విద్యుత్ రంగం సమస్యలపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని టీ.జేఏసీ నేతలు విమర్శించారు
హైదరాబాద్: విద్యుత్ రంగం సమస్యలపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని టీ.జేఏసీ నేతలు విమర్శించారు. ఈ క్రమంలో భాగంగా వారు డీప్యూటీ సీఎం రాజ నర్శింహను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సమస్యలపై సీఎం అసత్యాలు మాట్లాడుతన్నారని జేఏసీ నేతలు మండిపడ్డారు. వాటి వివరాలను డీప్యూటీ సీఎంకు వివరించామన్నారు.
ఈ నెల 19 వ తేదీన ఆంటోనీ కమిటీతో సమావేశమై తమ వాదనలను సమర్ధవంతంగా వినిపిస్తామన్నారు. తెలంగాణ కల సాకరమవడానికి రాజనర్శింహనకృషి చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో విస్తృతసాయి సమావేశాన్ని నిర్వహించడానిక సన్నద్దమవుతున్నారు.