fast unto death
-
అక్టోబర్ 2 నుంచి ఆమరణ దీక్ష
రాజానగరం: పురుషోత్తపట్నం ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిపి రెండు సంవత్సరాలు పూర్తకావొస్తున్నా ఇం తవరకు ఆయా రైతులకు నష్టపరిహారాన్ని అందించకపోవడం ప్రభుత్వ దుర్మార్గ పు ఆలోచనా విధానానికి తా ర్కాణంగా చెప్పవచ్చునని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. ఈ పరిహారాన్ని తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు, రైతు కూలీల పక్షాన ఈ నెల 25వ తేదీ నుం చి చేపట్టదలచిన ఆమరణ దీక్షను రైతు సత్యాగ్రహం పేరుతో గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2వ తేదీన చేపట్టనున్నట్టు తెలిపారు. ‘రా వాలి జగన్, కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తన ఇష్టానుసారంగా పంíపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పరిహారం పంపిణీ విషయంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తించే రైతులు, రైతు కూలీలకు ఈ రోజుకు కూడా న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికీ ఇంకా 85 మంది వరకు రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. ఎకరాకు రూ. నాలుగు లక్షలు పెంచి పరిహారం అడుగుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం కోర్టులకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం ఆలోచించడం లేదన్నారు. అయితే తాను ఆమరణ దీక్ష గురించి ప్రకటించిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పరుగుపరుగున వెళ్లి రైతుల తరఫున సీఎంకు వినతి ప్రతం ఇచ్చినట్టుగా డ్రామాలాడటం విడ్డూరంగా ఉందన్నారు. సెంటు భూమి కూడా లేని బాలకృష్ణ లాంటి వ్యక్తులతో కొంతమంది డమ్మీ రైతులతో ప్రెస్మీట్లు పెట్టించి, తప్పుదారి పట్టేవిధంగా ఎల్లో మీడియాలో ప్రకటనలు ఇప్పించడం విచిత్రంగా ఉందన్నారు. 2013 భూ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారాన్ని లెక్కిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఒక రైతుకు చెందిన భూములు ఒకటికి రెండు మూడు ప్రాజెక్టుల్లో పోతే పరిహారం నాలుగు రెట్లు ఇవ్వడంతోపాటు రూ.ఐదున్నర లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కుటుంబంలో 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉందన్నారు. రైతు కూలీలకు కూడా ఇదే విధంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లేదా నెలకు రూ.రెండు వేలు చొప్పున 20 సంవత్సరాలపాటు ఆ కుటుంబానికి ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ ఏ విషయాన్నీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేదని జక్కంపూడి ఆవేదన వ్యక్తం చేశారు. -
సున్నం రాజయ్య ఆమరణ దీక్ష భగ్నం
-
సున్నం రాజయ్య ఆమరణ దీక్ష భగ్నం
భద్రచలం: భద్రచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహర దీక్షను శనివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ని దీక్షాస్థలి నుంచి బలవంతంగా భద్రచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రచలాన్ని జిల్లాగా ప్రకటించాలని గత రెండు రోజులుగా సున్నం రాజయ్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం దసర పండగ రోజున కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుంది. కొత్త జిల్లాల జాబితాలో భద్రచలం పేరు లేకపోవడంతో సున్నం రాజయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులోభాగంగా భద్రచలం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు సున్నం రాజయ్య ఆమరణ దీక్షకు దిగారు. -
ఆమరణ దీక్షలు భగ్నం
కోరుట్ల డివిజన్ సాధనకు ఉద్యమం తీవ్రం ఆస్పత్రిలో ‘శికారి’ దీక్ష కొనసాగింపు కోరుట్ల : కోరుట్ల డివిజన్ కోసం మూడోసారి చేపట్టిన ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. గురువారం తెల్లవారుజామున కోరుట్ల, రాయికల్, మేడిపల్లి ఎస్సైలు ఆమరణ దీక్ష స్థలికి చేరుకుని దీక్షాపరులను ఆస్పత్రికి తరలించారు. దీక్షాపరులు పాత మున్సిపల్ మెయిన్ గేటుకు తాళం వేసుకున్నప్పటికీ వాటిని తీయించి దీక్షాపరులు శికారి రామకృష్ణ, వంగ ప్రభాకర్, గొసికొండ నరేశ్ను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఉదయం ఆరు గంటల సమయంలో వీరిని కోరుట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వంగ ప్రభాకర్, నరేశ్ దీక్ష విరమించగా..శికారి రామకృష్ణ కొనసాగిస్తున్నారు. దీక్ష కొనసాగిస్తా కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారని మాజీ కౌన్సిలర్ రామకృష్ణ ఆరోపించారు. కోరుట్ల డివిజన్ ప్రకటన వచ్చే వరకు ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్లూకోజ్ లెవల్స్, బీపీ లెవల్స్ తగ్గాయని దీక్ష విరమించాలని వైద్యుడు మల్లికార్జున్ సూచించారు. సంఘీభావం ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న శికారి రామకృష్ణకు సాధన సమితి అధ్యక్ష, కార్యదర్శులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ప్రతినిధులు గడ్డం మధు, జక్కుల ప్రసాద్, ముల్క ప్రసాద్, అఖిలపక్ష నాయకులు అనూప్రావు, రుద్ర శ్రీనివాస్, సాయిని రవీందర్రావు, వెగ్యారపు మురళి, జిల్లా ధనుంజయ్, వాసం భూమానందం, యువజన సంఘాల నాయకులు సనావొద్దీన్, జాల వినోద్, గడెల విజయ్, కిషోర్, అఖిలపక్షాల నాయకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి సంఘీబావం ప్రకటించారు. ఆమరణ దీక్షలను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తరోకో నిర్వహించారు. -
నేటి నుంచి ఎమ్మెల్యే వంశీ ఆమరణ దీక్ష
-
నేటి నుంచి ఎమ్మెల్యే వంశీ ఆమరణ దీక్ష
కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వినతి సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి బుధవారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నారు. చారిత్రక నేపథ్యం, జనాభా, ఇతర మండలాల ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా చేయాలని గత కొంత కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాట తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆమరణ దీక్షే సరైన మార్గమని కల్వకుర్తి అఖిలపక్షం తీర్మానం చేయడంతో వంశీ దీక్షకు దిగుతున్నారు. ఈ దీక్ష ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా కాదని ఆయన వెల్లడించారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా సాధించుకోవడానికే దీక్ష చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. -
జిల్లా కోసం 23 నుంచి ఆమరణ దీక్ష
జనగామ డివిజన్లో రేపటి నుంచి 48 గంటల బంద్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి జనగామ : రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాకు అనుకూలంగా ప్రకటన చేయని పక్షంలో ఈనెల 23 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ప్రకటించా రు. ఈనెల 14వ తేదీన జిల్లా జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ ఉండడంతో ముందస్తు ఉద్యమ కార్యచరణ సిద్ధం చేశారు. పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా సాధన అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసలు శాస్త్రీయ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది.. పార్టీలకతీతంగా సన్నద్ధం కండి.. ఇప్పుడు చేసే ఉద్యమమే కీలకంగా మారుతుండడంతో పోరాటాన్ని ఉరుకులు పెట్టించాల న్నారు. ఈనెల 14న ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈనెల 13, 14వ తేదీ వరకు 48 గంటల పాటు జనగామ డివిజన్ బంద్కు పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న జాతీయ జెండాతో పాటు జనగామ జెండా ఎగురవేస్తామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో ముందస్తు అరెస్టులు చేస్తే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పోలీస్స్టేçÙన్ ముట్టడించాలన్నారు. ఈనెల 14న జరిగే ప్రజాప్రతినిధుల సమావేశం, 15న మంత్రుల సబ్కమిటీ రిపోర్టు ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. చివరి అస్త్రంగా జనగామ జిల్లా వచ్చుడో.. దశమంతరెడ్డి చచ్చుడో అనే నినాదంతో ఈనెల 23వ తేదీన ఆమరణ దీక్ష చేపడుతామన్నారు. జోనల్ సమస్య తలెత్తకుండా స్టేషన్ఘన్పూర్ 3, పాలకుర్తి 5, జనగామ నియోజకవర్గంతో పాటు కొత్తగా ఏర్పడే మండలాలు కొమురవెల్లి, తరిగొప్పుల, చిల్పూరు మండలాలను కలిపే పటాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, రాజమౌళి, మేడ శ్రీనివాస్, ఆకుల వేణుగోపాల్రావు, పజ్జూరి గోపయ్య, మంగళ్లపల్లి రాజు, చిన్నం నర్సింహులు, కృష్ణారెడ్డి, రత్నాకర్రెడ్డి, తీగల సిద్దూ, మాజీద్, మోర్తాల ప్రభాకర్, పి.సత్యం పాల్గొన్నారు. కాగా జనగామ జిల్లా కోసం పట్టణంలోని ఎనిమిదో వార్డు మహిళా కౌన్సిలర్ జక్కుల అనిత గురువారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డికి అందజేశారు. గతంలో 25 వార్డుకు చెందిన మహిళా కౌన్సిలర్ ఆకుల రజని సతీష్ రాజీనామా చేయగా, అనితతో రాజీనామాల సంఖ్య రెండుకు చేరింది. -
హోదాపై ఆమరణదీక్షకు సిద్ధమా?
సీఎంకు మూడు పేజీల లేఖ రాసిన కాపు ఉద్యమనేత సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాన సమస్యగా ఉన్న ప్రత్యేక హోదాకోసం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమా? మీతోపాటు మీ కుమారుడు లోకేశ్ కూడా సిద్ధపడతారా... అందుకు మీరు సై అంటే నేను కూడా ఆమరణ దీక్ష చేపడతాను’’ అని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాలు విసిరారు. ఈ మేరకు ముద్రగడ మూడు పేజీల లేఖను గురువారం సీఎంకు పంపించారు. ‘‘నా జాతికి మీరిచ్చిన హామీలు అమలు చేయమంటే కోపమొచ్చి నా కుటుంబాన్ని అవమానించారు. అయినా నాకెటువంటి చింతా లేదు. దీనిపై మీనుంచి సానుభూతి మాటలుగానీ, క్షమాపణగానీ కోరడం లేదు. ఇంకెన్ని అవమానాలు చేసినా, చేయించినా భరిస్తాను. నా జాతికి బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రానికి 9వ షెడ్యూల్లో చేర్చమని అసెంబ్లీలో మీరు చేసే తీర్మానంకోసం ఎదురు చూస్తున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆమరణ దీక్ష చేయడానికి మీరూ.. మీ కుమారుడు సిద్ధపడితే నేను కూడా మీతోపాటే మీఇంట్లోనే చోటిస్తే దీక్షలో కూర్చుంటా. ఎవరెన్నిరోజులు చేయగలరో ఆ దీక్షలో పరీక్షకు నిలబడదాం. ఈ దీక్షను సవాలుగా స్వీకరించడంవల్ల ప్రత్యేక హోదాతోపాటు మన శరీర పటుత్వం, పట్టుదల, చిత్తశుద్ధి గురించి ప్రజలు తెలుసుకునే వీలుంటుంది.’’ అని ముద్రగడ తన లేఖలో తెలిపారు. -
న్యాయవాదుల ఆందోళన ఉధృతం
కమాన్చౌరస్తా : తెలంగాణ న్యాయమూర్తులపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయస్థాన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో నిరసన ప్రదర్శనకు దిగారు. న్యాయమూర్తులు సామూహిక సెలవు పెట్టారు. జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పీవీ.రాజ్కుమార్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రిలేదీక్ష చేపట్టారు. దీక్షలో న్యాయవాదులు ఎర్రం రాజిరెడ్డి, హన్మంతరావు, జెల్ల రమేశ్, పల్లె నర్సింహారెడ్డి, సీహెచ్.వెంకటరమణారెడ్డి, ముద్దసాని సంపత్, దాడి ఓంకార్, కొలకాని భూమయ్య పాల్గొన్నారు. భోజన విరామసమయంలో న్యాయస్థాన ఉద్యోగుల అధ్యక్ష, కార్యధర్శులు రమణారావు, పవన్కుమార్ ఆధ్వర్యంలో న్యాయస్థాన సిబ్బంది, న్యాయవాదులు జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ రాస్తారోకో చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్రెడ్డి, కార్యదర్శి బి.రఘునందన్రావు పాల్గొన్నారు. జగిత్యాలలో కోర్టు భవనం ఎక్కి నిరసన జగిత్యాల రూరల్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయూలని, న్యాయూధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయూలని జగి త్యాల న్యాయవాదులు బుధవారం కోర్టుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఏడుగురు న్యాయవాదులు కోర్టు భవనం ఎక్కి తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పోలీసులు విషయూన్ని జిల్లా న్యాయమూర్తి నాగమారుతిశర్మ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు జగిత్యాల కోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తితో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్రెడ్డిను ఫోన్లో మాట్లాడించారు. హైకోర్టు విభజన తమ చేతుల్లో లేదని, న్యాయవాదులు, ఉద్యోగులు సమన్వయం పాటించాలని జిల్లా న్యాయమూర్తి కోరారు. న్యాయవాదుల నిరసనను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఏడుగురు న్యాయవాదులు కోర్టు భవనం నుంచి కిందకు దిగివచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ, న్యాయూధికారులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయూలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. న్యాయవాదుల నిరసనతో కోర్టులో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకోవడంతో టౌన్సీఐ కరుణాకర్రావు, ఎస్సై కృష్ణ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్రెడ్డి, ప్రధానకార్యదర్శి చంద్రమోహన్, సీనియర్ న్యాయవాదులు హన్మంతరావు, జనార్దన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, దామోదర్రావు, ఎన్నమనేని నివాసరావు, పడిగెల జనార్దన్రెడ్డి, తాటిపర్తి శంకర్రెడ్డి, మహేందర్, మురళీమోహన్, గంగరాజం తదితరులు పాల్గొన్నారు. . హుజూరాబాద్లో ఆమరణ దీక్ష హుజూరాబాద్: హైకోర్టును తక్షణమే విభజించాలని, న్యాయూధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బుధవారం హుజూరాబాద్ సబ్కోర్టు ప్రధాన గేట్ ముందు న్యాయవాది కొత్తూరి రమేష్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా న్యాయవాదులందరూ దీక్షలో కూర్చున్నారు. హైకోర్టు విభజన విషయంలో వ్యతిరేకంగా మాట్లాడిన కేంద్రమంత్రి సదానందగౌడ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఏర్పడినా న్యాయవ్యవస్థపై ఇంకా ఆంధ్ర పెత్తనమే కొనసాగుతోందన్నారు. భోజన విరామ సమయంలో కోర్టు సిబ్బంది దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. సీఐ రమణమూర్తి పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనలో కేసరి శేషయ్య, ఎల్వీ.రమణారావు, రంగారావు, ముక్కెర రాజు, బండి కళాధర్, దొంత భద్రయ్య, లక్ష్మణమూర్తి, జయక ృష్ణ, రాఘవరెడ్డి, శ్యాంసుందర్, సృజన్, విజయ్కుమార్, సురేష్, లింగారెడ్డి, సమ్మయ్య, కుమారస్వామి, కొండయ్య, దేవయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ముద్రగడను మట్టుబెట్టాలని చూశారు
► కాపులకు వరాలు ఇచ్చి, ► వంచన చేసింది చంద్రబాబే.. ► సెప్టెంబర్ వరకూ వేచి ఉంటాం ► రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా అమలాపురం టౌన్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని ఆమరణ దీక్ష పేరుతో ముట్టుబెట్టాలని చూశారని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఆరోపించారు. తుని ఘటనలో అరెస్టరుు, సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆయన.. ముద్రగడతో కలిసి కిర్లంపూడికి వెళ్లారు. బుధవారం రాత్రి అమలాపురంలోని తన సోదరుడు దివంగత కాపు నేత నల్లా చంద్రరావు ఇంటికి చేరుకున్నారు. ఆయనకు కాపులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విష్ణుమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడను రాజమండ్రి ఆస్పత్రిలో ప్రభుత్వం నిర్బంధించి, అన్ని రోజులు ఆమరణ దీక్ష చేస్తున్నా పట్టించుకోలేదంటే, ఆయన ఏమైపోయినా ఫర్వాలేదన్న ధోరణితోనే ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో కాపులకు వరాలు ఇచ్చింది చంద్రబాబే, వాటిని అమలు చేయకుండా వంచన చేసిందీ ఆయనేనని విమర్శించారు. చంద్రబాబు ఏ రోజూ ముద్రగడతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయలేదని, అలాగే ముద్రగడ ఆయనను కలిసేందుకూ అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాపు మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడించిన చంద్రబాబు ఈ సమస్యను మరింత జటిలం చేశారని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబుతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తే ముద్రగడ, తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆగస్టు వరకూ ఆగమంటూ ప్రభుత్వం గతం నుంచి చెబుతోందని, సెప్టెంబర్ వరకూ వేచి ఉంటామని స్పష్టం చేశారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. చంద్రరావు కుమారులు అజయ్, సంజయ్, రాష్ట్ర కాపు నాయకులు నల్లా పవన్, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, అరిగెల నాని తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరివ్వకపోతే ఆమరణదీక్ష
► ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రిధర్రెడ్డి ► ఇరిగేషన్ కార్యాలయంలో బైఠాయింపు ► కాంట్రాక్టర్కు అధికారుల మద్దతుపై మండిపాటు నెల్లూరు(మినీబైపాస్): నెల్లూరు రూరల్ మండలంలోని మాదరాజుగూడూరు, కాకుపల్లి, లింగాయపాళెం రైతులకు రెండో పంట సాగుకు నీళ్లివ్వకపోతే ఆమరణదీక్ష చేపడతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. ఆయా గ్రామాల రైతులతో కలిసి బుధవారం ఆయన నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో ఎస్ఈ గది ఎదుట బైఠాయించారు. ఎడగారు సాగుకు నీళ్లివ్వాలని రైతులు అనేక మార్లు కోరినా ఫలితం కరువైందన్నారు. సోమశిల డ్యాంలో సరిపడా నీళ్లున్నాయని, మరో వైపు వర్షాలు కురుస్తున్నా అధికారులు నీటి విడుదలకు నిరాకరించడం సరికాదన్నారు. నీళ్లు వదిలితే పనులు చేపట్టిన కాంట్రాక్టర్కు ఇబ్బంది అని చెప్పడం దారుణమన్నారు. కాంట్రాక్టర్ ప్రయోజనం కోసం వేలాది ఎకరాల్లో పంట పండించే రైతుల కడుపు కొడతారా..అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలోని పొలాలకు 15 క్యూసెక్కుల నీరు ఇస్తామని వారం కిందట అంగీకరించిన అధికారులు ఇప్పుడు కాంట్రాక్టర్ కోసం మాటమారుస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఎకరా పొలం కూడా ఎండనీయబోమని ఓ వైపు జిల్లా మంత్రి చెబుతున్నారని, ఆయన మాటకు ఇరిగేషన్ అధికారులు విలువనివ్వరా అని నిలదీశారు. ఎస్ఈ వెంటనే కార్యాలయానికి చేరుకుని సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి భీక్ష్మించారు. మరోవైపు రైతులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఉన్నతాధికారులకు పరిస్థితి నివేదించారు. ఇన్చార్జి కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆదేశాలతో ఎస్ఈ పీవీ సుబ్బారావు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి, సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు, రైతులతో చర్చలు జరిపారు. 22వ తేదీన సమావేశం నిర్వహించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఆరోజు సానుకూల నిర్ణయం రాకపోతే ఆమరణదీక్షకు దిగుతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలోవైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, సీపీఎం నాయకుడు తిరుపాల్, పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకుంటాం
నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆమరణ దీక్ష ప్రారంభం బోధన్: ప్రాణాలైనా అర్పిస్తాం.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని కార్మికులు నినదించారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న సీఎం కేసీఆర్.. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేసింది. లేఆఫ్ ఎత్తివేసి ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతృత్వంలో గురువారం ఉదయం నిజామాబాద్ జిల్లా బోధన్లోని శక్కర్నగర్ ఎన్డీఎస్ఎల్ గేట్ ఎదుట కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అఖిల పక్ష నాయకులు వారికి మద్దతు ప్రకటించారు. -
ప్రభుత్వం సానుకూలంగా ఉంది: అచ్చెన్నాయుడు
ప్రభుత్వ పక్షాన ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపామని, అవి సఫలీకృతం అయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం విరమించిన తర్వాత ఆయనతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు పద్మనాభం దీక్ష విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని టీడీపీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా పెట్టి అమలుచేయాలని సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసిందని, సమస్య శాశ్వత పరిష్కారం కోసమే ఈ కమిషన్ వేశారని తెలిపారు. ఏ ఒక్క వర్గానికీ ఇబ్బంది లేకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీలైనంత త్వరగానే జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదికను పూర్తి చేయాలని అనుకుంటున్నారన్నారు. తుని ఘటనలో బయటి నుంచి కొంతమంది వచ్చారని, మరికొందరు తమకు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ ఘటనపై చాలా కేసులు బుక్ చేశామని, వాటిపై లోతైన దర్యాప్తు జరిపి.. వారిపైనే కఠిన నిర్ణయాలు ఉంటాయని, దాంతో సంబంధం లేనివారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలూ సంయమనంతో ఉండాలని, రెచ్చగొట్టే ప్రకటనలు చూసి రెచ్చిపోకూడదని సూచించారు. -
మాలో కోటీశ్వరులకు రిజర్వేషన్లు ఇవ్వక్కర్లేదు
కాపు రిజర్వేషన్ సమస్యను రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్లేందుకు చేసిన దీక్ష తగిన ఫలితం ఇవ్వడంతో దీక్షను విరమించానని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హామీలు అమలయ్యేలా చూసే బాధ్యతను ఇకమీదట కూడా చేపడతానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులలో కూడా పేదవారికి మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని, ఇందులో లక్షాధికారులు, కోటీశ్వరులకు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీలలో కలుపుతామని సీఎం కూడా అనేక సభల్లో చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చేరుస్తామని చెప్పినా.. తర్వాత వేర్వేరు సమస్యల కారణంగా దాన్ని అమలు చేయలేదని, తాను రోడ్డెక్కాక స్పందించి.. తనను ఒక మెట్టు దిగమన్నారని, అవసరమైతే రెండు మెట్లు దిగుతానని, జాతికి మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పంపిన బృందం చేసిన ప్రతిపాదనలలో చిన్న చిన్న సడలింపులున్నా, జాతి హితం కోసం తాను అంగీకరించినట్లు వెల్లడించారు. తాను ఎప్పుడూ సీఎంను కావాలని తిట్టాలని గానీ, అవమానించాలని గానీ తాను దీక్ష చేపట్టలేదని.. తన జాతి ఆకలి కేకలు తట్టుకోలేక రోడ్డెక్కాను తప్ప తనకు ఎవరినీ అవమానించే ఆలోచన లేదని అన్నారు 20 ఏళ్లుగా ఈ ఉద్యమాన్ని అణచిపెట్టుకున్నామని.. అయితే ఇప్పటికీ దానిపై స్పందన లేకపోవడం, అలాంటి సందర్భంలో సీఎం బలమైన హామీ ఇవ్వడం వల్లే దాన్ని నెరవేర్చాలని తాము రోడ్డెక్కామన్నారు. ఆ హామీ అమలు ఆలస్యం కావడంతో పలు రకాల అనుమానాలు వచ్చి.. అనరాని మాటలు అని ఉంటానని, వాటికి క్షమించాలని కోరారు. మంజునాథ కమిషన్ నివేదిక తెప్పించుకుని, కేబినెట్లో పెట్టి, కేంద్రానికి పంపి అక్కడ కూడా ఆమోదింపజేస్తే మీ ఇంటికొచ్చి పళ్లెంలో కాళ్లు కడుగుతామని ఆయన అన్నారు. తమ జాతికి తగిన ఫలాలు ఇస్తే సీఎం కాళ్లు మొక్కడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అత్యంత పేదవారికి మాత్రమే రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం తప్ప.. ఇందులో లక్షాధికారులు, కోటీశ్వరులకు అక్కర్లేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఇచ్చే సమయంలోనే ఈ క్లాజు కూడా పెట్టాలని చెప్పారు. బీసీ కోటాలో తగ్గించడం వద్దని, వాళ్లు, ఎస్సీ ఎస్టీలు అనుభవించే కోటా కాకుండా తమకు కొంత హక్కు ఇవ్వాలని కోరాము తప్ప.. వాళ్ల నోటి దగ్గర కూడు తీసే ఆలోచన తమకు లేదని ఆయన అన్నారు. తమకిచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని ఆయన మరోసారి కోరారు. తుని ఘటనలో చాలామంది మీద అక్రమంగా కేసులు బనాయించారని, కేసుల జాబితాను తనకు కూడా ఇవ్వాలని.. పూర్తి విచారణ తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరానని ఆయన అన్నారు. తనతో పాటు ఈ నాలుగు రోజులుగా తన కుటుంబ సభ్యులు, అమలాపురంలో మరికొందరు నాయకులు కూడా దీక్షలు చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా కూడా చాలా చోట్ల చేస్తున్న దీక్షలను విరమించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, దాసరి నారాయణరావు, వట్టి వసంతకుమార్, వి.హనుమంతరావు, హర్షకుమార్, బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, ఇంకా పలువురు నాయకులు, ఎంఆర్పీఎస్ నేతలు తమ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపారని, వాళ్లందరికీ తాను, తన జాతి ప్రజలు కృతజ్ఞతగా ఉంటామని ఆయన అన్నారు. -
ముద్రగడకు మద్దతుగా ప్లేట్లు కొట్టి నిరసన
అవనిగడ్డ : కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా దివిసీమలోని పలుచోట్ల ఆదివారం కాపు నాయకులు గరిటెలతో ప్లేట్లుకొట్టి నిరసన తెలిపారు. అవనిగడ్డలో టీటీడీ కల్యాణ మండపం ఎదుట దీక్షా శిబిరం వద్ద నాయకులు ప్లేట్లను గరిటెలతో కొట్టి నిరసన తెలిపారు. పలువురు కాపు నేతలు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేవరకూ పోరాటం ఆగదన్నారు. గాంధేయ మార్గంలో దీక్షలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు. రెండు చేతులు లేని పెయింటర్ యలవర్తి వెంకటేశ్వరరావు ప్లేటు కొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు నేతలు సింహాద్రి వెంకటేశ్వరరావు, బాడిగ నాంచారయ్య, కొండవీటి కిశోర్, న్యాయవాది రాయపూడి వేణుగోపాల్, అలపర్తి గోపాలకృష్ణ, పద్యాల వెంకటేశ్వరరావు, దేవనబోయిన అంజిబాబు, తోట ప్రసాద్, దాసినేని గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొత్తమాజేరులో చల్లపల్లి మండలం కొత్తమాజేరులో మాజేరు కాపు సంఘం ఆధ్వర్యంలో యువకులు, గ్రామస్తులు గరిటెలతో ప్లేట్లు కొట్టారు. చల్లపల్లి-మచిలీపట్నం ప్రధాన రహదారిపై ఈ కార్యక్రమం చేపట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
‘దివి’లో రెండోరోజు కాపుల దీక్ష భగ్నం
అవనిగడ్డ, భావదేవరపల్లి, చల్లపల్లి, మోపిదేవిలో దీక్షలను భగ్నం చేసిన పోలీసులు అవనిగడ్డలో దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి అవనిగడ్డ : కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా దివిసీమలో పలుచోట్ల రెండోరోజైన ఆదివారం కాపు నేతలు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి మద్దతు అవనిగడ్డ టీటీడీ కల్యాణమండపం ఎదురుగా కాపునేతలు రాజనాల బాలాజీ, ఇమ్మిడిశెట్టి వెంకటేష్ రెండోరోజు దీక్షచేశారు. వీరితోపాటు రేపల్లె హేమ, పూషడపు మనోహర్ దీక్ష చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్బాబు, కడవకొల్లు నరసింహారావు వీరికి పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరగకుండా తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నామన్నారు ప్రభుత్వం స్పందిం చి బీసీలను కాపుల్లో చేర్చే కార్యక్రమాన్ని చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. కాపు సంఘం ఐక్యవేదిక నాయకులు అన్నపరెడ్డి వెంకటస్వామి, కొండవీటి కిశోర్, రాధా-రంగా మిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మాణిక్యాలరావు తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు. దీక్షను భ గ్నం చేసిన పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ వెంకటకుమార్ నేతృత్వంలో పోలీసులు దీక్షా శిబిరానికి చేరుకుని దీక్షను భగ్నం చేశారు. దీక్ష చేస్తున్నవారిని బలవంతంగా ట్రక్ ఆటోలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం 144వ సెక్షన్ అమలులో ఉండగా దీక్షచేయమని పేర్కొంటూ వారివద్ద నుంచి పోలీసులు సంతకాలు తీసుకున్నారు. చల్లపల్లిలో చల్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అడపా రాంబాబు, ఆది రాంబాబు, అడపా బాబూరావు, సోమిశెట్టి శివనాగేశ్వరరావు దీక్షచేశారు. ఈ దీక్షకు న్యాయవాది మోపిదేవి ద్వారకానాథ్తో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికుమార్ దీక్షను భగ్నం చేసి, వారిని బలవంతంగా పోలీసు వాహనంలో స్టేషన్కి తీసుకెళ్లారు. నాగాయలంక, భావదేవరపల్లిలో కాపుల దీక్షలు భావదేవరపల్లి(నాగాయలంక) : కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతు పలుకుతూ ప్రభుత్వతీరుకు నిరసనగా భావదేవరపల్లిలో గ్రామస్తులు రెండవరోజు ఆదివారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పూషడపు నిరంజనరావు, ముమ్మారెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెదప్రోలులో.. పెదప్రోలు(మోపిదేవి) : కాపులు బీసీల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా పెదప్రోలు ప్రధాన సెంటరో కాపులు మహిళలతో కలసి దీక్ష చేపట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కంచాలు, గరిటెలతో నినాదాలు చేశారు. శ్రీకాకుళం(అవనిగడ్డ) : శ్రీకాకుళంలో ఆదివారం కాపునేతలు దీక్ష చేశారు. కాపు సంఘం రాష్ట్ర నేత సింహాద్రి శ్రీనివాసరావుతో పాటు పలువురు కాపు సంఘం నేతలు దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా నేత అందె జగదీష్ దీక్షకు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు మురళి, సత్యనారాయణ, కాంగ్రెస్ నేత కృష్ణారావు దీక్షకు మద్దతు తెలిపారు. -
బాబు పాదయాత్ర రాజకీయం కోసం కాదా?
♦ ఓడిపోయిన తర్వాత నాలాగ ఇంట్లో ఎందుకు కూర్చోలేదు ♦ కుల రాజకీయాలు చేస్తున్నాననడం సరికాదు ♦ ఆయనిచ్చిన హామీలు అడిగితే అంత కోపం ఎందుకో ♦ సాఫ్ట్వేర్ బాబుకు డేటా తెప్పించుకోడానికి 9 నెలలా? ♦ ఉపవాసాలు మాకు అలవాటే.. అతి చేయొద్దు ♦ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ సాధించేందుకు తాను గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తుంటే కుల రాజకీయాలు చేస్తున్నానని సీఎం చంద్రబాబు అంటున్నారని.. మరి ఆయన గతంలో పాదయాత్ర చేసింది రాజకీయం కోసం కాదా అని కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఓడిపోయిన తర్వాత తనలాగే ఇంట్లో కూర్చోకుండా అధికారం కోసం పాదయాత్ర ఎందుకు చేశారని నిలదీశారు. ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరిన సందర్భంగా కిర్లంపూడిలోని తన స్వగృహంలో ఆయన 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఆయనిచ్చిన హామీలనే ప్రస్తావిస్తుంటే.. ఆయనకు కోపం ఎందుకు వస్తోందని అడిగారు. తామేమీ పాకిస్థాన్ బోర్డర్ దాటలేదని, అలాంటప్పుడు ఇంత భద్రత ఏర్పాటుచేయడం అవసరమా అని నిలదీశారు. ముఖ్యమంత్రి గతంలో దీక్షలు చేయలేదా.. ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఆందోళనలు చేయలేదా, ప్రభుత్వానికి అడ్డు తగల్లేదా.. అని ప్రశ్నించారు. తమ కులానికి మేలు చేస్తామని ఆయన చెప్పడం వల్లే రిజర్వేషన్లు కావాలని అడిగాం తప్ప.. తామేమీ కుల రాజకీయాలు చేయట్లేదని స్పష్టం చేశారు. అయినా తమది కర్వేపాకు వర్గమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో తమను ఉపయోగించుకుని ఆ తర్వాత పక్కకు తీసి పారేయడం అందరికీ అలవాటుగా మారిపోయిందని చెప్పారు. ప్రతిపాదనలు వచ్చాయి.. ప్రభుత్వం తరఫున తన మిత్రుడు, టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కొన్ని ప్రతిపాదనలు చేశారని, వాటికి తాను కొన్ని సవరణలు చెప్పానని ముద్రగడ అన్నారు. ఆయన ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ల స్పందన ఏంటో చెబుతానన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏదైనా స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలి, ఏడాదికి వెయ్యికోట్లు ఇవ్వాలని మరోసారి చెప్పారు. ఎన్నికల సమయంలో, దానికి ముందు టీడీపీ ఇచ్చిన హామీల మేరకే ఇప్పుడు అడుగుతున్నామని అన్నారు. ఇంతకుమించి చేయడానికి తగిన ఆర్థిక స్థోమత కూడా లేదని తెలిపారు. అయినా.. తమ జాతిలో నూటికి 90 మంది పేదవాళ్లే ఉన్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కాపులు ఇప్పటికీ బీసీ స్టేటస్ అనుభవిస్తున్నారని.. ఇక్కడ మాత్రం తీసేశారని అన్నారు. డబ్బా కొట్టుకుంటున్నారు చంద్రబాబు ఇంతకుముందు తొమ్మిదేళ్ల పాలనలో కాపులకు ఏమైనా చేసి ఉంటే సరిపోయేదని.. అయినా ఆయన అది చేశాం, ఇది చేశామని డబ్బా కొట్టుకోవడం తప్ప.. క్షేత్రస్థాయిలో ఏవీ అమలు కావట్లేదని ముద్రగడ అన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ఇచ్చిన జీవో చెత్తబుట్టలో ఉండాల్సిన కాగితం అంటున్నారని.. అది దొంగ జీవో అయితే మీరు మంచి జీవో ఇచ్చి తమ వాళ్లకు మేలు చేయాలని అడిగారు. సాఫ్ట్వేర్ బాబుకు డేటా సేకరణ కష్టమా కాపుల స్థితిగతుల గురించి వేసిన జస్టిస్ మంజునాథ్ కమిషన్కు 9 నెలల గడువు ఇవ్వడంపై కూడా ముద్రగడ పద్మనాభం తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర ఇప్పటికే చాలా డేటా ఉందని, 2011లో చేసిన సామాజిక సర్వేలో కులాలు, ఆస్తుల వివరాలన్నీ ఉన్నాయని.. ఒక్క బటన్ నొక్కితే అందరి జాతకాలు బయటకు వస్తాయని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉపయోగించేవాళ్లలో నెంబర్ వన్ తానేనని చెప్పుకొనే ముఖ్యమంత్రికి డేటా తీసుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన అన్నారు. తన పార్టీ పరిస్థితి గురించి ప్రైవేటు ఏజెన్సీలతో సమాచారం తెప్పించుకునే బాబు.. ఈ విషయంలోనూ అలా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణలో ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారని, ఆ విధంగా కూడా డేటా కలెక్ట్ చేసుకోవచ్చని, ఇన్ని మార్గాలు పెట్టుకుని మంజునాథ్ కమిషన్కు తొమ్మిది నెలల సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉపవాసాలు అలవాటే.. డాక్టర్లూ అతి చేయొద్దు తనకు, తన భార్యకు రోజుల తరబడి ఉపవాసాలు చేయడం ముందు నుంచి అలవాటేనని, అందువల్ల మరికొన్నాళ్లు దీక్ష చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ముద్రగడ చెప్పారు. తాను, తన భార్య కూడా నాలుగేసి రోజులు కేవలం టీ తాగి గడిపేసిన రోజులు చాలా ఉన్నాయన్నారు. సీఎం, పోలీసులు ఇచ్చినా ఆదేశం ప్రకారం తన ఆరోగ్యం నిలకడగా లేదని వైద్యులు చెప్పిస్తున్నారని అనుకుంటున్నానని.. డాక్టర్లు అతి చేసి ఉద్యమస్ఫూర్తిని దెబ్బ తీయొద్దని చెప్పారు. అనవసరంగా తమ దీక్షను భగ్నం చేసే ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సెలైన్ పెడితే దీక్ష విరమించేస్తానని అపోహలు సృష్టిస్తారేమో.. అయినా కూడా దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. -
నెంబర్ 1 విశ్వాసఘాతకుడు ఆయనే: మంద కృష్ణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెంబర్ 1 విశ్వాస ఘాతకుడని, 2014లో కాపులు తెలుగుదేశం పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటిస్తే.. వాళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. తానెప్పుడూ కాపులకు హామీ ఇవ్వలేదు గానీ, ఎన్నికల్లో మొదటిసారి హామీ ఇచ్చాను కాబట్టి మాట నిలబెట్టుకుంటా అన్నాడని.. కానీ గెలిచిన తర్వాత అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచినా ఎలాంటి స్పందన లేదని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్ సాధన కోసం ముద్రగడ పద్మనాభం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరాహార దీక్ష చేస్తుంటే, ఆయనకు మద్దతుగా బయటి వాళ్లు ఎవరూ తూర్పుగోదావరి జిల్లాకు రాకుండా ఆంక్షలు విధించడం దారుణమని మంద కృష్ణ మాదిగ అన్నారు. అలా ఆంక్షలు విధించడం పౌరహక్కులను కాలరాయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన చెప్పారు. కాపులను మభ్యపెట్టేందుకే చంద్రబాబు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని మందకృష్ణ మండిపడ్డారు. -
ముద్రగడకు పలువురి సంఘీభావం
జగ్గంపేట : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దంపతుల ఆమరణ దీక్షకు సర్వం సిద్ధమైంది. కాపులను బీసీల జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో ప్రాణాలను లెక్కచేయకుండా ఆరు పదుల వయస్సులో శుక్రవారం ఉదయం నుంచి ముద్రగడ ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, రాష్ట్రంలోని పలువురి నేతలు ముద్రగడకు సంఘీభావం తెలుపుతున్నారు. గురువారం కిర్లంపూడిలో ముద్రగడను పలువురి నేతలు కలిసి మద్దతు తెలిపారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, పెండెం దొరబాబు, కాపు సంఘం నేత వాసిరెడ్డి ఏసుదాసు, మిండగుదిటి మోహన్, ఆకుల రామకృష్ణ, సంగిశెట్టి అశోక్, జీవీ రమణ తదితరులు ముద్రగడను కలిసి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. నేడు పూజలు చేయండి కాపులకు రిజర్వేషన్ను కల్పించాలని కోరుతూ సతీ సమేతంగా శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం చేపడుతున్న నిరాహార దీక్షకు మద్దతుగా కాపులందరూ శుక్రవారం ఉదయం తలారా స్నానం చేసి విష్ణుమూర్తికి పూజలు చేయాలని కాపు సద్బావన సంఘ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు విజ్ఞప్తి చేశారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీక్షకు మద్ధతుగా మధ్యాహ్నం భోజనం మాని ఎవరి ఇంటి వద్ద వారు ఖాళీ పళ్లానికి గరెటతో మోగించాలని కోరారు. ఆ శబ్ధం మన నాయకుడికి మద్దుతు తెలిపినట్టేనని అన్నారు. అలాగే కాపు సంఘం మరో నాయకుడు మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ ముద్రగడకు హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాపులందరిపై ఐక్యంగా ఉందన్నారు. దీక్షకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాని కోరారు. -
కాపుకాద్దాం..!
ముద్రగడకు మద్దతుగా రేపటి నుంచి గుంటూరులో దీక్షలు గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆవిర్భావం కాపులకు రిజర్వేషన్ల సాధనే అజెండాగా ముందుకు... అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్న జేఏసీ నేతలు కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ను బలపర్చాలని వినతి గుంటూరు : కాపులకు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా ఈనెల 6 నుంచి గుంటూరు నగరంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ నిర్ణయించింది. అన్ని పార్టీల నాయకులను ఒక తాటిపైకి చేర్చి గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీగా ఏర్పడింది. జెండాలను పక్కన పెట్టి కాపులకు రిజర్వేషన్ల సాధనే అజెండాగా ఉద్యమించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి కాపు జాతికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ముందుగా గుంటూరు అర్బన్జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసిన జేఏసీ నాయకులు కావటి మనోహరనాయుడు, కిలారి రోశయ్య, మాదా రాధాకృష్ణమూర్తి, కె.కె, ఊరిబండి శ్రీకాంత్లతోపాటు మరో వంద మంది రిలే నిరాహార దీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా దీక్షలు కొనసాగిస్తామని ఎస్పీకి తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కావటి మనోహరనాయుడు మాట్లాడుతూ కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడకు మద్దతుగా గుంటూరు తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభిస్తున్నామన్నారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ కాపుల్లో వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉన్నాయనే విషయాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయన్నారు. గాదె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దశాబ్దాల క్రితమే కాపులు బీసీల్లో ఉండేవారన్నారు. అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి... దీక్షలకు మద్దతు తెలపాలని కోరుతూ తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు అందించారు. పార్టీ నేతలంతా సానుకూలంగా స్పందించారని జేఏసీ నాయకులు తెలిపారు. -
నిరాహార దీక్ష భగ్నం
సుండుపల్లి : మండలంలోని రాయవరం గ్రామపంచాయతీలో ఇసుక క్వారీ రద్దు చేయాలని చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు మంగళవారం భగ్నంచేశారు. దీక్షలో ఉన్న వికలాంగుల నాయకుడు చాంద్బాషా, మాలమహానాడు అధ్యక్షుడు బండి ఈశ్వర్లను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు టెంట్ను కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆందోళన కారులను చెదరగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు రోడ్డుపై బైఠాయించి ఇసుకక్వారీని రద్దుచేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ ఆందోళనకారులతో మాట్లాడుతూ ఇసుక క్వారీని రద్దు చేయాలంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు విన్నవించుకోవాలన్నారు. అలాగే అక్రమంగా ఇసుక రవాణాచేస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని రద్దుచేసే విషయం తమ పరిధిలో లేదన్నారు. దీంతో మహిళలు ఒక క్యూబిక్మీటరు మాత్రమే ఇసుక లోడు చేయాల్సి ఉండగా నాలుగు క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక ఎత్తారని ఏఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని మండల తహశీల్దార్ పరిశీలిస్తారని ఆయన పేర్కొనగా డ్వాక్రా మహిళలు వినిపించుకోలేదు. ఈ సందర్భంగా పోలీసులు, మహిళల మధ్య తోపులాట జరిగింది. ఒకానొక దశలో మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీక్షచేపడుతున్న ప్రదేశం నుంచి సుమారు ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న రాయవరం ప్రాంతం వరకు ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల లాఠీచార్జికి నిరసనగా రాయవరం గ్రామంలో పలు దుకాణాలను స్వచ్ఛందంగా మూత వేశారు. -
'ఆత్మబలిదానం చేస్తే నా డబ్బుతో విగ్రహం పెట్టిస్తా'
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆత్మబలిదానం చేస్తే తన డబ్బుతో మహబూబ్నగర్ గడియారం సెంటర్లో విగ్రహం పెట్టిస్తానని కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2019లోపు పూర్తిచేస్తే 2019లో తాను, మరో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ జెండాలు మోస్తామన్నారు. ఒకవేళ ఆ పథకాలు పూర్తి కాకపోతే మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు టీడీపీ జెండాలు మోస్తారా అని ప్రశ్నించారు. సీడబ్ల్యుసీకి రాసిన లేఖలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. అయినా.. జూన్ 11న ఏపీ అధికారులు లేఖ రాస్తే, హరీశ్ రావు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నాళ్లుగా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కృష్ణాజలాలపై జూన్ 18, 19 తేదీలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించలేదని రేవంత్ అడిగారు. అసలు ప్రభుత్వం పాలమూరు జిల్లా బంద్కు పిలుపునివ్వడంలో అర్థం లేదని ఆయన మండిపడ్డారు. అయినా.. హరీశ్రావే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాజెక్టు సాధించొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. ఆయన ఆత్మబలిదానం చేస్తే తన డబ్బుతో విగ్రహం పెట్టిస్తానని వ్యాఖ్యానించారు. -
మోక్షం కోసం.. 83 ఏళ్ల వయసులో ఆమరణదీక్ష
మోక్షం సాధించడం కోసం 83 ఏళ్ల మహిళ కటక్లో గత 50 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె ఆమరణ దీక్ష ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కటక్లోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన భవర్లాల్ సేథి భార్య అయిన విక్కీ దేవి సేథి సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ దీక్ష చేస్తున్నారని, ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని సాధించాలన్న జైన సంప్రదాయం ప్రకారమే ఆమె ఇలా చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇందుకు తన కుటుంబం నుంచి, మత పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే.. ఇది చట్ట విరుద్ధమని, దీనిపై ఒడిషా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ 'స్ట్రగుల్ ఫర్ జస్టిస్' అనే స్వచ్ఛంద సంస్థ ఒరిస్సా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలుచేసింది. ఇలా దీక్ష చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని, ఐపీసీ 306, 309 సెక్షన్ల కింద శిక్షార్హమని ఆ సంస్థ కార్యదర్శి శశికాంత్ శర్మ అన్నారు. అయితే ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించాలా, వద్దా అనే విషయంలో హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
ఓయూలో ఆమరణ దీక్షలు
క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం నిరసన ర్యాలీలు... ఉద్రిక్తత హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు, నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు.. సీఎం దిష్టిబొమ్మ దహనం...పోలీసుల జోక్యంతో బుధవారం క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, టీపీపీఎస్సీ ద్వారానే పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్తో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్న ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ దీక్షలకు మద్దతుగా యూనివర్సిటీ లైబ్రరీని బహిష్కరించిన వందలాది మంది విద్యార్థులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ప్రదర్శనతో ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఓయూ పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు ముళ్ల కంచెను, బారికేడ్లను అడ్డంగా పెట్టి ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీ.విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు కోటూరి మానవతారాయ్, చైర్మన్ కళ్యాణ్ మాట్లాడుతూ మూడు, నాలుగు తరగతుల మినహా ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తే సహించబోమని హెచ్చరించారు. -
'రుణమాఫీ కోసం 25 నుంచి ఆమరణ దీక్ష'
కాకినాడ: ఈనెల 25వ తేదీ లోపల రైతుల రుణాలు మాఫీ చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని భారతీయ కిసాన్ సంఘ్ హెచ్చరించింది. ఈనెల 25లోగా రుణమాఫీ అమలు చేయాలని సంఘ్ డిమాండ్ చేసింది. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గెలిచిన తరువాత ఏదో ఒక సాకు చెబుతూ రుణాలు మాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దాంతో ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తోంది. -
నిమ్స్ నుంచి విన్స్ వరకు..
కేసీఆర్ ఆమరణదీక్షకు కేంద్రమైన నిమ్స్ ఇక్కడినుంచే ఉవ్వెత్తున ఉద్యమం డిసెంబర్ 9న ప్రకటనతో తెలంగాణపై ఆశలు సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిమ్స్ది ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. ఇక్కడ కేసీఆర్ ఆమరణదీక్ష చేయడం వల్లే 2009 డిసెంబర్9న కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఆనాటి నుంచి మొదలైన రాష్ట్ర ఉద్యమం ఊరూవాడా విజృంభించి తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న సిద్దిపేట వేదికగా ఆమరణదీక్షను చేపట్టేందుకు కరీంనగర్ నుంచి బయల్దేరగా మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేసి, ఖమ్మం సబ్జైలుకు తరలించారు. అక్కడి న్యాయమూర్తి ఆయనకు 14రోజుల రిమాండ్ విధించడంతో జైల్లోనే దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి చెందిన ఫిజిషియన్ మాధవరావు, కార్డియాలజిస్టు నరహరి, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యంతో కూడిన వైద్యబృందం ఖమ్మం సబ్జైలుకు వెళ్లి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని సమీక్షించారు. ఇదే సమయంలో కేసీఆర్ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ జిల్లాలన్ని అట్టుడికి పోయాయి. విద్యార్థుల నిరసనలతో ఉస్మానియా క్యాంపస్ హోరెత్తిపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో ఖమ్మం సబ్జైలు నుంచి హుటాహుటిన ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. 30న ఆయనకు నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో తెలంగాణవాదుల నుంచి పెద్దెత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంకా తాను దీక్ష విరమించలేదని, కొన సాగిస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం నుంచి నిమ్స్కు తరలింపు : కేసీఆర్ కోరిక మేరకు డిసెంబర్ 3న ఆయన్ను ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. దీంతో తెలంగాణ ఉద్యమానికి నిమ్స్ కేంద్రబిందువుగా మారింది. మిలీనియంబ్లాక్లోని రూమ్నెం. 228కు ఆయన్ను తరలించి, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసన్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈసీజీ, బీపీ, షుగర్, పరీక్షలు నిర్వహించారు. అర్థరాత్రి ఐసీయూకు తరలింపు : శరీరంలో సోడియం, పోటాషియం, ఎలక్ట్రోలైట్స్ శాతం పడిపోవడంతో ఆయన్ను ఐసీయూకి తరలించారు. కేసీఆర్ కోమాలోకి వెళ్లారనే వదంతులు తెలంగాణవాదులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దీక్షకు మద్దతుగా అప్పట్లో 48 గంటల బంద్కు పిలుపినిచ్చారు. రాళ్లదాడులు, బాష్పవాయుగోళాలు, లాఠీదెబ్బలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం అట్టుడికింది. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసు,మీడియా వాహనాలను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ను పరామర్శించేందుకు విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు నిమ్స్కు క్యూకట్టడంతో ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటి సీఎం రోశయ్య, టీడీపీ నేత చంద్రబాబు సహా ఇలా అనేకమంది నిమ్స్కు తరలివచ్చి కేసీఆర్ను పరామర్శించారు. అప్పటి పరిస్థితిపై ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఆయా పార్టీల అభిప్రాయాలను ఢిల్లీకి పంపించారు. డిసెంబర్ 9 అర్ధరాత్రి దీక్ష విరమణ : కేసీఆర్ దీక్ష, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. కాంగ్రెస్ కోర్కమిటీ రెండుసార్లు సమావేశమై..చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 9 రాత్రి 11.30 గంటలకు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సుముఖతను వ్యక్తం చేయడంతో కేసీఆర్ దీక్ష విరమించేందుకు అంగీకరించారు. ప్రొ.జయశంకర్ కేసీఆర్కు అర్థరాత్రి 12.30 గంటలకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు. -
న్యాయం జరగకుంటే ఆమరణ దీక్ష
ముంబై: అమెరికాలో అవమానానికి గురైన తన కుమార్తె, భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడేకు తగిన న్యాయం జరగకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. న్యూయార్కలో భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కౌన్సిల్ జనరల్గా విధులు నిర్వహిస్తున్న దేవయాని ఖోబ్రగడే పనిమనిషి విషయంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తూ ఇటీవల అమెరికా అధికారులు ఆమెను అరెస్టు చేసి అవమానకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్య ప్రవర్తనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ విషయమై దేవయాని తండ్రి ఉత్తమ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ నా కుమార్తెకు జరిగిన అన్యాయంపై భారత ప్రభుత్వం స్పందిస్తున్న తీరును గమనిస్తున్నా. మరో వారం రోజుల్లో న్యూఢిల్లీ వెళతా. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్సింగ్ను కలుస్తా. నా కుమార్తెకు తగిన న్యాయం జరగకపోతే నిరాహార దీక్షకు దిగుతా..’ అని చెప్పారు. కాగా, తన కుమార్తెను కుట్రపూరితంగానే అమెరికా అధికారులు నిర్బంధించారని, ఆమెపై పెట్టిన అక్రమ కేసులను ఆ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా వ్యాఖ్యలు భారత దేశ న్యాయవ్యవస్థనే కించపరిచేవిగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని ఉత్తమ్ తెలిపారు. కాగా, దేవయాని సంఘటనకు నిరసనగా ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు యూఎస్ జాతీయ పతాకాన్ని దగ్ధం చేశారు. -
కేసీఆర్ దీక్ష..చరిత్రాత్మకం
=సమాజాన్ని జాగృతం చేసింది =ఉద్యమంలో ఓరుగల్లుది కీలకపాత్ర =సంపూర్ణ తెలంగాణ సాధించే వరకూ పోరు =ప్రస్తుత ఘర్షణ నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్యే... =తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం వరంగల్ సిటీ, న్యూస్లైన్: ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష చరిత్రను మలుపు తిప్పింది. సమాజాన్ని జాగృతం చేయడంతోపాటు ప్రజలను కదిలించేందుకు దోహదం చేసింది. ఈ ఉద్యమంలో ఓరుగల్లు కీలకపాత్ర పోషించింది. ప్రజా ఉద్యమాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేశాయి. ఈ పోరాట స్ఫూర్తితోనే భవిష్యత్ తెలంగాణలో ముందుకు సాగాలి.’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. వరంగల్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి సెంటర్లో టీఆర్ఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ దీక్షా దివస్ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ తెలంగాణ సాధించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం తర్వాత ఆరు సూత్రాల పథకం ముందుకు తెచ్చారని, ఈ క్రమంలోనే 371(డీ) రాజ్యంగ సవరణ చేశారని చెప్పారు. ఈ సమయంలోనే పార్లమెంట్లో విపక్షాలు ఇదంతా వృథా ప్రయాసగా కొట్టిపడేశాయని, ఈ దఫా విఫలమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమొక్కటే పరిష్కారమని అప్పుడే స్పష్టం చేశాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే నిజమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న ఘర్షణ నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్యేనని అభివర్ణించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సమాజాభివృద్ధికి ఉద్యమ స్ఫూ ర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గుప్పెడు మందిదే పెత్తనం కొంత మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ పెత్తనం కాపాడుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ కూడా ఇదే విషయూన్ని తేల్చిచెప్పిందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటూ ఆధిపత్యాన్ని వ్యతిరేకించిందే తప్ప... సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదనే విషయం గుర్తించాలన్నారు. భారత ప్రభుత్వం కూడా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, సమానత్వం వైపా ? ఒక వర్గానికి అండగా నిలుస్తారా ? అన్నది బహిర్గతమయ్యే సమయం వచ్చిందన్నారు. తెలంగాణ పోరాటం ప్రజాస్వామికమైందని, ఇది తమపై సాగుతున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమమన్నారు. త్వరలో సీమాంధ్ర పెత్తందారుల కుట్రలను, తెలంగాణను అడ్డుకుంటున్న శక్తుల తీరును అన్ని పార్టీలకు మరోమారు వివరిస్తామన్నారు. తెలంగాణ సాధన దిశగా కదిలిస్తామని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలతోనే తెలంగాణ సాధ్యమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సమాజానికి ఈ పోరాటం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ పోరాట స్ఫూర్తితోనే భవిష్యత్ తెలంగాణలో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందన్నారు. ప్రజలను కదిలించేందుకు, ఉద్యమానికి ఈ దీక్షలు ఎంతో దోహదం చేశాయన్నారు. చరిత్రను ములుపు తిప్పిందన్నారు. ఈ ఉద్యమంలో వరంగల్ కీలక పాత్ర నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన రావడానికి ముందు తామంటేతామంటూ తెలంగాణపై పోటీపడి మాట్లాడిన రాజకీయపక్షాలు.... ప్రకటన రాగానే యూ టర్న్ తీసుకున్నాయని విమర్శించారు. ఇప్పుడు కూడా కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతుంటే మరోసారి అడ్డుకునే కుట్రలు సాగుతున్నాయన్నారు. ఎన్నో చర్చలు, కమిటీలు, అఖిలపక్షాల అనంతరమే నిర్ణయం తీసుకున్న విషయాన్ని విస్మరిస్తున్నారని, మరో పదేళ్లు చర్చలు జరిపినా సమయం సరిపోలేదంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రులకు హైదరాబాద్లో రక్షణ లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎనిమిది వేల కేసులు పెడితే... అందులో ఒక్కటి కూడా సీమాంధ్రులపై దాడిచేసిన కేసు లేదనే విషయం గుర్తించాలన్నారు. మరి వీరికి ఎందుకు రక్షణ అని కోదండరాం ప్రశ్నించారు. -
దీక్షకు దన్నుగా...
సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న ఆమరణ దీక్ష నేపథ్యంలో సర్వత్రా ఉ్కతంఠ నెలకొంది. అందరి దృష్టీ లోటస్పాండ్పై కేంద్రీకృతమైంది. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్తో శనివారం ఉదయం నుంచి లోటస్పాండ్లో జగన్ ఆమరణ దీక్ష చేపడుతున్న విష యం తెలిసిందే. దీక్షను స్వాగతిస్తూ, మద్దతునిస్తూ పలువురు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని వివిధ సీమాంధ్ర జిల్లాలకు చెంది, పెద్దసంఖ్యలో నగరంలో స్థిరపడ్డ కుటుంబాలతో పాటు పలువురు హైదరాబాదీలు జగన్ దీక్షను స్వాగతిస్తూ పార్టీ కార్యాలయానికి లేఖలు పంపారు. రాష్ట్రాన్ని విడదీసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పాడు చేయొద్దంటూ పలువురు మైనారిటీ నేతలు సైతం శుక్రవారం సందే శాలు పంపారు. ఇదిలా ఉంటే ఆమరణ దీక్ష నేపథ్యంలో నగరంలోని ఆయన అభిమానులు, పార్టీ నాయకులు శనివారం నుండి విస్తృత కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. జగన్కు సంఘీభావంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని నిర్ణయించారు. ఇతర పార్టీలూ స్పందించాలి 13 జిల్లాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా చేసిన ఏకపక్ష విభజన నిర్ణయంపై మిగిలిన పార్టీలు ఇప్పటికైనా స్పందిం చాలని రాష్ట్ర పరిరక్షణ వేదిక కో ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, ఏపీఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్రెడ్డి కోరారు. జగన్మోహన్రెడ్డి చేయతలపెట్టిన దీక్షను స్వాగతిస్తున్నామన్నారు. అంతా మద్దతునివ్వాలని కోరారు. -
సమైక్య సంకల్పం
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర కేబినెట్ ఆమోదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. సీమాంధ్రలోని 13 జిల్లాలతోపాటు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యధికులు సమైక్యవాదానికే మద్దతిస్తున్నా.. నిరంకుశంగా విభజనకు పాల్పడడంపై మండిపడుతున్నారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శనివారం నుంచి ఆమరణ దీక్షకు దిగనుండటంతో ఇప్పటికే నియోజక వర్గాలవారీ జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షల్ని మరింత ఉధృతంగా కొనసాగించనున్నట్టు పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు శుక్రవారం వెల్లడించారు. 72 గంటల బంద్కు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ కన్వీనర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు దీక్షల్ని విరమించి బం ద్లో పాల్గొన్నారు. కానీ ద్వితీయ స్థాయి నేతలు, కార్యకర్తలు మాత్రం రిలే దీక్షల్ని కొనసాగించారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లోనూ రిలే దీక్షలు కొనసాగాయి. మూడు రోజులుగా నిరవధిక దీక్షల్లో ఉన్న నేతలు శుక్రవారం ఉదయం తమ దీక్షల్ని విరమించి బంద్లో పాల్గొన్నారు. వీరి స్థానంలో మిగిలినవారు రిలే దీక్షల్ని కొనసాగించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షలో కూర్చుని ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా నినదించారు. వీరికి పార్టీ సమన్వయకర్తలు, ప్రధాన నేతలు సంఘీభావం తెలిపి, సాయంత్రం నిమ్మరసం ఇచ్చి రిలే దీక్షల్ని విరమింపజేశారు. శనివారం నుంచి అన్ని నియోజక వర్గాల్లోనూ దీక్షలు కొనసాగనున్నాయి. 72 గంటల బంద్కు సహకరించండి : అధిష్టానం పిలుపుమేరకు 72 గంటల బంద్కు ప్రజలంతా సహకరించాలని జిల్లా కన్వీనర్ కోరారు. శని, ఆదివారాల్లో బంద్ విజయవంతానికి పార్టీ శ్రేణులన్నీ కృషి చేయాలన్నారు. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల సిబ్బంది కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రను సాధించేందుకున్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ సంక్షోభం ద్వారానే సమైక్యాంధ్ర నిలుస్తుందన్న నమ్మకం ఉందని, ఆ దిశగా వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలన్నారు. ఇప్పుడుగానీ వెనుకడుగు వేస్తే రాష్ట్రం అథోగతిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉద్యమానికి ఊపు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన దీక్షలతో సమైక్య ఉద్యమానికి ఊపు వచ్చింది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపట్టారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, జేఏసీ నాయకులు నిరాహారదీక్షలకు సంఘీభావం తెలిపారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాక రరెడ్డి నేతృత్వంలో రెండురోజులపాటు నిరాహారదీక్ష చేపట్టారు. ఇందులో పార్టీ నాయకుడు వరప్రసాదరావు, పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 50 మంది నేతలు పాల్గొన్నారు. ఈ దీక్షకు ఆర్టీసీ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. అన్నమ య్య కీర్తనలతో సంగీత విభావరి చేపట్టారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో దాదాపు 200 మంది నిరాహారదీక్షలో పాల్గొన్నారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నాయ కత్వంలో 300 మంది రిలేనిరాహార దీక్షలో పాల్గొన్నా రు. ఈ దీక్షకు పార్టీ జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, తిరుపతి పద్మావతి మహిళా కళాశాల విద్యార్థినులు సంఘీభావం తెలిపారు. జీడీ నెల్లూరులో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి నాయకత్వంలో ఐ దు మండలాల కన్వీనర్లు రెండు రోజుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నగిరి నియోజకవర్గం పన్నూరులో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రోజా పాల్గొన్నారు. బి.కొత్తకోటలో తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ప్రవీణ్కుమార్రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. చంద్రగిరిలో నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నాయకత్వంలో ఆరు మండలాల కన్వీనర్లు, 150 మంది కార్యకర్తలు రెండురోజుల నిరాహారదీక్షను చేపట్టారు. ఈ దీక్షకు వై ఎస్సార్సీపీ ఐటీ విభాగం కన్వీనర్ మధుసూదన్రెడ్డి సంఘీభావం తెలిపారు. చిత్తూరులో పార్టీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నిరాహారదీక్ష చేపట్టారు. చిత్తూరు వై ఎస్సార్ సీపీ కార్యక్రమాలను ఫేస్బుక్లో పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంగనపల్లెకు చెందిన యూత్ నాయకుడు తులసీప్రసాద్ ఆధ్వర్యంలో కొంతమంది యువకులు పార్టీలో చేరారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దే శాయి తిప్పారెడ్డి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పార్టీ సమన్వయకర్త షమీమ్ అస్లాం ఆమరణ దీక్షలో కూర్చున్నారు. పూతలపట్టులో పార్టీ సమన్వయకర్తలు పుణ్యమూర్తి, సునీల్కుమార్, పూర్ణం, రవిప్రసాద్ రెండు రోజుల దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తలుపులపల్లె బాబురెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు శ్రీకాంత్రెడ్డి సంఘీభావం తెలిపారు. పీలేరులో పార్టీ రాజంపేట పార్లమెంటరీ ని యోజకవర్గ ఇన్చార్జి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి నిరాహార దీక్షలను ప్రారంభించారు. పార్టీ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి దీక్షల్లో పాల్గొన్నారు. సత్యవేడులో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఏడు మండలాల కన్వీనర్లతో కలసి నిరాహారదీక్ష చేపట్టారు. కుప్పంలో పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. పార్టీ నాయకుడు వెంకటేష్ బాబు, నాలుగు మండలాల కన్వీనర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నిరాహారదీక్షకు విశేష స్పందన - వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి గంగాధరనెల్లూరు, న్యూస్లైన్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో బుధవారం చేపట్టిన నిరాహార దీక్షలకు విశేష స్పందన లభించిందని ఆపార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. గంగాధరనెల్లూరులో బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ సీపీ తరఫున దీక్షలు చేపట్టామన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలు స్వచ్ఛం దంగా దీక్షలో పాల్గొనడం విశేషమని తెలిపారు. జగన్మోహన్రెడ్డి అధ్వర్యంలో ఓ ప్రణాళిక ప్రకారం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ నెల 7న ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి ఉంటుందన్నారు. 10వ తేదీన మండలాల్లో రైతుల ధర్నా, 17న నియోజకవర్గ కేంద్రాల్లో ఆటో రిక్షాలతో ర్యాలీ, 21న నియోజకవర్గ స్థాయిలో మహిళల ధర్నా, 24న యూత్ ఆధ్వర్యంలో ధర్నా ఉంటుందని వివరించారు. అలాగే 26న చిత్తూరులో జిల్లాస్థాయిలో సర్పంచుల ధర్నా, 29న నియోజకవర్గ స్థాయిలో విద్యార్థుల ధర్నా, నవంబరు 1న పంచాయతీ స్థాయిలో సమైక్యాంధ్రాకు మద్దతుగా తీర్మాన సభ ఉంటుందన్నారు. వీటిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
జైల్భరోకు భారీగా వచ్చిన పార్టీ శ్రేణులు
విజయవాడ, న్యూస్లైన్ : తెలుగు జాతి పరిరక్షణకోసం దృఢ సంకల్పంతో ఆస్పత్రిలో కూడా ఆమరణ దీక్షను కొనసాగిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం బాసటగా నిలుస్తున్నారు. ఒకవైపు ఆయన ఆరోగ్యంపై కలత చెందుతున్నప్పటికీ, తెలుగువారందరికీ సమన్యాయం చేయగల ఏకైక నాయకుడు జగనేనన్న విశ్వాసంతో దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో శుక్రవారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది పార్టీ శ్రేణులు పీఎస్ ప్రాంగణాన్ని ముట్టడించాయి. వెస్ట్జోన్ ఏసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో స్థానిక సి.ఐ. హనుమంతరావుతోపాటు వివిధ స్టేషన్లకు చెందిన నలుగురు సి.ఐ.లు, పలువురు ఎస్.ఐ.లు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒక్కసారిగా గేట్లను తోసుకుని లోపలికొచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీ సులు అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘జై జగన్... జైజై జగన్’ నినాదాలతో ఆ పరిసరాలు మార్మోగాయి. జగన్ సంకల్పాన్ని దెబ్బతీయలేరు... వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ అసమర్థ ముఖ్యమంత్రి, అవకాశవాది చంద్రబాబు కుమ్మక్కై తెలుగు ప్రజలను విడదీయడానికి కుట్రపన్నారని చెప్పారు. సరైన సమయంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, రాష్ట్ర భవిష్యత్ అంధకారం కాకుండా చూసేందుకు జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు దిగారన్నారు. ఆయన దీక్షను భగ్నం చేయడానికి ఆస్పత్రికి తరలించినా.. ఆయన సంకల్పాన్ని దెబ్బతీయలేకపోయారన్నారు. రాష్ట్రవ్యాపితంగా లక్షలాది మంది జైల్భరో కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఈ తరుణంలో గవర్నర్ కలుగజేసుకుని సమైక్య రాష్ట్రాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి దీక్షను భగ్నం చేయడానికి పాలకులు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఆయన డిమాండ్ను ఆమోదించేవరకు ఉద్యమం కొనసాగుతుందని, జగన్కు మద్దతుగా తామందరం ఆందోళనలో పాల్గొం టామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆత్మగౌరవయాత్ర అంటూ సీమాం ధ్రలో పర్యటించడానికి వస్తున్నారని, ఇటీవల లగడపాటికి పట్టిన గతే బాబుకూ పడుతుందని ఎద్దేవా చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ 30 రోజులుగా సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య ఉద్యమం ఎగసిపడుతుందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు నిర్బంధంలో సైతం జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు దిగారన్నారు. ఆయనకు యావన్మంది రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మరోవైపు చంద్రబాబు ఆత్మగౌరవయాత్రను చేపట్టడాన్ని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారన్నారు. చంద్రబాబుది ఆత్మవంచన యాత్రగా అభివర్ణించారు. పార్టీ నగర కన్వీనర్ జలీల్ఖాన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నా సడలని సంకల్పంతో జననేత తన ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు ప్రజల అభ్యున్నతి సాకారమవుతుందని వైఎస్ అభిలషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలు జ్యేష్ఠ రమేష్బాబు, మేకా ప్రతాప అప్పారావు, ఉప్పులేటి కల్పన, పి.గౌతంరెడ్డి, పడమట సురేష్బాబు, తాతినేని పద్మావతి, దుట్టా రామచంద్రరావు, దూలం నాగేశ్వరరావు, మాదివాడ రాము, దేవినేని చంద్రశేఖర్, సింహాద్రి రమేష్, కాజ రాజ్కుమార్, సూరపనేని రామారావు, వంగవీటి శ్రీనివాసప్రసాద్, డి.రత్నశేఖర్, ఎల్.సునీత, దాసీ జయప్రకాష్ కెనడీ, విశ్వనాథ రవి, బుల్లా విజయకుమార్, మస్తాన్, సుందర్పాల్, ఎం.ఎస్.బేగ్, విజయలక్ష్మి, అమీర్జానీ తదితరులు పాల్గొన్నారు. దీక్షలు భగ్నం.. మిగిలింది ఆరుగురే.. జగన్మోహన్రెడ్డికి సంఘీభావంగా వైఎస్సార్ సీపీ నేతలు 20 మంది దీక్షలు చేస్తుండగా వారిలో 14 మంది దీక్షలను శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రమేష్ (రాము), నూజివీడులో పార్టీ నేత లాకా వెంగళరావుయాదవ్, పెనుగంచిప్రోలులో వూట్ల నాగేశ్వరరావు, వేల్పుల పద్మకుమారి, గుడివాడలో పట్టణ కన్వీ నర్ మరీదు కృష్ణమూర్తి దీక్షలతోపాటు నందిగామలో తొమ్మిది మంది దీక్షలు భగ్నమయ్యాయి. పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అడ్హాక్ కమిటీ సభ్యుడు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావులతోపాటు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తంగిరాల రామిరెడ్డి, కాశిరెడ్డి, పెనమాక రవి, జి.జయరాజ్లు ఆమరణదీక్షలు కొనసాగిస్తున్నారు. కైకలూరులో పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జగన్కు మద్దతుగా జరుగుతున్న రిలే దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. హనుమాన్జంక్షన్లో రిలే నిరాహారదీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు దీక్ష శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. చాట్రాయిలో నాలుగో రోజు రిలే నిరాహారదీక్షలు జరిగాయి. -
దీక్షలు భగ్నం
సాక్షి, విజయవాడ : సమన్యాయం చేయాలి లేదా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ జైల్లో ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యంపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన్ను ఆస్పత్రికి తరలించ డంతో ప్రజలు పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో జననేత దీక్షకు దన్నుగా పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన ఆమరణ దీక్షలను భగ్నం చేయాలంటూ పాలకుల నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ దీక్షలు కొనసాగితే ఉద్యమం మరింతగా వేళ్లూనుకుంటుందనే భయం వారిని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు గురువారం రాత్రి కొందరు దీక్షాదక్షులను బలవంతంగా శిబిరాలనుంచి ఆస్పత్రులకు తరలించారు. జగన్ దీక్షకు మద్దతుగా గురువారానికి 29 మంది ఆమరణ నిరశనలో ఉన్నారు. తిరువూరులో మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ఆరుగురిని తొల గిం చారు. పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, మైలవరం యువజన నేత జ్యేష్ఠ శ్రీనాథ్ మైలవరంలో చేపట్టిన దీక్షలు ఐదోరోజుకు చేరుకున్నాయి. వీరి ఆరోగ్యం క్షీణిం చినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో వీరిని బలవంతంగా ఆస్పత్రికి తరలించి దీక్ష భగ్నం చేశారు. నందిగామలో దీక్ష చేస్తున్న వినుకొండ రామారావుకు జ్వరం రావడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో 20 మంది దీక్షలు కొనసాగిస్తున్నారు. పెడనలో నాలుగురోజులుగా దీక్ష చేస్తున్న ఉప్పాల రాము ఆరోగ్యం క్షీణిస్తోంది. రక్తపోటు స్థిరంగా ఉన్నా షుగర్ లెవెల్ తగ్గుముఖం పడుతున్నాయని వైద్యులు తెలిపారు. గుడివాడలో మరీదు కృష్ణమూర్తి, నూజివీడులో లాకా వెంగళరావు యాదవ్, పెనుగంచిప్రోలులో ఊట్ల నాగేశ్వరరావు చేపట్టిన దీక్షలు మూడోరోజుకు చేరాయి. పెడనలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అడ్హక్ కమిటీ సభ్యులు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. నగరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు రెండో రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరంలో తంగిరాల రామిరెడ్డి, గురివిందపల్లి జయరాజు, వై. శివకాశిరెడ్డి, పెనుమాక రవి కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ జలీల్ఖాన్ సందర్శించారు. పెనుగంచిప్రోలులో వేల్పుల పద్మకుమారి చేపట్టిన దీక్షలు రెండోరోజుకు చేరాయి. గుడివాడలో మరీదు కృష్ణమూర్తి చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా 10 మంది ముస్లిం సోదరులు రిలే నిరశన చేశారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రారంభించారు. నందివాడ మండలంలో మూడోరోజు రిలేదీక్షలో తొమ్మిదిమంది పాల్గొన్నారు. పామర్రులో మహిళలు ర్యాలీ చేశారు. నందిగామ గాంధీ సెంటర్లో దీక్షలు చేస్తున్న కుక్కల సత్యనారాయణ ప్రసాద్, నెలకుర్తి సత్యనారాయణ, నాదెండ్ల రాజన్, మార్కపూడి ప్రసాదరావు, షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజాపీరా, విశ్వనాథపల్లి కృపారావు, మొండితోక నారాయణరావు, వంకాయలపాటి సుధాకర్లకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వద్ద పలు వినూత్న నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పురంధరేశ్వరీ, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మీ, చిరంజీవి, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, జేడీ శీలం, కిషోర్చంద్రదేవ్ల మాస్క్లను పలువురు మహిళలు ధరించగా... మీరెందుకు రాజీనామా చేయరంటూ ఆందోళనకారులు కొరడాలతో కొడుతుండగా వారు వద్దని దండాలు పెడుతున్నట్లు ప్రదర్శించారు. మహిళలు రోడ్డుపై రింగ్, వాలీబాల్ తదితర ఆటలాడంతోపాటు భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జగన్కు మద్దతుగా జరుగుతున్న రిలే దీక్షలు ఐదో రోజుకు చేరాయి. సింగరాయపాలెంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు ఆధ్వర్యంలో జగన్కు మద్దతుగా ర్యాలీ జరిగింది. జగన్ యూత్ అధ్వర్యంలో పుల్లూరు గ్రామం నుంచి బైక్ ర్యాలీగా యువకులు మైలవరం చేరుకుని ఆమరణదీక్ష చేస్తున్నవారికి మద్దతు తెలిపారు. మైలవరంలో బైక్ ర్యాలీ.. మైలవరంలో జోగి రమేష్ అధ్వర్యంలో 150 బైక్లతో సుమారు 300మంది పైగా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జ్యేష్ఠ రమేష్బాబు ఆధ్వర్యంలోనూ మైలవరంలో నిరసన ప్రదర్శన జరిగింది. హనుమాన్జంక్షన్లో పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో నిర్వహిస్తున్న నిరాహారదీక్షలు మూడో రోజుకు చేరాయి. ఈ దీక్షలను పార్టీ సమన్వయకర్త మేకా ప్రతాప అప్పారావు ప్రారంభించారు. నగరంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. -
ఆమరణ దీక్షకు తాము సైతం
చోడవరం, న్యూస్లైన్ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు తాము సైతం అంటున్నాయి జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు. బుధవారం కూడా సంఘీభావంగా అంత టా ఆందోళనలు చేపట్టారు. రాస్తారోకో, మానవహారాలు నిర్వహించారు. చోడవరంలో పీవీ ఎస్ఎన్ రాజు, ముర్లోతు ముత్యాలనాయుడు, యర్రంశెట్టి శ్రీనివాసరావుల ఆమరణ దీక్ష శిబిరాన్ని పార్టీ నాయకులు దాడి వీరభద్రరావు, కొయ్య ప్రసాద్రెడ్డి, జి.వి.రవిరాజు, సత్తి రామకృష్ణారెడ్డి, బోళెం నర్సింహమూర్తి సందర్శించి మద్దతు తెలిపారు. ఎలమంచిలి ఆర్టీసీ బస్స్టేషన్ సమీపంలోని వైఎస్ విగ్రహంవద్ద పులపర్తి, పిఎన్ఆర్ పేట గ్రామాలకు చెందిన కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద జాతీయరహదారిపై డీసీసీబీ మాజీ డెరైక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వైఎస్రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనకాపల్లిలోని కొణతాల పెదబాబు నాయకత్వంలో 20 మంది దీక్షలు ప్రారంభించారు. కశింకోటలో మరో 15మంది దీక్షలు చేస్తున్నారు. వీరిని దాడి రత్నాకర్ పరామర్శించారు. ఇక్కడే జాతీయరహదారిపై పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. సోనియాగాంధీ, కేసీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తగరపువలసలో వైఎస్సార్సీపీ నేత కోరాడ రాజబాబు సహా మరో 7మంది ఆమరణదీక్షను మంగళవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోనే రాజబాబు సహా మరో ముగ్గురు దీక్ష కొనసాగిస్తున్నారు. నర్సీపట్నంలో సమన్వయకర్త పెట్ల ఉమాశంకరగణేష్ ఆధ్వర్యంలో 15మంది దీక్షలు ప్రారంభించారు. మునగపాక మెయిన్రోడ్డుపై వైఎస్సార్సీపీ శ్రేణులు మానవహారం చేపట్టాయి. జగన్ దీక్షకు మద్దతుగా మునగపాక పంచాయతీ పాలకవర్గం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించింది. సుమారు 20మంది పాల్గొన్నారు. అరకులోయ పాత బస్టాండ్ వద్ద రిలే దీక్షలు రెండో రోజుకు చేరాయి. దీనికి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు మద్దతు తెలిపారు. పార్టీ సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు, సివేరి దొన్నుదొర, పెదలబుడు సర్పంచ్ సమర్దిలు దీక్షదారులను పరామర్శించారు. -
దమ్ముంటే సీఎం, పీసీసీ చీఫ్ రాజీనామా చేయాలి
పీలేరు, న్యూస్లైన్: తాము నిఖార్సైన సమైక్య వాదులమని చెప్పే దమ్ము, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తమ పదవులకు రాజీనామా చేయాలని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి డిమాండ్చేశారు. బుధవారం రాత్రి ఆయన న్యూస్లైన్తో మా ట్లాడుతూ గత 28 రోజులుగా సీమాం ధ్రలో సమైక్య ఉద్యమం ఉవెత్తున ఎగసిపడుతుంటే పదిరోజుల పాటు నోరు మెదపక ఇంటికే పరిమితమైన సీఎం తమ ఉనికి కోల్పోతామన్న భయంతో మీడియా ముందుకు వచ్చారని దుయ్యబట్టారు. సీడబ్ల్యూసీ, యూపీఏలో ప్ర త్యేక ఆహ్వానితులుగా ఉన్న సీఎం, పీసీసీ చీఫ్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఢిల్లీలో ఒప్పుకుని ఇక్కడ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించా రు. వారం క్రితం మీడియా సమావేశంలో ప్రత్యేక రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలని డి మాండ్ చేసిన చంద్రబాబు సిగ్గు లేకుం డా సీమాంధ్రలో ఎలా యాత్ర చేయాలంటారని నిలదీశారు. రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజ యమ్మ పదవులకు రాజీనామా చేశారని తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ గుంటూరులో విజయమ్మ చేపట్టిన దీక్షను రాష్ట్ర ప్రభుత్వం నిరాక్షిణ్యంగా అడ్డుకుని భగ్నం చేసిందన్నారు. పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ జైల్లో ఆమరణ దీక్ష చేస్తున్నారని తెలిపారు. సీమాంధ్రలో వైఎస్సార్ సీపీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీలు, ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. -
దీక్షా సమరం
జననేత జగన్మోహన్రెడ్డి దీక్షాస్త్రం రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన నిరవధిక నిరశనకు సంఘీభావంగా జిల్లాలో దీక్షాయజ్ఞం మొదలైంది. సమన్యాయమా.. సమైక్యమా తేల్చాలంటూ అధినేత బాటలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, యువనాయకుడు జ్యేష్ఠ శ్రీనాథ్ మైలవరంలో ఆమరణ దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్యులతో పాటు వివిధ ప్రాంతాల్లో రిలే దీక్షలు నిర్వహించారు. ఎన్జీవోలు, వివిధ వర్గాలు జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. సోమవారం నుంచి మరికొందరు ఆమరణ, రిలే దీక్షలకు సమాయత్తమవుతున్నారు. సాక్షి, విజయవాడ : దీక్షా సమరం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డి చంచల్గూడ జైలులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు కదులుతున్నాయి. జననేత దీక్షకు మద్దతుగా ఆదివారం పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, మైలవరం వైఎస్సార్ సీపీ యూత్ నాయకుడు జ్యేష్ఠ శ్రీనాథ్లు మైలవరంలో ఆమరణ దీక్షలు మొదలుపెట్టారు. విజయవాడ, పెనమలూరు, పెడన ఇతర ప్రాంతాలలో ఆయనకు మద్దతుగా రిలేదీక్షలు, నిరసన ప్రదర్శనలు సాగాయి. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలలో కూడా దీక్షలు, ఆందోళనలు చేసేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. మైలవరంలో జోగి రమేష్ చేపట్టిన ఆమరణ దీక్షను ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణ త్యాగంతోనైనా రాష్ట్రానికి మేలు చేయాలన్న తలంపుతో వైఎస్సార్సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటే.. దాన్ని భగ్నం చేసేందుకు పాలకవర్గాలు అత్యంత పాశవికంగా వ్యవహరించాయని విమర్శించారు. అంబులెన్స్ కూడా లేకుండా సాధారణ వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఆస్పత్రిలో విజయమ్మ దీక్ష కొనసాగిస్తానంటే.. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తానే ఆమరణ దీక్ష నిర్వహిస్తానని చెప్పడం జగన్మోహన్రెడ్డి మనోధైర్యానికి నిదర్శనమన్నారు. సామాన్య పౌరుడు ఎక్కడ ఉన్నా దీక్ష చేయటానికి అర్హుడేనని, ఎటువంటి అడ్డంకులు ఉండవని న్యాయనిపుణులు చెబుతున్నా.. దీనిపై కాంగ్రెస్, టీడీపీలు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీక్ష చేస్తున్న జోగి రమేష్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పోరాడే దమ్ము, ధైర్యం వైఎస్ కుటుంబానికే ఉన్నాయని అన్నారు. జనం కోసం జగన్, విజయమ్మలు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రాష్ట్ర విభజనలో ప్రజలకు సమన్యాయం చేయాలని లేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షలు చేయడం వారి గుండెధైర్యాన్ని, కార్యదీక్షను తెలియజేస్తుందని పేర్కొన్నారు. పార్టీ యువ నాయకుడు జ్యేష్ఠ శ్రీనాథ్ కూడా మైలవరంలో ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ సభలో మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్బాబు మాట్లాడుతూ మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరగాలని వైఎస్సార్సీపీ కోరితే దాన్ని పక్కన బెట్టి రాష్ట్ర విభజనకు ఆ పార్టీ కూడా అంగీకార పత్రం ఇచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించిన మహానేత వైఎస్ వారసులు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆందోళన చేపట్టారని చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడగా ప్రస్తుతం స్వార్థం కోసం కాంగ్రెస్, టీడీపీలు తాకట్టుపెట్టాయని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు జగన్మోహన్రెడ్డి జైలు నుంచే దీక్ష చేపట్టారని అన్నారు. సమ న్యాయం జరగలన్నా, రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నా.. ఆ లక్ష్యాన్ని సాధించడం వైఎస్ కుటుంబ సభ్యులకే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ రెండు దీక్షా శిబిరాలను వందలాది మంది సందర్శించి పార్టీలు, కులమతాలకు అతీతంగా జోగి రమేష్, జ్యేష్ఠ శ్రీనాథ్లకు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ వైద్యవిభాగం కన్వీనర్ డాక్టర్ గోసుల శివభరత్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ఐఎంఏ హాల్ వద్ద రిలేదీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్ఖాన్ మద్దతు ప్రకటించారు. ఈ దీక్షల్లో వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి నేతృత్వంలో 59వ డివిజన్ ఎన్ఎస్సీ బోస్ నగర్లో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. జగన్ దీక్షలకు మద్దతుగా పెడనలో పార్టీ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేశారు. ఉయ్యూరులో పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్బాబు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దళితవాడలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించి అక్కడ్నుంచి కాగడాలతో ఉయ్యూరు మునిసిపల్ కార్యాలయం సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేశారు. నడుపూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. నడుపూరు గ్రామంలోని ఎమ్ఎన్కే రహదారిపై అరగంట పాటు బైఠాయించారు. జగన్కు మద్దతుగా మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జువ్వాది రుద్రయ్య సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. -
ఆదివిష్ణు దీక్ష భగ్నం
జంగారెడ్డిగూడెం, న్యూస్లైన్ : వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు రాఘవరాజు ఆదివిష్ణు నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు గురువారం రాత్రి భగ్నం చేశారు. సీఐ పి.మురళీరామకృష్ణ, ఎస్సై బీఎన్ నాయక్ రెండు వాహనా ల్లో సిబ్బందితో, అంబులెన్స్తో దీక్షా శిబిరానికి వచ్చి ఆదివిష్ణును తరలించేందుకు యత్నించగా వైఎస్ఆర్సీపీ నాయకులు నులకాని వీరస్వామినాయుడు, చలమాల శ్రీనివాస్, కె.మల్లిబాబు, పి.శ్రీనివాస్, పోల్నాటి బాబ్జి, కార్యకర్తలు ప్రతిఘటించారు. పోలీసులు నాయకులు, కార్యకర్తలను గెంటివేసి ఆదివిష్ణును బలవంతంగా అంబులెన్స్లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా ఆమరణదీక్ష కొనసాగిస్తునట్లు ఆదివిష్ణు ప్రకటించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డి.భాస్కరరావు, డాక్టర్ అనిల్కుమార్, డాక్టర్ కె.విజయకృష్ణ ఆదివిష్ణుకు వైద్యం చేసేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. ఆదివిష్ణుకు బీపీ, పల్స్, రక్తపరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఆదివిష్ణు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశామని సీఐ మురళిరామకృష్ణ, ఎస్సై నాయక్ చెప్పారు. -
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఆమరణ దీక్ష
ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించవద్దనే నినాదంతో ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు మద్దతుగా నెల్లూరు జిల్లా కోవూరులో పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సోమవారం నుంచి ఆమరణ దీక్ష ప్రారంభించారు. ప్రసన్నకు మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు దీక్షా స్థలానికి తరలి వస్తున్నారు. ఆయనకు మద్దతుగా పార్టీ నాయకుడు డాక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా చిట్టమూరులో వైఎస్ఆర్సీపీ గూడూరు కన్వీనర్ డాక్టర్ బాలచెన్నయ్య దీక్ష నిర్వహిస్తున్నారు. -
విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం
ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించవద్దనే నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఫొటోలు: లావణ్య కుమార్, సాక్షి ఫొటోగ్రఫర్ -
ఆమరణ దీక్ష భగ్నం
-
ఆమరణ దీక్ష భగ్నం
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఏడురోజులుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి, పార్టీ నేతలు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్కుమార్లు చేస్తున్న ఆమరణ దీక్షలను ఆదివారం రాత్రి 9గంటలకు పోలీసులు భగ్నం చేశారు. కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి నేతృత్వంలో ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, పదుల సంఖ్యలో పోలీసులు ఒక్కమారుగా శిబిరంపై దాడి చేసి నేతలను బలవంతంగా ఎత్తుకెళ్లి రిమ్స్కు తరలిం చారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనే కాంగ్రెస్ పార్టీ కుట్రలను నిరసిస్తూ, అన్నిప్రాంతాలను సమన్యాయం చేయాలనే డిమాండ్తో ఈనెల 12న రాయచోటి ఎమ్మెల్యే గడికోట, కడప మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డితో పాటు మరో ముగ్గురు నేతలు కలెక్టరేట్ ఎదుట ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక మొక్కవోని ధైర్యంతో దీక్ష చేస్తున్న నేతల స్ఫూర్తితో ప్రజానీకం రోడ్లపైకి వచ్చి ప్రత్యక్షపోరాటం చేసింది. దీక్షలకు వస్తోన్న ప్రజాస్పందన చూసి భరించలేని సర్కారు ఆదేశాలతో పోలీసులు మూకుమ్మడిగా శిబిరంపై దాడిచేసి ఐదుగురినీ రిమ్స్కు తరలించారు. శాంతియుతంగా కొనసాగిస్తున్న నేతలను అరెస్టు చేసేందుకు యత్నిస్తుండడంతో పార్టీ శ్రేణులు పోలీసు చర్యలను ప్రతిఘటించాయి. పోలీసుల చర్యలను నిరసిస్తూ వైఎస్సార్ టీయూసీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు మేసా ప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్రెడ్డిలు ఆదివారం రాత్రి నుంచే ఆమరణ దీక్షకు దిగారు. పోలీసుల అక్రమ అరెస్టు ఖండిస్తూ పార్టీ సిటీ కన్వీనర్ అంజాద్ బాషా సోమవారం కడపనగరం బంద్కు పిలుపునిచ్చారు. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తాం: రవీంద్ర ఏడురోజులుగా శాంతియుత దీక్ష చేస్తున్నాం. దీక్షకు స్పందించాల్సింది పోయి మమ్మల్ని అరెస్టు చేయడం దారుణం. దీక్షను భగ్నం చేశామని పోలీసులు, ప్రభుత్వం భావించవచ్చు. కానీ ఆస్పత్రిలోనూ దీక్షను కొనసాగిస్తాం. సమైక్య ప్రకటన వచ్చేంత వరకూ ప్రాణాలు పోయినా దీక్షను ఆపే ప్రసక్తే లేదు. ఆ మేరకు రిమ్స్లో వైద్యం తీసుకోకుండా నిరాకరించారు. ప్రాణాలు పోయినా మా ప్రాంతానికి అన్యాయం జరగనివ్వం.. శ్రీకాంత్రెడ్డి దీక్షను భగ్నం చేయడం అన్యాయం. రాష్ట్ర విభజన కేంద్ర నాయకత్వం కర్కోటక నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల మా ప్రాంతానికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రాణాలు పోయినా మాప్రాంతానికి మాత్రం అన్యాయం జరగనివ్వం. సమైక్య ప్రకటన వెలువడే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు. -
ముందస్తు అరెస్ట్కు పోలీసుల కుట్ర: దేవినేని ఉమ
విజయవాడ : తనను ముందస్తు అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. మీడియాను చూసి తనను గొల్లపూడి వద్దే అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆయన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా దేవినేని ఉమ నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. ఆయన గొల్లపూడి నుంచి దీక్షా శిబిరానికి బయల్దేరారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి దేవినేని ఈరోజు నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు. 2009 డిసెంబర్లో రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేయగానే తెలుగుదేశం పార్టీ తరుఫున ఈ ఇద్దరు నేతలు నగరంలో నిరవధిక దీక్ష చేశారు. అయితే ఈసారి రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన 14 రోజులు తరువాత స్పందించడంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. -
విజయమ్మ దీక్షకు ఉద్యోగుల మద్దతు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు శుక్రవారం భేటీ అయ్యారు. ఈనెల 19వ తేదీ నుంచి విజయవాడలో వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు వారు తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడానికి ఆమె చేస్తున్న దీక్షకు ఉద్యోగుల పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. విభజన నిర్ణయంపై గత 15 రోజులుగా సచివాలయంలో ఆందోళనలు నిర్వహిస్తున్నామని, తమ నిరసన కార్యక్రమాలకు వైఎస్ఆర్ సీపీ పూర్తిగా సంఘీభావం తెలిపిందని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఛైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా తమ ఆందోళనల్లో పాల్గొన్నారని ఆయన అన్నారు.