రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు | Rainfall in coastal andhra pradesh with in 24 hours, visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు

Published Wed, Jul 22 2015 2:50 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

ఒడిశా నుంచి కోస్తాంధ్రా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది.

విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్రా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. అలాగే ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement