సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి టెండర్ల ప్రక్రియపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ప్రభుత్వం, సీఆర్డీఏ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. వాస్తవానికి ఈ అప్పీలుపై శుక్రవారం వాదనలు కొనసాగాల్సి ఉండగా... ధర్మాసనం మల్లన్నసాగర్ కేసు విచారణ చేపట్టడంతో ఈ అప్పీలు విచారణకు నోచుకోలేదు. దీంతో ఈ కేసు విచారణను సోమవారం మధ్యాహ్నం పరిస్థితిని బట్టి చేపడతామని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది.