సివిల్‌ టాపర్స్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Mohan Reddy Congratulated To Civil Topper Durishetty Anudeep | Sakshi
Sakshi News home page

సివిల్‌ టాపర్‌ అనుదీప్‌కు ఎస్‌ జగన్‌ అభినందనలు

Published Sat, Apr 28 2018 12:28 AM | Last Updated on Sat, Apr 28 2018 3:35 AM

YS Jagan Mohan Reddy Congratulated To Civil Topper Durishetty Anudeep - Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

సాక్షి, గన్నవరం : అఖిల భారత సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. శుక్రవారం సివిల్స్‌- 2017 ఫైనల్‌ ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటాడం ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ గర్వకారణం అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సివిల్‌ టాపర్స్‌ కూడా వైఎస్‌ జగన్‌ అభినందించారు. వారి కృషికి ఫలితం దక్కిందని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

గత సంవత్సరం జూన్‌ 18న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి  యూపీఎస్సీ అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 వరకు సివిల్స్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించింది. యూపీఎస్సీ మూడు స్టేజిల్లో సర్వీసెస్‌ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్‌, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది.   

     టాపర్లు (తెలుగు రాష్ట్రాలు)                      ర్యాంకు
  దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్‌పల్లి)    1  
   శీలం సాయితేజ                                      43
   నారపురెడ్డి శౌర్య                                    100
   మాధురి                                              144
   వివేక్ జాన్సన్                                       195
   కృష్ణకాంత్‌ పటేల్‌                                    607
   వై అక్షయ్ కుమార్                                  624
 భార్గవ శేఖర్                                            816
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement