MRO office
-
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు టీడీపీ రంగులు
-
MRO కార్యాలయంలోని ముస్లిం మైనార్టీ అధికారిపై టీడీపీనేత దౌర్జన్యం
-
MRO పై టీడీపీ నేత రౌడీయిజం
-
కావలి ఎమ్మార్వో కార్యాలయంలో టీడీపీ నేతల రచ్చ
-
ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలోని గెస్ట్ హౌజ్ లో మందు పార్టీ
-
కళ్లూ, చేతులు పోయాయి సారూ.. అయినా కనికరించరా?
సాక్షి,పెద్దేముల్( వికారబాద్): ఆరు నెలల క్రితం ఇంటి వద్ద జరిగిన ఓ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి సర్వసం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, అధికారులు కనీసం సదరం సరిఫికెట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన తండ్రీకొడుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దేముల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బేగరి యాదప్ప, గీత దంపతులకు ఏకైక కుమారుడు వెంకటయ్య. అనారోగ్యంతో కొంతకాలం క్రితం గీత మృతి చెందింది. దీంతో తండ్రీకొడుకు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జూలై 2021లో యాదప్ప ఇంటి వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యాదప్ప కుమారుడు వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని కళ్లూ, రెండు చేతులు పోయాయి. ఒకరి సహాయం లేనిదే బయటకు వెళ్లలేని దుర్భర స్థితి. పేలుడు పదార్థాలకు కావాల్సిన సామగ్రి స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో లభ్యం కావడంతో అప్పట్లో ఆ శాఖ అధికారులు రూ.3 లక్షల నగదు, రెండెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో రూ.1,20 లక్ష నగదు అందచేశారని, మిగతా డబ్బులు, భూమి ఇవ్వటం లేదని యాదప్ప తెలిపారు. ఈ విషయమై పలుమార్లు ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ విషయాన్ని ఇటీవల పెద్దేముల్కు వచ్చిన కలెక్టర్ నిఖిల దృష్టికి తహసీల్దార్ తీసుకెళ్లారు. పూట గడవని తమకు కనీసం పింఛన్ మంజూరు చేయాలని తండ్రీకొడుకు వేడుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. వారికి సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు గురువారం మధ్యాహ్నం పెట్రోల్ డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఇద్దరూ ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా.. గమనించిన అక్కడున్న వారు పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఫయీమ్ఖాద్రీ వారిని సముదాయించారు. తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. తండ్రీకొడుకుకు తహసీల్దార్, ఎస్ఐ నాగరాజు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఽ సర్టిఫికెట్ ఇవ్వండి: ఎమ్మెల్యే తండ్రీకొడుకు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి, వెంటనే సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. తండ్రీకొడుకును అక్కడే ఉన్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆటోలో వికారాబాద్కు తరలించారు. -
తహసీల్ ఆఫీస్కే ఆపద !
సాక్షి, కామారెడ్డి: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు తయారైంది రెవెన్యూశాఖ పరిస్థితి. అందరి భూముల సమస్యలను పరిష్కరించే ఆ శాఖకే ఆపద వచ్చిపడింది. భూముల రికార్డులు భధ్రపరచడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహశీల్దార్ కార్యాలయ భవనం ఉన్న స్థలం అటవీశాఖదట. తహసీల్ ఆఫీస్, మండల పరిషత్ కార్యాలయం, జూనియర్ కాలేజీ భవనం...ఇలా అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ అటవీశాఖకు సంబందించిన సర్వేనంబరులోనే ఉన్నాయంటున్నారు. అలాగే 175 మంది రైతులకు సంబందించిన వ్యవసాయ భూములు, 70 కిపైగా నివాసపు గృహాలు కూడా ఆ సర్వేనంబరులోకి వస్తాయట. ఎప్పుడో విడుదల చేసిన అటవీ శాఖ గెజిట్లో సదరు సర్వేనంబరు అటవీశాఖదిగా పేర్కొనడం ఇప్పుడు రెవెన్యూ శాఖకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఫారెస్ట్ గెజిట్లో పేర్కొన్న సర్వే నంబర్లకు సంబందించి ఎలాంటి పాసుపుస్తకాలు జారీ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. దీంతో ఆ సర్వేనంబరులోని రైతులకు పాసుపుస్తకాల జారీ ఆగిపోయింది. ఫలితంగా రైతుబంధు నిలిచిపోయింది. బాధిత రైతులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే రెవెన్యూ కార్యాలయమే ఆపదలో ఉంటే రైతుల కష్టం తీర్చేదెవరని నోరెల్లబెడుతున్నారు. లింగంపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారికి సమీపంలో 983 సర్వే నంబరులో 450.08 ఎకరాల భూమి ఉంది. ఈ సర్వేనంబరులో 175 మంది రైతులు వందలాది ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు. 2005లో 150 ఎకరాలకు పట్టాలతో పాటు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఇచ్చారు. రైతులు బోర్లు తవ్వించుకుని పంటలు సాగు చేస్తున్నారు. పంట రుణాలు పొందారు. కొంత కాలం రైతుబంధు కూడా అందుకున్నారు. అదే సర్వేనంబరులో మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. అలాగే 70 కి పైగా ఇండ్లు కూడా నిర్మించుకుని ఉంటున్నారు. దశాబ్దాల తరబడిగా ఆ స్థలంలో జీవనం సాగుతోంది. రికార్డుల ప్రక్షాలణతో వెలుగులోకి.... రాష్ట్ర ప్రభుత్వం భూముల రికార్డుల ప్రక్షాలన మొదలుపెట్టిన సమయంలో అటవీ శాఖ తమ గెజిట్లోని సర్వే నంబర్లకు సంబందించిన వివరాలను రెవన్యూ శాఖ ముందుంచింది. రికార్డుల ప్రక్షాలన కొనసాగుతూ ఆ సర్వేనంబరుకు వచ్చేసరికి రెవెన్యూ అధికారులు షాక్కు గురయ్యారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం దొరకలేదు. ఫారెస్ట్ గెజిట్లో పేర్కొన్నదానిని మార్చాలంటే ఇప్పట్లో సాధ్యం అయ్యే పనికాదని కూడా అంటున్నారు. కాగా అటవీ శాఖ గెజిట్లో 983 సర్వేనంబరు ఉండడంతో అందులో భూములు కలిగి ఉండి పంటలు సాగుచేస్తున్న రైతులకు డిజిటల్ పాసుపుస్తకాలు అందలేదు. దీంతో రైతులకు రైతుబంధు కూడా నిలిచిపోయింది. అక్కడి రైతులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. డిజిటల్ పాసుపుస్తకాలు రాకపోవడం, ఆ సర్వేనంబరును హోల్డ్లో పెట్టడంతో రైతుబంధు నిలిచిపోయింది. దీంతో రైతులు ఆవేధన చెందుతున్నారు. జడ్పీ సమావేశంలో ఇదే అంశంపై చర్చ.... ఈ నెల 5న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో లింగంపేట ప్రజాప్రతినిధులు 983 సర్వేనంబరుకు సంబందించిన సమస్యను ప్రస్తావించారు. ఆ సర్వే నంబరు గెజిట్లో ఉందని అటవీ శాఖ జిల్లా అధికారి నిఖిత పేర్కొన్నారు. తహశీల్దార్ కార్యాలయం కూడా అదే సర్వే నంబరులో ఉందని పేర్కొనడంతో సభలో నవ్వులు పూశాయి. తహశీల్దార్ కార్యాలయం అటవీశాఖ సర్వేనంబరులోనిది కావడంతో అందరూ విస్తుపోయారు. తమ చేతిలో ఏమీలేదని అటవీ అధికారులు సభలో పేర్కొన్నారు. అయితే అటవీ శాఖకు సంబందించిన భూమిని కొందరు రియల్టర్లు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని, దానిపై కేసులు వేశారని సభ్యులు పేర్కొనగా తాము కౌంటర్ పిటీషన్ వేసినట్టు ఆమె వివరణ ఇచ్చారు. ఫారెస్ట్ గెజిట్లో పేర్కొనడం వల్లే సమస్య.... 983 సర్వేనంబరునుఫారెస్ట్ గెజిట్లో పెట్టారు. అందువల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గెజిట్లో మార్పులు జరిగితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉన్నతాధికారులకు గతంలోనే నివేదించాం. మా చేతుల్లో ఏమీ లేదు. రైతులు కూడా తిరుగుతున్నారు. పరిష్కారం దొరకాలంటే ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. గెజిట్లో ఆ సర్వేనంబరును తొలగిస్తేగానీ ఇబ్బంది పోదని భావిస్తున్నాం. –అమీన్ సింగ్, తహశీల్దార్ -
తన పేరిట పౌతి చేయడం లేదని..
సాక్షి, డిండి(నల్లగొండ): తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని పౌతి చేయడం లేదని ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు డబ్బాతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. వివరాలు.. మండల పరిధిలోని కాల్యతండాకు చెందిన ఆంగోతు చత్రునాయక్కు బొగ్గులదొన గ్రామ శివారులోని 113 సర్వే నంబర్లో 2.28 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఇందులో నుంచి 2014 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన దంజ్యనాయక్కు 28 గుంటల భూమిని విక్రయించాడు. కానీ 28 కుంటలకు సంబంధించి ప్రొసీడింగ్, పాత పట్టా పాసుపుస్తకం జారీ అయినప్పటికీ ధరణిలో మాత్రం వివరాలు నమోదు కాలేదు. చత్రునాయక్ మరణించడంతో ప్రస్తుతం అతడి కుమారులు తన తండ్రి పేరు మీద ఉన్న 2.28 ఎకరాలు పౌతి చేయాలని స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దంజ్యానాయక్ గతంలో తనకు విక్రయించిన 28 గుంటల భూమి తనకే చెందుతుందని, అందుకు సంబంధించిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని, సదరు పౌతిని నిలిపివేయాలని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉంచినట్లు తహసీల్దార్ ప్రశాంత్ తెలిపారు. కాగా తన తండ్రి పేరు మీదన్న పొలాన్ని పౌతి చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చత్రునాయక్ కుమారులలో ఒకరైన భద్యానాయక్ పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పోచయ్య తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. -
మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
-
తహశీల్దార్ కార్యాలయానికి అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: పుష్ప సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో సందడి చేశారు. శంకర్పల్లి మండలంలోని జన్వాడలో బన్నీ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం శుక్రవారం బన్నీ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ పనులు పూర్తి అయిన తరువాత ప్రొసీడింగ్ ఆర్డర్ను శంకర్పల్లి తహశీల్దార్ సైదులు బన్నీకి అందజేశారు. చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ అయితే ఎమ్మార్వో కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎమ్మార్వో సిబ్బంది, అభిమానులు బన్నీతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సైతం 6 ఎకరాల భూమి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా అదే శంకరపల్లి మండలంలో భూమిని కొన్నారు. చదవండి: ‘పుష్ప’లో అదిరిపోయే ఐటెం సాంగ్, బాలీవుడ్ భామ షాకింగ్ రెమ్యూనరేషన్! ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘ఫుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తండ్రి, కుమారుడి ప్రాణం తీసిన స్థల వివాదం
బొమ్మలసత్రం: స్థల వివాదం తండ్రి, కుమారుడి ప్రాణం తీసింది. ఈ ఘటన ఆదివారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు..నంద్యాలలో కోటా వీధికి చెందిన చిన్న సుబ్బరాయుడు, వెంకట లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు నాగరమేష్, కుమార్తె సుదీపిక ఉన్నారు. చిన్న సుబ్బరాయుడుతో పాటు సమీప బంధువు కందాల కృష్ణమూర్తికి పూర్వీకుల నుంచి భూములు వచ్చాయి. నంద్యాల మండలం పులిమద్ది గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 246లో రెండు ఎకరాలు, కొత్తపల్లి గ్రామ సమీపంలోని సర్వే 1578లో 55 సెంట్ల భూమిని వీరిద్దరూ కౌలుకు ఇచ్చేవారు. వచ్చిన ధాన్యాన్ని రెండు భాగాలుగా పంచుకునే వారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు గౌరీశంకర్, విజయ్కుమార్ న్యాయవాదులు కావటంతో నాలుగేళ్ల క్రితం రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి ఆన్లైన్లో భూములను తమ పేర్లపై మార్చుకున్నారు. ఈ విషయం తెలిసి గౌండా పని చేస్తున్న చిన్న సుబ్బరాయుడు కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను నిలదీశారు. ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో డిగ్రీ వరకు చదువుకున్న సుబ్బరాయుడు కుమారుడు నాగరమేష్ మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం నంద్యాల శివారు ప్రాంతంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు. కుమారుడి మృతితో మనస్తాపం చెందిన చిన్న సుబ్బరాయుడు శనివారం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక శనివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్న బంధువులు చిన్న సుబ్బరాయుడి మృత దేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కందాల కృష్ణమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎమ్మార్వో ఆఫీస్కు వెళ్లిన ఎన్టీఆర్.. ఆ భూమి కొనేందుకేనట!
Jr NTR: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రిజిస్ర్టేషన్ పనుల కోసం ఎన్టీఆర్ స్వయంగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఎన్టీఆర్తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తారక్తో సెల్ఫీలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్తో పాటు రామ్చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యారు తారక్. త్వరలోనే ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. -
తీగ లాగితే ‘రెవెన్యూ’ డొంక కదులుతోంది
సాక్షి, గుంటూరు(చేబ్రోలు): ప్రభుత్వం పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే కొంత మంది అవినీతి అధికారుల కారణంగా చెడ్డపేరు వస్తోంది. చేబ్రోలు తహసీల్దారు కార్యాలయ అధికారి, సిబ్బంది చేతివాటంపై తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా రెండు రోజులుగా చేబ్రోలులో విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి ఈ నెల 3వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంతో 4వ తేదీన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చేబ్రోలు తహసీల్దారు బీపీ ప్రభాకర్ను సస్పెండ్ చేశారు. చేబ్రోలు తహసీల్దారుగా పనిచేస్తున్న బీపీ ప్రభాకర్ మహిళా వలంటీర్ని రాత్రి సమయంలో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడం, ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు, భూములు ఆన్లైన్ నమోదులో అక్రమాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తహసీల్దారును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణకు తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా నలుగురు తహసీల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో జరిపిన రికార్డుల పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ►రెవెన్యూ నిబంధనల ప్రకారం క్వారీ గోతులకు సాగు భూములుగా అనుమతులు ఇవ్వకూడదు. సస్పెండ్ అధికారి మాత్రం చేబ్రోలు, వడ్లమూడి, సుద్దపల్లి గ్రామాల్లో 80ఎకరాల్లోని క్వారీ భూములకు సాగు భూములుగా ఆన్లైన్లో నమోదు చేసి వాటికి పాసు పుస్తకాలను కూడా అందజేసి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. సుద్దపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 135,136, 139లలో ఆవుల హరిబాబు, ఝాన్సీ, నవీన్, సుబ్బారావు, సువేందుల కుటుంబానికి చెందిన 60 ఎకరాల భూమి దశాబ్ద కాలం క్రితమే క్వారీంయింగ్ జరిగి గోతులుగా ఉన్న భూమికి సస్పెండ్ అయిన రెవెన్యూ అ«ధికారి లక్షలాది రూపాయిలు జేబులో వేసుకొని కొద్ది నెలల క్రితం పాసుపుస్తకాలు అందజేసి ఆన్లైన్లో నమోదు చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేశారు... ►చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేసి తమ ఘనతను చాటుకున్నారు. వడ్లమూడి గ్రామంలోని సర్వే నెంబరు 345/7లో 96 సెంట్ల భూమి రైతు పేరున ఉంది. దాని పక్కనే ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని కలిపి 1.96 ఎకరాల భూమిని ఆన్లైన్లో ఆ రైతు పేరున నమోదు చేయటం వెనుక లక్షల రూపాయిల సొమ్మును స్థానిక ఆర్ఐ, వీఆర్వో, కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో సస్పెండ్ అధికారి పూర్తి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ►చేబ్రోలులోని సర్వే నంబరు 709లో ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో గత 20 ఏళ్లుగా పాసుపుస్తకం జారీకి నోచుకోలేదు. సస్పెండ్ అధికారితో పాటు అతడి అనుచరులు కలిపి పక్కాగా ఆన్లైన్లో నమోదు చేసి పాసుపుస్తకాన్ని అందజేయటంతో లక్షల రూపాయిలు స్వాహా చేసినట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పక్కదారి పట్టించిన సస్పెండ్ అధికారి అతడి సోదరుడు, అతడి ముఖ్య అనుచరులపై విచారణ జరిపి వారిని కూడా సస్పెండ్ చేసి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇళ్ల స్థలాల పంపిణీలో రెవెన్యూ అధికారి లీలలు.. చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, వేజండ్ల గ్రామాల్లో రెవెన్యూ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు స్థానికులు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో కూడా వివిధ గ్రామాల నుంచి తహసీల్దారుపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎమ్మెల్యే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. నారాకోడూరు మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయించి ఎటువంటి విచారణ లేకుండా ఇళ్ల స్థలాలు అందజేసినట్లు గుర్తించారు. తహసీల్దారు 150 మంది వరకు అనర్హులకు ఇళ్ల పట్టాలు, పది నుంచి 20 వేలు వరకు డబ్బులు తీసుకొని అందజేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల విచారణలో కూడా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. -
గుమ్మానికి వేలాడిన నిరసన సూత్రం
చాలా సంఘటనలు ఇలా జరిగి అలా కాలం పొరల్లోకి వెళ్లిపోతుంటాయి. ఒక్కోసారి ఎంతో ప్రాధాన్యత గల సందర్భాలు కూడా సమాజంపై వేయవలసినంత ముద్ర వేయకుండానే మాములు ఘటనగా సమసిపోతాయి. దానివల్ల వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎవరికీ అందకుండానే మిగిలిపోతాయి. అయితే వాటి మూలాల్ని వెదికి ఆయా వ్యక్తులు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన పూర్వాపరాలే మిటో తెలుసుకుంటే అవి వ్యవస్థలో రావలసిన మార్పునకు సూచనలిస్తాయి. ఈ మధ్య ఒక మహిళ తన భూసమస్యను పరిష్కరించమని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి తన మంగళసూత్రాన్ని ఎమ్మార్వో ఆఫీసు ప్రవేశ ద్వారానికి తగిలించింది. తాను ఇంతకన్నా ఏమీ చెల్లించుకోలేను, దీన్ని తీసుకొని నా కార్యం చేసి పెట్టండని వేడుకొంది. ఈ సంఘటన జూన్ 30 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగింది. ఆ మహిళా రైతు పేరు పొలాస మంగ. మంగకు ఎలాంటి పోరాట, ఉద్యమ నేపథ్యం లేదు. రెండేళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా తన భూమిపై హక్కును ఎలా పరిరక్షించుకోవాలో అర్థం కాలేదు. ఆఫీసు లోపల తన తాళి బొట్టును తీసి ఏ ఉద్యోగి చేతిలోనో పెడితే పరిస్థితి ఎలా ఉండేదో గానీ, ఏకంగా ఆఫీసు గుమ్మానికి తగిలించడంతో కలకలం రేగింది. మధ్యలో వేలాడుతూ ఆఫీసులోకి వచ్చే పోయేవారి కంటపడి ఇదేమి చోద్యమనేలా చర్చకు వచ్చింది. ఇదేదో ఉద్రిక్త పరిస్థితికి దారి తీస్తుందన్న బెదురుతో రెవెన్యూ అధికారులు విషయాన్ని స్థానిక పోలీసు స్టేషనుకు చేరవేశారు. ఆ సమయాన జిల్లా కేంద్రంలో ఉన్న డిప్యూటీ తహసీల్దారు హుటాహుటిన ఆఫీసుకొచ్చి ఆమెతో మాట్లాడి సమస్యను తెలుసుకొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను స్టేషన్కు తీసుకెళ్ళి ఆమె అలా ఎందుకు చేయవలసివచ్చిందో కనుక్కున్నారు. వార్త జిల్లా కలెక్టర్ దాకా వెళ్ళింది. సంగతేమిటో చూడమని ఆయన ఆర్డీవోను పుర మాయించారు. ఆ అధికారి స్వయంగా భూమి వద్దకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని ఆమెతో అన్నారు. ఇలా అధికారులు దిగి వచ్చి తన సమస్యను ఆలకిస్తారని ఆమె తాళిని తగిలించేముందు ఊహించి ఉండకపోవచ్చు. ఇదొక అరుదైన ఘటనగా, రెవెన్యూ శాఖ పరువు ప్రతిష్టకు ముడిపడిన విషయంగా భావించి అధికారగణం కదిలి వచ్చిందనుకోవచ్చు. ప్రపంచంలో మహిళలు అతికష్ట సమయంలో ఉద్వేగభరితమైన రీతిలో తమ నిరసనను ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. మంగ చూపిన తెగువ కూడా ఆ స్థాయికి తక్కువేమీ కాదు. పదేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్ళిన మంగ భర్త రాజేశం ఎక్కడ, ఎలా ఉన్నాడో సమాచారం లేదు. ప్రస్తుతం కొడుకుతో పాటు మెట్పల్లిలోని తన పుట్టినింటిలో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇదే అదునుగా తన ఎకరం 23 గుంటల భూమిని భర్త తోబుట్టువులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె వాదన. మంగ భర్త పరిస్థితిని కూడా తెలుసుకునే పని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆమె అనుభవాలను, ఆలోచనలను నలుగురి ముందుకు తెచ్చి వాటికి తగిన ప్రాచుర్యం ఇయ్యవలసిన సందర్భమిది. మంగ చూపిన తెగువను ఒక నిరసన బాటగా మలుచుకునే బాధ్యత నారీలోకంపై ఉంది. ప్రభావశీల సంఘటనలు ప్రతిరోజూ జరుగవు. - బి. నర్సన్ వ్యాసకర్త కవి, కథకుడు మొబైల్ : 9440128169 -
మెదక్ జిల్లా శివం పెట్ MRO ఆఫీస్ లో కలకలం
-
టైమ్ 11 దాటినా పత్తాలేని తహసీల్దార్..
సాక్షి, మెదక్ : పరిపాలన వ్యవస్థ సక్రమంగా నడవాలంటే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఏ ప్రభుత్వానికైనా మంచిపేరు రావాలంటే అధికారుల కృషి ఉండాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం తరచూ సమయపాలన పాటించకపోవడం పట్ల ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన రేగోడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11గంటలు దాటినా కార్యాలయంలో కేవలం ధరణి కంప్యూటర్ ఆపరేటర్, ఒక వీఆర్ఏ మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో అక్కడే తహసీల్దార్ కోసం పడిగాపులు కాసిన రైతులు, ప్రజలు విలేకరులకు సమాచారం అందించారు. విలేకరులు వెల్లి చూడగా తహసీల్దార్తో పాటు పలువురు అందుబాటులో లేరు. తరచూ సమయపాలన పాటించడం లేదని పలువురు వాపోయారు. గతంలో అధికారుల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారుల తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెలా వేలరూపాయలు వేతనం తీసుకుంటున్నా విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భూమి మార్పు విషయంలో అడిగిన డబ్బులు ఇచ్చినా ఓ అధికారి, వీఆర్ఓ పనిచేయకుండా తిప్పించుకుంటున్నారని మర్పల్లి గ్రామానికి చెందిన ఒకరు తెలిపారు. మారుమూల మండలంలోని రేగోడ్పై జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్యాలయానికి వెల్లే సన్నిహితులకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్యులను పట్టించుకోకపోవడం ఏమిటోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోని ఇబ్బందులు తప్పించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్ జిల్లా కేంద్రంలో ఏసీపీ హల్చల్ రెండేళ్లుగా తిరుగుతున్నా మా తాత పేరున ఉన్న 133అ సర్వే నంబరులో ఎకరా మూడుగుంటలనర భూమికి తొమ్మిది గుంటలు భూమి మాత్రమే ఆన్లైన్లో చూపిస్తుంది. మిగతా భుమిని ఆన్లైన్లో పెట్టాలని అధికారులను తరచూ కోరుతున్నా. గత సంవత్సరం కార్యాలయంలోని ఓ అధికారికి, వీఆర్ఓకు డబ్బులు ఇచ్చినా భూమిని సరిచేయలేదని, మా తాతపేరుపై ఉన్న భూమిని మా నాన్న పేరున చేయడం లేదు. రోజూ తిరుగుతున్నా పని కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. – అనిల్, మర్పల్లి ఫిర్యాదు చేసినా మారడం లేదు తహసీల్దార్తో పాటు సిబ్బంది సమయానికి రావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా అధికారి, సిబ్బందిలో మార్పు రావడం లేదు. ఇక్కడి అధికారుల తీరువల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – నాగయ్య స్వామి, సిందోల్ ఒక్కోసారి ఆలస్యం అవుతుంది.. ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. కానీ ముందుగానే వస్తున్నాం. ఆఫీసుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలు అందిస్తున్నాం – సత్యనారాయణ, తహసీల్దార్ -
ఎమ్మార్వో ఆఫీసులో అధికారుల తిట్ల పురాణం
సాక్షి, గద్వాల: ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు కర్తవ్యం మరిచారు. ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాల్సిందిపోయి సోయి మరచి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తహసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో వెలుగు చూసింది. సర్వేయర్ బ్రహ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ పరస్పరం బండ బూతులతో రచ్చకెక్కారు. అధికారుల తిట్ల పురాణాన్ని పనుల నిమిత్తం వచ్చిన కొందరు వ్యక్తులు వీడియో తీసి బయటపెట్టడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ఇలా గొడవపడటంపై జనం మండిపడుతున్నారు. పైఅధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
కార్యాలయంలో రాసలీలలు
సాక్షి, బళ్లారి: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారి దారితప్పి ఏకంగా కార్యాలయంలోనే ఓ మహిళతో ముద్దుముచ్చట్లకు పాల్పడడం సంచలనమైంది. కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్ గురుబసవరాజు రెండు నెలల క్రితం కుష్టిగి తహసీల్దార్గా పనిచేస్తున్న సమయంలో ఆఫీసులోని ఓ మహిళా ఉద్యోగికి ముద్దుపెడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈనేపథ్యంలో ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జోగ్ఫాల్స్ వద్ద టెక్కీ ఆత్మహత్యాయత్నం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన ఐటీ ఇంజనీరు జలపాతం నుంచి దూకి ప్రాణాలు తీసుకోబోయాడు. పోలీసుల జోక్యంతో విరమించుకున్నాడు. బెంగళూరులో నివసించే టెక్కీ చేతన్ కుమార్కు ఇటీవల ఉద్యోగం పోయింది. దీంతో జీవితం మీద విరక్తి చెందిన శివమొగ్గ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ జోగ్ జలపాతం నుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అధికారులు కళ్లుగప్పి జలపాతం ఎగువకు చేరుకున్నాడు. మొబైల్, లగేజ్ అన్నింటిని 960 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడేశాడు. ఇంతలో భద్రతా సిబ్బంది గమనించి అతన్ని వారించారు. ఇంతలో పోలీసులు కూడా చేరుకున్నారు. అందరూ దూరం నుంచే చేతన్తో మాట్లాడి వెనక్కి వచ్చేలా ఒప్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు చేతన్ జలపాతం నుంచి వెనక్కి రావడంతో కథ సుఖాంతమైంది. అనూహ్య ప్రమాదం సాక్షి, బళ్లారి: ఇనుప కడ్డీల లోడుతో నిలబడి ఉన్న లారీని కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కండక్టర్ శరణప్ప (40) దేహంలోకి కడ్డీలు గుచ్చుకుని విలవిలలాడాడు. బుధవారం తెల్లవారుజామున బళ్లారి జిల్లా కూడ్లిగి సమీపంలోని జాతీయ రహదారి– 58 పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుష్టిగి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోతూ నిలిపిఉన్న ఇనుపరాడ్ల లారీని వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బస్సులోకి కడ్డీలు చొచ్చుకుపోయాయి. కండక్టర్ దేహంలోకి చొచ్చుకుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గంటకుపైగా కండక్టర్ ఎటూ కదల్లేక నరకం అనుభవించాడు. 108 అంబులెన్స్, ఫైర్ సిబ్బంది వచ్చి కండక్టర్ శరీరం నుంచి కడ్డీలను కత్తిరించి బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, ముగ్గురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు. -
ఎమ్మార్వో కార్యాలయంలో.. పెట్రోల్ కలకలం
సాక్షి, సిద్దిపేట : తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో అత్మహత్య చేసుకుంటామని తండ్రీ కూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాల నుంచి కోహెడ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో అత్మహత్య చేసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచలచెరువులపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి తిరుపతి రెడ్డి, అతని కుమార్తె స్వరూప తమ భూమి వేరే వాళ్ల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని వాపోయారు. తన తండ్రి తిరుపతి రెడ్డికి చెందిన ఎకరం 30 గుంటల భూమిని తన పేరుమీద 2011 లో రిజిస్ట్రేషన్ చేయించారని అప్పటినుండి మ్యుటేషన్ చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు స్వరూప అన్నారు. ఈ మధ్యకాలంలో పహాణీలో తన తండ్రి పేరును తొలగించి వేరే వాళ్ల పేరు మీద భూమిని నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న తహసీల్దార్, ఇప్పుడున్న తహసీల్దార్ భూమి మోక మీదకి వచ్చి తనిఖీ చేసి హద్దులు నిర్ణయించి భూమి తమ పేరు మీదనే చేస్తామని చెబుతున్నారు కానీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వ్యక్తి తమ భూమిలో గత కొన్ని రోజులుగా దున్నతున్నాడని, పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సైతం తమను తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంతవరకు తహసీల్దార్ కార్యాలయంలోనే ఉంటామని లేకుంటే కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. విషయం తెలుసు తహసీల్దార్, పోలీసులు బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
‘నేను స్పెషలాఫీసర్ని.. ఇది నా ఐడీ’
సాక్షి, సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం) : సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి బాలాజీపేటకు చెందిన 40వ వార్డు సచివాలయ కార్యదర్శులను వెంటబెట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా తహసీల్దార్ గదిలోకి వెళ్లి ఆయన సీట్లో కూర్చున్నాడు ‘‘నేను సీఎం కార్యాలయం నుంచి వచ్చిన స్పెషలాఫీసర్ను, ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది’’ ఇది నా ఐడీ అని చూపించాడు. తన పేరు ఉపేంద్ర రోషన్ అని తన సెల్ నంబర్: 6301814060గా చెప్పాడు. తహసీల్దార్ సుస్వాగతం అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజును పిలిచి వివరాలు అడిగాడు. బుధవారం మళ్లీ వస్తానని అప్పటికి అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచాలని చెప్పి వెళ్లిపోయాడు. (టార్గెట్ వైఎస్సార్సీపీ! ) సందేహం కలిగిన డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు ప్రభుత్వ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీయగా అటువంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పారు. దీంతో సాయంత్రం ఆ వ్యక్తికి ఫోన్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత వీలుపడదని చెప్పాడు. అయితే డిప్యూటీ తహసీల్దార్ గట్టిగా చెప్పడంతో రాత్రి ఏడు గంటలకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న టూటౌన్ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతడు రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన వాడని, బీఎడ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని టూటౌన్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగురోజులుగా రాజమహేంద్రవరంలో పలు సచివాలయాలకు వెళ్లి, తాను సీఎం పేషీ నుంచి వచ్చానని అక్కడి సిబ్బందిపై హడావుడి చేస్తూ వస్తున్నాడని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన వారి ఫోన్ నంబర్లన్నీ అతడి ఫోన్లో ఉండడం కొసమెరుపు. నకిలీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు -
ఎమ్మార్వో ఆఫీసులో వ్యక్తి వీరంగం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి అధికారులపై దాడికి యత్నించాడు. అడ్డొచ్చిన వీఆర్ఓ పుల్సింగ్పై దాడి చేశాడు. అంతేకాకుండా కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశాడు. కుర్నాపల్లి శివారులోని సర్వే నంబర్ 127, 128, 129లో ఉన్న భూములను తమ బంధువుల పేరుపై పట్టాలు చేసి పాస్బుక్లు ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. అందుకు అధికారులు కుదరదని చెప్పడంతో.. ఆగ్రహానికి లోనైనా శ్రీనివాస్రావు దాడికి తెగబడ్డాడు. పట్టా చేయాలని కోరుతుంటే అధికారులు ఏడాదిన్నరగా తిప్పుకుంటారని శ్రీనివాస్రావు ఆరోపించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతేడాది అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
లంచం అడిగిన తహసీల్దార్కు ఊహించని షాక్
భోపాల్ : లంచం అడిగిన తహసీల్దార్కు ఓ మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. లంచంగా తన ఇంటిలో ఉన్న గేదెను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాలు..నౌధియా గ్రామానికి చెందిన రాంకలీ పటేల్ అనే మహిళ ..పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తన పేరు మీద మ్యుటేషన్ చేయాలని కోరుతూ తహసీల్దార్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పని కావాలంటే రూ. 10వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయ అధికారులు అడిగారు. దీంతొ సదరు మహిళ అప్పు చేసి మరీ రూ.10వేలు లంచం అప్పజెప్పింది. అయినప్పటికీ ఆమె పని కాలేదు. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ఆరా తీసింది. ఇంకా పని కాలేదని, మ్యుటేషన్ చేయాలంటే మరో రూ.10వేలు లంచంగా ఇవ్వాలన్నారు. లంచం ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో తన గేదెను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చింది. లంచంగా తన గేదెను తీసుకొని తన పేరుపై మ్యుటేషన్ చేయాలని కోరింది. లంచం అడిగిన విషయం అందరికీ తెలియడంతో తహసీల్దార్ అధికారులు ఆందోళన చెంది.. అసలు నిన్ను లంచం ఎవరు అడిగారు అంటూ ఆ మహిళపై కోపగించుకున్నారు. అంతేకాదు నాలుగు రోజుల కిత్రమే మహిళ పేరున మ్యుటేషన్ చేశామని , తమను అల్లరి చేసేందుకే మహిళ కుట్ర పన్ని కార్యాలయానికి గేదెను తెచ్చిందని ఎమ్మార్వో వివరణ ఇచ్చారు. కాగా, మహిళపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని ఎమ్మారో కార్యాలయ అధికారులు తెలిపారు. -
24 రోజుల తర్వాత... అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్..
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య అనంతరం 24 రోజుల తర్వాత గురువారం అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ కార్యాలయం తెరుచుకుంది. ఘటన జరిగిన భవనాన్ని ఖాళీ చేసి..నూతన భవనంలో కార్యాలయం ప్రారంభించారు. ఎమ్మార్వో వెంకట్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయంలోనే ఈ నెల 4వ తేదీన హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేష్ కూడా మృతి చెందాడు. ఈ సంఘటన అనంతరం కార్యాలయం మూతపడింది. నేడు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నూతన కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. చదవండి: మహిళా తహసీల్దార్ సజీవ దహనం తహశీల్దార్ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? -
వేరొకరికి పట్టా చేశారని..
దంతాలపల్లి : తన భూమిని వేరొకరికి పట్టా చేశారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ దివ్యాంగ యువకుడు మంగళవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఐనాల ఉప్పలయ్య 2012లో తండ వెంకటయ్య నుంచి ఎనిమిది ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అయితే, డబ్బు పూర్తి స్థాయిలో చెల్లించకపోగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. కాగా, వెంకటయ్యతో పాటు ఆయన కుమారుడు విష్ణు కూడా వేర్వేరుగా మరణించారు. అనంతరం నెల రోజులకు ఐనాల ఉప్పలయ్య వెళ్లి విష్ణు భార్య సరితను కలసి తనకు అమ్మిన భూమి రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. దీనికి సరిత రశీదులు సరిగా లేవని, అవి ఫోర్జరీవని చెప్పడమే కాకుండా అదనంగా డబ్బు చెల్లించాలని చెబితే ఉప్పలయ్య నిరాకరించాడు. కొన్ని రోజుల అనంతరం ఫోర్జరీ సంతకాలతో ఉప్పలయ్య సాదాబైనామాకు దరఖాస్తు చేసుకుంటే సరిత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు పరిశీలించి సరితకు ఎనిమిది ఎకరాలతో పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేశారు. ఈ క్రమంలో ఐనాల ఉప్పలయ్య మరణించగా ఆయన కుమారుడు, దివ్యాంగుడైన ఐనాల ఓంశంకర్.. భూమి మీదకు వెళ్తే సరిత కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంది. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. తాజాగా సరిత తన భూమిని వేరొకరికి విక్రయించడంతో ఓంశంకర్ తన భూమిని అధికారులు వేరొకరికి పట్టా చేశారని ఆరోపిస్తూ మంగళవారం తహసీల్దార్ గౌరీశంకర్తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై బానోతు వెంకన్న.. ఓంశంకర్ను వారించారు. ఈ విషయమై దంతాలపల్లి తహసీల్దార్ గౌరీశంకర్ మాట్లాడుతూ కోర్టు కేసులో ఉండటంతో భూ సమస్యను తాము పరిష్కరించలేమని చెప్పామని పేర్కొన్నారు. -
వీఆర్వో అనుమతిస్తేనే తహసీల్దార్ దర్శనం
సాక్షి, కరీంనగర్ : అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాలకు పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టారు. కలెక్టరేట్ కాంప్లెక్స్లో ఉన్న కరీంనగర్రూరల్, అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలకు సోమవారం వివిధ సమస్యలపై బాధితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయా కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మానిటర్లో తహసీల్దార్లు కార్యాలయాల్లోకి వచ్చే వారిని, లోపల ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయాల లోపలికి వెళ్లేముందు దరఖాస్తుదారులను అటెండర్లు పూర్తి వివరాలు అడిగి లోపలికి పంపిస్తున్నారు. వీఆర్వోల అనుమతి లేకుండా నేరుగా తహసీల్దార్లను కలువకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. ఒకవైపు ప్రజావాణిలో భూసమస్యలపై జేసీ శ్యాంప్రసాద్లాల్కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ కొందరు బాధితులు మళ్లీ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను కలిసేందుకు వచ్చారు. అయితే ముందుగా సంబంధిత గ్రామాల వీఆర్వోలు బాధితుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. మరికొందరు బా«ధితులను వీఆర్వోలు స్వయంగా తహసీల్దార్ సుధాకర్ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించారు. దరఖాస్తు ఎవరి వద్ద ఉంది, సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను తహసీల్దార్ సుధాకర్ వీఆర్వోకు సూచించారు. అదేవిధంగా అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ముందుగా అటెండర్ దరఖాస్తుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని లోపలికి పంపిస్తున్నారు. సంబంధిత అధికారి దరఖాస్తుదారుల సమస్యను పరిశీలించి అవసరమైతే తహసీల్దార్ దగ్గరకు స్వయంగా తీసుకెళ్తున్నారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరా -
తహసీల్దారు.. పైరవీ జోరు !
సాక్షి, నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం తహసీల్దార్ల బదిలీలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారిని సొంత జిల్లాలకు బదిలీ చేసింది. జిల్లాకు చెందిన తహసీల్దార్లు కూడా మళ్లీ సొంత జిల్లాకు రానున్నారు. జిల్లా కలెక్టర్లు సోమవారం తహసీల్దార్లకు మండలాల వారీగా పోస్టింగులు ఇవ్వాల్సిందిగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, భూపరిపాలన శాఖ చీఫ్ కమిషన్ సోమేశ్కుమార్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో ఎవరికి ఏ మండలం ఇస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే కనుక ఏ మండలం ఎలా ఉంటుంది.. ఎక్కడ చేస్తే బాగుంటుందన్న విషయాలపై అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు పలువురు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మళ్లీ పాత జిల్లాకు.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు మూడునెలల ముందు తహసీల్దార్ల బదిలీలను చేపట్టారు. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని ఇతర జిల్లా లకు బదిలీ చేశారు. ఈక్రమంలో జిల్లాకు చెంది న తహసీల్దార్లలోనర్సయ్య, కలీం, నారాయణ, సుభాష్చందర్, తుకారాంను జగిత్యాల జిల్లాకు పంపించారు. జి.లక్ష్మి, నరేందర్, సంతోష్రెడ్డి, శంకర్, రాజ్మోహన్, కిరణ్మయి,పి.నర్సయ్యను మంచిర్యాల జిల్లాకు బదిలీ చేశారు. శ్యాంసుందర్ను కరీంనగర్, లోకేశ్వర్రావును ఆదిలాబాద్, జి.శ్రీకాంత్ను పెద్దపల్లి, పి.వెంకటరమణను వరంగల్ అర్బన్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రస్తుత ఆదేశాలతో వారు మళ్లీ నిర్మల్ జిల్లాకు రానున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో తహసీల్దార్లు మన జిల్లాకు వచ్చారు. ఇందులో అతిఖుద్దీన్, ప్రభాకర్, మహేంద్రనాథ్, మోతీరాం, పవన్చంద్ర, శివరాజ్, శ్రీదేవి, సంధ్యారాణి, మోహన్సింగ్, చంద్రశేఖర్ ఉన్నారు. అలాగే సత్యనారాయణ, రాజేశ్, రాజేందర్ జగిత్యాల జిల్లా నుంచి రాగా, సుధాకర్, అనుపమరావు, వెంకటలక్ష్మి, ఉమాశంకర్ పెద్దపల్లి జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. బదిలీ కోసం ఎదురుచూసి.. ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా.. తమను సొంత జిల్లాలకు బదిలీ చేయడం లేదన్న ఆందోళన చాలామంది తహసీల్దార్లలో కనిపించింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు కూడా రానుండటంతో ఇక ఆ ఎన్నికలు కూడా పూర్తయ్యే వరకు ఉండాల్సి వస్తుందేమోనని భావించారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు ఎన్నికలకు అనుకూలంగా కనిపించకపోవడం, తాజాగా రెవెన్యూ అధికారులపై జరిగిన దాడులు, శాఖ చేసిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలను చేపట్టినట్లు చెబుతున్నారు. అబ్ధుల్పూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం తర్వాత రెవెన్యూ అధికారులు చేసిన ఆందోళన రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. పనులన్నీ పక్కనపెట్టి వారు చేసిన నిరసన చివరకు బదిలీలకు మార్గం సుగమం చేసినట్లు భావిస్తున్నారు. అనుకూలమైన చోటు కోసం.. జిల్లాకు బదిలీ అయిన తర్వాత ఇక్కడ ఏ మండలానికి వెళ్తారో.. అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లాలోని పలు మండలాలపై రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతుంటారు. ప్రధానంగా నిర్మల్ అర్బన్, నిర్మల్రూరల్, ఖానాపూర్, భైంసా తదితర మండలాలను ఎక్కువమంది కోరుకుంటారన్నది రెవెన్యూ వర్గాలు చెబుతున్న మాట. ఆదాయ వనరులతో పాటు అనుకూలమైన వాతావరణం ఉన్న మండలాన్ని చాలామంది తహసీల్దార్లు ఆశిస్తున్నారు. ఈనేపథ్యం లో జిల్లాలోని పలు స్థానాలకు పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు తహసీల్దార్లు అనుకూలమైన మండలం కోసం భారీ ఎత్తున పైరవీలు సైతం మొదలుపెట్టినట్లు సమాచారం. కొంతమంది ఇప్పటికే హైదరాబాద్ వెళ్లి ‘పెద్ద’లను కలిసినట్లు వినిపిస్తోంది. ప్రధాన పోస్టు కావడంతో.. జిల్లాకు కలెక్టర్ ఎలాగో.. మండలానికి తహసీల్దార్ అదే స్థాయి అధికారి. ఒక్క రెవెన్యూ మాత్రమే కాకుండా చాలా పనుల్లో, విషయాల్లో మండలానికి తహసీల్దారే బాధ్యుడు. మండలస్థాయిలో ప్రాధాన్యతతో పాటు దానికి తగ్గట్లు ప్రయోజనాలు ఉండటంతో ఆ పోస్టుకు డిమాండ్ పెరిగింది. అందులోనూ అనుకూలమైన చోటు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పని చేసుకోవడంతో పాటు సంబంధిత ప్రయోజనాలనూ పొందే అవకాశాలు ఉంటాయి. ఈనేపథ్యంలోనే జిల్లాలో తమకు ప్రయోజనకరంగా ఉండే చోటు కోసం పెద్దఎత్తున్న ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
వక్ఫ్బోర్డు భూముల ఆక్రమణపై కఠిన చర్యలు
సాక్షి, గజ్వేల్(సిద్ధిపేట) : వక్ఫ్బోర్డు భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఓఎస్డీ మహ్మద్ ఖాసీమ్ హెచ్చరించారు. ఈనెల 12న జిల్లాలో సాగుతున్న వక్ఫ్భూముల దందాపై ‘అన్యాక్రాంతం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన శుక్రవారం గజ్వేల్లో పర్యటించి వక్ఫ్భూముల ఆక్రమణపై విచారణ చేపట్టారు. ముందుగా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన ఆయన ఆ తర్వాత వక్ఫ్భూములను పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు, వివాదాలపై ఆరా తీశారు. నిబంధనలు విరుద్ధంగా వక్ఫ్భూములను ఆక్రమిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఇంకా ఆయన వెంట ఉమ్మడి మెదక్ జిల్లా వక్ఫ్బోర్డు ఇ¯Œ ్సస్పెక్టర్ ఖాదర్, సర్వేయర్లు సుజన్, నాగరాజు తదితరులు ఉన్నారు. -
ఇక తహసీల్దార్లకు భద్రత
సాక్షి, ఆదిలాబాద్ : మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రస్థా యి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండడంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. అయితే జిల్లాలో జనాలు ఎక్కువగా వెళ్లే మం డల కార్యాలయాలపై ఇది వరకే ఓ కన్నేసి ఉంచి న పోలీసు యంత్రాంగం ఇక నుంచి ఆ నిఘాను పటిష్టం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద పోలీస్ బుక్ పాయింట్ను ఏర్పాటు చేసి భద్రత పటిష్టం చేయనున్నారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రత భావం నెలకొన్న విషయం తెలిసిందే. విజయారెడ్డి మృతికి సంతాపంగా వారంరోజుల పాటు నిరసనలు చేపట్టిన ఉద్యోగులు బుధవారం నుంచి విధుల్లో చేరారు. అయితే స్ట్రైక్ నుంచి విధుల్లో చేరిన మొదటిరోజు నుంచే భద్రత చర్యలు ప్రారంభం కావడం మంచి పరిణామం. కార్యాలయాల వద్ద బుక్ పాయింట్ జిల్లాలో 17 గ్రామీణ మండలాలు, ఒక అర్బన్ మండలం ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్ మండల రెవెన్యూ కార్యాలయం కలెక్టరేట్ భవనంలో ఉంది. అయితే కలెక్టరేట్ ముందు, లోపల, వెనకాల, ఎప్పుడూ పోలీసుల నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. జనాలు కూడా అధిక సంఖ్యలో కలెక్టరేట్కు వస్తుంటారు. 17 గ్రామీణ మండలాల్లోనూ రెవెన్యూ కార్యాలయాలు, అంతే మోతాదులో పోలీసు స్టేషన్లు ఉన్నాయి. రెవెన్యూ ఆఫీసుల్లో జరుగుతున్న సంఘటనలపై ఆ మండల పోలీస్స్టేషన్, దాని పరిధిలో పని చేసే పోలీసు అధికారులు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. మండల కార్యాలయాల్లో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే అక్కడున్న పోలీస్స్టేషన్కు సమాచారం అందించే సౌకర్యం ఉంది. సమాచారం అందుకున్న సదరు పోలీస్స్టేషన్ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పరిష్కరిస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, సభలు జరిగినప్పుడు తప్పా.. ప్రతివారం రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు, ఆఫీసు పర్యవేక్షణ బృందాలు, స్పెషల్ టీంల పరిశీలన అంటూ ఏమీలేవని చెప్పవచ్చు. కానీ ఇప్పుడలా కాకుండా మండల రెవెన్యూ ఆఫీసుల వద్ద పోలీస్ బుక్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు ప్రతి సోమవారం ఐదారుసార్లు రెవెన్యూ కార్యాలయాలను పరిశీలన చేసి బుక్పాయింట్లో సంతకం పెడతారు. దీంతో ఈ మండలాన్ని ఎవరెవరూ ఎప్పుడెప్పుడు పరిశీలన చేశారన్న విషయం ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు మండలాలను విజిట్ చేసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఫలితంగా ఆఫీసులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పోలీసు శాఖ భావిస్తోంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు మండలాలు, గ్రామాలను రాత్రి, పగలు జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. జనాలు ఎక్కువగా వెళ్లే ఆఫీసులపై... ఒక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సూపరింటెండెంట్, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆ మండల పరిధిలోని వివిధ రెవెన్యూ గ్రామాలకు చెందిన వీఆర్వోలు, టైపిస్టు, అటెండర్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. అయితే వివిధ పనుల నిమిత్తం రైతులు, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, సంస్థల ప్రతినిధులు, తదితరులు అనునిత్యం మండలాఫీసులకు వస్తుంటారు. అయితే ఏ మండల కార్యాలయానికి జనాలు ఎక్కువగా వెళ్తున్నారో ఆ మండలాఫీసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సదరు మండలంలో బుక్ పాయింట్ నిర్వహించడంతో పాటు ఆ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారులు కూడా నిఘా ఉంచనున్నారు. ఎదైనా సంఘటన జరిగితే తక్షణమే స్పందించి సమస్యను అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటారు. రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, మండలాఫీసుల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలని రెవెన్యూ ఉద్యోగులు నిరసనలో భాగంగా సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిఘా మరింత పెంచుతాం జనాలు ఎక్కువగా వెళ్లే రెవెన్యూ కార్యాలయాలపై నిఘా మరింత పెంచుతాం. బుక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపడుతాం. బ్లూ కోట్స్, పెట్రోలింగ్లో పాల్గొనేవారు రెవెన్యూ కార్యాలయాలను పరిశీలిస్తారు. కలెక్టరేట్తో పాటు మండలాల్లోని కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ చోట్ల భద్రత ఇప్పటికే ఉంది. దీనిని మరింత పటిష్టం చేస్తాం. – విష్ణు ఎస్ వారియర్, ఎస్పీ, ఆదిలాబాద్ భద్రత మంచిదే మండల కేంద్రాల్లో రెవెన్యూ ఉద్యోగులకు భద్రత ఏర్పాటు చేయడం మంచిదే. బుధవారం పోలీసు సిబ్బంది మా కార్యాలయానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా నిఘా ఉంచడం సంతోషమే. రెవెన్యూ ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ముందుకు వస్తారు. – సి.రాజమనోహర్రెడ్డి, తహసీల్దార్, ఆదిలాబాద్ రూరల్ రెవెన్యూ కార్యాలయాలపై నిఘా ఇలా.. ► ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్లో పోలీసుల నిఘా. ► పరిశీలన చేసిన పోలీసు అధికారులు సంతకం చేసేలా బుక్ పాయింట్ ఏర్పాటు. ► పిటిషనర్లు రెవెన్యూ అధికారులకు అసౌకర్యం, ఇబ్బంది కల్గించకుండా చూస్తారు. ► అనుమానం ఉన్న సదరు పిటిషనర్ను లోనికి వెళ్లనివ్వరు. ► తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రతివ్యక్తిపై నిఘా -
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో రూ.90 లక్షల నిధులతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ వీరపాండియన్లు ముఖ్య అతిధిలుగా హజరయ్యారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి..వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.3,900 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించామన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వచ్చే నెల 15న వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు రూ. 15 వేలు ప్రభుత్వం చెల్లించనుందన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వబోతున్నామని, అలాగే రైతుల పంటలకు ఇన్సూరెన్స్కు సంబంధించి రూ.1,100 కోట్లు ప్రభుత్వమే చెల్లించనుందన్నారు. కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఈ çసంవత్సరం చివరికంతా రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని తెలిపారు. చరిత్రాత్మకం.. ప్రభుత్వం ఏర్పడిన నెలల వ్యవధిలోనే 1.20 లక్షలసచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయటం చరిత్రాత్మకమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. వచ్చే నెల 2 నుంచి గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ప్రజల దగ్గరకే పాలన వస్తోందన్నారు. బీసీ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. దాహార్తి తీర్చాలి.. ఎమ్మిగనూరు పట్ణణ ప్రజల దాహార్తి తీర్చాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కోరారు. గాజులదిన్నె ప్రాజెక్ట్ ద్వారా పైపులైన్ ద్వారా పట్టణ వాసులకు తాగునీటిని తీర్చేందుకు రూ. 100 కోట్లను మంజూరు చేయించాలని మంత్రులకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్లకు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు జగన్మోహన్రెడ్డి, బీఆర్ బసిరెడ్డి, వై.రుద్రగౌడ్, బుట్టారంగయ్య, రియాజ్, గోనెగండ్ల మాజీ ఎంపీపీ నసుద్దీన్, మాజీ సర్పంచ్ నాగేష్నాయుడు, నందవరం సంపత్కుమార్గౌడ్, ఆర్డీవో బాలగణేషయ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హైకోర్టు విషయంలో సీమకు మంచే జరుగుతుంది ఎమ్మిగనూరుటౌన్: పరిపాలన పరంగా వికేంద్రీకరణ జరుగుతోందని, హైకోర్టు విషయంలో సీమ వాసులకు మంచే జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆదివారం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో మంత్రి బుగ్గన మాట్లాడారు.ౖ హెకోర్టు ఏర్పాటు విషయంలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం సమీక్షిస్తుందన్నారు. -
'ఆసరా' పెన్షన్ పథకంలో భారీ గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చార్మినార్ తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా ఆసరా పెన్షన్ల పథకంలో భారీ గోల్మాల్ జరిగింది. ఆ కార్యాలయ ఉద్యోగుల ప్రమేయంపై ఆధారాలు లభించకపోయినా వారి నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నలుగురితో కూడిన ముఠా 8 నెలల్లో 255 మంది పేర్లతో రూ.25 లక్షల వరకు స్వాహా చేసింది. దీనిపై హైదరాబాద్ ఆర్డీఓ డి.శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక నిందితుడు 2017లో వెలుగులోకి వచ్చిన ఇదే తరహా ఆసరా స్కామ్లోనూ అరెస్టు అయినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. సూత్రధారి ఇమ్రాన్ఖాన్ ప్రతీకాత్మక చిత్రం; పోలీసుల అదుపులో నిందితులు ఆసరా పథకం కింద పెన్షన్ కోరుకునే అర్హులు దరఖాస్తు, ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి పూర్వాపరాలు పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా అర్హుల దరఖాస్తును తహసీల్దార్ అప్రూవ్ చేస్తారు. ఈ తంతు ముగిసిన తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో ఉండే డేటా ఎంట్రీ ఉద్యోగులు దరఖాస్తుదారుడి వివరాలను తమ సంస్థాగత ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. దీనికోసం ప్రతి తహసీల్దార్కు ఓ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటాయి. ఇలా అప్లోడ్ చేసిన వివరాలు కలెక్టరేట్ ద్వారా ‘సెర్ఫ్’ కార్యాలయానికి చేరతాయి. దీంతో అక్కడి అధికారులు లబ్ధిదారుడి ఖాతాలో నెలనెలా పెన్షన్ జమ చేస్తుంటారు. ఈ పెన్షన్ను కియోస్క్ యంత్రంలో వేలిముద్రలు వేయడం ద్వారా లబ్ధిదారులు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తతంగం మొత్తం తెలిసిన మహ్మద్ ఇమ్రాన్ఖాన్ అనే వ్యక్తి ఈ స్కామ్కు సూత్రధారిగా మారాడు. ఆరేడేళ్లుగా బండ్లగూడ, చార్మినార్ తహసీల్దార్ కార్యాలయాల కేంద్రంగా ఇతగాడు దళారీగా పని చేస్తున్నాడు. దీంతో ఇతడికి ఆయా కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగులతో పరిచయాలు ఏర్పడ్డాయి. చార్మినార్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇమ్రాన్ ఎమ్మార్వో వినియోగించే యూజర్ ఐడీ, పాస్వర్డ్ సంగ్రహించాడు. వీటిని తన స్నేహితుడు, నల్లగొండలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న మహ్మద్ అస్లంతో పాటు సయ్యద్ సొహైలుద్దీన్లకు అందించాడు. వీరి ద్వారా ఈ రహస్య వివరాలు నగరానికి చెందిన మహ్మద్ మోసిన్కు చేరాయి. కియోస్క్ యంత్రాలు నిర్వహిస్తూ లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం ఇతడి వృత్తి. ఈ నలుగురూ ఇలా సంగ్రహించిన వివరాలతో ఆసరా పెన్షన్లు స్వాహా చేయడానికి దాదాపు ఎనిమిది నెలల క్రితం పథకం వేశారు. ఖాతా నంబర్లు మార్చి.. బండ్లగూడ, చార్మినార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాలకు చెందిన 255 మందితో కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఈ బ్యాంకు ఖాతాల నంబర్లను అప్పటికే పెన్షన్ పొందుతున్న ఆసరా లబ్ధిదారుల వాటికి బదులుగా రీప్లేస్ చేశారు. కొన్ని పేర్లను వీరే లబ్ధిదారులుగా చేర్చారు. చార్మినార్ ఎమ్మార్వో యూజర్ ఐడీ, పాస్వర్డ్ తెలిసి ఉండడంతో వాటి ఆధారంగా కొత్త లబ్ధిదారులు, బ్యాంకు ఖాతా నంబర్ల అప్రూవల్ పొందారు. అనివార్య కారణాల నేపథ్యంలో కొందరు వృద్ధులు తమ బంధువులు, సంబంధీకుల బ్యాంకు ఖాతాలను ఆసరా పెన్షన్ కోసం ఇస్తూ/మారుస్తూ ఉంటారు. ఆ నెపంతో వీరంతా అప్రూవల్ పొందారు. దీంతో అప్పటి నుంచి ఆయా లబ్ధిదారులకు చేరాల్సిన పెన్షన్ డబ్బు వీరి పొందుపరిచిన కొత్త ఖాతాల్లోకి వస్తోంది. ఆ డబ్బును ఖాతాదారుల సాయంతో వీళ్లు స్వాహా చేస్తున్నారు. ఇలా మొత్తం రూ.25 లక్షల వరకు ఈ గ్యాంగ్ కాజేసింది. ఇలా గుర్తింపు... ఇటీవల కొందరు వృద్ధులు తమకు ఆసరా పెన్షన్లు అందట్లేదని, ఆ డబ్బు తమ ఖాతాల్లో పడడం ఆగిపోయిందని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణ చేపట్టిన ఆయన స్కామ్ జరిగినట్లు గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై మదన్ సహకారంతో సాంకేతిక దర్యాప్తు చేసి స్కామ్ మూలాలు కనిపెట్టారు. దీంతో మంగళవారం అస్లంతో పాటు సొహైల్, మోసిన్, ఇమ్రాన్లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో వీరికి ఓ మహిళ సైతం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క చార్మినార్ ఎమ్మార్వో యూజర్ ఐడీ, పాస్వర్డ్ బయటకు రావడం వెనుక ఇంటి దొంగల పాత్ర ఉందా? నిర్లక్ష్యమే కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. దీనికోసం నిందితుల్ని న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అస్లం గతంలో బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేశాడు. 2017లో మరికొందరితో ముఠా కట్టి ఆసరా పెన్షన్లనే కాజేశాడు. దాదాపు రూ.40 లక్షలు కాజేసిన ఆ స్కామ్లోనూ ఇతగాడు అరెస్టు అయ్యాడు. -
పాస్ పుస్తకం ఇవ్వడం లేదని టవర్ ఎక్కిన వ్యక్తి
సాక్షి, మెదక్ : తన భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్ ఇవ్వడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లంబాడి కిషన్ అనే వ్యక్తిని సంవత్సర కాలం నుచి ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఎమ్మార్వో భిక్షపతి కనీనం కనికరం లేకుండా దురుసుగా మాట్లాడారని, తన పాస్ పుస్తకం రాబట్టుకోడానికి వేరే మార్గం కనిపించకనే టవర్ ఎక్కినట్లు బాధితుడు కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఎమ్మార్వో పాస్ పుస్తకం ఇస్తానని హామీ ఇచ్చినా, కిషన్ మాత్రం విద్యుత్ టవర్ దిగడం లేదు. -
ప్రతి పనికీ మనీ మనీ..!
కేశంపేట : రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య బాధితులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. తహసీల్దార్ లావణ్యకు ఎంత సమర్పించుకున్నారో చెప్పారు. ప్రతి పనికీ రేటును ఫిక్స్ చేసి వసూలు చేశారని పలువురు రైతులు ఆరోపించారు. రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలంటే తహసీల్దార్కుగానీ, తన ఏజెంట్లకుగానీ డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని, మీడియాకు తెలిపితే తమ సమస్యలను మరింత జటిలం చేస్తుందనే తాము ఎవరికీ చెప్పలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంపై దాడి.. కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రైతులు బయటే గుమిగూడారు. అదే సమయంలో వచ్చిన సర్వేయర్ నాగేశ్ కాళ్ళు మొక్కి తమకు ఇవ్వాల్సిన రిపోర్టులను అందజేయాలని రైతులు కోరారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రైతులు సర్వేయర్ను నిలదీశారు. టేబుల్, కుర్చీలను ఎత్తి పడేశారు. సకాలంలో పోలీసులు స్పందించి రైతులను సముదాయించి బయటకు పంపించారు. కలెక్టర్ రావాలి... గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని భూరికార్డులను మాయం చేసిన లీలలు తెలవాలంటే కలెక్టర్ కేశంపేటకు రావాలని రైతులు డిమాండ్ చేశారు. మండలంలో జరిగిన అవినీతిపై కలెక్టర్ విచారణ జరిపించాలన్నారు. సర్వేయర్ కాళ్లు మొక్కుతున్న బాధితురాలు మళ్లీ ఏసీబీ తనిఖీలు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మళ్లీ తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ లావణ్య, వీఆర్వో అనంతయ్య రైతు వద్ద నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో వారిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మరోమారు తనిఖీలు నిర్వహించారు. రూ. 50 వేలు ఇస్తేనే కాస్తు.. కేశంపేట శివారులోని సర్వే నంబర్ 223లో రెండు ఎకరాల భూమిని 1991లో సాదాబైనామాగా తలకొండపల్లి మండలంలోని రామకృష్ణపురం గ్రామానికి చెందిన శేరిల వెకటయ్య వద్ద కొనుగోలు చేశామని భారతమ్మ అనే మహిళా రైతు తెలిపారు. అప్పటి నుంచి కబ్జాలో ఉన్నామని, దానికి కాస్తు రాయాలని వీఆర్వో అనంతయ్యను కోరగా రూ.50 వేలు డిమాండ్ చేశారని చెప్పారు. తప్పనిపరిస్థితుల్లో డబ్బులిచ్చి కాస్తు రాయించుకున్నామన్నారు. గత సంవత్సరం మళ్లీ కాస్తు రాయాలని కోరగా లక్ష రూపాయలు ఇవ్వాలని వీఆర్వో కోరారని, తహసీల్దార్ను సంప్రదిస్తే అనంతయ్య చెప్పినట్టు లక్ష రూపాయలు ఇసైనే కాస్తు రాస్తామన్నారని భారతమ్మ ఆరోపించారు. తాము డబ్బులు ఇవ్వకపోవడంతో శేరిల వెంకటయ్య పేరును అన్లైన్లో చేర్చారని తెలిపారు. దీంతో అతను ఆ భూమిని విక్రయించాడని, తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. -
బోర్డులో నీతి.. లోపలంతా అవినీతి
సాక్షి హైదరాబాద్/షాద్నగర్ టౌన్: కార్యాలయాలబయట అవినీతి రహిత సేవలు అంటూ పెద్ద అక్షరాలతో ప్రకటనలు.. లోపలకు అడుగుపెడితే చాలు గుప్పుమంటున్న అవినీతి వాసనలు. ఇది అవినీతికి కేరాఫ్ అడ్రస్లుగా మారిన రెవెన్యూ కార్యాలయాల పరిస్థితి. ఇందులో దొరికిన వారే దొంగలు.. కానీ దొరకని వారు చాలా మందే దర్జాగా దండుకుంటున్నారు. రెవెన్యూశాఖలో ఇలాంటి తిమింగళాలు ఎందరో ఉన్నారు. వీరిద్వారా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకున్నందుకే.. రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసేందుకు సీఎం కేసీఆర్ నడుంబిగించారు. కాగా.. ఉత్తమ తహసీల్దార్గా అవార్డు పొంది.. అక్రమ సంపాదనలో రికార్డు సృష్టించిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య తీరు పై విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మనమందరం కలిసి పంచుకుందాం అనే నినాదంతో కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని వెల్లడైంది. 2016 నవంబర్ 21న కేశంపేట తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత లావణ్య మండలంలో పట్టుబిగించారు. ఈప్రాంతం లో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కన్నేశారు. తన పేరు బయట పడకుండా మధ్యవర్తులను తెరపైకి తీసుకొచ్చి భూవివాదాలు సెటిల్మెంట్లు చేసేవారని తెలుస్తోంది. ఫైలు కదలాలంటే ఆమ్యామ్యా తప్పదు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రతి రైతు వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదంటే ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని.. భూ రికార్డుల మార్పిడి, ఆన్లైన్లో నమోదు వర కు ప్రతి పనికీ వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం బయట ‘ఈ కార్యాలయం అవినీతి రహిత కార్యాల యం’అంటూ పెద్ద అక్షరాలతో బ్యానర్ను ఏర్పాటు చేశారు. వీఆర్ఏ, వీఆర్ఓ, సిబ్బంది ఎవరైనా డబ్బులు అడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయా లని లావణ్య ఇటీవల కార్యాలయం ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. కానీ, ఆ బోర్డులను ఏర్పాటు చేయించిన తహసీల్దారే భారీ అవినీతి తిమింగళమని తెలియడంతో రైతులు, ప్రజలు అవాక్కయ్యారు. చంచల్గూడ జైలుకు లావణ్య, వీఆర్వో బుధవారం రూ.93 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని గురువారం ఉదయం 6 గంటల వరకు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఉంచి విచారించారు. కార్యాలయం లోని ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెండిం గ్ ఫైళ్ళ గురించి ఆరా తీసి.. ఎందుకు పెండింగ్లో ఉంచారని లావణ్యను ప్రశ్నించినట్లు తెలిసింది. కార్యాలయంలోని రికార్డు గదిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. గురువారం ఉదయం 6గంటల ప్రాం తంలో ఆమెను, వీఆర్వోను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి మరోసారి విచారణ చేపట్టారు. ఇద్దరికీ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని బంజారాహిల్స్లోని ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఇం ట్లో హాజరుపర్చారు. 14రోజులపాటు రిమాండ్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో వీద్దరినీ చంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఉద్యోగంలో చేరినప్పటినుంచీ ఇదే తంతు ఈమె గతంలో పనిచేసిన చోట్ల కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కౌడిపల్లి, దౌల్తా బాద్, ములు గు, కొండాపూర్ మండలాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన లావణ్య అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారులు, స్థానిక రాజకీయ నాయకుల అండతో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారని వెల్లడైంది. ములుగు మండలంలో ఆమె పనిచేస్తున్న సమయంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలను అడ్డాగా చేసుకుని దందా కొనసాగించేవారని తెలుస్తోంది. కొండాపూర్ నుంచి బదిలీ అయిన రోజు కూడా కార్యాలయానికి వచ్చి పాత ఫైళ్లన్నింటినీ క్లియర్ చేసి అందినకాడికి దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులెన్నో.. ఏసీబీలో ఓ ముఖ్యమైన అధికారి తన సన్నిహితుడి పనికోసం లావణ్యను సంప్రదిస్తే.. దాన్ని పరిష్కరించేందుకు ఆమె ఏకంగా 2నెలలు తిప్పినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖకే చెందిన మరో అధికారి చేత సిఫారసు చేయిస్తే గానీ ఆ పని పూర్తి కాకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఓ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో ఆమెకు రూ.40లక్షలు ముట్టాయని..ఏసీ బీ దాడుల్లో పట్టుబడింది కూడా ఆ నగదేనంటూ ప్రచారం జరుగుతోంది. లావణ్య వంటి అవినీతి తిమింగళాలు రెవెన్యూశాఖలో ఎందరో ఉన్నారు. అడపాదడపా వీరు పట్టుబడుతున్నా.. చర్యలు తీసు కోవడంలో ఉన్నతాధికారుల ఉదాసీనత కూడా అవి నీతి పెరిగేందుకు ఊతమిస్తోందనే విమర్శలున్నా యి. అరెస్టు చూపిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలు, అధికారులు, సచివాలయంలోని పేషీలు శ్రద్ధ చూపకపోవడంతోనే.. రెవెన్యూ శాఖ అవినీతి ఊబిగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి. అందుకే కేసీఆర్ ఈ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు నడుంబిగించారు. ఫోరం ఫర్ గుడ్గవర్నెన్స్ ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్న మచ్చుకు కొన్ని కేసులివి: హైదరాబాద్ కలెక్టరేట్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న సత్యనారాయణ 2010, ఫిబ్రవరిలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో చిక్కారు. ఈ కేసు సమగ్రంగా విచారణ జరిపి అదే ఏడాది అక్టోబర్లో ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ ద్వారా ప్రాసిక్యూషన్కు సిఫారసు చేస్తూ ఏసీబీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి ప్రాసిక్యూషన్కు నాలుగేళ్ల పాటు అనుమతి ఇవ్వకపోగా, కేసును విరమించుకోవడం గమనార్హం. అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మోహన్రావు 2010లో చేతివాటం ప్రదర్శిస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయనపై విచారణ జరిపి ప్రాసిక్యూషన్కు అనుమతినివ్వాలని ఏసీబీ కోరినా ఎలాంటి పురోగతి లేదు. పైగా కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పెండింగ్లో ఉన్నట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉండడం గమనార్హం. డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్ 2011లో అవినీతి సొమ్ముతో ఏసీబీకి చిక్కారు. ఆ సమయంలో ఆయన ఇంటిలో సోదాలు చేయగా, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో రాములు నాయక్ ప్రాసిక్యూషన్కు ఏసీబీ కోరింది. కానీ, కేసును మూడేళ్లు పెండింగ్లో ఉంచిన ప్రభుత్వం చివరకు శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకుంది. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్రిజిస్ట్రార్ సహదేవ్ 2011లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేసును సమగ్రంగా విచారణ జరిపిన ఏసీబీ 2012లో ఆయన్ను కూడా ప్రాసిక్యూషన్కు అనుమతించాలని కోరగా, ప్రభుత్వం మాత్రం రెండేళ్ల తర్వాత శాఖాపరమైన విచారణకే పరిమితమైంది. ఆ విచారణ ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. గత ఐదేళ్లలో 50 వరకు ఇలాంటి అవినీతి కేసులను ప్రభుత్వం మూసివేసింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద గుమిగూడిన రైతులు, ప్రజలు లంచాలు తిరిగి ఇచ్చేస్తున్నారంటూ పుకార్లతో.. లావణ్యకు లంచాల రూపంలో ఇచ్చిన నగదును ఏసీబీ వారు తిరిగి ఇచేస్తున్నారంటూ మొదలైన పుకార్లు క్షణాల్లో పాకిపోవడంతో.. కేశంపేట ఎమ్మెఆర్వో కార్యాలయానికి బాధిత ప్రజలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అయితే.. కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవడం, నగదు గురించి ఎవర్ని అడగాలో తెలియకపోవడంతో ఇవన్నీ పుకార్లేనని అర్థం చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. -
అంతా మా ఇష్టం!
సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): కొంతమంది ఉద్యోగుల చేతివాటం రైతులకు శాపంగా మారింది. డబ్బులిచ్చిన వారికే పనిచేయడం, మిగిలిన వారికి వివిధ కారణాలు చెప్పి రోజుల తరబడి తిప్పించడం వజ్రపుకొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో పరిపాటిగా మారింది. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో భూ యాజమాన్య రికార్డులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కొంతమంది కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ఒక సర్వే నెంబర్లను..మరొకరికి కేటాయించి నిజమైన రైతులకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ పంట రుణాలు కోసం రైతులు బ్యాంకులకు అడంగల్, 1బీ ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంది. సాఫ్ట్వేర్లో లోపాలను ఆసరాగా చేసుకుని అడంగల్ మంజూరులో సాంకేతిక సమస్యలు సృష్టించి కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కొందరు వీఆర్ఓల కనుసన్నల్లో అడంగల్ వసూళ్ల వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఏసీబీ దాడులు జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. సర్వేయర్ ఇచ్చిన రిపోర్టును సైతం ఖాతరు చేయడం లేదు. తహసీల్దార్ డిజిటల్ సైన్ మిస్మ్యాచ్గా చూపి కార్యాలయం చుట్టూ రైతులతో ప్రదక్షిణలు చేయించి జేబులు నింపుకుంటున్నారు. ఎక్కడా లేనివిధంగా వజ్రపుకొత్తూరు మండలంలోనే ఇలా జరుగుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడంగల్, 1బీ కావాలంటే సర్వే నెంబరుకి రూ.500 వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏటా ఇదే పరిస్థితి.. వజ్రపుకొత్తూరు తహశీల్దార్ కార్యాలయంలో సర్వే నెంబర్ల ట్యాంపరింగ్ యథేచ్ఛగా సాగుతోంది. మ్యూటేషన్లను పరిశీలించకుండానే అవి పరిష్కరిస్తుండటంతో అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. రైతుకు గత ఏడాది మంజూరైన అడంగల్, 1బీ ఈ ఏడాది మంజూరు కాని పరిస్థితి నెలకొం ది. అంటే ఒకరి సర్వే నెంబర్లను మరొకరి పేరిటి అధికారులు, వీఆర్ఓలు కలిసి ఇష్టారాజ్యంగా ట్యాంపరింగ్కు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా చేస్తేనే రైతులుకార్యాలయా నికి వచ్చి ఎంతో కొంత ముట్టజెప్పక తప్పరనే భావనతో ఏటా రుణాలు ఇచ్చే సీజన్లో ట్యాంపరింగ్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. లుగేళ్లు కిందట ఓ వీఆర్ఓ.. రైతు తనకు అడిగినంత ఇవ్వలేదనే కారణంతో ఏకంగా అతని పట్టాదార్ పాస్ పుస్తకంలో సర్వే నెంబర్లను రెడ్ ఇంక్తో రౌండ్ చేసేశారు. మరో వీఆర్ఓ అడంగల్, 1బీను కరెక్షన్ చేయాలని కోరి తే సీతాపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ నుంచి రూ.5వేలు వసూలు చేసి చివరకు ఆ పని చేయకుండా తిప్పి పంపించేశారు. మరో వీఆర్ఓ ఏకంగా బీసీకి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం మం జూరు చేసి విచారణను ఎదుర్కొన్నారు. ఒక్క అడంగల్ మాత్రమే కాకుండా ఓబీసీ, కుల, ఆదా య ధ్రువీకరణ పత్రాల నుంచి పట్టాదార్ పాస్ పుస్తకం వరకు, మ్యూటేషన్ ఓకే చేయాలన్నా విస్తీర్ణం బట్టి రూ.2 వేలు నుంచి రూ.20 వేలు వరకు కొందరు వసూళ్ల పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. నా దృష్టికి తీసుకురండి.. అడంగల్, 1బీల మంజూరు విషయంలో వసూళ్లు, అవినీతికి పాల్పడితే రైతులు నా దృష్టికి తీసుకురావాలి. అటువంటి వీఆర్ఓలను ఉపేక్షించం. ఇప్పటికే సమావేశం పెట్టి హెచ్చరించాను. ఎవరి వద్ద నుంచైనా డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే చర్యలు తప్పవు. విజయవాడ సీసీఎల్ఏలో ఏటా భూరికార్డుల వివరాలు రీఫ్రెష్ అవుతాయి. ఆ సమస్య కారణంగా కొంత మంది రైతుల సర్వే నెంబర్లకు డిజిటల్ సైన్ మిస్ మ్యాచ్ అవడం, పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. రైతులు తమకున్న హక్కు పత్రాలతో నేరుగా నన్ను కలిస్తే అడంగల్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాను. – జి. కల్పవల్లి , తహసీల్దార్, వజ్రపుకొత్తూరు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తా.. గత ఏడాది నాలుగు గ్రామా ల పరిధిలో ఉన్న భూములకు అడంగల్, 1బీ వచ్చిం ది. ఈ ఏడాది మీ సేవా కేంద్రానికి వెళితే ధ్రువపత్రాలు రాలేదు. ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించినా ఎవరూ స్పందిం చడం లేదు. ఏటా ఇదే పరిస్థిత. కొందరు కావాలనే ఇలా చేస్తున్నారు. మ్యూటేషన్న్లు సక్రమంగా తనిఖీ చేయడం లేదు. విచారణ చేపట్టకుండా డబ్బులిస్తే పని జరిగిపోతోంది. మీసేవలో డిజిటల్ సైన్ మిస్మ్యాచ్ అయిందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి నాతో పాటు 20 మంది వరకు రైతులకు ఎదురైంది. నా భూములకు 1బీ రాకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాను. – బగాది బాలకృష్ణ, రైతు, గుళ్లలపాడు, వజ్రపుకొత్తూరు మండలం అన్నీ అవకతవకలే.. తహసీల్దార్ కార్యాలయంలో అన్నీ అవకతవకలే. నాకు ఏడు ఎకరాల భూమి ఉంది. అందులో మూడు ఎకరాలకు అడంగల్, 1బీ రావడం లేదు. సర్వే చేయించాను. మ్యూటేషన్ దరఖాస్తు చేశారు. అయినప్పటికీ స్పం దించడం లేదు. అభ్యంతరాలేంటో చెప్పడం లేదు. ఇక్కడి పరిస్థితిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రక్షాళన చేయకుంటే అవకతవకలు తారస్థాయికి చేరే అవకాశం ఉంది. కార్యాలయంలో సమాధానం చెప్పేందుకు కూడా ఎవరూ ఇష్ట పడటం లేదు. – కొర్ల త్రినాథ్ చౌదరి, ఉండ్రుకుడియా, వజ్రపుకొత్తూరు మండలం -
చెత్తబుట్టలో ధృవీకరణ పత్రాల వ్యవహారంలో కొత్త ట్విస్ట్
-
మంగళగిరి ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట అంగన్వాడీ,ఫీల్డ్ ఆఫీసర్ల అందోళన
-
పశ్చిమ గోదావరి: ఓటరు లిస్టులో మీ పేరు చెక్ చేస్కోండి..!
సాక్షి, పశ్చిమ గోదావరి: ♦ 1950 టోల్ఫ్రీ నెంబరులో కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడీ నెంబర్ను 1950 నెంబర్కు మెసేజ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ♦ గూగుల్ ప్లే స్టోర్లో VOTER HELP LINE యాప్ను మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని, సంబంధిత వివరాలు ఎంటర్ చేసి ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ♦ ఆర్డీఓ ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. ♦ ఎమార్వో ఆఫీసులో ఎమ్మార్వో లేదా ఎన్నిక విధులకు కేటాయించిన ఇతర అధికారులను కలిసి కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ♦ బూత్ లెవెల్ ఆఫీసర్స్ (బీఎల్వో)లు వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఆ జాబితాను ప్రతీ పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. ♦ ఒక వేళ మీఓటు లేదని తెలిస్తే పై మూడు స్థాయిల్లోను అక్కడికక్కడే తగిన ఆధారాలు చూపి ఫామ్ - 6 నింపి ఓటు నమోదు చేసుకోవచ్చు. ♦ మీ సేవా కేంద్రాల్లోను నిర్ణీత రుసుము తీసుకుని ఓటుందో లేదో తెలియజేస్తారు. సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తే ఆన్లైన్లో కూడా నమోదు చేస్తారు. ♦ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవెల్ అధికారి వరకూ అందరి వద్ద ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా మీ ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే ఓటు నమోదుకు ఉన్న అవకాశాలు గురించి ఆర్డీవో, ఎమ్మార్వో, బూత్ లెవెల్ అధికారిని సంప్రదించాలి. బూత్ లెవెల్ అధికారి - 912111 9481 తహసీల్దార్ - 94910 41449 - ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
చాట్రాయి తహసీల్దారు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, కృష్ణా జిల్లా: చాట్రాయి తహసీల్దారు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నేతల సిఫారసులు ఉన్న వారికే ఇళ్ళపట్టాలు పంపిణీ చేస్తుండటం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలమేరకు.. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా తహశీల్దార్ బాలకృష్ణారెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. అధికార పార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే ఇళ్ళపట్టాలు పంపిణీ చేస్తున్న విషయం బయటకు తెలియడంతో లబ్ధిదారులతో కలిసి నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు. దీంతో ఆయనకు సమాధానం చెప్పకుండా అధికారులు మొకం చాటేశారు. ఇందుకు నిరసనగా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే బైటాయించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు సైతం భారీగా తహసీల్దారు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. స్పందించిన కలెక్టర్ లక్ష్మీకాంతం ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. మేకా ప్రతాప్ అప్పారావుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రోటోకాల్ పాటించకపోవడం పొరపాటేనని తహసీల్దారు లిఖితపూర్వకంగా ఎమ్మెల్యే వద్ద విచారం వ్యక్తం చేశారు. తహసీల్దారు వివరణతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. అనంతరం అర్హులైన వారికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ చేపడతామని తహసీల్దార్ తెలిపారు. -
ఏసీబీ వలలో సర్వేయర్
సాక్షి, అలంపూర్: లంచం తీసుకుంటుండగా సర్వేయర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం ఉండవల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు... మండలంలోని కంచుపాడుకు చెందిన పెద్ద వెంకట్రెడ్డి, చిన్న వెంకట్ రెడ్డి, సత్యారెడ్డి అన్నదమ్ములు. వారికి 7.12 ఎకరాల పొలం ఉంది. ఆస్తి పంపకాల్లో పెద్ద వెంకట్ రెడ్డికి 2.18 ఎకరాలు, చిన్న వెంకట్ రెడ్డికి 2.17 ఎకరాలు, సత్యారెడ్డికి 2.17 ఎకరాలు ఆస్తి సంక్రమించింది. తనçపొలానికి హద్దులు ఏర్పాటు చేయాలని సత్యారెడ్డి రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్ సూచన మేరకు గతనెల 18న మీసేవ ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేశాడు. ఈవిషయాన్ని సర్వేయర్ హరికృష్ణకు తెలిపాడు. దీంతో అక్టోబర్ 2న హరికృష్ణ సర్వే పనులు పూర్తి చేశాడు. రిపోర్టు ఇవ్వలేదు. కొన్నిరోజులు తిప్పుకుని రూ.7వేలు ఖర్చవుతుందని చెప్పాడు. సత్యారెడ్డి అభ్యర్థన మేరకు రూ.5వేలకు రిపోర్టు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇదే విషయమై సత్యారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే సర్వేయర్ ముందుగా లంచం డబ్బులు కర్నూలులోని తన నివాసంలో ఇవ్వాల్సిందిగా సూచించాడు. చివరకు కార్యాలయం వద్దకే తేవాలని చెప్పాడు. చివరికి సర్వేయర్ సూచన మేరకు ఆయన కారులో డబ్బును ఉంచాడు. ఏసీబీ అధికారులు కారును సోదా చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్ హరికృష్ణను అదుపులోకి తీసుకొని విచారించారు. అదే సమయంలో కర్నూలోని ఆయన నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇన్స్పెక్టర్లు లింగస్వామి, కమల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
చిట్యాల(భూపాలపల్లి): ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో రెండేళ్లలో తహసీల్దార్ పాల్సింగ్, వీఆర్వో రవీందర్ ఏసీబీ అధికారులకు పట్టుపడగా, శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ రామగిరి కిరణ్కుమార్ రూ.5వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ కిరణ్కుమార్ కథనం ప్రకారం... చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన రేషన్ డీలర్ ముకిరాల శ్యామలకు పభుత్వం నుంచి రూ.40 వేల కమీషన్ విడుదలైంది. శ్యామలను అత్తగారింటి వద్ద విజయలక్ష్మి అని పిలుస్తుంటారు. ఈమేరకు ఆధార్కార్డు, రేషన్కార్డు విజయలక్ష్మి పేరుమీదే ఉన్నాయి. ఆమె పేర కమీషన్ డబ్బు మంజూరు కాగా కుమారుడు మధువంశీకృష్ణ 45 రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్ కిరణ్కుమార్ను సంప్రదించి శ్యామలగా ధ్రువీకరించి చెక్కు ఇవ్వాలని కోరాడు. ఇందుకు డీటీ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. తమ వద్ద డబ్బులు లేవని వేడుకున్నా వినలేదు. దీంతో రూ.5వేలు ఇస్తానని చెప్పి గత నెల 28న ఏసీబీ కార్యాలయంలో సంప్రదించాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి డీటీ కిరణ్కుమార్పై ఈనెల 1 నుంచి 4 వరకు నిఘా పెట్టారు. శుక్రవారం ఆఫీస్లో మధువంశీకృష్ణ నుంచి డీటీ రూ.5వేల నగదు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం రికార్డులు సోదా చేశారు. డీటీని అరెస్ట్ చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్డులో హాజరుపరచనున్నారు. ఏసీబీ సీఐలు సతీష్కుమార్, క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. డీటీపై అవినీతి ఆరోపణలు చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో 2014లో డిప్యూటీ తహసీల్దార్గా కిరణ్కుమార్ విధుల్లో చేరాడు. రెండేళ్లుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జిల్లా అధికారులు పలుమార్లు హెచ్చరించారు. 2016లో తహసీల్దార్ శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడగా సహచర ఉద్యోగులు, అధికారులు చందాలుగా ఇచ్చిన రూ.3లక్షల డబ్బులను డీటీ దగ్గర పెట్టుకోవడంతో స్థానిక అధికారులు గొడవ పడి మృతుడి కుటుంబ సభ్యులకు ఇప్పించారు. డీలర్లు కొందరు తమను వేధిస్తున్నాడని డీటీపై ఫిర్యాదు చేశారు. ఇటీవల మంగపేట తహసీల్దార్గా వెళ్లాలని జిల్లా అధికారులు ఆదేశించినా పోలేదని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఇష్టారాజ్యాంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కడ పరిపాటిగా మారింది. 2013లో అప్పటి తహసీల్దార్ లింగాల సూరి బాబు రైతు వద్ద రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2016 సెప్టెంబర్ 19న తహసీల్దార్ పాల్సింగ్, వీఆర్వో రవీందర్ రైతు వద్ద రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డీటీగా కిరణ్కుమార్ శుక్రవారం రూ.5వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది. అయినా సహచర అధికారుల్లో మార్పు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. -
కనిపించని కనికరం
సాక్షి కడప: అతనికి చిన్నప్పుడే పోలియో సోకి కాళ్లు చచ్చుపడిపోయాయి..ఎంతదూరమైనా కాళ్లను ఈడ్చుకుంటూ..వంగి చేతుల సాయంతో కదలాలే తప్ప మరో మార్గంలేని దివ్యాంగుడు..ఇతని అన్న దాసరయ్య ..వదిన అనారోగ్యంతో కానరాని లోకాలకు వెళ్లారు. అన్న పిల్లల పోషణ కోసం దివ్యాంగుడిగా ఉన్న (చిన్నాన్న) వెంకటేశ్వర్లు కష్టాలు పడుతున్నారు. ఒకవైపు అనారోగ్యంతో మంచాన పడిన తల్లి లక్షుమ్మ (85)ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మరోవైపు జీవనపోరాటం సాగిస్తున్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మూడు నెలల్లో మూడుసార్లు కలెక్టరేట్ మీ కోసంకు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. ఎంత కష్టం బద్వేలు పరిధిలోని గోపవరం మండలం మడకలవారిపల్లె పరిధిలోని భావనారాయణనగర్కు చెందిన పెగడ వెంకటేశ్వర్లు దివ్యాంగుడు. రెండుకాళ్లు ఎంతమాత్రం పనిచేయవు. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కుటుంబానికి ఆదరువు అని వెంకటేశ్వర్లు గోడు వెళ్లబోసున్నారు. ఇప్పటికి మూడుసార్లు వచ్చానని...రెవెన్యూ అధికారులు దరఖాస్తు చూసి ఇక నువ్వు పో.. వస్తుందంటారు.. కానీ కలెక్టర్ను కలిసి ఎక్కడో సెక్షన్లో రిజిష్టర్ చేయిస్తే తప్ప రాదని స్థానిక అధికారులు చెబుతున్నారని, దిక్కుతెలియడం లేదని దివ్యాంగుడు ఆందోళన వ్యక్తం చేశారు.అన్ని కష్టనష్టాలకు ఓర్చి ఇక్కడికి పదేపదే వస్తున్నా పనులు జరగకపోతే బాధగా ఉంటుందని వాపోయారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు కడప కలెక్టరేట్ మొదలుకొని తహసీల్దార్ కార్యాలయం వరకు పదేపదే ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించే అధికారులే కనిపించడం లేదు. ఇప్పటికే సంబంధిత దరఖాస్తులను పూర్తి చేసి బద్వేలు పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలోకూడా అందజేశారు. అయితే అక్కడి అధికారులు ఇక్కడ చేసేదేమీ లేదు..కడపలోనే కలెక్టరేట్లో చేయించుకోవాలని చెప్పడంతో పలుమార్లు కడపకు కూడా వచ్చాడు. దివ్యాంగుడైన వెంకటేశ్వర్లు పదేపదే అన్నిచోట్ల తిరుగుతున్నా పని చేసే పెట్టే అధికారులే కరువవడం ఆందోళన కలిగించే పరిణామం. ఆడపిల్లల సంరక్షణ కోసం సరిగ్గా రెండేళ్ల క్రితం అన్న దాసరయ్య టీబీకి గురయ్యాడు. మందులు వాడుతూనే మంచానికి పరి మితమై తనువు చాలించాడు. అన్న భార్య నరసమ్మ కూడా కేన్సర్కు గురి కావడంతో ఆమె కూడా ఆస్పత్రిలో మృత్యువాత పడింది. దాసరయ్య, నరసమ్మలకు ఇద్దరు ఆడపిల్లలైన లక్ష్మిదేవి, వెంకటసుబ్బమ్మలను దివ్యాంగుడైన వెంకటేశ్వర్లే పోషిస్తున్నారు. అంతా తానై చూసుకుంటున్నారు. పెళ్లి కూ డా చేసుకోకుండా అన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. వెంకటేశ్వర్లు దివ్యాం గుడు కావడంతో పనులు చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో వారి పోషణ గగనంగా మారింది. దీంతో రేషన్బియ్యం వండుకునితింటూ కాలం గడుపుతున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కాస్తయినా ఉపశమనంగా ఉంటుందని భావిస్తూ అన్నిచోట్ల తిరుగుతున్నా కనికరం కరవవుతోంది. అమ్మను చూసుకుంటూ.. దివ్యాంగుడైన వెంకటేశ్వర్లు తల్లిని, అన్న బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అనారోగ్యంతో మంచంలో ఉన్న తల్లికి సపరిచర్యలు చేస్తూనే మరోవైపు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తిరగని చోటంటూ లేకుండా తిరుగుతున్నాడు.ఇతనికి ప్రభుత్వం ఇంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయలేదు. ఆరు నెలల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. సీఎంను కలవాలని అమరావతికి పోయినా అక్కడ కూడా అధికారుల అనుమతి లేకపోవడంతో వెనక్కి వచ్చారు. చనిపోయిన వారికి సంబంధించి కూడా ఎలాంటి సొమ్ము ఒక్క పైసా కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సారూ.. మా మొర ఆలకించరు
సాక్షి, నాగర్ కర్నూలు : జిల్లాలోని కోడేర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి గత వారం రోజులుగా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఈ చర్యలతో ఆగ్రహించిన రైతులు కార్యాలయానికి తాళాలు వేసి తమ నిరసనను తెలియజేశారు. అధికారులు మమ్మల్ని మనుషులుగా కాకుండా, మా పట్ల హేళనగా చూస్తున్నారని రైతులు ఆవేదన చెందారు. కొత్తగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకానికి సంబంధించి మాకు ఎటువంటి చెక్కులు అందట్లేదని, చెక్కులు ఇవ్వకున్నా పరవాలేదు కనీసం మా భూముల పట్టాదారు పాస్ పుస్తకాలు అయినా మాకు ఇవ్వాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. -
చంపేశారు!
‘‘భూమి ఉంది... భయం లేదు... కూతుళ్లకు పెళ్లిళ్లు ఘనంగా చేయాలని రోజూ అనేవాడివి.. ఇప్పుడు కదలకుండా పడి ఉన్నావు... మాకు దిక్కెవరయ్యా’’ మార్చురీ వద్ద ఇద్దరు కూతుళ్లు త్రివేణి, భారతిని పట్టుకుని కేశవనాయక్ భార్య శాంతమ్మ విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ గిరిజన రైతు ఆరేళ్లుగా సాగుచేసుకుంటున్న పొలాన్ని కాజేసేందుకు ప్రణాళిక రచించారు. ఆన్లైన్లో వేరొకరి పేరు కూడా ఎక్కించారు. న్యాయం చేయాలని బాధిత రైతు కాళ్లావేళ్లాపడినా...అధికారులు కనికరం చూపలేదు. ఆందోళన చెందిన ఆ గిరిజనుడు పురుగుల మందు తాగి ప్రాణం తీసుకోగా.. అతనిపైనే ఆధారపడిన ఇద్దరు కూతుళ్లు, భార్య దిక్కులేని వారయ్యారు. ఆత్మకూరు : తమ భూమిని అధికార పార్టీకి చెందిన వ్యక్తి పేరుపై ఆన్లైన్లో నమోదు చేయడంతో మనస్తాపానికి గురైన ఆత్మకూరు మండలం వేపచెర్లతండాకు చెందిన రైతు కేశవనాయక్ (45) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... వేపచెర్ల తండాకు చెందిన కేశవనాయక్, శాంతమ్మ దంపతులు కూలీలు. వీరికి ఇంటర్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కింద 507–2 సర్వే నంబర్లో 3.21 ఎకరాల పొలాన్ని శాంతమ్మ పేరు మీద పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఆ పొలంలో పంట సాగుచేసుకుంటున్నారు. ఆత్మకూరు సిండికేట్ బ్యాంకులో రూ.70 వేల పంట రుణం పొందారు. ఇదిలా ఉండగా నెల రోజుల కిందట శాంతమ్మ పేరిట ఉన్న 3.21 ఎకరాల భూమిని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణానాయక్ పేరిట ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేశవనాయక్ రెవెన్యూ అధికారులను సంప్రదించి, తన గోడు వెల్లబోసుకున్నాడు. కానీ న్యాయం జరగలేదు. మరోవైపు పంట రుణం రెన్యూవల్ సమయం దగ్గరపడింది. రెన్యూవల్ చేయాలంటే బ్యాంకు అధికారులు రికార్డులు పరిశీలిస్తారు. అప్పుడు వేరే పేరు కనిపిస్తే ఇబ్బంది అవుతుందని ఆందోళనకు గురైన రైతు కేశవనాయక్ ఆదివారం ఇంటి దగ్గరే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చక్రం తిప్పిన మారెక్క శాంతమ్మ భూమిని కృష్ణానాయక్ పేరిట మార్పు చేయించడంలో ఎంపీపీ మారెక్క హస్తం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీకి చెందిన కృష్ణా నాయక్ పేరుమీద మార్చాలని ఎంపీపీ రెవెన్యూ అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెత్తినట్లు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో అంత్యక్రియలు ఆదివలారం సాయంత్రం పొలంలోనే అంత్యక్రియలు చేయటానికి సిద్ధమవగా కృష్ణానాయక్ బంధువులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కేశవనాయక్ అంత్యక్రియలు సజావుగా జరిగాయి. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాలపోతన్న, మాజీ సర్పంచు యల్లప్ప తదితరులు రైతు కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. నోటీసులు ఇచ్చాం: తహసీల్దార్ నారాయణ సర్వే నంబర్507–2లోని 3.21 ఎకరాల భూమికి సంబంధించి ఆర్డీఓ ఉత్తర్వులు ప్రకారమే నోటీసులు ఇచ్చామని తహసీల్దార్ నారాయణ చెప్పారు. సాగులో కృష్ణానాయక్ ఉండటం వల్ల వారికే ఆన్లైన్ చేశామన్నారు. ఈ భూమిని రద్దు చేసినది తాను కాదని, గతంలో పనిచేసిన తహసీల్దార్ నాగరాజు అని స్పష్టం చేశారు. తహసీల్దార్ను సస్పెండ్ చేయాలి అనంతపురం న్యూసిటీ: రైతు కేశవనాయక్ (45) మృతికి కారణమైన ఆత్మకూరు తహసీల్దార్ నారాయణను తక్షణం సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సర్వజనాస్పత్రిలోని మార్చురీలో కేశవనాయక్ మృతదేహాన్ని ఆయన సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం చేయవద్దని కేశవనాయక్ కుటుంబీకులు, వైఎస్సార్ సీపీ నేతలు మార్చురీలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటరావ్, ఆర్డీఓ మలోల మార్చురీ వద్దకు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం ప్రకాశ్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తమ భూమి పోతే ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయలేనని, తనకు ఆత్మహత్యే శరణ్యమని రైతు కేశవనాయక్ మొరపెట్టుకున్నా తహసీల్దార్ కనికరం చూపలేదన్నారు. రైతు మృతికి కారణమైన తహసీల్దార్పై చర్యలు తీసుకుని, బాధితులకు భూమిని అప్పగించేలా చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
ఎమ్మార్వో కార్యాలయంలో వ్యక్తి హల్చల్
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. రోషయ్య అనే ఎమ్మార్పీఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆందోళనకు దిగాడు. అంతేకాకుండా కిరోసిన్ డబ్బాతో ఆఫీసులోపలికి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. తన డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు. అయితే వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు రోశయ్యను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
అనంతగిరి (కోదాడ): బోరును సీజ్ చేస్తామని అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘట న అనంతగిరిలో సోమవారం చోటు చేసుకుంది. మం డల పరిధిలోని గోండ్రియాలకు చెందిన రైతు నెల్లూరి రాజేంద్రప్రసాద్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బోరు విషయంలో పక్కపక్క పొలాలకు చెందిన రైతులు గొడవ పడి అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో తన బోరును సీజ్ చెయ్యకుండా రాజేంద్ర ప్రసాద్ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అధికారులు రోజు వచ్చి తన బోరును సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం కార్యాలయానికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు. చట్టప్రకారం వ్యవరిస్తామని తహసీల్దార్ స్పష్టం చేయడంతో ఆయన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగారు. వెంటనే అధికారులు ఆయనను కోదాడకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. దీనిపై తహసీల్దార్ అనంతగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
'ప్రభుత్వాన్ని కదిలించేందుకే ధర్నా'
-
సోలార్ పనులు ప్రారంభం
గాలివీడు : మండల పరిధిలోని తూముకుంట, వెలిగల్లులో సోలార్ పనులు ప్రారంభం అయ్యాయి. రైతుల భూములకు తహసీల్దార్ కార్యాలయంలో ఆన్లైన్ అయిన 1బి రికార్డుల జాబితా ప్రకారం తూముకుంట, వెలిగల్లు సోలార్ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు సోలార్ ప్రాజెక్టు ఎస్ఈ నారాయణమూర్తి తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భవానీతో పెండింగ్ జాబితాపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో మైలవరంలో 1000మెగావాట్లకు సంబంధించి రైతుల భూముల జాబితా సిద్ధం చేశామన్నారు. తూముకుంట, వెలిగల్లులో 500మెగావాట్లకు సంబంధించి మూడు సబ్స్టేషన్లు, భూములకు హద్దులు, అమర్రాజ కంపెనీ వారు పనులను ప్రారంభించారన్నారు. సోలార్కు తూముకుంట, వెలిగల్లు గ్రామ రైతులు సహకరించాలని కోరారు. పెండింగ్ జాబితాను కూడా త్వరలో ఉన్నతాధికారులకు పంపించేవిధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరారు. ఈ కార్యక్రమంలో తూముకుంట సోలార్ ఏడీ శంకర్నాయుడు, సీనియర్ అకౌంటెంట్ విజయకుమార్, ఆర్ఐ యునీత్కుమార్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాణాప్రతాప్రెడ్డిలు పాల్గొన్నారు. -
తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
కర్నూలు: జిల్లాలోని ఆళ్లగడ్డ తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. కార్యాలయంలోని కంప్యూటర్లు, ముఖ్యమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ఎమ్మార్వో కార్యాలయానికి కరెంట్ కట్
చిన్నశంకరంపేట: మెదక్ జిల్లాలో ఎమ్మార్వో కార్యాలయానికి విద్యుత్ శాఖాధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యాలయానికి విద్యుత్ బిల్లులు బకాయి ఉండటంతో.. అధికారులు బుధవారం కరెంట్ సరఫరాను ఆపేశారు. దీంతో కంప్యూటర్లు పని చేయక ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు బకాయిలు చెల్లించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కురవి ఆర్ఐకి బెదిరింపు మెసేజ్
కురవి : మండల రెవెన్యూ కార్యాల యం లో విధులు నిర్వహించే ఆర్ఐ ఫిరోజ్కు మంగళవారం సాయంత్రం బెది రింపు మెసేజ్ వచ్చింది. భయంతో అతడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం ప్రకారం.. కురవి ఆర్ఐ ఫిరోజ్ ఈ నెల 5వ తేదీన విధులు నిర్వహించుకుని మానుకోటకు బైక్పై వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం పొడిని చల్లారు. ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆర్ఐ ఫిరోజ్ సెల్కు ఒక బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఈ రకంగా ఉంది. ‘ఓరి లంచగొండి సన్నాసి... ఫిరోజ్గా ఎలా ఉందిరా కారం మంటా ?’ అంటూ ఉంది. అలాగే రూ.5 లక్షలు ఈ నెల 25వ తేదీ సాయంత్రం లోగా మాకు అప్పగించాలి.. లేదో కాళ్లు, చేతులు నరికేస్తాం ఖబర్ధార్’ అంటూ మెసేజ్ పంపారు. 7702564615 నంబర్ నుంచి రెండు సార్లు ఈ మెస్సెజ్ పంపించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్ఐ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. -
సర్వర్ సమస్యను పరిష్కరించాలి
పాన్గల్ : తహసీల్దార్ కార్యాలయంలో ఎదురవుతున్న సర్వర్ సమస్యతో రోజుల తరబడి సర్టిఫికెట్లు, ఇతర పత్రాలకోసం తిరుగుతూ రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయరాములుసాగర్ తెలిపారు. మంగళవారం వివిధ గ్రామాలనుంచి ఆర్ఓఆర్, పహాణి, పాస్పుస్తకాలకోసం రైతులు ధర్నా నిర్వహించారు. వారికి సంఘీభావం తెలిపిన జయరాములు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రైతులు పంట పొలాల వివరాలు అన్లైన్లో నమోదు చేయడానికి, పాసు పుస్తకాల కొరతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంకుల ద్వారా రుణాల లభించక పెట్టుబడులకు వేచి చూస్తున్నారని తెలిపారు. స్పందించిన ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రభాకర్రావు మాట్లాడుతూ సర్వర్ సమస్య గురించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, రైతులకు రుణాల మంజూరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. -
ఏసీబీ దాడులు : వీఆర్వో అరెస్ట్
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా రైతు నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటున్న వీఆర్వో కాశీనాథ్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నగదు సీజ్ చేసి... కాశీనాథ్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. -
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
నల్గొండ : నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ భిక్షపతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డాడు. ఇసుక పర్మిషన్ ఇచ్చేందుకు చిన్న రాజేష్ అనే వ్యక్తి నుంచి భిక్షపతి రూ.3,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్ చిక్కాడు. భిక్షపతిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. -
'గుణాదిగూడ కాలువ వెంటనే పూర్తి చేయాలి'
నల్గొండ : వ్యవసాయ సాగుకు ఎంతో ఉపయోగపడే నల్గొండ జిల్లా భువనగరి మండలంలోని గుణాదిగూడ కాలువ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తక్షణమే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. మంగళవారం భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ నేతలు, కార్యకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో పార్టీ నేత నంద్యాల నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ దీక్షకు స్థానిక కాంగ్రెస్పార్టీ నేత కుంభం అనిల్కుమార్రెడ్డి మద్దతు పలికారు. ఈ దీక్షలో సీపీఎం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కర్నూలు: కర్నూలు జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎర్రుపాళెం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సత్యనారాయణ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకున్నాడు. గ్రామ శివారులోని గ్రామకఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిలో ఆక్రమణలు తొలగించి దళితులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సత్యనారాయణ నాయకత్వంలో 50 మంది ధర్నాకు దిగారు. అధికారులు పట్టించుకోకపోవడంతో అతను వెంట తెచ్చుకున్న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతనిని వారించారు. ఎమ్మార్వో సమ్మిరెడ్డి అతనిని కార్యాలయానికి పిలిపించుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. -
ఎమ్మార్వో కార్యాలయంలో పాము కలకలం
నెల్లూరు : నెల్లూరు జిల్లా చేజర్ల తహసీల్దార్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం అధికారులు, సిబ్బంది తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో పాము దర్శనమిచ్చింది. దీంతో అధికారులు... సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. పాము పట్టుకునేందుకు స్నేక్ సొసైటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది అధికారులు తెలిపారు. దీంతో కార్యాలయం బయటే అధికారులు సిబ్బంది... పడిగాపులు పడుతున్నారు. -
మునగపాక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
విశాఖ: విశాఖ జిల్లాలోని మునగపాక తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునగపాక టీచర్స్ కాలనీ 138, 139 సర్వే నెంబర్లలోని ఖాళీ భూములను రీసర్వే చేయాలంటూ స్థానికులు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహశీల్దార్ కార్యాలయం భవనం పైకి ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయబోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. సదరు యువకుడ్ని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించడంతో స్థానికులు కూడా పోలీస్స్టేషన్కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. -
వీఆర్వో లంచం తీసుకున్నాడంటూ రైతుల ఆందోళన
కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. పాస్ పుస్తకాలు అడిగితే వీఆర్వో దాడి చేశారంటూ రైతులు నిరసన చేస్తున్నారు. పట్టా పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పి వీఆర్వో రూ.40 వేలు లంచం తీసుకున్నాడంటూ బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. -
ఇసుక అక్రమ రవాణాను ఆపాలి
విశాఖపట్నం : ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ... మహిళలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటన విశాఖ జిల్లా కోట ఊరట్లలో గురువారం జరిగింది. గొట్టివాడ గ్రామానికి చెందిన మహిళలంతా కలిసి ఈ రోజు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొన్నారు. తమ గ్రామ సమీపంలోని వరహా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా తాహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. -
ఎమ్మార్వో ఆఫీస్లో ఎస్సార్లు మాయం
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్లో సర్వీస్ రిజిస్టర్లు మాయమయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో సర్వీస్ రిజిస్టర్లు కనిపించకపోవడంతో ఉద్యోగులు ఎమ్మార్వోను నిలదీశారు. దీంతో ఎమ్మార్వో తాను కొత్తగా వచ్చానని, విషయం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుంటానని సమాధానమిచ్చారు. కాగా, ఎమ్మార్వో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులను ఈ విషయంపై ఆరా తీయగా.. వారు కలెక్టరు కార్యాలయంలో ఏవోకి సమర్పించామని చెప్పారు. అయితే, ఏవో మాత్రం రిజిస్టర్లు నాకు ఇస్తే, ఎకనాలెడ్జిమెంట్ చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఆర్ లు మాయంపై విచారణ జరపాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు -
తహశీల్దార్ కార్యాలయంలో సీబీఐ విచారణ
గుత్తి (అనంతపురం) : సబ్సిడీ విత్తనాల పంపిణీపై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ..అనంతపురం జిల్లా గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం రైతులను విచారించింది. 2011 నుంచి 2013 వరకు మండలంలోని మార్నేపల్లెకు చెందిన 11 మంది రైతులకు వైఎస్సార్ జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి సబ్సిడీ విత్తనాలు అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఈ మేరకు సంబంధిత రైతులను పిలిపించి తహశీల్దార్ హరిప్రసాద్ సమక్షంలోవివరాలు నమోదు చేసుకున్నారు. కాగా దీనిపై మరింత సమాచారాన్ని వెల్లడించేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. -
బాధిత రైతు కుటుంబం ఆందోళనతో దిగొచ్చిన సర్కారు
బనగానపల్లి : కర్నూలు జిల్లా బనగానపల్లి రెవెన్యూ కార్యాలయ ఉద్యోగుల తీరుతో విసిగి సోమవారం ఆత్మాహుతి చేసుకున్న రైతు కుటుంబానికి తగిన సాయం చేసేందుకు ప్రభుత్వం దిగొచ్చింది. రైతు బలరాములు మృతదేహంతో కుటుంబ సభ్యులు, రాళ్ల కొత్తూరు గ్రామస్తులు మంగళవారం బనగానపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయ్మోహన్, జేసీ హరికిరణ్ మంగళవారం సాయంత్రం బనగానపల్లికి చేరుకుని బలరాములు కుటుంబసభ్యులతో మాట్లాడారు. రెండెకరాల ప్రభుత్వ భూమి ఇస్తామని, సీఎం సహాయనిధి నుంచి రూ.5 లక్షల పరిహారం ఇప్పిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. తన పొలానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరుతూ బలరాములు మూడు రోజులగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పని కాకపోవడంతో విసిగి సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోగా, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. -
తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతుల నిరసన
ఆస్పరి (కర్నూలు) : కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. పేర్లు నమోదు చేసుకున్నా పట్టాదారు పాసుపుస్తకాల వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదని వారు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని ములుగుండం, వలగొండ, బిల్వకల్లు తదితర గ్రామాలకు చెందిన సుమారు 80 మంది రైతులు మండల కార్యాలయానికి తరలివచ్చారు. అయితే తహశీల్దార్ కార్యాలయంలో లేకపోవటంతో అక్కడి అధికారులకు తమ సమస్య వివరించి వెనుదిరిగారు. -
ఎమ్మార్వో కార్యాలయంలో అగ్ని ప్రమాదం
నెల్లూరు: కొందరు గుర్తుతెలియని దుండగులు తహశీల్దార్ కార్యాలయంలోని దస్త్రాలకు నిప్పంటించిన సంఘటన నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండల కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది ఈ విషయాన్ని గమనించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. గతంలో కూడా ఈ కార్యాలయంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఈ విషయం పై కార్యాలయ సిబ్బందిని వివరణ కోరగా.. ఇవి గతంలో కాలిన పత్రాలే కావడంతో ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నారు. -
సర్టిఫికెట్ ఇవ్వకుండా యువకుడిపై దాడి
హైదరాబాద్: సర్టిఫికెట్ కోసమని ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన యువకుడిపై చేయిచేసుకోవడంతో నగరంలోని బాలానగర్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుల ధ్రువీకరణ పత్రం కోసం శుక్రవారం ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన ఓ యువకుడిపై కార్యాలయ సిబ్బంది దాడిచేసి, కొట్టారు. ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
కోటగిరిలో బీడీ కార్మికుల ఆందోళన
కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సోమవారం బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. అర్హులైన బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల ప్రోద్బలంతో అనర్హులకు కూడా పింఛన్ వస్తున్నా అధికారులు పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదన్నారు. నిజామాబాద్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సిద్ధార్ధ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్ గురించి వైఎస్సార్సీపీ నాయకులు డిప్యూటీ తహశీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. వెంటనే అర్హులకు పింఛన్లు ఇప్పించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సిద్ధార్ధ రెడ్డి చెప్పారు. -
ఎన్నికల హామీల సంగతేంటి బాబూ..?
-
తహశీల్దారు కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
తూప్రాన్ :తహశీల్దారు కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బత్తుల సత్యన్నారాయణ(55) అనే రైతు తన భూమి వివరాలను రికార్డుల్లో నమోదు చేయడంలేదని ఆరోపిస్తూ సోమవారం తహశీల్దారు కార్యాలయంలో పురుగుమందు తాగాడు. దీంతో అతడిని హుటాహుటిన సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తహశీల్దార్పై తెలుగు తమ్ముళ్ల దాడి
అనంతపురం : అధికారం అండగా ఉందనే భరోసాతో తెలుగు తమ్ముళ్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. తాజాగా బుధవారం అనంతపురం తహశీల్దార్పై దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే...అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీటీసీ కాటన్నెకాలువ శ్రీనివాస్ ఓ భూ వివాదానికి సంబంధించిన అంశంలో జోక్యం చేసుకుని ఎమ్మార్వోతో వాగ్వాదానికి దిగాడు. అదే క్రమంలో.. కార్యాలయంలోకి వచ్చిన తహశీల్దార్ మహబూబ్ పాషాను దుర్భాషలాడుతూ, అతని కాలర్ పట్టుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన అధికారి సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
రుణమాఫీ కాలేదని ఐదుగురు ఆత్మహత్యాయత్నం
కోడేరు: రుణమాఫీ వర్తించలేదని ఐదుగురు రైతులు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కోడేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. కోడేరు మండలంలోని జనుంపల్లి గ్రామానికి చెందిన అంకె శివమ్మ, శ్రీపురం గోపాల్, రాఘవేందర్, ఎర్రోళ్ల కుర్మయ్య, మంతయ్యలు 2013లో నాగర్కర్నూల్ మండలంలోని గుడిపల్లి ఐసీఐసీఐ బ్యాంకులో రూ.లక్ష వరకు పంట రుణం తీసుకున్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ వర్తించలేదు. దీంతో తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి, తిరిగి విసుగు చెందారు. దాంతో వారంతా శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని, వెంట తెచ్చుకున్న విషపు గుళికలను మింగేందుకు యత్నించారు. అక్కడున్న కొందరు వారిని వారించి తహశీల్దార్కు సమాచారం అందించారు. వెంటనే ఆయన వారి వద్దకు చేరుకుని రుణ హామీ వర్తింపజేస్తామని హామీ ఇవ్వటంతో వారు శాంతించారు. -
'అక్రమ రవాణా అడ్డుకొని మాకు న్యాయం చేయండి'
విజయనగరం: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని తమకు న్యాయం చేయాలని ఇసుక రవాణాదారులు తహశీల్దార్ ను కోరారు. విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో గురువారం ఇసుక రవాణాదారులు వాహనాలతో వచ్చి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు నిబంధనలను పాటించటం లేదని, వారి తీరు కారణంగా తమకు గిట్టుబాటు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావటం లేదని అధికారులకు తెలిపారు. కాగా చంపావతీ నదీ తీరం ఉన్న గుర్ల మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఐదు ఇసుక రీచ్లు ఉన్నాయి. (గుర్ల) -
ఆహార కార్డుల కోసం ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి
కోనరావుపేట(కరీంనగర్): ఆహార భద్రత కార్డుల కోసం గ్రామస్థులు పోరుబాట పట్టారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల ప్రజలు సోమవారం ఉదయం ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కార్యాలయానికి తాళం వేశారు. ఆహార భద్రత కార్డులు అనర్హులకే ఇస్తున్నారని, అర్హులను విస్మరిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో రావాలని పట్టుబట్టారు. అయితే, ప్రస్తుతానికి పాత రేషన్ కార్డుల ప్రకారమే లబ్ధిదారులకు పంపిణీ జరుగుతుందని, అర్హులను తేల్చేందుకు మరోసారి విచారణ జరుపుతామని ఎమ్మార్వో నాగరాజమ్మ వారికి తెలిపారు. -
తహశీల్దార్ కార్యాలయం దిగ్బంధం
నల్లగొండ: ఆహారభద్రత కార్డుల మంజూరులో అలక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ప్రజలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామస్తులు సుమారు 100 మంది మండల కేంద్రానికి తరలివచ్చారు. ఆహారభద్రత కార్డులను మంజూరు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. తహశీల్దార్ వీర ప్రతాప్ను కార్యాలయం లోనే బంధించి వారంతా కార్యాలయం వెలుపల బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (తుర్కపల్లి) -
'సహ'దరఖాస్తు చించినందుకు ఆందోళన
కరీంనగర్: అడంగల్, పహణీల పరిశీలన కోసం సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న దరాఖాస్తును చించివేసిన అధికారులపై చర్య తీసుకోవాలని కె. మహేందర్ అనే వ్యక్తి తహసీల్ధార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధ్యులైన అధికారులపై చర్యతీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. (కమలాపూర్) -
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఉపాధి కూలీల ఆందోళన
డీ.హీరేహాళ్(అనంతపురం): డీ.హీరేహాళ్ మండలంలోని మురిడి గ్రామంలోని ఉపాధి కూలీలు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఉపాధి హామీ కూలీలకు గత మే నెల నుంచి కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. డబ్బులు ఇచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. దీంతో స్థానిక ఏపీఓ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
సీఐటీయూ ఆందోళన
అనంతపురం: పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను తొలగించటంతో సీఐటీయూ కార్మికులు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డరుకు విరుద్ధంగా ఏజెన్సీలను తొలగించటం అన్యాయమని వారు ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులకు ఏజెన్సీలను కట్టబెడుతున్నారని సీఐటీయూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (కనగానపల్లె) -
ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి
అనంతపురం: రాష్ట్రంలో ఇసుక ధరల పెంపును నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు మంగళవారం హిందూపురంలోని ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ మద్దతు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. -
రోడ్డెక్కిన బీడీ కార్మికులు
సదాశివనగర్(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని బీడీ కార్మికులు జీవన భృతికోసం గురువారం మధ్యాహ్నం ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రగతి శీల బీడీకార్మికుల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. దాదాపు 300 మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తమకు జీవన భృతి రూ.1000 ఇవ్వాలని, పనిదినాలు 26 రోజులకు పెంచాలని కోరారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీకార్మికుల వర్కర్స్ యూనియన్ ఏరియా కార్యదర్శి యాదయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇసుక దందా ఆపాలి.. లేకుంటే ఉద్యమమే
కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఇసుక మాఫియాను అరికట్టాలని లేదంటే మరో ఉద్యమం ప్రారంభిస్తామని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాసుల బాలరాజు హెచ్చరించారు. సోమవారం ఎమ్మార్వో ఆఫీసును ఆయన ముట్టడించారు. ఇసుక లారీలు మోతాదుకు మించి అధికలోడ్తో వెళ్తున్నాయన్నారు. అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు. కోటగిరి మండల మహిళలు, వృద్ధులు పింఛన్లు ఇప్పించాలని బాలరాజును వేడుకున్నారు. -
పెన్షన్ల కోసం రైతుల ఆందోళన
కరీంనగర్: చిగురు మామిడి మండలం ముల్కనూరులో అర్హులైన వారికి పెన్షన్లు అందటం లేదని ఆగ్రహానికి గురైన గ్రామస్తులు తహసీల్దారు కార్యాలయంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నారు. అనంతరం కార్యాలయం ఎదుట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. -
పాస్ పుస్తకాలు మాయం
లింగంపేట : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సీజ్ చేసి ఉంచిన పట్టాదారు పాస్ పుస్తకాలు మాయమయ్యా యి. గతేడాది అక్టోబర్లో అప్పటి జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ సుమారు 2 వందలకుపైగా పాస్ పుస్తకా లు, మరికొన్ని డాక్యుమెంట్లను అప్పటి లింగంపేట వీ ఆర్వో కిష్టారెడ్డి రూంలో నుంచి స్వాధీనం చేసుకుని సీ జ్ చేశారు. అనంతరం వాటిని తహసీల్ కార్యాలయం లో భద్రపరిచారు. కాగా గురువారం పలువురి సమక్షం లో తహశీల్దార్ సీజ్ చేసిన పాస్ పుస్తకాల మూటలను విప్పగా అందులో కేవలం 24 పట్టాదారు పాసు పుస్తకాలు మాత్రమే ఉండడంతో అధికారులు, ఆయా గ్రా మాల రైతులు విస్తుపోయారు. కాగా తహశీల్ కార్యాల యం నుంచి వందల సంఖ్యలో పట్టాపాస్ పుస్తకాలు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులకు కక్కుర్తి పడి ఒకరిద్దరు రెవెన్యూ సి బ్బంది కార్యాలయం నుంచి మాయం చేశారనే విమర్శ లు వినిపిస్తున్నాయి. నకిలీ పాసు పుస్తకాల వ్యవహారం లో అప్పటి తహశీల్దార్ టీఆర్.ఉమ, వీఆర్వో కిష్టారెడ్డి ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అందుకు బాధ్యులైన మరికొందరిపై కోర్టులో కేసు నడుస్తోంది. కాగా సీజ్ చే సిన వాటిలో నుంచి నకిలీ పాస్ పుస్తకాలు లేకుండా చే సి తప్పిదానికి పాల్పడ్డ అధికారులకు ఆసరా అందించ డం కోసం పాస్ పుస్తకాలను మాయం చేశారా!లేక డ బ్బులకు ఆశపడి అమ్ముకున్నారా!అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాగా పాస్ పుస్తకాలు, టైటిల్డీడ్లు మాయం కావడంపై తహశీల్దార్ సాలన్బీ యాహ్యాను ‘సాక్షి’ ప్రశ్నించగా జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్కు , కామారెడ్డి ఆర్డీఓకు వివరిస్తామన్నారు. తాను కొత్తగా వచ్చానని తనకేమీ తెలియదన్నారు. ఏడు పాస్ పుస్తకాలు స్వాధీనం లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామంలో బొ ల్లి సాయికుమార్ అనే వ్యక్తి ఇంటి నుంచి గురువారం ఏడు పట్టాదారు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వీఆర్వో రవికుమార్ తెలిపారు. సాయికుమార్ ఇంట్లో పాస్ పుస్తకాలు ఉన్నట్లు సమాచారం అందడం తో వెళ్లి పరిశీలించగా లభించాయన్నారు. ఇందులో మాల కమ్మరి చిన్న కాశయ్య(ముస్తాపూర్), ముత్తిరాజ య్య(శెట్పల్లి), పూజల రుక్మాబాయి, లంబాడి లక్ష్మి, ఇసాల్గారి సాయిలు(లింగంపేట), మన్నె ఆగమయ్య, బిక్కల సాయవ్వ(ఐలాపూర్)కు చెందిన పాస్ పుస్తకా లు లభించాయి. వీటిని తహశీల్దార్కు అందిస్తానని వీ ఆర్వో చెప్పారు. నాలుగు గ్రామాలకు చెందిన రైతుల పాస్పుస్త కాలు దొరకడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయికుమార్ గతంలో స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో పైరవీలు చేసి పలువురు రై తులకు రుణాలు ఇప్పించేవాడని, అందుకే అతడి దగ్గ ర పాస్ బుక్కులు దొరికి ఉంటాయని స్థానికులు చెప్పారు. -
మహిళ ఉద్యోగిపై కానిస్టేబుళ్ల వీరంగం
ఆర్టీసీ బస్సులో మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించి వీరంగం సృష్టించిన కానిస్టేబుళ్లపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. దేవరపల్లి గ్రామానికి చెందిన గారపాటి అనిత పద్మకుమారి గోపాలపురం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు విజయవాడలో చదువుకుంటున్నాడు. ఆదివారం విజయవాడ వెళ్లిన ఆమె కుమారుడిని చూసి సాయంత్రం తిరిగి ఆర్టీసీ బస్సులో దేవరపల్లి బయల్దేరింది. అదే బస్సులో ఏలూరు ఆశ్రం ఆస్పత్రి వద్ద ఏలూరు పోలీసు హెడ్ క్వాటర్స్లో ఉంటున్న ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు పోలి ప్రభుదాస్, కంకిపాటి రాజు, పంపన సూరిబాబులు విశాఖపట్నం నుంచి ఖైదీలను తీసుకు వచ్చేందుకు ఎక్కారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ప్రభుదాస్ పద్మకుమారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఆమె బ్యాగ్ను తనిఖీ చేయాలంటూ పట్టుబట్టడంతో భయపడిన పద్మకుమారి పోలీస్ స్టేషన్ వద్ద బస్సు ఆపాలంటూ డ్రైవర్కు చెప్పింది. పోలీస్ స్టేషన్ వద్ద ఎందుకు బస్సు ఆపమన్నావంటూ ప్రభుదాస్ పద్మకుమారి తలకు తన వద్ద ఉన్న గన్ను ఎక్కు పెట్టడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురై మౌనం వహించారు. మిగిలిన కానిస్టేబుళ్లు కూడా ప్రభుదాస్కు వత్తాసు పలికారని అనంతపల్లి పోలీసులకు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు ఆమె పేర్కొన్నారు. సోమవారం అనంతపల్లి పోలీస్ స్టేషన్కు కానిస్టేబుళ్లను తీసుకురాగా, అక్కడకు వచ్చిన పద్మకుమారి కానిస్టేబుళ్లను నిలదీసి ఓ మహిళా ఉద్యోగిపై దాడికి దిగడం ఏమిటని నిలదీయడంతో వారు క్షమాపణ కోరారు. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా ఉండాలంటే కేసు నమోదు చేయాలని బాధితురాలు కోరగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో స్పందించిన పొలీసులు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.