భార్యను హతమార్చిన జవాన్ | soldier killed his wife in prakasam | Sakshi
Sakshi News home page

భార్యను హతమార్చిన జవాన్

Oct 15 2015 8:28 AM | Updated on Oct 22 2018 8:44 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ ఆర్మీ జవాన్ భార్యను ఉరివేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

గిద్దలూరు :  ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ ఆర్మీ జవాన్ భార్యను ఉరివేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లో వెళితే...ఖమ్మంకు చెందిన శివశంకర్‌కు ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రశాంతినగర్‌కు చెందిన ప్రవీణ(21)తో వివాహమైంది. శివశంకర్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు.

నాలుగు రోజుల క్రితం సెలవుపై ఖమ్మం వచ్చిన శివశంకర్ భార్యతో కలిసి రెండు రోజుల క్రితం గిద్దలూరుకు వచ్చాడు. బుధవారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన శివశంకర్ తాడుతో ఉరివేసి ప్రవీణను హతమార్చాడు. దాంతో ప్రవీణ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు నిందితుడు శివశంకర్ ను అదుపులోకి తీసుకుని... పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా అతడిని విచారిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement