
రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్ల ముద్రణ
ముంబై: ఆర్థిక శాఖ గత రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్లను జారీ చేసింది. ఈ నోట్ల ముద్రణ ఆపేసిన దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో రూపాయి నోట్లను జారీ చేసింది. 1994-95లో దాదాపు 4 కోట్ల రూపాయి నోట్ల ముద్రణయ్యాయని, ఒక్కో నోటుకు ముద్రణ వ్యయం రూ.1.48 అయిందని, ఆ తర్వాత ఈ నోట్లను ముద్రించలేదని ప్రభుత్వం తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 50 లక్షలు, ఈ ఏడాదిలో 15.5 కోట్లు చొప్పున రూపాయి నోట్లను ముద్రించామని పేర్కొంది. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు వెల్లడయ్యాయి.