ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు షెడ్యూల్‌ | schedule 34th day prajasankalpayatra schedule released | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు షెడ్యూల్‌

Published Tue, Dec 12 2017 2:43 PM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM

schedule 34th day prajasankalpayatra schedule released - Sakshi

సాక్షి, అనంతపురం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 34వ రోజు అనంతపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. రేపు(బుధవారం) ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్‌ మండలం పాపం పేట బైపాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. రుద్రమ పేట, సవేరా ఆసుపత్రి క్రాస్‌, కాకల్లపల్లి క్రాస్‌, డాల్ఫిన్స్‌ హోటల్‌ రోడ్డు మీదుగా ప్రసన్న పల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 

12 గంటలకు లంచ్‌ బ్రేక్‌ తీసుకుంటారు. అనంతరం 3 గంటలకు తిరిగి పాదయాత్ర చేపడతారు. చిన్మయ నగర్‌ మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది. రాప్తాడులో సాయంత్రం 4 గంటలకు వైఎస్‌ జగన్‌ జెండాఆవిష్కరణ చేస్తారు. అనంతరం అక్కడి సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదుగంటలకు గంగలకుంటలో 34వ రోజు పాదయాత్ర ముగుస్తుందని, పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement