపోయింది. నిందితుడి ఫోన్ కాల్ లిస్టు. డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం నిందితుల వివరాలు సేకరించారు. దీంతో గిర్నిబావిలో ఓ వ్యక్తి సమక్షంలో శుక్రవారం ఉదయం నిందితులు లొంగిపోయారని సీఐ వివరించారు. నిందితులు రాయపురి రాజు, రాయపురి జనార్దన్, గుడుదాసు నమస్తే, శాఖమూరి రమేష్బాబును అరెస్టు చేసి, 25 వేల నగదు, ఆరు సెల్ఫోన్లు, రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. -
లాభాల్లో ఉంటేనే పీఆర్సీ
♦ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు చంద్రబాబు షాక్ ♦ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి సాక్షి, విజయవాడ బ్యూరో: లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే పీఆర్సీ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ జేఏసీ నేతలతో సమావేశమైన ఆయన వారి సమస్యలపై చర్చించారు. 4.60 లక్షల మంది ఉద్యోగుల్లో కేవలం 20 వేల మంది పీఆర్సీకి నోచుకోక ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి పీఆర్సీ ఇవ్వాలని నేతలు కోరగా సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, అప్పు తెచ్చుకోవడానికి ఎఫ్ఆర్బీఎం నిబంధనలు అడ్డొస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని, అక్కడి ఉద్యోగులతో పోల్చుకోవద్దని సూచించారు. ప్రైవేటు సంస్థలతో పోటీపడి ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు పని చేస్తే పీఆర్సీకి మించిన వేతనాలు ఇస్తానని స్పష్టం చేశారు. మంచి ఫలితాలు సాధిస్తేనే.. గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రం పీఆర్సీ అమలు చేస్తామని, తాను ఆశించిన ఫలితాలు రాబడితే అంతకు మించి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలనే డిమాండ్పై మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కంటింజెంట్ ఉద్యోగుల రెగ్యులరైజ్, ఫుల్టైమ్ కంటింజెంట్ ఉద్యోగులకు పదో పీఆర్సీలో కనీస వేతనం, జూలై 2015, జనవరి 2016 రెండు విడతల డీఏ విడుదల, పది నెలల పీఆర్సీ బకాయిల చెల్లింపు, అంతర జిల్లాల బదిలీలకు ఆమోదం, పండిట్లు, పీఈటీ పోస్టుల అప్గ్రెడేషన్ త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు జేఏసీ నేతలు చెప్పారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ అశోక్బాబు, కో-చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూల్ జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి
వడదెబ్బ తగిలి ఇద్దరు మృత్యవాత పడిన సంఘటన కర్నూల్ జిల్లాలో మంగళవారం జరిగింది. కోడుమూరు మండలంలోని మూడుమూల గ్రామంలో మహబూబ్ బాష (15) పశువులకు నీళ్లు తాపడానికి వెళ్ళి వడదెబ్బ తగిలి చనిపోయాడు. మరో ఘటనలో గోనెగండ్ల మండలం కురిమాల గ్రామంలో చాకలి వెంకటేశ్వర్లు పొలంలోని వరిగడ్డిని తరలిస్తుండగా వడదెబ్బ తగిలి కుప్పకూలిపోయాడు. ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. -
అనుమానం పెనుభూతమై..
అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యని అతికిరాతకంగా కడతేర్చాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెద వేగిమండలం కే.కన్నాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామును చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకి ఆరేళ్ల క్రితం రోజ(21)తో వివాహమైంది. కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వీరి జీవితంలోకి తరచు గొడవలు జరుగుతుండేవి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త శనివారం రాత్రి కూడా ఆమెతో గొడవపడి కోపోద్రిక్తుడై ఆమె నిద్రిస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున కొబ్బరి కాయలు నరికే కత్తితో ఆమె మెడ నరికేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి మృతి
బండల లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చీగలగల్ మండలంలోని కంభదహల్ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. ఉరవకొండ మండలం పీతవరం గ్రామానికి చెందిన మాల వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం బండల లోడ్తో బయలుదేరాడు. కంభదహల్ గ్రామం సమీపంలోని పొలంలో ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్లో ఉన్న వెంకటేశ్వర్లు అక్కడిక్కడే మృతి చెందాడు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు కోల్సిటీ కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణం గంగానగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సింగరేణిలో ఓసీపీ3లో అపరేటర్గా పనిచేసే గంపా వెంకటేశ్వర్లు (54) భార్య సరోజతో కలసి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. సమీప బంధువు ఒకరు చనిపోతే ఆ కార్యక్రమాల్లో పాల్గొని బైక్పై ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. గోదావరిఖని గంగానగర్ వద్ద గోదావరిలో స్నానం చేసి తిరిగి బైక్పై బయల్దేరగా... ఓ ట్రాక్టర్ ఢీకొంది. వెంకటేశ్వర్లు, సరోజల తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా, సరోజ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మీ అమ్మ నుంచి పిలుపొచ్చింది...
హైదరాబాద్: మీ అమ్మ నుంచి పిలుపువచ్చింది..నేను వెళ్లిపోతున్నాను.. నా గురించి వెతకవద్దు.. అంటూ లేఖ రాసి ఓ వృద్ధుడు ఇంటి నుంచి వెళ్ళి పోయిన ఘటన హైదరాబాద్ లోని కార్ఖాన పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పీఎస్ పరిధిలోని మడ్ఫోర్ట్ ఎంఈఎస్ కార్యాలయం శివాలయం సమీపంలో నివాసం ఉండే వ్యాపారి ఎం. వెంకటేశ్వర్లు(65) భార్య రెండేళ్ళ క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి దిగులుతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తన కొడుకు ముత్యాలరావును ఉద్దేశించి లేఖరాసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'ఆ కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్పై వేధింపుల కేసు నమోదు చేసినట్లు వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం నగరంలోని వెస్ట్జోన్ డీసీపీ కార్యాలయంలో వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ... బాధితురాలి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చెప్పారు. సుశీల్, డ్రైవర్ అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. బాధితురాలిని వెంబడించిన కారు మంత్రి రావెల కిషోర్ బాబుదే అని డీసీపీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.ఈ కేసులో అన్ని అంశాలను పరిశీలించాకే సుశీల్పై నిర్భయ కేసు నమోదు చేశామని డీసీసీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
లారీ ఢీకొని ఆర్ఎంపీ మృతి
లారీ ఢీ కొని ఆర్ఎంపీ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గోవిదరావుపేట మండల శివారులో చోటుచేసుకుంది. పసర గ్రామానికి చెందిన చిట్టిమల్ల వెంకటేశ్వర్లు(56) ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. మంత్రి చందూలాల్, చల్వాయిలో పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తుండగా అక్కడకు వెళ్లాడు. గోవిదరావుపేటకు వచ్చేక్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ వెంకటేశ్వర్లును ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడిక్కక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని మునుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మనవరాలిపై అత్యాచారం
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానవ సంబంధాలు మంట కలిపేలా ఓ వృద్ధుడు సొంత మనవరాలి(కూతురి కూతురు)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రానగర్లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు సొంత మనవరాలిపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గతంలో కూడా ఇతను మన వరాళ్లతో తప్పుగా ప్రవర్తించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
అనుమానంతో భార్య గొంతు కోసి పరారీ
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై అనుమానాన్ని పెంచుకుని కిరాతకంగా గొంతుకోశాడు. నెల్లూరు నగరంలోని డైకస్రోడ్డు శాంతినగర్లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన వెంకటేశ్వర్లు ఒడిశా రాష్ట్రానికి చెందిన పుష్పలతను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. శాంతినగర్లో కాపురం పెట్టాడు. ఏమైందోగానీ మంగళవారం తెల్లవారుజామున పుష్పలత గొంతుకోసి అతడు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు రక్తపు మడుగులో పడి ఉన్న పుష్పలతను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న పుష్పలతకు ప్రాణం పోసేందుకు వైద్యులు శస్త్రచికిత్స ప్రారంభించారు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ కిరాతకానికి పాల్పడినట్టు స్థానికుల కథనం. -
పురాతన శివలింగాన్ని రాయి అనుకుని..
నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని ఓ ఇంట్లో పురాతన శివలింగం లభ్యమైంది. అయితే, పదిహేనేళ్ల క్రితమే వెలుగు చూసినా అది శివలింగమని వారికి తెలియకపోవడంతో ఇన్నాళ్లూ మరుగునపడి ఉంది. ఎలుగూరి వెంకటేశ్వర్లు పాత ఇంటిని తొలగించే క్రమంలో 15 ఏళ్ల క్రితం ఓ రాయి బయటపడింది. కొబ్బరికాయలు కొట్టేందుకు పనికి వస్తుందని దాన్ని దాచిపెట్టారు. సోమవారం ఇంట్లో పూజల సమయంలో కొబ్బరికాయ కొట్టేందుకు ఆ రాయిని తీసుకురాగా, అది శివలింగమని పురోహితులు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. అసలు విషయం తెలియడంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆ శివలింగాన్ని ఏదో ఒక శివాలయానికి తరలించాలని నిర్ణయించారు. -
పగిడ్యాలలో భారీ దొంగతనం
కర్నూలు జిల్లా పగిడ్యాలలో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు సహా ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. వారు సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపల బీరువాలో పరిశీలించగా రూ.50వేల నగదుతోపాటు పది తులాల ఆభరణాలు కనిపించలేదు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శివాంజల్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోజా సస్పెన్షన్ అన్యాయం
-
బడి బస్సు కిందపడి ఒకరు మృతి
ప్రమాదవశాత్తు స్కూలు బస్సు కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు(30) తన కూతురిని బైక్పై స్కూలుకు వెళుతుండగా.. తర్లుపాడు రోడ్డులోని అల్లూరిపోలేరమ్మ గుడి వద్ద వెనుక నుంచి వచ్చిన కమల్ కాన్సెప్టు స్కూల్ బస్సును తప్పించుకునే క్రమంలో రోడ్డు మార్జిన్నుంచి బైక్ జారింది. ఈ క్రమంలో బస్సు వెనుక టైరు కింద వెంకటేశ్వర్లు పడిపోయాడు. తల పగలటంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. -
రెండు బైక్లు ఢీ.. ఒకరు మృతి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ ప్రాంతంలో పెట్రోల్ పంపు వద్ద రెండు బైక్లు ఢీ కొట్టి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పట్టణంలోని షాపూర్నగర్కు చెందిన వైద్యపు వెంకటేశ్వర్లు (60) శనివారం ఉదయం బైక్పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్కు రిఫర్ చేశారు. అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతి చెందాడు. -
ఎండిన పంట చూసి రైతు బలవన్మరణం
కష్టపడి సాగు చేసిన పంట ఎండిపోవడంతో తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు అనే రైతు కౌలుకు భూమి తీసుకుని మిరప సాగు చేశాడు. వర్షాల్లేక అది ఎండిపోవడంతో మనస్తాపం చెంది శనివారం తెల్లవారుజామున ఇంటి దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
నర్సారావుపేట: గుంటూరు జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నర్సారావుపేట మండలం అచ్చమ్మపాలెంలో వ్యవసాయ బావిలో శుక్రవారం ఉదయం అచ్చి వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. మృతదేహాన్ని రైతులు బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. గురువారం జరిగిన ఓ ఫంక్షన్ నుంచి వెంకటేశ్వర్లును ముగ్గురు స్నేహితులు తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో స్నేహితులే వెంకటేశ్వర్లును హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రత్యేక హోదాపై మీనమేషాలు తగదు
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి బాపట్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై మీనమేషాలు మానుకోవాలని ఎమ్మెల్సీ డాక్టరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. బాపట్లలోని తన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధించుకుంటే హక్కుగా రాష్ట్రాభివృద్ధికి నిధులు తెచ్చుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీలంటే కేంద్ర ప్రభుత్వం దయాదాక్ష్యిణ్యాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా కోసం 18సార్లు నివేదికలను పంపినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకోవటం విచారకరమన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీనే అన్నిసార్లు ప్రత్యేకహోదాపై నివేదిక పంపితే వినకపోతే సఖ్యతఉన్నాట్లా..? లేనట్లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. శాంతియుతంగా విజయవాడలో ప్రదర్శన చేపడితే విచక్షణరహితంగా అరెస్టు చేయించటం సరికాదన్నారు. శంకుస్థాపనకు దూరం.. పచ్చటి భూములను చదును చేసి రాజధాని నిర్మించటం ఏమేరకు భావ్యమో చంద్రబాబునాయుడు చెప్పాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. శివరామకృష్ణ కమిటీ కూడా పంటపొలాల జోలికి వెళ్లకూడదనే నివేదిక ఇచ్చిందన్నారు. ఇప్పుడు రాజ ధాని శంకుస్థాపనకు వెళ్ళితే వైఎస్సార్కాంగ్రెస్పార్టీ కూడా పచ్చటి పొలాలను నాశనం చేసుకున్నదాంట్లో భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు తమ పార్టీ దూరంగా ఉంటుందని తెలిపారు. 33 వేల ఎకరాలు పంటపొలాలను తీసుకోకుండా నూజివీడులో ఉన్న 50వేల ఎకరా ల అటవీభూములు తీసుకుంటే నేడు ఆహార ధాన్యాలు పండే పచ్చటి పొలాల కు ఇబ్బంది కలిగేదికాదన్నారు. ధరల స్థిరీకరణకు నిధి కేటాయించకపోవటం విచారకరం..పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు వంద నుంచి 140శాతం పెరిగినప్పటికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతున్నాయని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ధరల స్థిరీకరణకు వెయ్యికోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఆ విషయాన్ని అసలు పట్టించుకోవటంలేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరరావు, నాయకులు నరాలశెట్టి కృష్ణమూర్తి, వెంకట్రావు ఉన్నారు. -
మరణంలోనూ ఒక్కటిగా....
భర్త మృతి తట్టుకోలేక భార్య మరణం చందర్లపాడులో విషాదఛాయలు చందర్లపాడు : జీవితంలో కలిసి మెలిసి ఉండటమేకాదు.. చావులోనూ ఒకటయ్యారు ఆ ఆలుమగలు.. పిల్లలను పెంచి పెద్దచేసి వాళ్లను ఓ ఇంటి వాళ్లను చేసిన ఆ దంపతులు ఊహించని రీతిలో మృత్యుడిలోకి చేరుకున్నారు. ముందుగా భర్త మృతిచెందగా ఆ బాధను తట్టుకోలేక భార్య కూడా కొద్ది గంటల్లోనే తనువుచాలించింది. మండల కేంద్రమైన చందర్లపాడులో మంగళవారం జరిగిన ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. గ్రామానికి చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లు(65) హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య తిరుపతమ్మ(60) అతనికి చేదోడువాదోడుగ ఉంటోంది. వయస్సు మీద పడటంతో కొద్ది నెలల క్రితమే హోటల్ను తీసేశారు. ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో వెంకటేశ్వర్లు ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుండెపోటుకు గురై మరణించాడు. భర్త తనువుచాలించడంతో భార్య తిరుపతమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆమె రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచింది. వీరిరువురికి బుధవారం కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు నిర్వహించారు. -
స్నేహితుడి కుమార్తె పై అత్యాచారయత్నం
భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లిలో స్నేహితుడి కుమార్తె పై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కథనం ప్రకారం... భూపాలపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు నాంపల్లి వెంకటేశ్వర్లు తన స్నేహితుడి కుమార్తె(14)ను ఆదివారం బైక్పై పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి... అత్యాచారం చేయబోయాడు. దాంతో బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బాలిక తండ్రి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అరికాళ్లలో మంటలు, తిమ్మిర్లు..!
నా వయసు 51 ఏళ్లు. రెండేళ్ల నుంచి నా కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు చాలా బాధపెడుతున్నాయి. నాకు బీపీ, షుగర్ వ్యాధులు, చెడు అలవాట్లు కూడా లేవు. అయినా ఈ సమస్యేమిటి? - వెంకటేశ్వర్లు, భువనగిరి కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, కాలి చివర మొద్దుబారడం వంటి లక్షణాలు నరాల నుంచి వెన్నుపాము వరకు వచ్చే సమస్యల సూచికలు. ఈ సమస్య పెరుగుతూ పోతే చేతులకు కూడా వస్తుంది. అలాగే నడకలో మార్పు, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, అంగస్తంభనలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. వీటినే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. ఈ కండిషన్కు ప్రధాన కారణాలు డయాబెటిస్, విటమిన్ బి12, బి1, ఫోలిక్ యాసిడ్, ప్యాంటథెనిక్ యాసిడ్ లోపాలు ఉండవచ్చు. కొన్నిసార్లు లెప్రసీ, హెచ్ఐవీ, హెపటైటిస్-బి అండ్ హెపటైటిస్ సి వైరస్ ల వంటివి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. సాధారణంగా 30 శాతం మందిలో ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పై లక్షణాలను నియంత్రించడా నికి గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, అమీట్రిప్టిలిన్, డ్యూలోక్సె టిన్ మందులతో పాటు, మీ కండిషన్కు ఏ అంశం కారణమో దానికి కూడా వైద్యం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంటే ఉదాహరణకు బీ12 లోపం వల్ల ఈ కండిషన్ వస్తే దాన్ని భర్తీ చేయడం అన్నమాట. ఈ లక్షణాలున్నప్పుడు అరికాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే చిన్న పుండ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు రక్తప్రసరణలో ఇబ్బందులు, వెన్నుపాము జబ్బులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్ను సంప్రదించండి. నా వయసు 44 ఏళ్లు. నాకు గత రెండేళ్ల నుంచి అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గి మళ్లీ మళ్లీ ఈ సమస్య వస్తోంది. అలా అవుతున్నప్పుడు నాకు భయమేస్తోంది. దీనికి పూర్తిగా పరిష్కారం లేదా? - శ్రీలత, అనకాపల్లి మనల్ని సరిగ్గా అంటే బ్యాలెన్స్డ్గా నిలబెట్టే ప్రధాన భాగం చిన్నమెదడు, చెవి మధ్య ఉన్న ‘వెస్టిబ్యులార్ నరం’. చిన్నమెదడుకు వచ్చే జబ్బుల వల్ల మీరు పేర్కొన్న వర్టిగో లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. అంటే చూపులో, మాటలో, నడకలో, స్పర్శలో, బలంలో మార్పులు ఉంటే తక్షణం న్యూరాలజిస్ట్ను సంప్రదించాలి. అలా కాకుండా కేవలం కళ్లు తిరగడం, వినికిడి తగ్గడం, చెవిలో శబ్దం రావడం ఉంటే అవి చెవి నరానికి సంబంధించిన నరం వరకు వచ్చి సమస్య మాత్రమే. తలతిప్పినప్పుడు మాత్రం వచ్చే సమస్యకు, తక్షణ ఉపశమనానికి బీటాహిస్టిన్, సిన్నరజిన్ లాంటి మందులు ఉపయోపడతాయి. కొన్నిసార్లు ఇది మళ్లీ మళ్లీ వస్తుంది. అలా తరచుగా వచ్చేవారికి వెస్టిబ్యులార్ ఎక్సర్సెజైస్, ఎప్లేస్ మెథడ్ ద్వారా చికిత్స అవసరం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే చెవి నరానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా దీన్ని నియంత్రించ వచ్చు. ఇది కాస్త సతాయిస్తుంటుంది కానీ ప్రమాదకరం కాదు. కాబట్టి ఆందోళన చెందకండి. డాక్టర్ బి. చంద్రశేఖర్రెడ్డి చీఫ్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్ మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
తహశీల్దార్పై దాడికి యత్నం
హైదరాబాద్ : ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి స్థలంలో ల్యాండ్ ఫర్ సేల్ అని ఓ సంస్థ నిర్వాహకులు బోర్డులు పెట్టారు.ఆసుపత్రి అధికారుల ఫిర్యాదుతో అక్కడకు వచ్చిన అమీర్పేట రెవెన్యూ అధికారులు బోర్డులను తొలగించగా కబ్జాదారుడు తాహాశీల్దార్ పై దాడికి యత్నించాడు. దాంతో తాహాసీల్దార్ వెంకటేశ్వర్లు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... అనుపమ ఎంటర్ప్రజైస్ సంస్థ నిర్వాహాకుడు మహ్మద్ హుసేన్ శుక్రవారం మధ్యాహ్నం కొంతమందితో కలిసి ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ప్రధాన గేటు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ల్యాండ్ ఫర్ సేల్, ఇక్కడ ప్లాట్లు విక్రయిస్తున్నామని బోర్డులు పెట్టించాడు. దీనిని గమనించిన ఆసుపత్రి అధికారులు అమీర్పేట తాహాసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాహాసీల్దార్ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి ఆర్.ఐ.ప్రదీప్, వీఆర్ఓ విజయరాజును అక్కడకు పంపి స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చిన అధికారులు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించి ఆసుపత్రి సెక్యూరిటి సిబ్బంధితో కలిసి ప్రభుత్వ స్థలంలో వెలసిన బోర్డులను తొలగించారు.ఆ సమయంలో అక్కడే ఉన్న హుసేన్ ఆగ్రహంతో ఊగిపోతూ స్థలం తమదని వాగ్వివాదానికి దిగాడు. ఏదైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని అతడికి సూచించి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత హుసేన్ నేరుగా తాహాసీల్దార్ కార్యాలయంకు వచ్చి ఆసుపత్రి ఆవరణలో రఘుకుల ప్రసాద్ అనే వ్యక్తికి ఐదు ఎకరాల స్థలం ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వరని తాహాసీల్దార్ వెంకటేశ్వర్లుతో వాగ్వివాదానికి దిగి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తీవ్రమైన అసభ్యపదజాలంతో దూషిస్తూ కొట్టడానికి వెళ్లడంతో అక్కడే ఉన్న వీఆర్ఓ విజయరాజు, ఇతర ఉద్యోగులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లాలని చెప్పినా వినిపించుకోకుండా హుసేన్ కార్యాలయంలో హంగామ సృష్టించాడు. పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చేలోపు అక్కడినుండి వెళ్లిపోయాడు.అనంతరం వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్కు వచ్చి జరిగిన గొడవను వివరించి ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్డులో ఉన్న స్థల వివాదం.... ఆసుపత్రి ఆవరణలో ఉన్న 11ఎకరాల రెండు గుంటల కాళీ స్థల వివాదం కోర్టులో ఉందని అధికారులు తెలిపారు.ఇందులోని కొంత స్థలం తమదని పేర్కొంటే అమీనాబేగం, మొహ్మద్ ఖాసీం అనే వ్యక్తులు కోర్టుకు వెళ్లారని, కోర్టుకు వెళ్లిన వారిలో తాను కూడా ఉన్నానని తమపై దౌర్జన్యాని పాల్పడ్డ వ్యక్తి మహ్మద్ హుసేన్ చెపుతున్నాడని తాహాసీల్దార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
అపార్టుమెంట్ పై నుంచి పడి వాచ్మన్ మృతి
అల్వాల్ (హైదరాబాద్ క్రైం): హైదరాబాద్ నగరం అల్వాల్లోని జేఏ ఆర్కేడ్లో అపార్టుమెంట్పై నుంచి పడి వాచ్మన్ మృతిచెందిన సంఘటన గురువారం జరిగింది. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం తణుకు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(40) పదిహేను రోజుల క్రితం జేఏ ఆర్కేడ్లో వాచ్మన్గా చేరాడు. ఈ క్రమంలో గురువారం అపార్టుమెంట్ పెంట్హౌజ్పై ఉన్న ట్యాంక్పైకి ఎక్కుతుండగా నిచ్చెనపై నుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, వెంకటేశ్వర్లకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగలనుకొని చితక బాదారు.. వ్యక్తి మృతి!
-
తల వదిలి ... మొండెం తీసుకెళ్లారు
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. ఏపీఎస్పీ 9వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. అతడి తలను దుండగులు బండి ఆత్మకూరులో వదిలి వెళ్లారు. సదరు గ్రామస్తులు మనిషి తలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని తలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టగా... కోడూరు వద్ద తల లేని మొండాన్ని గుర్తించి... స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తల, మొండం గత అయిదురోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుదిగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధమా లేక ఇతర ఏమైనా కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల తన కుటుంబాన్ని కర్నూలులో దింపిన వెంకటేశ్వర్లు తిరిగి వస్తున్న క్రమంలో అదృశ్యమైయ్యాడని పోలీసులు తెలిపారు. తలతో పాటు ఏడమ చేతిని కూడా దుండగులు నరికి వేశారు. -
టికెట్ లేదని చితకకొట్టారు, ఒకరి మృతి
కర్నూలు : కర్నూలు జిల్లా డోన్ లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తించారు. డోన్ రైల్వే స్టేషన్ జంక్షన్లో దొంగలనే అనుమానంతో... రైలులోని కొందరు ప్రయాణీకులను చితకబాదారు. తన్నుకుంటూ తీసుకెళ్లారు. పోలీసుల దెబ్బల ధాటికి కర్నూలుకి చెందిన గౌడ వెంకటేశ్వర్లు మృతి చెందాడు. కర్నూలు నుంచి వేరే ఊరికి వెళ్తుండగా....తన భర్తను అకారణంగా కొట్టి చంపేశారని మృతుడు భార్య కన్నీటి పర్యంతమైంది. పోలీస్ డ్రెస్లో వచ్చిన ఐదారుగురు చితక్కొట్టి వెళ్లిపోయారని...అందుకే చనిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఏసీబీ వలలో ఇద్దరు రెవెన్యూ అధికారులు
రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ గండేడ్లో ఘటన గండేడ్: ఏసీబీ వలకు ఇద్దరు రెవెన్యూ అధికారులు చిక్కారు. వ్యవసాయ భూమి రికార్డుల మార్పు, పట్టా చేసేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ గండేడ్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ శీనప్పలు గురువారం రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. గండేడ్ మండ లం గాధిర్యాల్ గ్రామానికి చెం దిన దాయాదులు హుస్నాబాద్ హన్మంత్రెడ్డి, రాంరెడ్డిలకు కొంతకాలంగా సర్వేనంబర్లు 188,189, 253లోని 12 ఎకరాల భూమి విషయమై గొడవలు ఉన్నాయి. మొత్తం భూమి హన్మంత్రెడ్డి పేరుమీద ఉండడంతో తనకు వాటా ఇవ్వాలని రాంరెడ్డి కోర్టులో కేసు వేయడంతో 1996లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వంశపారంపర్యంగా రాంరెడ్డికి దక్కాల్సిన రెండుభాగాలైన 8 ఎకరాలు ఇస్తానని హన్మంత్రెడ్డి అంగీకరించి అఫిడవిట్ రాసిచ్చాడు. దీంతో రాంరెడ్డి కుమారుడు వెంకట్రాంరెడ్డి సదరు పొలాన్ని తన తండ్రి పేరుమీదుగా మార్చి పట్టా చేయాలని 3 నెలల క్రితం తహసీల్దార్ వెంకటేశ్వర్లును ఆశ్రయించాడు. అప్పటి నుంచి తహసీల్దార్ కాలయాపన చేస్తూ వచ్చాడు. చివరకు తహసీల్దార్ రూ.40 వేలు డిమాండ్ చేయడంతో రూ. 20 వేలు ఇస్తానని వెంకట్రాంరెడ్డి అంగీకరించాడు. అయినా కూడా తహసీల్దార్ పనిచేసి పెట్టలేదు. దీంతో విసుగెత్తిన వెంకట్రాంరెడ్డి ఈనెల 10న నగరంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిచ్చిన రూ. 20 వేలు తీసుకొని గురువారం మధ్యాహ్నం గండేడ్ తహసీల్దార్ వద్దకు వచ్చాడు. ఈరోజే రికార్డుల్లో నమోదు చేయించి పట్టా పత్రం ఇస్తానని తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆయనకు తెలిపాడు. డబ్బులు సీనియర్ అసిస్టెంట్ శీనప్పకు ఇవ్వాలని చెప్పడంతో.. ఏసీబీ అధికారుల సూచన మేరకు వెంకట్రాంరెడ్డి వాయిస్ రికార్డు చేశాడు. అనంతరం వెంకట్రాంరెడ్డి శీనప్పకు రూ. 20 వేలు ఇవ్వగా ఏసీబీ అధికారులు వెళ్లి శీనప్పను రెడ్హ్యాండడ్గా పట్టుకున్నారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ శీనప్పలను అదుపులోకి తీసుకొని విచారించారు. స్వాధీనం చేసుకున్న నోట్ల మీదున్న వేలిముద్రలను సేకరించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కాగా తహసీల్దార్ ప్రతి కేసుకు లంచం మాట్లాడుకొని శీనప్ప ద్వారా డబ్బులు తీసుకునేవాడని స్థానికులు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు శ్రీనివాస్, రాజేష్, కాశయ్య ఉన్నారు. -
ఒకరిపై కక్ష 121 మందికి శిక్ష
ఒంగోలు వన్టౌన్: అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ఉద్యోగులపై కూడా అకారణంగా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. కేవలం ఒక ఉపాధ్యాయుడిపై కక్షసాధింపు కారణంగా కనిగిరి నియోజకవర్గం పరిధిలోని సీఎస్పురం మండలంలో పనిచేస్తున్న 121 మంది ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్ నెలల జీతాలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే..సీఎస్పురం మండలంలోని అంబవరం ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కే వెంకటేశ్వర్లును విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ అధికార పార్టీ నేతల సిఫార్సులతో విద్యాశాఖాధికారులు సెప్టెంబర్ 8న సస్పెండ్ చేశారు. దీంతో మండలంలోని ఉపాధ్యాయులంతా ఒంగోలుకు తరలివచ్చి కలెక్టర్ను, డీఈవోను కలిసి ఆ ఉపాధ్యాయుడి తప్పు లేకుండా సస్పెండ్ చేశారని వినతిపత్రాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 29న వెంకటేశ్వర్లు సస్పెన్షన్ను ఎత్తివేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అయినా వెంకటేశ్వర్లును తిరిగి విధుల్లోకి చేర్చుకోకుండా సీఎస్పురం ఎంఈవో సెలవు పెట్టి వెళ్లిపోయారు. డీఈవో ఉత్తర్వుల మేరకు వెంకటేశ్వర్లు అక్టోబర్ 9న తిరిగి విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు, మండలంలో పని చేస్తున్న మిగిలిన 121 మంది ఉపాధ్యాయులకు అక్టోబర్ నెల జీతాలు చెల్లించలేదు. ఈ క్రమంలో సీఎస్పురం ఎంఈవోగా ఇటీవల హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి బాధ్యతలు స్వీకరించారు. అంబవరం స్కూలులో రికార్డులన్నింటినీ పరిశీలించి అవి సక్రమంగా ఉంటేనే అక్కడ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు జీతాలు చెల్లించాలని డీఈవో ఆమెను ఆదేశించారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో పాఠశాలను సందర్శించి అన్ని రికార్డులను పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు తేల్చారు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుతో పాటు మండలంలోని మిగిలిన 121 మంది ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్ నెల జీతాలు చెల్లించేందుకు ఎంఈవో బిల్లులను కనిగిరి ఉపఖజానాధికారి కార్యాలయంలో సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు విద్యాశాఖాధికారులపై మళ్లీ ఒత్తిడి తెచ్చారు. వెంకటేశ్వర్లుకు జీతాలు చెల్లించటానికి లేదని, మిగతా ఉపాధ్యాయులకు జీతాలివ్వాలని సూచించారు. అయితే విధి నిర్వహణలో ఉన్నందున ఆయన్ను మినహాయించి మిగతా వారికి జీతాలు చెల్లించేందుకు నిబంధనలు అంగీకరించవు. ఈ నేపథ్యంలో కనిగిరి ఉపఖజానాధికారి కార్యాలయంలో ఎంఈవో సమర్పించిన రెండు నెలల జీతాల బిల్లులను సవరణల సాకుతో వెనక్కి తెచ్చారు. కేవలం ఒక ఉపాధ్యాయుడ్ని టార్గెట్ చేస్తూ మండలంలోని ఉపాధ్యాయులందరికీ జీతాలు అందకుండా అడ్డుకుంటున్న వైనాన్ని ఉపాధ్యాయులందరూ నిరసిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అందరికీ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యాశాఖ అధికారుల తీరు ఆక్షేపణీయం పొట్టెండ్ల మాలకొండయ్య, ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ట్రెజరీకి పంపించి టోకెన్ నంబర్ కూడా ఓకే అయిన తరువాత బిల్లులు వెనక్కు తీసుకోవడం తగదు. విద్యాశాఖ అధికారుల తీరు ఆక్షేపణీయం. ఉపాధ్యాయులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి. వ్యక్తిగత కక్షతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు జేఎస్ ఆనంద్, ఉపాధ్యాయుడు వ్యక్తిగత కక్షతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లింపులో విద్యా శాఖ తీరును తీవ్రంగా నిరసిస్తున్నాం. ఉపాధ్యాయులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి. జీతం లేకుండా విధులు నిర్వర్తించమంటే ఎలా,గోపీ, ఉపాధ్యాయుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం. జీతాల మీదనే ఆధారపడి జీవిస్తున్నాం. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఏ విదంగా విధులు నిర్వర్తించగలం. వెంటనే జీతాలు చెల్లించాలి,వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయుడు గత నెలలో ఎంఈవో మెడికల్ లీవ్ పెట్టారని జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎంఈవో ఉన్నా కూడా జీతాల బిల్లులు పంపించకపోతే ఎలా, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ట్రెజరీకి పంపిస్తున్నాం,బత్తుల పద్మావతి, ఎంఈవో డీఈవో లిఖిత పూర్వక ఉత్తర్వుల మేరకు అంబవరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కమ్మనేతి వెంకటేశ్వర్లు జీతాన్ని నిలిపి వేసి మిగిలిన ఉపాధ్యాయులకు జీతాల బిల్లులు బుధవారం ట్రెజరీకి పంపుతున్నాం. -
నేడు విశాఖలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం ఉదయం విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఉన్న షాదీఖానాలో జరగనుంది. పార్టీ అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ సాయిరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి సాగి ప్రసాదరాజు ఈ సమావేశంలో జిల్లా పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో పాటు హామీలు నెర్చడంలో వైఫల్యానికి నిరసనగా ఈ నెల 5వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నా విజయవంతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ ధర్నాకు హాజరవుతుండడంతో భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చే అవకాశాలు ఉండడంతో చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. దీంతో పాటు జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా త్రిసభ్య కమిటీ సభ్యులు సూచనలు చేయనున్నారు. సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవహారాల ఇన్చార్జ్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, ట్రేడ్యూనియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జున, జిల్లా ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయులు, గిడ్డి ఈశ్వరి, కిలారి సర్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఇతర జిల్లా నాయకులు పాల్గొననున్నారు. -
మణుగూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయూలి
మణుగూరు : మణుగూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి ఫోన్లో సాక్షితో మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన ట్రైబల్ వెల్పేర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు దృష్టికి నియోకవర్గ సమస్యలను తీసుకెళ్లినట్లు తెలిపారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయూలని, నియోజకవర్గంలోని పులుసుబొంత ప్రాజెక్టు కిన్నెరసాని కాలువ పనులకు నిధులు కేటాయించి పనులు పూర్తిచేయాలని కోరామని చెప్పారు. 11ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన పూర్తిచేయా ని, చెరువులు, కుంటలకు మరమ్మతులు చే యూలని, గిరిజన బాలికల రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరి నట్టు వివరించారు. పీహెచ్సీలో సిబ్బంది ని నియమించాలని, గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మిం చాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరామని తెలిపారు. మణుగూరు పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీలో ఖాళీలను భర్తీ చేయూలని కోరినట్లు చెప్పారు. ఈ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పం దించారని తెలిపారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. -
భర్తను చితకబాదిన భార్య
నేలకొండపల్లి : తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను పట్టించుకోవడంలేదని ఆగ్రహించిన భార్య, బంధువులతో కలిసి అతడిని చితకబాది పోలీస్స్టేషన్లో అప్పగించింది. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం... జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలోని జూపెడకు చెందిన ఎలక వెంకటేశ్వర్లుకు నల్లగొండ జిల్లా మోతే మండలంలోని రాయిపాడు గ్రామానికి చెందిన పప్పుల రాజారావు కూతురు రమణతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే వెంకటేశ్వర్లు బోనకల్ మండలంలోని మోటమర్రి గ్రామంలో కొద్ది రోజులుగా వీఆర్ఓగా పనిచేస్తున్నాడు. కాగా, నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన ఓ మహిళతో అతడు కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడంలేదు. ఈ విషయంపై భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఇటీవల నల్లగొండ జిల్లా మోతే పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ వెంకటేశ్వర్లు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతోపాటు రెండు నెలల నుంచి ఇంటికి రావడంలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు భార్య రమణ మంగళవారం తన ఇద్దరు పిల్లలు, బంధువులతో కలిసి చెన్నారం గ్రామానికి వచ్చారు. అనంతరం భర్త వెంకటేశ్వర్లుతోపాటు అతడితో ఉన్న మహిళను వారు చితకబాది పోలీసుస్టేషన్లో అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి ఎస్హెచ్ఓ బాలస్వామి.. వెంకటేశ్వర్లు, అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై కేసు నమోదుచేశారు. -
కమిషనర్ తీరుపై కన్నెర్ర
ఒంగోలు: నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహారం ప్రజాప్రతినిధులకు సైతం అసహనం తెప్పించింది. సోమవారం విద్యుత్ స్తంభంపై నుంచి పడి చనిపోయిన వెంకటేశ్వర్లు బంధువులు, గ్రామస్తులు ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా ... శాంతింపజేయాల్సింది పోయి కమిషనర్ సెల్ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఎక్కడున్నారో తెలియనీయకుండా తప్పించుకోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మొదలు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ వరకు కమిషనర్కు ఫోన్లు చేస్తున్నా నో రెస్పాన్స్. దీంతో కలెక్టర్కు ఫోన్చేసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించడంతో కలెక్టర్ జోక్యం చేసుకోవల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి... ముక్తినూతలపాడు పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్గా అదే గ్రామానికి చెందిన సూదనగుంట వెంకటేశ్వర్లు(32) సోమవారం కరెంట్ పోల్ ఎక్కి విద్యుత్ బల్బులు అమర్చుతూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషయం విదితమే. వెంకటేశ్వర్లు కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, బంధువులు మంగళవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ ఆవరణలోనే మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ నాయకులు కలుగజేసుకొని రూ.15 లక్షల పరిహారం, మృతుని భార్యకు ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి శిద్దా రాఘవరావుకు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్కు ఫోన్చేసి కమిషనర్ మొండి వైఖరిని వివరించారు. మరో వైపు వైఎస్సార్ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా జోక్యం చేసుకొని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి వివరించారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి నేరుగా కలెక్టర్తో మాట్లాడారు. మరో వైపు మంత్రితోపాటు ఎమ్మెల్యే కూడా కమిషనర్తో మాట్లాడేందుకు యత్నించగా ఆమె ఎక్కడున్నారో తెలియరాలేదు . కనీసం ఫోన్లు కూడా పని చేయకపోవడంతో కలెక్టర్తో మాట్లాడాల్సి వచ్చింది. క్యాంపులో ఉన్న జిల్లా ఉప కార్మికశాఖ అధికారి అఖిల్ విషయం తెలుసుకొని కార్మికశాఖ తరుపున తప్పక న్యాయం జరిగేలా చూస్తానంటూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రమాదేవి ద్వారా ఆందోళన చేస్తున్నవారికి తెలియజేశారు. ఆ హామీతో సంతృప్తి చెందని ఆందోళనకారులు చర్చిసెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. పరారైన కమిషనర్ను పిలిపించాలంటూ ఆగ్రహించారు. ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ అక్కడకు చేరుకొని కలెక్టర్తో చర్చించడానికి రావాలంటూ కొంతమందిని పంపించారు. కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై తప్పకుండా కమిషనర్నుంచి వివరణ కోరతానని కలెక్టర్ విజయ్కుమార్ హామీ ఇచ్చారు. మృతుని భార్యకు ప్రభుత్వ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తానని...పర్మినెంట్ చేసే అవకాశాలు పరిశీలిస్తానన్నారు. వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్టు, పీఎఫ్ ఇతరత్రా మొత్తం న్యాయబద్ధంగా ఎంత రావాలో అంత మొత్తాన్ని త్వరితగతిన ఇప్పిస్తామంటూ కలెక్టర్ వివరించడంతో శాంతించి మృతదేహాన్ని చర్చిసెంటర్నుంచి తీసుకొని వెళ్లారు. మున్సిపల్ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం... వెంకటేశ్వర్లు ఎలక్ట్రీషియన్ కాదని, హెల్పర్గా మాత్రమే తీసుకున్నట్లు మున్సిపల్ డీఈ గోపాల్ కలెక్టర్కు వివరించారు. దీంతో కలెక్టర్ ఆగ్రహించారు. నాన్ టెక్నికల్ కింద ఉద్యోగం ఇచ్చి టెక్నికల్ పనులు ఎందుకు చేయించుకుంటున్నారు...అతనిని ఏ విభాగం కింద తీసుకున్నారో రిపోర్టు పంపండంటూ మండిపడ్డారు. ఆరుగంటలపాటు అందుబాటులోకి రాని కమిషనర్ చర్చలు ముగిశాయని తెలుసుకొని రాత్రి 8 గంటల తరువాత ప్రత్యక్షమయ్యారు. చీమకుర్తికి వెళ్లడంతో ఫోన్ స్విచాఫ్ అయిందని చెప్పడం గమనార్హం. -
బిల్లు ఆమోదం వెనుక బాబు, వెంకయ్యల కుట్ర
జేఏసీ జిల్లా చైర్మన్ వెంకటేశ్వర్లు ధ్వజం నల్లగొండ అర్బన్: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపొద్దని తెలంగాణ సమాజమంతా ఉద్యమాలు కొనసాగిస్తుంటే పార్లమెంట్లో అందుకు సంబంధించిన బిల్లును ఆమోదించి కేంద్రం అత్యుత్సాహం ప్రదర్శించిందని జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. బిల్లు ఆమోదం వెనుక చంద్రబాబునాయుడు, వెంకటయ్యనాయుడుల కుట్ర ఉన్నదని ఆయన ఆరోపించారు. బిల్లుకు నిరసనగా పట్టణంలోని రామగిరి సెంటర్లో శుక్రవారం రాత్రి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ గతంలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేయడం బాధాకరమన్నారు. ఆంధ్రాప్రాంతం వారి ప్రయోజనాల కోసం 3లక్షల మంది గిరిజనుల హక్కులను కేంద్రం కాలరాసిందని ఆరోపించారు. కేంద్రం గిరిజనుల హక్కులను హరిస్తూ వారికి తీరని ద్రోహం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వేణుసంకోజు, సోమయ్య, జవహర్లాల్, విజయ్కుమార్, పిచ్చయ్య, శ్రీనివాస్, దేవేందర్, సైదులు, సాగర్, రవి, రమేష్, సోమమల్లయ్య, సిహెచ్. రామరాజు, సంతోష్రెడ్డి పాల్గొన్నారు. బంద్కు టీజేఏసీ మద్దతు పోలవరం బిల్లును వ్యతిరేకిస్తూ శనివారం తలపెట్టిన బంద్కు టీజేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీజేఏసీ చైర్మన్ జి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. విద్యార్థి సంఘాలు.. తెలంగాణ రాష్ట్ర బంద్కు మద్దతు ప్రకటిస్తున్న పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఇందూరు సాగర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కోట రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. రాజారాం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి లోకం, యువకులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. -
కన్నతండ్రే కాలయముడయ్యాడు
ప్రేమను పంచాల్సిన కన్నతండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెనుభూతమై...ఆ కోపాన్ని ముక్కుపచ్చలారని పసివారిపై చూపాడు. పాము తన బిడ్డల్ని తానే చంపుకుతిన్నట్లు..కాలనాగులా మారి కన్నబిడ్డల్ని కాటేశాడు. ప్రేమగా ఎత్తుకు పెంచిన చేతులతోనే వారి ఊపిరి ఆగేదాకా నీటముంచి..ఉసురు తీశాడు. చివరకు తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంగోలులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఒంగోలు టౌన్: భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లల్ని హతమార్చిన దారుణ సంఘటన ఒంగోలులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు... యర్రగొండపాలేనికి చెందిన పగ్గల వెంకటేశ్వర్లుకు ఐదేళ్ల క్రితం నాగమణితో వివాహమైంది. పొట్టకూటి కోసం ఒంగోలు వచ్చిన వెంకటేశ్వర్లు స్థానిక గాంధీనగర్ నాలుగో లైనులో నివాసం ఉంటూ ఒక టీస్టాల్లో టీమాస్టర్గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి వెంకట దుర్గాసాయి (3), చిన్నకుమారుడు వెంకట శ్రీనివాస్ (13 నెలలు). భార్యపై ఎప్పటి నుంచో ఉన్న అనుమానం పెనుభూతమై...చివరకు కన్నబిడ్డలతో సహా భార్యను హతమార్చాలనుకున్నాడు. చిన్నారులకు, భార్యకు శుక్రవారం రాత్రి బాదంపాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. కొద్దిగా తాగాక అనుమానం వచ్చిన భార్య వాటిని పడేసింది. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో...అర్ధరాత్రివేళ ఇద్దరు పిల్లల్ని నిండుగా నీరున్న డ్రమ్ములో ముంచి అత్యంత పాశవికంగా అంతమొందించాడు. వారు చనిపోయారని నిర్ధారించుకుని మృతదేహాలను ఇంట్లో మంచంపై పడుకోబెట్టాడు. ఆ తరువాత తాను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈలోగా మత్తు నుంచి తేరుకున్న భార్య నాగమణి భర్త ఇంట్లోకి..బయటకు తిరుగుతుండటాన్ని గమనించింది. అయితే బిడ్డలు అప్పటికే విగతజీవులయ్యారన్న సంగతి గుర్తించలేకపోయింది. భార్యతో ఘర్షణపడి..శరీరంపై చొక్కా కూడా లేకుండా పరిగెత్తుకుంటూ బజారున పడ్డాడు. నేరుగా మంగమూరు రోడ్డు సెంటర్కు చేరుకుని బైపాస్రోడ్డుగుండా 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ సమీపానికి చేరుకున్నాడు. ఏదో ఒక వాహనం కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. చివరకు సింగరాయకొండ వైపు నుంచి వస్తున్న లారీకి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎదురెళ్లాడు. అది గమనించిన లారీ డ్రైవర్ అతన్ని తప్పించేందుకు ప్రయత్నించాడు. అయినా లారీకి ఒక పక్క వెంకటేశ్వర్లు ఢీకొనడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పాక్కుంటూ మధ్యలో ఉన్న డివైడర్పై వెళ్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. చిన్నారుల మృతి ఘటనపై సమాచారం అందుకున్న తాలూకా ఎస్సై జీ పాండురంగారావు చిన్నారుల మృతదేహాలు తీసుకుని..రిమ్స్కు బైపాస్గుండా వెళ్తున్న సమయంలో రోడ్డుపక్కన వెంకటేశ్వర్లు పడిఉండటాన్ని గుర్తించి అతన్ని రిమ్స్లో చేర్చారు. అనంతరం చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను సందర్శించిన డీఎస్పీ: ఒంగోలు డీఎస్పీ పి.జాషువా గాంధీనగర్లో హత్యకు గురైన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను శనివారం ఉదయం సందర్శించారు. తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్, ఎస్సై జి.పాండురంగారావులతో కలిసి వెళ్లిన ఆయన సంఘటన జరిగిన తీరుపై వాకబు చేశారు. చిన్నారుల తల్లి నాగమణితోపాటు కుటుంబ సభ్యులను విచారించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై తాలూకా సీఐ ఐ శ్రీనివాసన్ దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు ఉద్దేశపూర్వకంగా ఇద్దరు కుమారులను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమేరకు అతనిపై హత్య కేసు నమోదు చేశారు. సాయి ఇక రాడా.. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు తెల్లవారేసరికి విగత జీవులుగా కనిపించడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. పెద్దకుమారుడు దుర్గాసాయి మృతదేహాన్ని రిమ్స్కు తీసుకెళ్లే సమయంలో.. బాలుడి స్నేహితుల్లో ఒకరు ‘అరే సాయి ఇక రాడా..’ అన డం అక్కడి వారి హృదయాలను ద్రవింపజేసింది. చిన్నారుల మృతదేహాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడున్న వారి అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. -
నేటికీ బ్రిటీష్ కాలం నాటి సంఖ్యే...
ఒంగోలు కలెక్టరేట్ : ‘ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్య బ్రిటీష్ కాలం నాటిదే. ఒకవైపు జనాభా పెరుగుతున్నా అందుకు అనుగుణంగా కార్యాలయాలు పెంచడం లేదు. సిబ్బందిని పెంచడంలేదు. పైగా, ప్రస్తుతం ఉన్న వారిని దిగకోస్తూ మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో ఏర్పడిన నూతన ప్రభుత్వమైనా ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలి’ అని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1983 తరువాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 25 నుంచి 50 వేలలోపు జనాభా ఉంటే మండలాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం లక్షలాది జనాభా పెరిగినా అదే సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. 432 మంది సూపరింటెండెంట్లకు సంబంధించి 167 కోట్ల రూపాయల బడ్జెట్తో గత ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. నూతనంగా 20 డివిజన్లు ఏర్పాటు చేయాలని సీసీఎల్ఏ ప్రభుత్వానికి నివేదిస్తే కేవలం 10 డివిజన్లతో సరిపెట్టిందన్నారు. జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో 78 భూసేకరణ యూనిట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధీనంలో ఉన్నాయని, అందులో 35 మంది సిబ్బంది ఉన్నారని, వాటిలో 28 యూనిట్ల ను రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. ఆక్రమణలు తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు అన్యాయం... ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అన్యాయమని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించే సమయంలో ఒకవర్గం వారు రెచ్చగొట్టి మరో వర్గంచేత సంబంధిత తహసీల్దార్, ఆర్ఐపై కేసులు పెట్టిస్తున్నారని, చివరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయిస్తున్నారని తెలిపారు. అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి దళారులు కేసులు పెట్టిస్తున్నారని, ఇలాంటి కేసులపై జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం స్పందించాలని ఆయన కోరారు. తూతూమంత్రంగా హెల్త్కార్డులు... ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని నాలుగేళ్ల నుంచి కోరుతుంటే గత ప్రభుత్వం చివరి దశలో తూతూమంత్రంగా ఇచ్చిందని బొప్పరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 రకాల వ్యాధులకు ఓపీ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. రెగ్యులర్గా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగికి రెండు లక్షల రూపాయల రీయింబర్స్మెంట్ ఉన్నందున నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం హెల్త్కార్డుల విషయంలో మరింత ప్రయోజనకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులనుకొనసాగించాలి... ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని బొప్పరాజు కోరారు. జూన్ నెలాఖరుకు కాంట్రాక్టు ముగిసి రోడ్డున పడతామన్న ఆందోళన ఎక్కువ మంది ఉద్యోగుల్లో ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకుండా పనిజరిగే పరిస్థితులు లేవన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విన్నవించడం జరిగిందన్నారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. జిల్లాస్థాయిల్లో పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు చేపట్టాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్బాబు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎల్ నరసింహారావు, ఆర్.వాసుదేవరావు, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోయ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆంధ్ర అధికారుల బదిలీలు షురూ
భద్రాచలం : జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన ఉన్నత స్థాయి అధికారుల బదిలీల పర్వం వేగవంతమైంది. కీలక పోస్టుల్లో తెలంగాణకు చెందిన అధికారులే పనిచేసేలా చర్యలు చేపట్టిన రాష్ట్రప్రభుత్వం రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ హోదా గల ఏడుగురు అధికారులను బదిలీ చేసింది. మంగళవారం ఈ మేరకు జీవో నంబర్ 6 పేరుతో ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేసింది. దీనిలో భాగంగా భద్రాచలం, పాల్వంచ ఆర్డీవోలు కాసా వెంకటేశ్వర్లు, ఎన్.సత్యనారాయణలను బదిలీ చేస్తూ... ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రత్యే క ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా పనిచేస్తున్న ఆర్.అంజయ్యను భద్రాచలం ఆర్డీవోగా బదిలీ చేశారు. అందరి మన్ననలు పొందిన వెంకటేశ్వర్లు భద్రాచలం ఆర్డీవోగా కాసా వెంకటేశ్వర్లు 2013 డిసెంబర్ 4న బదిలీపై వచ్చారు. గతంలో భద్రాచలం తహశీల్దార్గా పనిచేసిన అనుభవం దృష్ట్యా శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈ ఏడాది జరిగిన ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు పాత్రను ప్రముఖంగా చెప్పవచ్చు. అన్ని శాఖల అధికారులను సమన్వయ పరిచి, ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ చిన్నపాటి లోపాలు కూడా లేకుండా విజయవంతం చేయించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. -
మేల్కొన్న ఓటరు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నాలుగు మున్సిపాలిటీలకు, రెండు నగర పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. జిల్లాలో సగటున 77.09 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఈసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. అత్యధికంగా ప్రజ్ఞాపూర్-గజ్వేల్ నగర పంచాయతీలో 83.39 శాతం పోలింగ్ కాగా, అత్యల్పంగా మెదక్లో 76.31 శాతం ఓట్లు పోలయ్యాయి. మెదక్లో 8,16 వార్డుల్లో, జోగిపేటలో 1,16 వార్డుల్లో, సంగారెడ్డిలో 20, 22 వార్డుల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ అభ్యర్థి బొంగుల విజయలక్ష్మి భర్త రవి, టీఅర్ఎస్ అభ్యర్థి మనోరంజని భర్త వెంకటేశ్వర్లు పోలింగ్ కేంద్రంలోనే ఘర్షణకు దిగారు. 10వ వార్డు పోలింగ్ కేం ద్రంలో వీళ్లిద్దరూ బాహాబాహీకి దిగడంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ పట్టణ సీఐ శివశంకర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోకుండా ఒక వర్గం వ్యక్తిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం, అదే వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన జ్యోతి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని శివశంకర్ అకారణంగా అడ్డుకొని, ఆమెను అరెస్టు చేసి జీపులో పోలీసుస్టేషన్కు తలించడం పట్ల మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆమె టీఅర్ఎస్ అభ్యర్థికి బంధువు కావడమే అరెస్టుకు కారణమని ప్రచారం జరిగింది. ఈ గొడవను ‘సాక్షి టీవీ’ ప్రసారం చేయటంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డి స్పందించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని సూచించడంతో పోలీసులు బొంగుల రవి, వెంకటేశ్వర్లు మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. టీడీపీ నాయకుడు ప్రతాప్రెడ్డి గృహనిర్బంధం గజ్వేల్ నగర పంచాయతీలో పోలింగ్ కేంద్రాలవద్ద పోలీసుల అతి ప్రవర్తన వల్ల వృద్ధులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులను త్వరగా నడవాలంటూ తోసివేయడంతో పలువురు మండిపడ్డారు. కాగా ప్రజ్ఞాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాడనే కారణంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి కుమారుడు విజయవర్ధన్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని నిరసిస్తూ ప్రతాప్రెడ్డి గజ్వేల్ పోలీస్స్టేషన్ వద్ద డీఎస్పీ శ్రీధర్రెడ్డితో వాగ్వాదానికి దిగటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతాప్రెడ్డిని పోలీసులు అతని ఇంటికి తీసుకువెళ్లి గృహ నిర్బంధం చేశారు. మెదక్లో 2వ వార్డు అభ్యర్థి అశోక్పై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. కొత్త ఓటర్ల నిరాశ.... కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్ల వివరాలను సకాలంలో ఓటరు జాబితాలో పొందుపరచడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. తమ వద్దనున్న జాబితాలో కొత్త ఓటర్ల పేర్లు ఉండగా... పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చిన జాబితాలో వారి పేర్లు లేకపోవడం వివాదంగా మారింది. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 2000 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. -
క్లబ్ పై దాడి
మంచిర్యాల అర్బన్, న్యూస్లైన్ : మంచిర్యాల హైటెక్ సిటీలోని మంచిర్యాల క్లబ్పై మంగళవారం రాత్రి పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా 36 మందిని అరెస్టు చేయగా.. వారి నుంచి రూ.4 లక్షలు, 22 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. క్లబ్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్సైలు లతీఫ్, వెంకటేశ్వర్లు, సంజీవ్ సిబ్బందితో కలిసి క్లబ్పై దాడి చే శారు. ఆ సమయంలో ఆరు గదుల్లో పేకాట ఆడుతూ కనిపించారు. పారిపోయే క్రమంలో 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి పోలీసుస్టేషన్కు తరలించినట్లు సీఐ చెప్పారు. ఈ సందర్భంగా 22 సెల్ఫోన్లు, రూ.4 లక్షలు నగదు, ఫర్నిచర్, కైన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో రాజన్న, వెంకటేశ్గౌడ్, అంజిత్రావు, ఎండీ అన్వర్, ఎస్.జగన్, రామడుగు సుధీర్, కట్కూరి మల్లేశ్, బలమూరి కిషన్రావు, బేర పోచయ్య, గౌరీ వెంకటరమణ, ఎస్.సత్యనారాయణ, ఎండీ ఖాజా, కొత్త రవీందర్, చిలువేరు నాగేశ్వర్రావు, కళ్యాణ్, యాదగిరిరావు, సురేందర్రెడ్డి, రమేష్రెడ్డి, భీమయ్య, నర్సింగారావు, మనోహర్రావు, చంద్రయ్య, నవీన్కుమార్, నునారపు రాజలింగు, పాపారావు, శ్రీనివాస్, ఎస్.వెంకటేశ్వర్రావు, బి.అనిల్, పూర్ణచందర్, రాజేందర్గౌడ్, జి.నరేందర్, లక్ష్మీమనోహర్రావు, సానా సత్తయ్య, వి.శ్రీనివాసరావు, బెల్లంకొండ భూమారెడ్డి, యం.రవీందర్రావు ఉన్నారు. -
పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించిన డీఐఓ
కారేపల్లి, న్యూస్లైన్: జిల్లా వ్యాప్తంగా 2,98,220 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసే విధంగా లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డీఐఓ) వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన మండలంలోని పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కారేపల్లి పీహెచ్సీలో విలేకరులతో మాట్లాడారు. 3,327 పోలియో కేంద్రాలు, 90 మోబైల్ టీంలు, 62 తాత్కాలిక పోలియో కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వైద్య సిబ్బందితో పాటు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ స్వచ్చంధ సేవా సంస్థల నుంచి వలంటీర్లు మొత్తంగా 13,944 మంది ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. గోదావరి నది పరివాహాక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలైన రేఖపల్లి, జీడికుప్ప, పోచారం, పేరాంటాలపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో రెండు లాంచీ లను, పర్ణశాల, అమలారం, ఏలూరి, తిప్పకుప్ప గ్రామాలకు మూడు బోట్లను ఏర్పాటుచేసి చిన్నారులకు పోలి యో చుక్కలను వేసినట్లు ఆయన తెలిపారు. కొండరెడ్లు, ఆదివాసీలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక వలంటీర్లను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. వచ్చే నెల 11వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ)ద్వారా దేశానికి ఫ్రీ పోలి యో సర్టిఫికెట్ను ప్రధాన మంత్రి, రాష్ట్రపతిల చేతుల మీదుగా ఢిల్లీలో అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు కారేపల్లి పీహెచ్సీలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీరి వెంట కారేపల్లి ప్రాజెక్టు సీడీపీఓ విజయలక్ష్మి, వైద్యురాలు నాగమణి, ల్యాబ్ టెక్నిషియన్ జియావుద్దీన్లు ఉన్నారు. -
‘ఫోరైడ్’ విషానికి విరుగుడు !
నీటి నుంచి ‘ఫ్లోరైడ్’ను సులువుగా తొలగించేందుకు రెండు పద్ధతులను అభివృద్ధి చేసిన ఉస్మానియా ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్.. నల్లగొండ జిల్లాలో వేలాది మందిని జీవచ్ఛవాలను చేస్తున్న మహమ్మారి.. ఆ ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి నల్లగొండ జిల్లా వాసులను ఆదుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు నడుం బిగించారు. ఐదేళ్లపాటు పరిశోధన చేసి.. అత్యంత సులువైన పద్ధతుల్లో నీటిలోంచి ఫ్లోరైడ్ను తొలగించే పద్ధతులను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనను గుర్తించిన భారత సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (సెర్బ్) దానిని అమలుచేసి, చూసేందుకు రూ. 12 లక్షలను మంజూరు చేసింది. ఈ నిధులతో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఒక ఫ్లోరైడ్ పీడిత గ్రామాన్ని ఎంచుకుని రెండేళ్లపాటు శుద్ధిచేసిన తాగునీటిని అందించేందుకు వెంకటేశ్వర్లు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఇటీవల నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులును కలసి అనుమతి కూడా తీసుకున్నారు. వెంకటేశ్వర్లు ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో వృక్షశాస్త్రం (బాటనీ) సీనియర్ ప్రొఫెసర్గా, పర్యావరణ శాస్త్ర విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. తాను చేసిన పరిశోధన వివరాలను ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా తెలియచేశారు. రెండు పద్ధతుల్లో ఫ్లొరైడ్ నీటి శుద్ధి నీటిలోంచి ఫ్లోరైడ్ను తొలగించేందుకు వెంకటేశ్వర్లు రసాయన, ఎలక్ట్రాలసిస్ విధానాల్లో నీటిని సులువుగా, తక్కువ వ్యయంతో శుద్ధిచేసే రెండు పద్ధతులను అభివృద్ధి చేశారు. ఐదేళ్ల పాటు చేసిన తన పరిశోధన వివరాలను సెర్బ్కు తెలియజేసి.. అమలుచేసి పరిశీలించేందుకు రూ. 12 లక్షల నిధులను సమకూర్చుకున్నారు. ఒక గ్రామాన్ని ఎంచుకుని.. నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ నీటిని తాగిన ప్రజల ఆరోగ్య పరిస్థితిని మూడు లేదా ఆరునెలలకోసారి పరిశీలిస్తారు. వారి మూత్రం, రక్తాన్ని పరిశీలించి, ఫ్లోరైడ్ శాతం ఎంత తగ్గింది? దాని ప్రభావమేమిటి? తదితర అంశాలను పరిశీలిస్తారు. ఫ్లోరైడ్ రహితంగా మారుస్తా... నేను చేపట్టిన ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. ప్రాజెక్టును చేపట్టిన గ్రామంలో ఫలితాల ఆధారంగా.. దాతల సహాయంతో నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఈ నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి.. నల్లగొండను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తా. నేను రూపొందించిన పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని పంట పొలాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.ట ఇవీ పద్ధతులు... రసాయన విధానం.. - బోరు నీటిని ప్లాంటులోని ట్యాంకుల్లో సేకరించి, బేరియం హైడ్రాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు. - నీటిలో కలిపిన బేరియం హైడ్రాక్సైడ్ అందులోని ఫ్లోరైడ్, ఇతర రసాయనాలతో చర్య జరిపి అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది. - దాంతోపాటు నీటిలోని భార లోహ మూలకాలు, బ్యాక్టీరియా, ఫంగస్, నాచును తొలగించే చర్యలు చేపడతారు. - కొంత సమయం అనంతరం వడగట్టడం ద్వారా శుద్ధి అయిన మంచినీరు రూపొందుతుంది. ఎలక్ట్రాలసిస్ విధానం.. విద్యుత్తు ద్వారా నీటిని శుద్ధి చేసే ‘ఎలక్ట్రాలసిస్’ విధానం చాలా సులువైనది. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉన్నా.. అధిక విద్యుత్ వినియోగంతో పాటు ఇతర ఇబ్బందులూ ఉన్నాయి. వెంకటేశ్వర్లు దీనిని సులువుగా చేసేలా అల్యూమినియం కడ్డీలతో ఈ పరికరాన్ని రూపొందించారు. దీనితో ఏమాత్రం నీరు కూడా వృథా కాదు. కేవలం రూ. 500 వ్యయమయ్యే దీనితో ఇంట్లోనే నీటిని శుద్ధి చేసుకోవచ్చు. పది లీటర్ల నీటిని శుద్ధి చేయడానికి దాదాపు 10 నిమిషాల సమయం సరిపోతుంది. -
రైస్మిల్లులపై విజిలెన్స్ దాడులు
త్రిపురారం, న్యూస్లైన్ : మండల కేంద్రంలోని రెండు రైస్ మిల్లులపై బుధవారం విజిలెన్స్ అధికారులు దా డులు నిర్వహించారు. 185 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. బాబుసాయిపేట రోడ్డు సమీపంలో ఉన్న శ్రీనివాస మోడరన్ రైస్ మిల్లుల్లో నర్సింహ అనే వ్యాపారి ప్రజల వద్ద కొనుగోలు చేసిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిలువ చేశాడు. అదే వి ధంగా వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్లులో వెంకటేశ్వ ర్లు అనే వ్యాపారి 85 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిలు వ ఉంచాడు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి బి య్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బియ్యా న్ని తుంగపాడులో ఉన్న వంశీసాయి రైస్ మిల్లులో అప్పగించారు. ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ స్వామి తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఓ శ్రీధర్రెడ్డి, కానిస్టేబుల్ విష్ణువర్దన్, గిరి, సివిల్ సప్లయ్ ఆర్ఐ వాజీద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
ఓటే యువతకు ఆయుధం
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్లైన్ : సమాజాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి యువతకు ఓటే ఆయుధమని డీఎస్పీ లతామాధురి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్లో పట్టణ యువజన సంఘాల సమితి, టీజీఏ ఆధ్వర్యంలో సోమవారం ఆన్లైన్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలోని అవినీతి, అక్రమాల నిర్మూలనకు యువత ఓటు అనే ఆయుధంతో ఉత్తమ నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. తద్వారా ఓటుహక్కును సద్వినియోగం చేసుకుని దేశ, సమాజ ఉన్నతికి పాటుపడాలన్నారు. ఓటరు నమోదు కోసం యువజన సంఘాల నాయకులు చేపట్టిన ఉచిత ఆన్లైన్ ఓటరు నమోదు కార్యక్రమం అభినందనీయమని ప్రశంసించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని, కోరారు. అనంతరం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 2,500 మంది ఓటరుగా పేరు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు, పట్టణ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు ఊరే గణేశ్, టీజీఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రంగినేని శ్రీనివాస్, యువజన సంఘాల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలశంకర్కృష్ణ, యువజన సంఘాల పట్టణ ఉపాధ్యక్షుడు గోలి శంకర్, నాయకులు బండారి సతీశ్, వినోద్, కిశోర్, సాయి, విష్ణు పాల్గొన్నారు. -
గంగోత్రి ఎరువుల కర్మాగారంపై విచారణ
తుర్కపల్లి, న్యూస్లైన్: మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలోని గంగోత్రి ఎరువుల కర్మాగారంలో అమ్ముతున్న సీఎంఎస్ బస్తాలు డీఏపీ ఎరువులకు ప్రత్యామ్నా యం కాదని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు తెలిపారు. గంగోత్రి ఎరువుల కర్మాగారంపై డీసీసీబీ డెరైక్టర్ పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి ఫిర్యాదు మేరకు ఆదివారం కర్మాగారంలో విచారణ చేపట్టారు. రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐశ్వర్య సీఎంఎస్ పేరుతో అమ్ముతున్న ఎరువుల బస్తాల్లో కాల్షి యం, మెగ్నిషియం, సల్ఫర్లు ఉన్నాయని, డీఏపీలో ఉండే భాస్వరం లేదని తెలిపారు. గతంలో గంగోత్రి కర్మాగారం లో కొనుగోలు చేసిన ఐశ్వర్య సీఎంఎస్ ఎరువులు డీఏపీ అని వాడి నష్టపోవద్దని సూచించారు. ఐశ్వర్య సీఎంఎస్ ఎరువులు చౌడునేలలో పనిచేస్తాయని, పంటలకు సీఎంఎస్ ఎరువులు భూములకు సూక్ష్మపోషకాలివ్వవని తెలిపారు. కొనుగోలు చేసిన రైతులు ఈ విషయాన్ని గమనించి వాడుకోవాలని సూచించారు. గంగోత్రి యాజమాన్యం సీఎంస్ బస్తాలు రిటేలుగా కొనుగోలు చేయడం సరికాదన్నారు. గంగోత్రి యజమాన్యానికి సీఎంఎస్ ఎరువులను తయారు చేయడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. రిటేల్ అమ్మకాలు కొనసాగించం కొందరు రైతులు కావాలని సీఎంఎస్ ఎరువులు తీసుకెళ్లారని గంగోత్రి ఎరువుల కర్మగారం మేనేజింగ్ డెరైక్టర్ మధురాంరెడ్డి తెలిపారు. కంపెనీ ఎటువంటి రిటేల్ అమ్మకాలు కొనసాగించదని తెలి పారు. సీఎంఎస్ ఎరువులు డీఏపీ అని వాడి నష్టపోకుండా వ్యవసాయశాఖ అధ్వర్యంలో మండలంలో సీఎంఎస్ ఎరువులపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రైతులు మోసపోవద్దు గంగోత్రి ఎరువుల కర్మాగారంలో కొనుగోలు చేసిన ఐశ్వర్య సీఎంఎస్ ఎరువులు వాడి డీఏపీ ఎరువులు అనుకొని మోసపోవద్దని డీసీసీబీ డెరైక్టర్ పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. గంగోత్రి ఎరువుల కర్మగారం రైతులకు అవగాహన కల్పించకుండా సీఎంఎస్ ఎరువు లు అంటగట్టారని ఆరోపించారు. విచారణలో ఏఓ శిల్ప పాల్గొన్నారు. -
రబీలో ‘రాయితీ’కి రాం.. రాం!
సిద్దిపేట/సిద్దిపేట రూరల్, న్యూస్లైన్: ప్రధానంగా నీటిని ఆదా చేసేందుకు, నేల సారాన్ని కాపాడేందుకు వరికి బదులు ఇతర పంటలు సాగుచేయూలని సూచిస్తుంటారు. అయితే ఈసారి సవుృద్ధి గా కురిసిన వర్షాల వల్ల నీటి వనరులు కళకళలాడుతున్నాయి. సహజంగానే వరి వేసేందుకు ఆసక్తి చూపే రైతులు.. నీటి సౌలభ్యం కారణంగా వరి పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐఆర్ 64, ఎంటీయుూ 1010 వంటి విత్తనాలు విత్తేందుకు కసరత్తు చేస్తున్నారు. సరిగ్గా ఈ సవుయుంలోనే సర్కారు నుంచి సబ్సిడీ విత్తనాలు లభించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం కనపడడం లేదని పెదవి విరుస్తున్నారు. సిద్దిపేట వ్యవసాయు డివిజన్లో కనీసం 15 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి వేస్తారని అధికారిక అంచనా. ఒక ఎకరాలో నారు పోసేందుకు దాదాపు 50 కిలోలు వడ్లు అవసరవువుతాయి. అంటే 7.50 లక్షల కేజీల విత్తనాలు(30 కేజీలవైతే పాతిక వేల బస్తాలు)సిద్దిపేట వ్యవసాయు డివిజన్కు కావాలన్నవూట. ఆదాపై పరదా.. వ్యవసాయు, దాని అనుబంధ శాఖలు ఐఆర్ 64, ఎంటీయు 1010 రకాల వరి విత్తనాలను రైతులకు తగినన్ని నిల్వలు అందుబాటులో ఉంచితే కిలోకు రూ.5 చొప్పున ధర తక్కువవుతుంది. ప్రైవేటు సీడ్ షాపుల్లో ఐఆర్ 64 రకానికి 30 కేజీల బస్తాలు కనీసం రూ.750కి ఒకటి విక్రయిస్తున్నారు. ఎంటీయుూ 1010 కూడా ఇంచుమించు అదే రేటుకు అవుు్మతున్నట్లు తెలుస్తోంది. అంటే రైతులకు మొత్తంగా రూ.37.50 లక్షలయ్యే ఆదాపై ప్రస్తుతం పరదా పడుతున్నట్లు లెక్క! ఈ సీజన్లో 1010 రకం వరి విత్తనాల బస్తాలు 25 కేజీలవి రూ.585కు ఒకటి చొప్పున ఇస్తున్నట్లు వ్యవసాయు శాఖ వర్గాలు చెబుతున్నారుు. ప్రైవేటుతో పోల్చితే బస్తాకు రూ.40 తగ్గుతుంది. అరుుతే అవి కూడా అందరికీ లభించడంలేదని, దాంట్లోనూ దాగుడువుూతలే కనిపిస్తున్నాయుని రైతులు వాపోతున్నారు. డివూండ్ ఉన్న విత్తనాలను సబ్సిడీపై వ్యవసాయు శాఖ, పీఏసీఎస్, డీసీఎమ్మెస్ వంటి వాటి ద్వారా ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై సిద్దిపేట ఏడీఏ వెంకటేశ్వర్లును ‘న్యూస్లైన్’ ఫోన్లో సంప్రదించింది. ఐఆర్ 64 రకానికి ఏవూత్రం రాయితీ ఉండదన్నారు. గతంలోనూ లేదన్నారు. ఎంటీయుూ 1010 రకం వరి విత్తనాలు వూత్రం స్వల్ప రారుుతీపై అందజేస్తున్నట్లు తెలిపారు.