విజయమ్మ దీక్షకు ఉద్యోగుల మద్దతు | secretariat seemandhra employees forum extends support to YS vijayamma's Deeksha | Sakshi
Sakshi News home page

విజయమ్మ దీక్షకు ఉద్యోగుల మద్దతు

Published Fri, Aug 16 2013 6:10 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

secretariat seemandhra employees forum extends support to YS vijayamma's Deeksha

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. ఈనెల 19వ తేదీ నుంచి విజయవాడలో వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు వారు తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడానికి ఆమె చేస్తున్న దీక్షకు ఉద్యోగుల పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.

విభజన నిర్ణయంపై గత 15 రోజులుగా సచివాలయంలో ఆందోళనలు నిర్వహిస్తున్నామని, తమ నిరసన కార్యక్రమాలకు వైఎస్‌ఆర్‌ సీపీ పూర్తిగా సంఘీభావం తెలిపిందని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఛైర్మన్‌ మురళీకృష్ణ తెలిపారు. వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా తమ ఆందోళనల్లో పాల్గొన్నారని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement