తహశీల్దార్‌పై తెలుగు తమ్ముళ్ల దాడి | tdp followers create nuisance in mro office | Sakshi
Sakshi News home page

తహశీల్దార్‌పై తెలుగు తమ్ముళ్ల దాడి

Published Wed, Mar 25 2015 3:16 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

అధికారం అండగా ఉందనే భరోసాతో తెలుగు తమ్ముళ్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. తాజాగా బుధవారం అనంతపురం తహశీల్దార్‌పై దాడికి దిగారు.

అనంతపురం : అధికారం అండగా ఉందనే భరోసాతో తెలుగు తమ్ముళ్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. తాజాగా బుధవారం అనంతపురం తహశీల్దార్‌పై దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే...అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీటీసీ కాటన్నెకాలువ శ్రీనివాస్ ఓ భూ వివాదానికి సంబంధించిన అంశంలో జోక్యం చేసుకుని ఎమ్మార్వోతో వాగ్వాదానికి దిగాడు. అదే క్రమంలో.. కార్యాలయంలోకి వచ్చిన తహశీల్దార్ మహబూబ్ పాషాను దుర్భాషలాడుతూ, అతని కాలర్ పట్టుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన అధికారి సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement