శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచండి: వైఎస్ఆర్సీపీ | ysrcp demands to maintain 854 feet of water level in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచండి: వైఎస్ఆర్సీపీ

Published Mon, Oct 27 2014 2:12 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచండి: వైఎస్ఆర్సీపీ - Sakshi

శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచండి: వైఎస్ఆర్సీపీ

శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 854 అడుగులు కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెళ్లి కలిశారు. శ్రీశైలంలో నీటిమట్టం 850 అడుగుల కన్నా తగ్గితే.. చెన్నైతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆయనకు చెప్పారు.

రాయలసీమ జిల్లాల్లో పంటలు ఎండిపోకుండా ఉండాలంటే కనీసం జనవరి 15వ తేదీ వరకైనా 850 అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలని నేతలు కోరారు. కృష్ణా బోర్డులో రాయలసీమ నీటి సమస్యపై చర్చించాలని తెలిపారు. కర్నూలులో కృష్ణా వాటర్ బోర్డు ఏర్పాటుచేస్తే.. అందరికీ అనువుగా ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement