అధికార పార్టీ అండతో రాత్రికి రాత్రే కబ్జా | With the backing of the ruling party doing land kabja | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ అండతో రాత్రికి రాత్రే కబ్జా

Published Wed, Aug 27 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

అధికార పార్టీ అండతో రాత్రికి రాత్రే కబ్జా

అధికార పార్టీ అండతో రాత్రికి రాత్రే కబ్జా

హిందూపురం : అధికార పార్టీ అండ ఉంటే చాలు.. కోర్టు పరిధిలో ఉన్న భూమైనా కేవలం 24గంటల్లో కబ్జా చేసేయవచ్చు. కోట్లు విలువజే సే భూమైతే చాటు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయచ్చు. హిందూపురం పట్టణంలోని ధన్‌రోడ్డు సమీపంలో ఉన్న ఓ భూమిని సోమవారం రాత్రికి రాత్రే ఓ రియల్టర్ కబ్జా చేయడమే ఇందుకు ఉదాహరణ. బాధితుడు లక్ష్మినరసారెడ్డి తెలిపిన మేరకు పూర్తీ వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ధన్‌రోడ్డు సమీపంలో వై.తిమ్మారెడ్డి, లక్ష్మినరసారెడ్డి, రమేష్‌రెడ్డి అన్నదమ్ముల పేరిట (సర్వే నంబరు 66/1ఎ1) 18.40 ఎకరాల పొలం ఉంది.
 
ఇందులో మూడోవంతు భాగం 6.40 ఎకరాల స్థలాన్ని బెంగళూరుకు చెందిన రాంప్రసాద్, సంధ్యారాణి, రజని, నగేష్‌కు విక్రయించారు. వీరు ఆ స్థలాన్ని 2012లో వేరొకరికి విక్రయించారు. అయితే విక్రయ సమయంలో సర్వే నంబరు తప్పుగా రావడంతో బాధిత అన్నదమ్ములు కోర్టును ఆశ్రయించారు. నాటి నుంచి ఆ స్థలం కోర్టు పరిధిలో ఉంది. అయితే కాలక్రమేనా కోర్టు పరిధిలో ఉన్న 6.40ఎకరాల స్థలానికి అమాంతం ధర పెరిగిపోయింది. సుమారు రూ.10 కోట్లు విలువజేసే ఆ స్థలంపై బెంగుళూరుకు చెందిన రియల్టర్ టీ.నాగబాబు కన్ను పడింది. అంతే తడవుగా బెంగళూరుకు చెందిన రాంప్రసాద్, సంధ్యారాణి, రజని, నగేష్ పేరిట బినామీ అగ్రిమెంట్ సృష్టించుకున్నాడు.
 
విషయం తెలుసుకున్న బాధిత లక్ష్మినరసారెడ్డి పదిరోజుల క్రితం మరోమారు కోర్టును ఆశ్రయించాడు. ఈ లోగా నాగబాబు గతంలో పనిచేసిన తహశీల్దార్ విశ్వనాథ్, ఓ కానిస్టేబుల్ సాయంతో నకిలీ పాసుపుస్తకాలు సృష్టించాడు. తన అనుచరగణంతో సోమవారం రాత్రి 6.40ఎకరాల భూమిని కబ్జా చేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. రియల్టర్ ప్రస్తుత మంత్రికి బంధువని, అందుకే కోర్టు పరిధిలో ఉన్నా ఆ భూమిని కబ్జా చేశాడని బాధితుడు లక్ష్మినరసారెడ్డి సాక్షికి తనగోడు వెళ్లబోసుకున్నాడు. స్థల విషయమై కోర్టు స్పందించి ప్రస్తుత తహశీల్దార్‌కు మంగళవారం నోటీసులు జారీ చేసినట్లు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement