Department of Finance
-
వామ్మో.. 61 ఏళ్లు.. సర్కారు బెంబేలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదలుకొని రానున్న ఐదేళ్లలో ఏకంగా 44 వేల మంది ప్రభుత్వ ఉద్యో గులు రిటైర్ కానున్నారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్ల కింద సగటున రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారంగా మారనుంది..’ఇది ఇటీవల 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలోని ఓ ప్రధాన అంశం. ఆర్థిక శాఖ లెక్క ప్రకారం రానున్న ఐదేళ్ల కాలంలో ఖజానాపై దాదాపు రూ.20 వేల కోట్ల భారం పడనుందని అంచనా. అంటే సరాసరి నెలకు రూ.350 కోట్ల పైచిలుకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు రిటైర్మెంట్లు లేకపోవడం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మళ్లీ రిటైర్మెంట్లు ప్రారంభం కావడం, అప్పటి నుంచి ఉన్న భారం ఒక్కసారిగా మీద పడడంతో ఎలా నెట్టుకురావాలో అర్థం కాక ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పదవీ విరమణ వయసు పెంపుతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగలేదు. దీంతో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించే అవసరం పడలేదు. ఆ తర్వాత నుంచి రిటైర్మెంట్లు మొదలవగా ఈ ఏడాది డిసెంబర్ వరకు మొత్తం 7,995 మంది రిటైరవుతారని చెబుతున్నారు. వీరికి తక్షణ బెనిఫిట్ల కోసం రూ.3,200 కోట్ల వరకు అవసరం కాగా సరిగ్గా చెల్లించలేని పరిస్థితి ఉంది. పైగా ఇక నుంచి ఈ భారం ప్రతి యేటా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కనీసం నెలకు రూ.350 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,800 కోట్లు అవసరం అవుతాయని, రానున్న ఐదేళ్ల కాలంలో సుమారు రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. ఏమేమి చెల్లించాలి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైరైన తర్వాత చెల్లించాల్సిన బెనిఫిట్లు చాలానే ఉంటాయి. వారి మూల వేతనానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలను కలుపుకొని లెక్కించిన వేతనానికి 10 రెట్లు ఆర్జిత సెలవుల (లీవ్ శాలరీ) రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లీవ్ శాలరీల మొత్తం ఒక్కో ఉద్యోగికి సగటున రూ.8 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీంతో పాటు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమ్యుటేషన్ రూపంలో మరో రూ.20 లక్షలు చెల్లించాలి. ఈ లెక్కల ప్రకారం చూస్తే కనీసం రూ.40 లక్షలు ఒక్కో ఉద్యోగికి చెల్లించాలన్న మాట. రానున ఐదేళ్లలో అంటే 2028 నాటికి రిటైర్ అయ్యే సంఖ్య నెలకు 10 వేలకు చేరుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అప్పుడు నెలకు కనీసం రూ.400 కోట్లు (అప్పటికి) అవసరమని అంచనా. గడ్డు పరిస్థితుల్లో ఖజానా రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి ప్రకారం మార్చి నెల నుంచి రిటైరైన వారికి బెనిఫిట్లు చెల్లించడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది. సరెండర్ లీవ్స్ లాంటి చెల్లింపులు కూడా గగనమవుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించింది. 2022 జూలై డీఏ ప్రకటించినా మరో నాలుగు డీఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు వారి జీఎల్ఐతో పాటు జీపీఎఫ్లపై వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఈ చెల్లింపుల విషయంలో ఆర్థిక శాఖ తలలు పట్టుకుంటోంది. తమ బిల్లుల కోసం ఉద్యోగులు రోజూ సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. రిటైర్మెంట్కు మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళతాయని, ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వ వీలును బట్టి ఆర్థిక అంశాలను సర్దుబాటు చేసుకుని ఉద్యోగుల బెనిఫిట్లు చెల్లించాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
చిన్న పరిశ్రమల వికాసంపై ఫోకస్
సాక్షి, అమరావతి: అత్యధికులకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లను చేయి పట్టి నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలన్నింటినీ గుర్తించి ‘ఉద్యమ్’ పోర్టల్లో నమోదు చేయించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోపాటు మార్కెటింగ్ అవకాశాలు, బ్యాంకుల నుంచి రుణాలందించడం, అవకాశాలను అంది పుచ్చుకుంటూ విస్తరించే విధంగా అవకాశాలు కల్పించడం, ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయించడం, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించింది. ‘ఉద్యమ్’ పోర్టల్లో నమోదుకు చర్యలు ఇప్పటికీ ఉద్యమ్ పోర్టల్లో నమోదు కాని ఎంఎస్ఎంఈలు 45 లక్షలకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని త్వరతగతిన గుర్తించి ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేయించే విధంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఎంఎస్ఎంఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉద్యమ్ పోర్టల్లో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 7.52 లక్షలు కాగా.. వీటిలో 1.6 లక్షల పరిశ్రమలు తయారీ రంగానికి చెందినవి కాగా 5.7 లక్షల యూనిట్లు సేవా రంగానికి చెందినవి. వీటిలో 96 శాతం యూనిట్లు అత్యధికంగా సూక్ష్మ రంగానికి చెందినవే కావడం గమనార్హం. ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోళ్లు తప్పనిసరి రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విభాగాలు ఏటా చేసే కొనుగోళ్లలో 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈ యూనిట్ల నుంచే ఉండాలంటూ జీవోను జారీ చేసింది. కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలు మూతపడకుండా చేయూతనిచ్చే విధంగా ఈ జీవోను తీసుకొచ్చింది. అయినా.. కొన్ని ప్రభుత్వ విభాగాలు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తున్నట్టు ప్రభుత్వ దృష్టికి రావడంతో రాష్ట్ర ఎంఎస్ఎంఈలను కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తే అటువంటి బిల్లులకు ఆమోదం తెలపవద్దంటూ ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ఎంఎస్ఎంఈలకు చాలా ప్రోత్సాహం లభిస్తుందని ఎఫ్ఎస్ఎంఈ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ఏసీబీకి చిక్కిన ఆర్థిక శాఖ సెక్షన్ అధికారి
సాక్షి, అమరావతి/నగరంపాలెం: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లబ్దిదారు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ(సంక్షేమ విభాగం–2) సెక్షన్ అధికారి ఒంటెద్దు నాగభూషణ్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు నగరం కొరిటెపాడులోని గౌతమినగర్ 4వ వీధికి చెందిన ఒంటెద్దు నాగభూషణరెడ్డి వెలగపూడి ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖ భవనం–2 (సంక్షేమం–2)లో సెక్షన్ అధికారిగా ఉన్నారు. మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా దీవెన పథకానికి కర్నూలులోని బాలాజీనగర్కు చెందిన మహమ్మద్ నదీమ్ హుస్సేన్ తన కుమారుడు అజంతుల్లా షరీఫ్ కోసం దరఖాస్తు చేశారు. దీంతో అజంతుల్లా షరీఫ్కు సుమారు రూ.15 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన ఉపకార వేతనం విడుదల చేసేందుకు సెక్షన్ అధికారి నాగభూషణరెడ్డి దరఖాస్తుదారు మహమ్మద్ నదీమ్ హుస్సేన్ను రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు కర్నూలు జిల్లాలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. వారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదును బదలాయించారు. ఈ క్రమంలో మహమ్మద్ నదీమ్ హుస్సేన్ శుక్రవారం ఉదయం 10.10 గంటలకు నాగభూషణరెడ్డికి సచివాలయ ఆవరణలోని పార్కింగ్ ప్రదేశంలో రూ.40 వేలు లంచం ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్యాంట్ జేబులోని డబ్బులను స్వా«దీనం చేసుకున్నారు. నాగభూషణ్ రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు తొలుత రూ.10 వేలు ఫోన్ పే చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అదనపు ఎస్పీ మహేంద్ర మత్తే, అధికారులు పాల్గొన్నారు. -
Telangana: మనకొచ్చేది ఎంత?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయోననే దానిపై తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదల, ఎఫ్ఆర్బీఎం పరిమితి, అమల్లోకి రాని నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాల సిఫారసుల విషయంలో కేంద్రం ఏం చేస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదాతోపాటు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రం ఈ ఏడాదైనా సానుకూలంగా స్పందిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అప్పులపై పరిమితులు, గ్రాంట్ల బకాయిలు, పన్నుల్లో వాటాల తగ్గింపు, సిఫారసులు అమలుకాని కారణంగా రాష్ట్రానికి ఇప్పటివరకు దాదాపు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వివిధ అంచనాల్లో ఆర్థికశాఖ.. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎలా ఉంటుందోనని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడమే కాకుండా అప్పులు తెచ్చుకునే పరిమితుల కారణంగా రాష్ట్ర బడ్జెట్లో రూ.15వేల కోట్లకుపైగా లోటు వచి్చందని.. ప్రత్యేక గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడంతో ఈ ఏడాది దాదాపు రూ.30వేల కోట్ల వరకు నష్టపోయామని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కార్పొరేషన్లకు పూచీకత్తు ఇచ్చి తీసుకునే రుణాలను రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కింద ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురాకుండా వెసులుబాటు కల్పి స్తుందా? పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు ఎంత ప్రతిపాదిస్తుంది? కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో నిర్మలా సీతారామన్ పెద్ద మనసు చూపుతారా? ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం, ఉపాధి హామీ, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, మహిళాశిశు సంక్షేమ పద్దులను పెంచడం ద్వారా పరోక్షంగానైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తారా’అన్న కేంద్ర బడ్జెట్లో తేలిపోనుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మేరకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, ఇతర నష్టాలు ►పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా రెవెన్యూ నష్టం: రూ.33,712 కోట్లు ►నీతి ఆయోగ్ మిషన్ భగీరథ సిఫారసులు: రూ.19,205 కోట్లు ►నీతి ఆయోగ్ మిషన్ కాకతీయ సిఫారసులు: రూ.5 వేల కోట్లు ►ఏపీ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్ బకాయిలు: రూ.17,828 కోట్లు ►ఎఫ్ఆర్బీఎం పరిమితుల కారణంగా 2022–23లో అప్పుల నష్టం: రూ.15,303 కోట్లు ►ఆంక్షలు అమలు చేయలేదంటూ జీఎస్డీపీలో 5 శాతం రుణ పరిమితితో నష్టం: రూ.6,104 కోట్లు ►15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లు: రూ.5,374 కోట్లు ►వెనుకబడిన జిల్లాలకు నిధుల బకాయిలు: రూ.1,350 కోట్లు ►14వ ఆర్థిక సంఘం సిఫారసుల బకాయిలు: రూ.817 కోట్లు ►15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ప్రత్యేక నిధులు: రూ.723 కోట్లు ►ఏపీకి పొరపాటుగా బదిలీ అయిన సీసీఎస్ పథకాల నిధులు: రూ.495 కోట్లు ►2020–21లో పౌష్టికాహార పంపిణీ కోసం ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులు: రూ.171 కోట్లు -
మరో రూ.1,000 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల రుణం సమకూర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా తీసుకున్న ఈ అప్పును 21, 22 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించనుంది. మంగళవారం ఈ వేలం జరిగింది. రూ.1,000 కోట్లతో ఈ ఏడాది అప్పుల మొత్తం రూ.27,500 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.47,500 కోట్లు రుణాల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఏడాది మధ్యలో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన మేరకు ఆ రుణం రూ.39 వేల కోట్లకు తగ్గింది. ఇప్పటికి రూ.27వేల కోట్లకు పైగా రుణాలు సమకూరిన నేపథ్యంలో మిగిలిన సుమారు రూ.12 వేల కోట్ల రుణాలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. డిసెంబర్లో మిగతా రుణాలు..! కాగ్ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి తగ్గట్టుగానే ప్రతి నెలా ఖర్చులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తలపెట్టిన పలు కార్యక్రమాల అమలుకు అదనపు నిధులు అవసరమవుతున్నాయి. వచ్చే నెలలో ఇవ్వాల్సిన రైతుబంధుతో పాటు దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్ల లాంటి కార్యక్రమాల కోసం మరిన్ని నిధులు అవసరం కానున్నాయి. దీంతో ఈ ఏడాది డిసెంబర్లోనే తమకు మిగిలిన రుణాలు సమకూర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆర్థిక శాఖ వర్గాలు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఆర్బీఐ అనుమతినిస్తే వచ్చే నెలలోనే ఆ మేరకు రుణాలు తీసుకునే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. తమపై కక్ష సాధింపులో భాగంగా ఇప్పటికే రుణాల్లో కోత విధించారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్థికశాఖ పెట్టిన ఈ ప్రతిపాదన ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సిందే. -
ఆర్బీఐ తాజాగా నివేదిక విడుదల.. అప్పుల్లో.. అడుగునే
సాక్షి, అమరావతి: ఒకసారి శ్రీలంకతో పోలుస్తూ.. మరోసారి రూ.పది లక్షల కోట్లంటూ రాష్ట్ర అప్పులపై తమకు నచ్చినట్లు పుంఖాను పుంఖాలుగా ఓ వర్గం మీడియా ప్రచురిస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదని ఆర్బీఐ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది. 2021–22 ఆర్థిక ఏడాది మార్చి నాటికి వివిధ రాష్ట్రాల అప్పులపై ఆర్బీఐ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇన్స్టిట్యూషన్లతో పాటు స్టేట్ డెవలప్మెంట్ రుణాలు (మార్కెట్ బారోయింగ్), విద్యుత్ బాండ్లు, నాబార్డు, ఇతర బాండ్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కేంద్రం నుంచి రుణాలు, అడ్వాన్స్లు, నేషనల్ సెక్యూరిటీ ఫండ్, నేషనల్ కో–ఆపరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపాజిట్స్ అండ్ అడ్వాన్స్ ద్వారా తీసుకున్న మొత్తం రుణాలను రాష్ట్రాల వారీగా ఆర్బీఐ వెల్లడించింది. అన్ని రకాల రుణాలు కలిపి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 2022 మార్చి నాటికి రూ.3,98,903 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. 2019 మార్చి నెలాఖరు నాటికి అంటే చంద్రబాబు పాలన చివరి దశలో రాష్ట్రం అప్పులు రూ.2,64,451 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. 2019 ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు సర్కారు ఏప్రిల్ 4వతేదీన ఒకేసారి రూ.4,000 కోట్లు, మే 2వ తేదీన రూ.500 కోట్లు, మే 7వతేదీన 500 కోట్లు, మే 14వ తేదీన రూ.1,000 కోట్లు అప్పులు చేసింది. దీంతో మరో రూ.ఆరు వేల కోట్ల మేర చంద్రబాబు సర్కారు అప్పు చేసినట్లైంది. దీంతో చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు రూ.2,70,451 కోట్లకు చేరుకున్నాయి. ఇంతకంటే ప్రామాణికం ఇంకేముంది? అప్పులపై ఆర్బీఐ నివేదిక కంటే ప్రామాణికం ఏదీ ఉండదని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చాలనే దురుద్దేశంతోనే రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ ఓ వర్గం మీడియా బురద చల్లుతోందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అప్పులు ఎన్ని ఉన్నాయో ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా చెప్పినందున ఇకనైనా తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఆర్థిక శాఖ వర్గాలు సూచిస్తున్నాయి. ఆ రెండు పత్రికలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తున్నాయని పేర్కొంటున్నాయి. నిపుణుల పేరుతో ఓ వర్గం మీడియా వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పుల వివరాలను ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ పత్రంలో స్పష్టంగా పేర్కొన్నప్పటి ఆ పత్రికలు పట్టించుకోకుండా కథనాలు అల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏడు రాష్ట్రాల తరువాతే ఏపీ.. దేశంలో ఏడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే అధికంగా అప్పులు చేశాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రానికి అప్పులున్నాయని తెలిపింది, అత్యధిక అప్పుల్లో రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో మహారాష్ట్ర, నాలుగో స్థానంలో పశ్చిమబెంగాల్, ఐదో స్థానంలో రాజస్థాన్, ఆరో స్థానంలో కర్నాటక, ఏడో స్థానంలో గుజరాత్ రాష్ట్రాలున్నాయి. ఆ తరువాత.. అంటే 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. -
మరో 2,440 సర్కారీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: విద్య, పురావస్తు శాఖల్లో మొత్తం 2,440 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ విద్య, కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యాశాఖలో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత విభాగాలు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వాటిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ విద్యలో.. అరబిక్–02, వృక్షశాస్త్రం–113, వృక్షశాస్త్రం (ఉర్దూ)–15, రసాయన శాస్త్రం–113, కెమిస్ట్రీ (ఉర్దూ)–19, పౌరశాస్త్రం–56, పౌరశాస్త్రం (ఉర్దూ)–16, సివిక్స్ (మల్టీమీడియం)–1, కామర్స్–50, కామర్స్ (ఉర్దూ)–7, ఎకనామిక్స్–81, ఎకనామిక్స్ (ఉర్దూ)–15, ఇంగ్లిష్–153, ఫ్రెంచ్–2, హిందీ–117, హిస్టరీ–60, హిస్టరీ (ఉర్దూ)–12, హిస్టరీ/సివిక్స్–17, హిస్టరీ/సివిక్స్ (ఉర్దూ)–5, హిస్టరీ/సివిక్స్ (మల్టీమీడియం)–1, గణితం–154, గణితం (ఉర్దూ)–09, భౌతికశాస్త్రం–112, భౌతికశాస్త్రం (ఉర్దూ)–18, సంస్కృతం–10, తెలుగు–60, ఉర్దూ–28, జంతుశాస్త్రం–128 జంతుశాస్త్రం (ఉర్దూ)–18 కలిపి 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తారు. మరో 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక విద్యలో 359 పోస్టులు.. సాంకేతిక విద్యలో 359 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్–4, ఆటోమొబైల్ ఇంజనీరింగ్–15, బయోమెడికల్ ఇంజనీరింగ్–3, కెమికల్ ఇంజనీరింగ్–1, కెమిస్ట్రీ–8, సివిల్ ఇంజనీరింగ్–82, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్–24, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్–41, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్–1, ఫుట్వేర్ టెక్నాలజీ–5, జియోలజీ–1, లెటర్ ప్రెస్–5, మెకానికల్ ఇంజనీరింగ్ 36, మెటలర్జీ–5, ప్యాకింగ్ టెక్నాలజీ–3, ఫార్మసీ–4, ఫిజిక్స్–5, ట్యానరీ–3, టెక్స్టైల్ టెక్నాలజీ–1 పోస్టులు కలిపి 247 పోస్టుల్ని లెక్చరర్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఇవికాక జూనియర్ ఇన్స్ట్రక్టర్–14, లైబ్రేరియన్–31, మ్యాట్రన్–5, ఫిజికల్ డైరెక్టర్–37, ఎలక్టీష్రియన్–25 పోస్టుల్నీ భర్తీ చేస్తారు. ఉన్నత విద్యలో.. కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్లో లెక్చరర్ విభాగంలో ఇంగ్లిష్–23, తెలుగు–27, ఉర్దూ–2, సంస్కృతం–5, స్టాటిస్టిక్స్–23, మెక్రోబయోలజీ–5, బయోటెక్నాలజీ–9 అప్లయ్డ్ న్యూట్రిషియన్–5, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్–311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్–39, కామర్స్–బిజినెస్ అనలటిక్స్(స్పెషలైజేషన్)–8, డెయిరీ సైన్స్–8, క్రాప్ ప్రొడక్షన్–4, డేటా సైన్స్–12, ఫిషరీస్–3, కామర్స్–ఫారిన్ ట్రేడ్ (స్పెషలైజేషన్)–1, ఆర్కివ్స్, డిస్ట్రిక్ట్ గెజిటర్స్ విభాగంలో 6 రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు కలిపి మొత్తం 491 పోస్టులను భర్తీ చేస్తారు. ఇవికాక లైబ్రేరియన్–24, ఫిజికల్ డైరెక్టర్–29 పోస్టులున్నాయి. పాలనాపరమైన అనుమతి లభించడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ ఆర్కివ్స్లో 8 పోస్టులు.. డైరెక్టర్ స్టేట్ ఆర్కివ్స్ విభాగంలో 8 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో ఆర్కివిస్ట్–2, అసిస్టెంట్ ఆర్కివిస్ట్–2, అసిస్టెంట్ లైబ్రేరియన్–1, జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్(ఉర్వూ, పర్షియన్)–1, రిసెర్చ్ అసిస్టెంట్–1, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ (ఉర్దూ, పర్షియన్)–1 పోస్టులున్నాయి. -
50 వేల ఉద్యోగాల భర్తీపై.. నేడే కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి దశలో భర్తీ చేయాలని భావిస్తున్న 50 వేల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలపై ఆర్థిక శాఖ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై.. గతంలో ఇచ్చిన ఖాళీలపై మరోసారి తుది నిర్ధారణకు రానున్నారు. ఆదివారం శాఖల వారీగా భర్తీ చేయాల్సిన 50 వేల పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి.. ఈనెల 13న సీఎం కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నారు. మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఆయా విభాగాల అధిపతులు ఈ సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, పౌరసరఫరాలు, వినియోగదారుల శా ఖ, అటవీ పర్యావరణ, సాంకేతిక శాఖలతో, 10.30 గంటలకు నీటిపారుదల శాఖ, కార్మిక, ఉపాధి కల్పన, హోం, న్యాయ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 11 గంటలకు చట్టసభలు, పురపాలక, పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖల అధికారులు, 11.30 గంటలకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం రెవెన్యూ విభాగాల అధికారులతో, 12 గంటలకు రవాణా, రహదారులు, భవనాల శాఖ, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశమవుతారు. 12.30 గంటలకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఖాళీల భర్తీపై నివేదికలు ఇవ్వనున్నారు. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలు కూడా.. పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలకు సంబంధించిన సమాచారం కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు ఈ సమావేశంలో సమర్పించనున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి జోనల్ వ్యవస్థ చిక్కుముడులు విడిపోవడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎలాంటి ఇబ్బందులు లేనందున తక్షణమే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ లెక్కలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి జనవరి నుంచే ఈ కసరత్తు జరిగినా.. కోవిడ్ కారణంగా భర్తీ ప్రక్రియ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొత్త జోన్లకు ఇటీవలే రాష్ట్రపతి నుంచి ఆమోదం రావడంతో మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుంటోంది. -
ఆర్థిక క్రమశిక్షణ వైపే అడుగులు
సాక్షి, అమరావతి: ఆర్థిక నిర్వహణలో మరింత పొదుపు పాటించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ (ఏపీ ట్రాన్స్కో) నిర్ణయించింది. చౌక విద్యుత్ కొనుగోళ్లు, వృధా వ్యయాన్ని తగ్గించడంపైనే రాబోయే కాలంలో దృష్టి పెట్టాలని తీర్మానించింది. ఏపీ ట్రాన్స్కో బోర్డు సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా ట్రాన్స్కో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► వృధాను అరికట్టడంలో గత ఏడాదిగా తీసుకున్న నిర్ణయాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయమైందని, ముందస్తు వ్యూహంతో చౌక విద్యుత్ను కొనుగోలు చేయడం వల్ల రూ.700 కోట్లు మిగిల్చినట్టు పేర్కొన్నారు. ► తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, యూపీ వంటి రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఈ విషయౖ మె ఆయా రాష్ట్రాలు సంప్రదించినట్టు వివరించారు. ► గడచిన ఏడాదిలోనే రాష్ట్ర విద్యుత్ సంస్థలు రూ.4,783.23 కోట్లు ఆదా చేయగలిగాయని శ్రీకాంత్ ప్రస్తావించారు. 2018–19లో రూ. 48,110.79 కోట్లున్న విద్యుత్ సంస్థల వ్యయాన్ని 2019–20 నాటికి రూ.43,437.56 కోట్లకు తగ్గించినట్టు తెలిపారు. ► విద్యుత్ కొనుగోలుకు ముందే ప్రణాళిక రూపొందించడం వల్ల యూనిట్ రూ.1.63 నుంచి రూ.2.80 మధ్యే లభించిందని, ఇది విద్యుత్ సంస్థల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించిందని సమావేశం అభిప్రాయపడింది. ► విద్యుత్ సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించే క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును బోర్డు ప్రశంసించింది. గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సబ్సిడీలకు ఈ ఏడాది రూ.11,311.70 కోట్లు విడుదల చేయడం, రూ.8,353.58 కోట్లు వ్యవసాయ సబ్సిడీ ఇవ్వడంపై ట్రాన్స్కో బోర్డు హర్షం వ్యక్తం చేసింది. ► విద్యుత్ సంస్థల ఆర్థిక నిర్వహణ పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ట్రాన్స్కో జేఎండీ చక్రధర్బాబును బోర్డు ప్రత్యేకంగా అభినందించింది. ► విద్యుత్ సంస్థలకు రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇవ్వడం లేదని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ గుర్తు చేశారు. -
కోవిడ్–19 నియంత్రణకు రూ.374 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్ 19 నియంత్రణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా వివిధ పద్దులు కింద అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విపత్తుల సహాయ నిధి టీఆర్ 27, గ్రీన్ ఛానెల్ పీడీ ఖాతాలు, జిల్లా మినరల్ ఫండ్ కింద మొత్తం రూ.373.76 కోట్లు అందుబాటులో ఉంచినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిధులను.. క్వారంటైన్లో ఉన్నవారికి తాత్కాలిక వసతి, ఆహారం, దుస్తులు, ఆరోగ్య సంరక్షణకు,స్క్రీనింగ్, కాంటాక్ట్లో ఉన్నవారిని గుర్తించడానికి, కోవిడ్ 19 నియంత్రణ, చికిత్సలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు, కోవిడ్ నియంత్రణలో భాగంగా సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య, పురపాలక, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి సంక్షేమానికి చర్యలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీకి చెందినవారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని కోవిడ్–19 నియంత్రణ చర్యల రాష్ట్ర స్థాయి సమన్వయాధికారి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. లాక్డౌన్ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై త్వరలో ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు. లాక్డౌన్పై ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నదానిపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి నేతృత్వంలో టాస్క్ఫోర్సు కమిటీ పనిచేస్తోందన్నారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర, విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబులతో కలిసి కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 53 వేల మంది కూలీలకు రాష్ట్ర వ్యాప్తంగా 326 షెల్టర్లు ఏర్పాటు చేసి ఆహార వసతి కల్పించాం. ► పరిశ్రమల్లో పనిచేస్తున్న మరో 50 వేల మంది కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు మరో 208 షెల్టర్లు ఏర్పాటు చేశాయి. ► పది రాష్ట్రాల్లో చిక్కుకున్న 8 వేల మంది ఏపీకి చెందిన వారి క్షేమం కోసం చర్యలు. -
డబ్బు.. జాగ్రత్త!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా లాక్డౌన్తో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో 2020–21 ఆర్ధిక ఏడాదికి సంబంధించి మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులను జాగ్రత్తగా వ్యయం చేయాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. అనవసర రంగాలకు కాకుండా చాలా జాగ్రత్తగా అవసరమైన రంగాలకు మాత్రమే నిధులను వ్యయం చేయాలని పేర్కొంది. కేటాయింపులకు మించి పైసా కూడా శాఖలు వ్యయం చేయరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులను సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆయా శాఖలకు పంపిణీ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► కోవిడ్–19 కారణంగా లాక్డౌన్ విధించినందున రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో శాఖాధిపతులు, డీడీవోలు గ్రాంట్లను స్తంభింప చేయకుండా ఆ నిధులను ఖజానాకు సరెండర్ చేయాలి. ► పలుశాఖలు, రంగాలకు మూడు నెలలకు అనుమతించిన మేరకే వ్యయం చేయాలి. అంతకు మించి వ్యయం చేయకూడదు. ► సంబంధిత పనులకు నిధులుంటేనే శాఖాధిపతులు బిల్లులను ప్రాసెస్ చేయాలి. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేకుండా శిక్షణ (వైద్యం మినహా), ఫర్నీచర్ కొనుగోళ్లు, ప్రకటనల జారీ లాంటివి చేయకూడదు. ఇన్స్టిట్యూషన్లకు ఎటువంటి గ్రాంట్లను మంజూరు చేయకూడదు. ► కేంద్ర సహాయ, రాష్ట్ర అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత ఏజెన్సీ నుంచి నిధులు వచ్చిన తరువాత రాష్ట్ర వాటా నిధులను ఇవ్వాలి. ► ఓటాన్ అకౌంట్ మూడు నెలల బడ్జెట్లో కొత్త పథకాలకు సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చిన తరువాతే నిధులు విడుదల చేయాలి. ► వేతనాలు, పెన్షన్లు, సహాయ పునరావాసం తదితర అత్యవసర రంగాలకు బడ్జెట్ కంట్రోల్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులో పేర్కొంది. -
సాగు నీరు..రుణాల జోరు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపు ఆశించిన మాదిరి లేకున్నా ఉపశమనం కలిగించేలా ఉంది. 2020–21 వార్షిక బడ్జెట్లో సాగునీటి రంగానికి మొత్తంగా రూ. 11,053.55 కోట్లు కేటాయించగా అందులో నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 3,606.58 కోట్ల మేర కేటాయింపులు చేసింది. గతేడాది బడ్జెట్లో కేటాయించిన నిధులకన్నారూ. 2,577.38 కోట్లు మేర కేటాయింపులు పెంచింది. గతంకన్నా భిన్నంగా ప్రాజెక్టుల పంపుల నిర్వహణ భారీగా ఉండనుండటంతో దానికింద నిర్వహణ పద్దు నిధులను పెంచారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, దేవాదుల ప్రాజెక్టులకు అధిక కేటా యింపులు చేశారు. అయినప్పటికీ ఈ నిధులతో ప్రాజెక్టులు పూర్తికాకుంటే ఇప్పటికే ఏర్పాటు చేసిన వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొనే రుణాల ద్వారానే వాటిని పూర్తి చేయనున్నారు. అడిగింది కొండంత.. ఇచ్చింది కొంతే.. ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన కేటాయింపుల నేపథ్యంలో గతేడాది సాగునీటికి కేవలం రూ. 8,476.17 కోట్లే కేటాయించారు. ఈ ఏడాది కూడా మాంద్యం పరిస్థితులున్నా గతేడాదికన్నా రూ. 2,57 7,38 కోట్ల మేర పెంచి మొత్తంగా రూ.11,0 53.55 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్ లో కనీసం రూ. 21 వేల కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖకు సాగునీటిశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో కాళేశ్వరానికి రాష్ట్ర బడ్జెట్కింద రూ. 7 వేల కోట్లు కోరింది. కానీ ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది రూ. 805.47 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు కు రూ. 3,500 కోట్లు, దేవాదులకు రూ. 500 కోట్లు, తుపాకులగూడేనికి రూ. 500 కోట్లు కేటాయించాలన్న సాగునీటిశాఖ విజ్ఞప్తిని సర్కా రు పెద్దగా పట్టించుకోలేదు. పాలమూరుకు రూ. 368.58 కోట్లు, దేవాదులకు రూ. 292.38 కోట్లు, తుపాకులగూడేనికి రూ.73.83 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా,నెట్టెంపాడు,కోయిల్సాగర్ ప్రాజెక్టుల పూర్తికి రూ. 1,200 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కేటాయింపులు రూ. 50 కోట్లకే పరిమితమయ్యాయి. బకాయిలూ భారీగానే... సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది భారీగానే పెండింగ్ బకాయిలున్నాయి. రూ. 11,965.23 కోట్ల బకాయిలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ప్రధాన పనులకు సంబంధిం చి బకాయిలు రూ. 5,550 కోట్లు ఉండగా రుణాల కోసం కార్పొరేషన్లకు మార్జిన్ మనీ కింద ఇవ్వాల్సినవి రూ. 1,695 కోట్లు, భూసేకరణ బకాయిలు రూ. 1,585 కోట్లు, విద్యుత్ బకాయిలు రూ. 3,072 కోట్ల మేర ఉన్నాయి. పాలమూరు పరిధిలో రూ. వెయ్యి కోట్లు, కాళేశ్వరం పరిధిలో రూ. 1,500 కోట్లు, ఎల్లంపల్లిలో రూ. 350 కోట్ల మేర ఉన్నాయి. ఇక ఈ ఏడాది మైనర్ ఇరిగేషన్కు కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే రూ. 42 కోట్లు తగ్గించి రూ. 602.45 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రూ. 402 కోట్లు కేటాయించారు. అయితే దీని బకాయిలే రూ. 550 కోట్ల మేర ఉన్నాయి. ఆదుకునేది అప్పులే ప్రధాన ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఖరీఫ్, రబీ నాటికి భారీ ఆయకట్టు లక్ష్యాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటితో 360 టీఎంసీలను ఎత్తిపోయా లని ప్రణాళిక వేశారు. దీంతోపాటే సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేయాలనే లక్ష్యం కూడా ఉంది. ఈ ఏడాది డిసెంబర్కల్లా దేవాదులలో 100% పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే రాష్ట్ర నిధులతో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రూ. 61,500 కోట్ల రుణ సేకరణ చేపట్టగా అందులో రూ. 38 వేల కోట్ల రుణాల ద్వారానే ఖర్చు జరిగింది. ఇక సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ. 17 వేల కోట్ల రుణ సమీకరణ చేయగా అందులో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశారు. 2019–20 వార్షిక బడ్జెట్ నిధుల ద్వారా రూ. 8 వేల కోట్లు ఖర్చు జరగ్గా రుణాల ద్వారా చేసిన ఖర్చు రూ. 14 వేల కోట్లుగా ఉంది. ఈ ఏడాది సైతం రూ. 20 వేల కోట్ల రుణాల ద్వారా ఖర్చు చేసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. అందులో కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ. 13 వేల నుంచి రూ. 15 వేల కోట్లు ఖర్చు జరిగే అవకాశం ఉండగా మిగతా ప్రాజెక్టులకు మరో రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. డబుల్ రోడ్లకు బ్యాంకు రుణాలే దిక్కు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు నిర్మించే డబుల్ రోడ్లకు ఈసారి బ్యాంకు రుణాలే ఆధారం కానున్నాయి. ఈ రోడ్లకు ప్రణాళికలు రూపొందించిన కొత్తలో విరివిగా నిధులు అందగా, గత రెండు మూడేళ్లుగా చాలినన్ని విడుదల కావడం లేదు. ఈసారి కూడా బడ్జెట్ కేటాయింపులు దాదాపు అలాగే ఉన్నాయి. డబుల్ రోడ్లకు తాజా బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించగా.. అందులో ప్రగతి పద్దు కింద రూ.655 కోట్లు చూపారు. గత బడ్జెట్లో దీనికి కేవలం రూ.187 కోట్లు కేటాయించారు. అంతకు ముందు బడ్జెట్లో అది రూ.460 కోట్లుగా చూపారు. 2017–18లో రూ.2,500 కోట్లు వచ్చాయి. ఆ సంవత్సరం పనులు ఊపుగా జరిగాయి. ఆ తర్వాత నుంచి నిధులు తక్కువగా రావడంతో కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో బిల్లులు పేరుకుపోయాయి. ఇటీవల బ్యాంకు లోన్ ద్వారా ఆ బకాయిలు తీర్చారు. ఇప్పుడు కూడా చాలినన్ని నిధులు వచ్చే అవకాశం లేనందున మళ్లీ బ్యాంకు రుణంపై ఆధారపడాల్సి ఉంది. రాష్ట్రంలో 65% పనులు పూర్తయ్యాయి. మరో 35% పనులు చేపట్టాల్సి ఉంది. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు.. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, నగరంలో పోలీసు కమాం డ్ కంట్రోల్ భవనం తదితరాల కోసం రూ.550 కోట్లు కేటాయించారు. తెలంగాణ కళాభారతికి రూ.50 కోట్లు కేటాయించారు. గజ్వేల్ ప్రాంత అభివృద్ధి అథారిటీకి ఈసారి నిధులు కేటాయించలేదు. బియ్యం సబ్సిడీకి రూ.2,362 కోట్లు రాష్ట్రంలో ప్రజా పంపి ణీ వ్యవస్థ కింద సరఫరా చేసే సబ్సిడీ బియ్యం కోసం బడ్జెట్లో రూ.2,362 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రూపాయికే కిలో బి య్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తంగా 2.80 లక్షల మంది లబ్ధి్ధదారులకు సబ్సిడీ బియ్యం సరఫరాకు వీలుగా ఈ నిధుల కేటాయింపు జరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.7 కోట్లు అదనంగా కేటాయించారు. -
మాంద్యాన్ని అధిగమించి.. జాతీయ సగటు మించి...
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యంతో ప్రపంచ, జాతీయ వృద్ధి రేటు భారీగా పతనమైన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వృద్ధి రేటు చెక్కు చెదరకుండా దృఢంగా నిలబడింది. 2019లో ప్రపంచ వృద్ధిరేటు 2.4 శాతానికి పతనమైందని, ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యల్పమని ప్రపంచబ్యాంకు విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక అవకాశాల నివేదిక పేర్కొంటోంది. 2019–20లో జాతీయ వృద్ధిరేటు సైతం 5 శాతానికి పడిపోనుందని అంచనాలున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు కానుందని అంచనా. అయితే, గత కొన్నేళ్లుగా రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు గణాంకాలతో పోలిస్తే ఈసారి కొంతమేర తగ్గుదల కనిపిస్తోంది. అయినా జాతీయ వృద్ధిరేటు సగటును మించిన వృద్ధి రేటును రాష్ట్రం సాధించనుంది. ఇలా అధిగమించడం 2015–16 నుంచి ఇది వరుసగా ఐదోసారి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాలను స్పష్టం చేస్తోంది. 2018–19లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.8.61 లక్షల కోట్లతో 14.3 శాతం వృద్ధిరేటును నమోదు చేయగా, 2019–20 నాటికి రూ.9.7 లక్షల కోట్లకు పెరిగి 12.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. 2018–19లో స్థిర ధరల వద్ద 6.13 లక్షల కోట్లున్న జీఎస్డీపీ 2019–20లో 8.2 శాతం వృద్ధి రేటుతో రూ.6.63 లక్షల కోట్లకు పెరగనుందని అంచనా. ప్రథమ, తృతీయ రంగాల హవా.. రంగాల వారీగా పరిశీలిస్తే.. 15.8 శాతం వృద్ధి రేటుతో ప్రాథమిక, 14.1 శాతం వృద్ధి రేటుతో తృతీయ రంగాలు వృద్ధి పథంలో దూసుకుపోతూ రాష్ట్ర వృద్ధి రేటు పెంపుదలకు దోహదపడుతున్నాయి. ద్వితీయ రంగం 5.3 శాతం వృద్ధి రేటును సాధించింది. ప్రాథమిక రంగం పరిధిలోని వ్యవసాయం, పశు, అటవీ, మత్స్య పరిశ్రమలు, మైనింగ్, క్వారీయింగ్, ద్వితీయ రంగం పరిధిలో తయారీ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర పౌరసేవలు, నిర్మాణ రంగ పరిశ్రమలు, తృతీయ రంగం పరిధిలో వాణిజ్య, రిపేర్ సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, స్టోరేజీ, ప్రసార సేవలు, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, నివాస గృహాల యాజమాన్య హక్కులు, వృత్తి సేవలు, ప్రజాపరిపాలన, ఇతర సేవలు వస్తాయి. మొత్తానికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి 65.2 శాతం చేయూత (గ్రాస్ వాల్యూ యాడెడ్/ జీవీఏ) తృతీయ రంగమే అందిస్తోంది. జాతీయ సగటు కన్నా అధిక తలసరి ఆదాయాన్ని రాష్ట్రం నిలబెట్టుకుంది. ప్రస్తుత ధరల వద్ద జాతీయ తలసరి ఆదాయం సగటు వృద్ధి రేటు 6.3 శాతం కాగా, రాష్ట్రం 11.6 శాతాన్ని సాధించింది. చివరగా, జాతీయ స్థాయిలో 8.08 ద్రవ్యోల్బణం నమోదు కాగా, రాష్ట్రంలో సైతం 7.46 నమోదైంది. పారిశ్రామిక కార్మికుల కోసం రూపొంచిన వినియోగదారుడి ధరల సూచిక (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్) ప్రకారం ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. చర్యలు సఫలీకృతం.. వ్యవసాయం, పశుపోషణ, విద్యుత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రం శరవేగంగా ఆర్థికాభివృద్ధి సాధించడానికి దోహదపడ్డాయి. జాతీయ సగటుకు మించిన వృద్ధి రేటును రాష్ట్రం నిలబెట్టుకోవడానికి ఇవే ప్రధాన కారణాలని ప్రభుత్వం విశ్లేషిస్తోంది. 32 అర్బన్ ఫారెస్ట్ల అభివృద్ధి తెలంగాణకు హరితహారంలో భాగంగా 2019లో మొత్తం 38.18 కోట్ల మొక్కలు నాటగా, వాటిలో 31.79 కోట్ల మేర జియో ట్యాగింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ఫారెస్ట్రీ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు, ఇతర జిల్లాల్లో కలిపి 32 అర్బన్ ఫారెస్ట్ పార్కులు పూర్తి చేశారు. మరో 46 ప్రాంతాల్లో ఈ పార్కుల ఏర్పాటుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణలోని వివిధ అడవుల పరిధిలోని జీవవైవిధ్యం కాపాడేందుకు 12 రక్షిత ప్రాంతాల పరిధిలోని 9 వన్యప్రాణి అభయారణ్యాలను, 3 జాతీయపార్కులను (జాతీయపార్కుల వరకు 5,692.48 చదరపు కి.మీ) నెట్వర్క్ను ప్రకటించింది. తెలంగాణలో 2,939 చెట్ల రకాలు, 365 పక్షుల జాతులు, 103 క్షీరదాలు, 28 రకాల సరీసృపాలున్నాయి. రాష్ట్రంలోని అటవీ విస్తీర్ణం 26,969.48 లక్షల చ.కి.మీ.గా విస్తరించి ఉంది. మొత్తం అటవీ విస్తీర్ణంలో మూడో వంతు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోఉండగా, నాలుగు జిల్లాల్లో అంటే ఈ రెండు జిల్లాలతో సహా నాగర్కర్నూల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి 50 శాతం అటవీ ప్రాంతముంది. మొత్తం కలిపి రాష్ట్రంలోని అటవీప్రాంతమున్న 24 శాతం అటవీ శాఖ నిర్వహణ పరిధిలో ఉన్నా దాదాపు 15 శాతంలో మాత్రమే గణనీయమైన పచ్చదనం, అడవులున్నాయి. 2020–21 సంవత్సరానికి సంబంధించి హరితహారంలో 68 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 1994 నుంచే అటవీ శాఖ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ల సాంకేతికను వినియోగిస్తోంది. రిమోట్ సెన్సింట్ శాటిలైట్ ఇమేజరీ సాంకేతికను ఉపయోగించి అటవీ ప్రాంతాలను పర్యవేక్షిస్తోంది. ఎకో టూరిజంలో భాగంగా బొగతా, కుంతాల, పొథెరా, మల్లెలతీర్థం జలపాతాలు, అనంతగిరి హిల్స్, మంజీరా వన్యప్రాణి అభయారణ్యం, లక్నవరం చెరువు, మల్లారం ఫారెస్ట్, పాకాల చెరువు, టైగర్ఫారెస్ట్లను అభివృద్ధి చేస్తోంది. లక్ష్మీ పంప్హౌస్ నుంచి 51.77 టీఎంసీల ఎత్తిపోత సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న లక్ష్మీ (మేడిగడ్డ) పంప్హౌస్ నుంచి మార్చి 4వ తేదీ నాటికి మొత్తంగా 51.77 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. అలాగే ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) పంప్హౌస్ ద్వారా 46.53 టీఎంసీలు, దాని పైన ఉన్న పార్వతి (సుందిళ్ల) ద్వారా 44.06 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్యాయర్లోకి ఎత్తిపోసినట్లు సర్వే తెలిపింది. ఇక ఎల్లంపల్లి నుంచి నంది పంప్హౌస్ ద్వారా 59.94 టీఎంసీలు, గాయత్రి పంప్హౌస్ ద్వారా 57.64 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు వెల్లడించింది. ఇక మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 27,584 చెరువుల పునరుద్ధరణను రూ.8,735.32 కోట్లతో చేపట్టినట్లు సర్వే వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు 21,601 చెరువుల పనులు పూర్తయ్యాయని, దీనికి రూ.4,352 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. ఈ చెరువుల పునరుద్ధరణ ద్వారా 8.94 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని వెల్లడైంది. మరో 5,983 చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. -
పన్నుల వాటాలో ‘మొండిచేయే’!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రావడం లేదు. ఈ ఏడాది కేంద్ర పన్నుల వాటా కింద రూ. 14,348 కోట్లు వస్తాయనే అంచనాలో రాష్ట్ర ప్రభుత్వం ఉండగా అందులో జనవరి ముగిసే నాటికి 66 శాతమే వచ్చాయి. వాస్తవానికి 2019–20 బడ్జెట్లో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాను దాదాపు 18 శాతంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం రూ. 14,348 కోట్లు వస్తాయనే అంచనా ఉండగా చివరి త్రైమాసికం ప్రారంభమయ్యే జనవరి ప్రారంభానికి రూ. 8,449.85 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఇక చివరి త్రైమాసికంలో మిగిలిన రూ. 6 వేల కోట్లకుపైగా నిధులు రావాల్సి ఉంది. అంటే కనీసం నెలకు రూ. 2 వేల కోట్లయినా పన్నుల వాటా కింద రావాలి. కానీ జనవరిలో కేంద్ర పన్నుల వాటాలో కేవలం రూ. వెయ్యి కోట్లే మంజూరు చేసింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి ఇంకో రూ. 5 వేల కోట్లు రావాల్సి ఉంది. అయితే ఈ రెండు నెలల్లో కేంద్రం నుంచి ఆ స్థాయిలో నిధులు రావడం కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
సీఎం రివ్యూకే తప్పుడు సమాచారం..
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సమీక్ష కోసం జిల్లా విద్యాశాఖాధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. జాగ్రత్తలు చూసుకోకుండానే తమ జిల్లాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించి తప్పుడు వివరాలు సమర్పించారు. వాస్తవంగా జీతాలు తీసుకుంటున్న టీచర్లు, ఉద్యోగులు, సిబ్బంది కంటే తక్కువ ఉన్నట్లుగా లెక్కలు చూపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి శాఖల వారీగా ఆర్థికశాఖ కేడర్ స్ట్రెన్త్ వివరాలను సేకరించింది. ఇందులో భాగంగా జిల్లాల్లో డీఈవోల నుంచి విద్యాశాఖకు సంబంధించిన వివరాలను తీసుకుంది. వాటిపై సీఎం సమీక్ష చేయనున్న నేపథ్యంలో ఆ సమాచారా న్ని మరోసారి పరిశీలించింది. అయితే అందులో తప్పుడు సమాచారం ఉన్నట్లు గుర్తించింది. ట్రెజరీల నుంచి వేతనాలు తీసుకుంటున్న పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులు, టీచర్లు, సిబ్బంది కంటే తమ వద్ద ఉన్న వారి సంఖ్యను తక్కువగా ఇచ్చినట్లు తేల్చింది. సీఎం సమీక్ష కోసం సిబ్బంది లెక్కలు అడిగితే తప్పుడు లెక్కలు ఇస్తారా? అని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. ఈనెల 2లోగా సరైన లెక్కలు ఇవ్వాలని ఆదేశించింది. కేడర్ స్ట్రెన్త్కు సంబంధించిన సమగ్ర వివరాలను tg.dse.ao@gmail.comకి పంపించాలని డీఈవోలను ఆదేశించారు. -
పన్ను ఎగవేతదారులను పట్టుకోండి: ఆర్థికశాఖ
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలో లక్ష్యం మేరకు పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. పన్నుల ఎగవేతదారులను డేటా అనలైటిక్స్ సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్భూషణ్ పాండే అధ్యక్షత వహించారు. అధిక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే, ఈ వివరాలు వారి వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నుల్లో ప్రతిఫలించకపోవడం.. అటువంటి సమాచారం జీఎస్టీ, ఆదాయపన్ను విభాగాల మధ్య పంపిణీ చేసుకోవడంపై ఇందులో చర్చించారు. ఈ తరహా పన్నుల ఎగవేతదారులను గుర్తించేందుకు సమాచారాన్ని జీఎస్టీ విభాగం ఆదాయపన్ను శాఖతో పంచుకోవాలని పాండే కోరారు. -
3.144 % డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం (డీఏ) పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మూల వేతనంపై కరువు భత్యం 30.392 శాతం నుంచి 33.536 శాతానికి పెరిగింది. 2019, జనవరి 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. వచ్చే డిసెంబర్లో చెల్లించనున్న ప్రస్తుత నవంబర్ వేతనంతో కలిపి పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.డీఏ బకాయిల చెల్లింపు ఇలా..: 2019, జనవరి 1 నుంచి 2019, అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2020, ఫిబ్రవరి 29కి ముందు పదవీ వివరణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లిస్తుంది. 2004, సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు 2019, జనవరి 1 నుంచి 2019, అక్టోబర్ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్ ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను డిసెంబర్ 2019లో నగదు రూపంలో చెల్లిస్తుంది. జీపీఎఫ్ ఖాతాలకు అనర్హులైన ఫుల్ టైం కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను డిసెంబర్లో నగదు రూపంలో చెల్లించనుంది. 2015, పీఆర్సీ ఉద్యోగులకు..: 2015, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిమెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం కరువు భత్యం 30.392 శాతం నుంచి 33.536 శాతానికి పెంపు వర్తించనుంది. 2010, పీఆర్సీ ఉద్యోగులకు ..: జీవో 36 ఆధారంగా 2010, పీఆర్సీ వేతనాలు అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 112.992 శాతం నుంచి 118.128 శాతానికి పెరిగింది. అదే విధంగా 2010, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిమెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం 112.992 శాతం నుంచి 118.128 శాతం డీఏ పెంపు వర్తించనుంది. జీవో నం.171 ప్రకారం.. వేతనం రూ.3850 నుంచి రూ.6700కు పెరిగిన ఫుల్ టైం కాంటింజెంట్ ఉద్యోగులకు సైతం ఇదే పెంపు వర్తిస్తుంది. 2006 యూజీసీ వేతనాలపై ఇలా..: సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 148 శాతం నుంచి 154 శాతానికి ప్రభుత్వం పెంచింది. సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న... ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్తో ఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ల బోధన సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది.2016 యూజీసీ వేతనాలపై ఇలా..: సవరించిన యూజీసీ వేతనాలు–2016 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 9 శాతం నుంచి 12 శాతానికి ప్రభుత్వం పెంచింది. యూజీసీ వేతనాలు–2016 అందుకుంటున్న... ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, జేఎన్టీయూహెచ్తోపాటుఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ల బోధన సిబ్బందికి ఇది వర్తిస్తుంది. వేతన సవరణ–2010 ప్రకారం వేతనాలు పొందు తున్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 112.992 శాతం నుంచి 118.128 శాతానికి ప్రభుత్వం పెంచింది. పార్ట్ టైం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు నెలకు రూ.100 వేతనం పెరిగింది. పెన్షనర్ల డీఏపై గురువారం ఉత్తర్వులిచ్చే అవకాశముంది. -
ప్రభుత్వ పథకాల డబ్బు లబ్ధిదారులకే
సాక్షి, అమరావతి: ప్రభుత్వం పలు పథకాల ద్వారా వివిధ వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఇస్తున్న డబ్బులు నేరుగా లబ్ధిదారులకు చేరాల్సిందేనని, బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించు కోకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లకు స్పష్టం చేశారు. ఇలా మినహాయించు కోలేని రీతిలో అన్ ఇన్ కంబర్డ్ (నిర్దేశిత) బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన 208వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి లక్ష్యాలను బ్యాంకర్లకు వివరించారు. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే విశ్వసనీయత నిలబడుతుందని అన్నారు. వడ్డీలేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని, ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలని సూచించారు. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామని, అందుకు సంబంధించిన రశీదును గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ అందిస్తారని చెప్పారు. సున్నా వడ్డీ కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు ఎంత చెల్లించాలో జాబితా ఇస్తే, ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. గతంలో (గత ప్రభుత్వంలో) కొన్ని చెప్పి వాటిని అమలు చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని, ఇప్పుడు అలా కాదని.. తాము చెప్పిన దానికి కట్టుబడి ఉంటామని సీఎం స్పష్టం చేశారు. ముద్ర రుణాల పంపిణీపై దృష్టి సారించాలి ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్లపై చిరు వ్యాపారాలు చేసే వారికి గుర్తింపు కార్డులు ఇస్తామని, చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా ఒక పథకాన్ని అమలు చేస్తుందని, దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమని కోరారు. ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వం ముందుకు వస్తుందని, దానిని సానుకూలంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువగా (85 శాతం) ఉందని బ్యాంకు అధికారులు చెప్పడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాలు బాగా పడినందున రిజర్వాయర్లలో నీళ్లు నిండుగా ఉన్నాయని, రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. సచివాలయంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ మేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ను ఏర్పాటు చేశామని, ప్రతి రెండు వేల జనాభాకో గ్రామ సచివాలయం త్వరలో ప్రారంభం అవుతుందని, వారి సేవలను బ్యాంకర్లు వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు. రైతులు, కౌలు రైతులకు రుణాల పంపిణీలో వీరి సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల షాపు ఉంటుందని, అక్కడే రైతులకు వర్క్షాపు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. వర్క్షాపు ద్వారా వ్యవసాయంలో అత్యుత్తమ విధానాలను రైతులకు తెలియజేస్తామని, ప్రకృతి వ్యవసాయంపై కూడా వారికి శిక్షణ ఇస్తామని చెప్పారు. కరువు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో చిరుధాన్యాలను బాగా ప్రోత్సహిస్తామని తెలిపారు. వీరికి రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లకు తగిన రుణ సహాయం చేస్తే, ఔత్సాహిక యువకులు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉందని సీఎం సూచించారు. ఔత్సాహికులకు చేయూత ఇవ్వండి.. ఆర్థిక రంగం మందగమనం సూచనలు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలపై దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఔత్సాహికులు ఎంతో మంది కంపెనీలు పెడుతున్నారని, వారికి బ్యాంకర్లు చేయూత నివ్వాలని కోరారు. బ్యాంకర్లు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సమన్వయం ఎక్కువగా ఉండాలని ఆయన సూచించారు. వైఎస్సార్ నవోదయం ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, బ్యాంకర్లు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించాలన్నారు. చిన్న మొత్తాలకు ఇంకా భారీ వడ్డీలను వసూలు చేస్తున్నారని, ఐదు వేలు, పది వేలకు కూడా పెద్ద ఎత్తున వడ్డీలు వసూలు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి చిన్న రుణాల విషయంలో సామాన్యులను ఆదుకోవడంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని బుగ్గన సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ పొగాకు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాలన్నారు. సీఎం ఆరుతడి పంటలను, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నందున ఆ రైతులకు రుణాలు అందించాలని కోరారు. 2 వేల జనాభాకు బ్యాంకింగ్ సదుపాయం ప్రతి 2 వేల జనాభాకు బ్యాంకింగ్ సుదుపాయం ఉండాల్సిందేనని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వర్షాలు బాగా కురుస్తున్నందున వ్యవసాయ రంగం ఊపందుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రాధాన్యత రంగాలకు ఆశించిన రీతిలో రుణాలు అందుతున్నాయన్నారు. కౌలు రైతుల కోసం ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు చాలా బాగున్నాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సెల్వరాజ్ ప్రశంసించారు. దీని వల్ల వ్యవస్థీకృత ఆర్థిక సంస్థల నుంచి వారికి రుణాలు అందుతాయని అన్నారు. కేవలం పంట రుణాలే కాకుండా ఇతరత్రా రుణాలు కూడా కౌలు రైతులకు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాలనలో సమూల మార్పులు ప్రభుత్వ పరిపాలన దృక్పథంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ అన్నారు. పరిపాలనలో ప్రభుత్వం నిర్మాణాత్మక మార్పులను తీసుకువస్తోందని.. వలంటీర్లు, గ్రామ సచివాలయాల వల్ల క్షేత్ర స్థాయిలో చివరి వరకూ అనుసంధానం ఉంటుందని చెప్పారు. దీన్ని బ్యాంకులు బలంగా వినియోగించుకోవాలన్నారు. సీఎం అనేక వర్గాల వారికి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారని, వివిధ పథకాల లబ్ధిదారులు, వారి బ్యాంకు ఖాతాలను ఎస్ఎల్బీసీకి అందిస్తామని, నేరుగా లబ్ధిదారులకే నగదు అందేలా చూడాలని కోరారు. -
పనులకు పచ్చజెండా
సాక్షి, అమరావతి: రూ.పది కోట్ల లోపు ఒప్పంద విలువ కలిగి ఇప్పటికే మొదలైన పనులన్నింటినీ కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులకు బిల్లులు చెల్లించేందుకు కూడా అనుమతిస్తూ ఆర్ధికశాఖ ఇటీవల మెమో జారీ చేసింది. ఈమేరకు బిల్లుల చెల్లింపు, పనులకు సంబంధించి ఈ ఏడాది మే 29వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మెమో జారీ చేశారు. ఒప్పందం కుదిరి, ప్రారంభం కాని రూ.పది కోట్ల లోపు విలువగల నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) పనులను కూడా కొనసాగించాలని, ఇందుకు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సహాయ పునరావాస, భూసేకరణ బిల్లుల చెల్లింపునకు కూడా ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో రూ.పది కోట్ల లోపు విలువగల పనులన్నీ ప్రారంభం కానున్నాయి. తాగునీరు, రహదారులు, ఇతర అన్ని రకాల పనులు ఇందులో ఉన్నాయి. ఈ విషయంలో అన్ని శాఖలు ద్రవ్యజవాబుదారీ బడ్జెట్ నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ సూచించింది. పురోగతి ఆధారంగా నిర్ణయం.. సంబంధిత శాఖలు పనుల పురోగతితోపాటు అగ్రిమెంట్ విలువను పరిగణనలోకి తీసుకుని ఎంత పని పూర్తయిందనే అంశం ఆధారంగా పనులు కొనసాగించడమా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని మెమోలో ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 29 నాటికి చేసిన పనుల పురోగతి ఆధారంగా బిల్లుల చెల్లింపులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. సహాయ పునరావాస ప్యాకేజీ, భూసేకరణ విషయంలో బిల్లుల చెల్లింపునకు మిన హాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సమీక్షించనున్న మంత్రులు.. ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నాటికి విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు మినహా మిగిలిన పనులు మంజూరై ఉంటే ప్రారంభించని వాటిని రద్దు చేయాలని మెమోలో పేర్కొన్నారు. రూ.పది కోట్లకుపైగా విలువగల విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో మంజూరై ప్రారంభించని పనులపై సంబంధిత శాఖ మంత్రులు సమీక్షించాలి. విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో రూ.పది కోట్లకు పైగా విలువగల పనులు ప్రారంభమై అగ్రిమెంట్ విలువలో 25 శాతం తక్కువ వ్యయం అయిన పనులను కూడా సంబంధిత శాఖల మంత్రులు సమీక్షించాలని ఆర్థిక శాఖ సూచించింది. సమీక్ష సమయంలో అంచనాల వ్యయ ప్రతిపాదనలు సక్రమంగా ఉన్నాయా? సింగిల్ బిడ్లు ఏమైనా దాఖలయ్యాయా? అంచనా వ్యయం కంటే ఎక్కువ మొత్తానికి టెండర్ కోట్ చేశారా? టెండర్లతో నిమిత్తం లేకుండా పనులేమైనా ఇచ్చారా? అనే అంశాలను పరిశీలించడంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పనుల అవసరం ఉందా? లేదా? అనేది పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అనంతరం అనుమతి కోసం ఆర్థికశాఖ మంత్రికి పంపాలని మెమోలో సూచించారు. -
మాంద్యంలోనూ సం'క్షేమమే'
చాలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మనకంటే మరింత అధ్వానంగా ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. కర్ణాటక, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల వృద్ధి మైనస్లోకి వెళ్లగా తెలంగాణ పరిస్థితి కొంత నయంగా ఉంది. స్థిరమైన ఆర్థిక ప్రగతి, ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన పరపతితో ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకోగలుగుతోంది. ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి, కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరి çస్తున్నాం. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆర్థిక సంస్థలు, మూలధన వాటాను కలిపి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల నిర్మాణం యథాతథంగా కొనసాగుతుంది. సాక్షి, హైదరాబాద్: ‘‘ఏడాదిన్నరగా ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు 5%గా నమోదై కనిష్ట స్థాయికి చేరుకుంది. రాష్ట్రంపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. జీఎస్టీ పరిహారం అవసరం లేదనుకున్న తెలంగాణ కూడా తప్పనిసరి పరిస్థితిలో కేంద్రం నుంచి దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆర్థిక వృద్ధి తీవ్రంగా దిగజారుతున్న ఇలాంటి పరిస్థితిలో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి రావడానికి చింతిస్తున్నా. అయినా గుడ్డిలో మెల్లలా మనం చాలా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాం. ఇంతటి తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్నా అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి, ప్రజాసంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తూ ఈ బడ్జెట్ను రూపొందించాం. పేదలు, రైతుల జీవితాల్లో వెలుగు తీసుకురావాలన్న చిత్తశుద్ధిని మరోసారి ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. పూర్తి ఆశావహ దృక్పథంతో వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల హామీలను నెరవేరుస్తూ 2019–20 బడ్జెట్ను రూపొందించాం. అన్ని రంగాల్లో శీఘ్రగతి అభివృద్ధి సాధించే దిశలో ఈ బడ్జెట్ దోహదపడుతుందని ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది’’అని ’సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం 2019–20 ఆర్థిక ఏడాదికిగాను మిగిలిన కాలానికి రూ. 1,46,492.3 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పోలిస్తే ఈసారి పద్దు మొత్తాన్ని భారీగా కుదించడానికి మాంద్యం ప్రభావమే కారణమంటూ సీఎం సోదాహరణం గా వివరించారు. సీఎం బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... దేశంలోనే అగ్రగామిగా నిలిచాం.. అవతరించిన ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆకర్షించాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన మొద టి ఏడాది నెలకు రూ. 6,247 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగే పరిస్థితి. ఐదేళ్ల తర్వాత నెలకు రూ. 11,305 కోట్లు ఖర్చుపెట్టే స్థాయికి చేరింది. 2014కు ముందు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) సగటు వృద్ధిరేటు కేవలం 4.2%. 2018–19లో రెండున్నర రెట్లకుపైగా పెరిగి 10.5% నమోదైంది. మూలధన వ్యయంలో అట్టడుగున ఉండే తెలంగాణ, నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఐదేళ్లలో 11.2%నుంచి గత ఆర్థిక ఏడాదిలో 16.9 శాతానికి చేరుకుంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన మొత్తం మూలధన వ్యయం రూ. 1,65,167 కోట్లు. అన్ని రంగాల్లో సాధిస్తున్న పురోగతి ఫలితంగా గత ఐదేళ్లలో రాష్ట్రం 21.49% సగటు ఆదాయ వృద్ధిరేటు సాధించి దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. ఈ గణాంకాలన్నీ కాగ్ నిర్ధారించి అధికారికంగా ప్రకటించినవే. ఆర్థిక మాంద్యంతో అతలాకుతలం.. ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. 2018–19 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 8% నమోదైనా మూడో త్రైమాసికానికి 6.6 శాతానికి, చివరి త్రైమాసికానికి 5.8 శాతానికి పడిపోయింది. ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో మరింత దిగజారి 5% కనిష్ట వృద్ధిని నమోదు చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యు ఫాక్చరర్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33% తగ్గింది. వాహన విక్రయాలు 10.65% క్షీణించాయి. ఫలితంగా ప్రముఖ కంపెనీలు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేయాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల అమ్మకం ద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి వ్యాట్ తగ్గిపోయింది. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. గతేడాది విమాన ప్రయాణికుల వృద్ధి 11.6% ఉంటే ఈ ఏడాది మెనస్ 0.3 % నమోదైంది. సరుకు రవాణా వృద్ధి ఏకంగా 10.6% తగ్గింది. రైల్వే గూడ్సు వ్యాగన్ల బుకింగుల వృద్ధిరేటు 4.1% నుంచి 1.6 శాతానికి పడిపోయింది. చాలా పరిశ్రమలు మూతపడడంతో బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి శాతం 10.6 నుంచి మైనస్ 5.1 శాతానికి పడిపోయింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కనిష్టంగా రూ.72.43కి పడిపోయింది. మాంద్యం వల్ల ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కేంద్రం నుంచి రూ. 175 కోట్లు, జూన్, జూలై నెలల్లో రూ. 700 కోట్లను జీఎస్టీ పరిహారంగా తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవిక దృక్పథంతోనే బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ఆర్థికశాఖ తీవ్ర మేథోమధనం చేసి అనేక మంది ఆర్థిక గణాంక నిపుణులతో చర్చించి నిర్ధారణ చేసుకున్న వాస్తవిక దృక్పథంతో 2019–20 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది. కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 22.69% వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే 2019–20 తొలి త్రైమాసికంలో 1.36% మాత్రమే సాధ్యమైంది. రాష్ట్రంలో 15 % ఆదాయాభివృద్ధిని ఆశిస్తే కేవలం 5.46 శాతమే సాధ్యమైంది. గత ఐదేళ్లలో రాష్ట్రం వాణిజ్య పన్నుల విభాగంలో 13.6% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఆర్థిక ఏడాది మొదటి 4 నెలల్లో కేవలం 6.61 శాతమే సాధించగలిగింది. ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఈ ఏడాది మొదటి 4 నెలల్లో కేవలం 2.59 శాతమే వృద్ధిరేటు సాధ్యమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది వరకు 19.8% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి 4 నెలలు 17.5 శాతమే వృద్ధిరేటు నమోదైంది. మోటార్ వాహనాల పన్ను రూపంలో ఆదాయం దారుణంగా పడిపోయింది. గత ఐదేళ్లలో 19% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మైనస్ 2.06 శాతానికి పడిపోయింది. పన్నేతర ఆదాయం లోనూ గత ఆర్థిక సంవత్సరం వరకు 14.9% నమోదైన సగటు వార్షిక వృద్ధిరేటు... ఈ ఏడాది గడిచిన 4 నెలల్లో మైనస్ 14.16 శాతానికి పడిపోయింది. దీనికితోడు2019–20 ఆర్థిక ఏడాదికి పన్నుల్లో వాటా కింద రాష్ట్రా నికి రావాల్సిన నిధు ల్లో కేంద్రం 4.19% కోత పెట్టింది. విద్యుత్ సంస్థలకు ఆర్థిక సహకారం.. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఇప్పటివరకు రూ. 20, 925 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించాం. ఉదయ్ పథకం ద్వారా డిస్కమ్లకు ఉన్న రూ. 9,695 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వమే భరించింది. విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయిపడిన రూ. 5,772 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ. 42,632 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. ప్రగతి సూచికల్లో తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. బకాయిలు చెల్లించాకే కొత్త పనులు.. ఉన్నది ఉన్నట్లు చెప్పేందుకు, వాస్తవాలను జనం ముందు ఉంచే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఆర్థిక మాంద్యం కారణంగా కేంద్రం, రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా తగ్గిన మాట కఠిన వాస్తవం. ఈ వాస్తవాల ఆధారంగానే ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసింది. అన్ని శాఖల్లోనూ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాం. దీనికి అనుగుణంగానే ఆయా శాఖలు ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధులు ఖర్చు చేయాలని మంత్రులు, కార్యదర్శులకు ఆర్థికశాఖ సూచనలు చేసింది. భవిష్యత్తులో అంచనాలు సవరించొచ్చు మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు మనకు ఉంది. కేంద్రం నిధులు అంతంతే.. ప్రభుత్వ పన్నుల ద్వారా రాష్ట్రం నుంచి గత ఐదేళ్లలో కేంద్రానికి రూ. 2,72,926 కోట్లు అందగా ఈ నిధుల్లో తెలంగాణ వాటాగా మనకు రూ. 31,802 కోట్లు వచ్చాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను తెలంగాణకు ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నా ఓ ఏడాది నిధులను కేంద్రం ఇవ్వలేదు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కోసం గత ఐదేళ్లలో అక్షరాలా రూ. 5,37,373 కోట్లు ఖర్చు పెడితే అందులో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం రాష్ట్రానికి అందిన నిధులు రూ.31,802 కోట్లు మాత్రమే. ఐటీ ఎగుమతుల్లో మేటిగా.. ప్రభుత్వ ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో వృద్ధిరేటు నమోదైంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో గత ఐదేళ్లలో 6.3% అదనపు వృద్ధితో 2018–19 ఆర్థిక ఏడాది నాటికి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటు నమోదు చేయగలిగింది. పారిశ్రామిక రంగం అదనంగా 5.4% అదనపు వృద్ధి సాధించి 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8% నమోదు చేసింది. 2014–15లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లయితే 2018–19 నాటికి రూ. 1.10 లక్షల కోట్లకు చేరుకుంది. ‘ఆయుష్మాన్’కన్నా ఆరోగ్యశ్రీ మెరుగు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని పథకాల కోసం ప్రజాధనాన్ని వృథా చేయదలచుకోలేదు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ కంటే మనం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైంది, ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు ఖర్చు చేస్తే ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ. 250 కోట్ల విలువైన వైద్య సేవలే అందుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకే మేలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందవు. ఆయుష్మాన్ భారత్కన్నా ఆరోగ్యశ్రీ పథకం ఎన్నోరెట్లు మెరుగైనది కాబట్టి మనం కేంద్ర పథకాన్ని వద్దనుకున్నాం. పట్టణాలు, గ్రామాలకు మంచి రోజులు.. కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులకు సమానంగా నిధులు జమచేస్తాం. ఈ రెండింటినీ కలిపి గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ. 339 కోట్లను అందించాలని నిర్ణయించాం. ఈ నెల నిధులను ఇప్పటికే గ్రామ పంచాయతీలకు విడుదల చేశాం. ఇదే తరహాలో పట్టణాలకూ నిధుల ప్రవాహం ఉంటుంది. ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు, పన్నులతోపాటు వివిధ రకాలుగా గ్రామ పంచా యతీలకు సమకూరే ఆదాయం కూడా స్థానిక సంస్థలకు ఉంటుంది. గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. సంక్షోభంలోనూ సాగుకు ఉచిత విద్యుత్.. ఆర్థిక సంక్షోభం ఉన్నా వ్యవసాయానికి ఉచిత కరెంటు యథాతథంగా కొనసాగుతుంది. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడానికయ్యే కరెంటు బిల్లుల భారం రైతులపై వేయ కుండా మేమే చెల్లించాలని నిర్ణయించాం. ఎన్నడూ లేనట్లు విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, 6 కిలోల బియ్యం పథకం లాంటి వాటికి నిధుల కొరత రానీయం. రైతుబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు, రైతు బీమా ప్రీమియం చెల్లింపులకు రూ. 1,137 కోట్లు, పంట రుణాల మాఫీకి రూ. 6 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించాం. ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్లో రూ. 9,402 కోట్లను ప్రతిపాదించాం. -
మాటిచ్చామంటే.. నెరవేర్చాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే వాటిని అధిగమించి ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల పథకాలను ప్రతిబింబించేలా బడ్జెట్ను రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 12వతేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండాలి? ఏ రంగాలకు ప్రాధాన్యం కల్పించాలి? కేటాయింపులు ఎలా ఉండాలనే అంశాలపై ముఖ్యమంత్రి గురువారం ఆర్థికశాఖకు దిశా నిర్దేశం చేశారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి ప్రాథమికంగా నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితికి దిగజార్చిందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఐదు నెలల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దిగజారిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొనటంతో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తీరాల్సిందేనని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలుకు బడ్జెట్లో పెద్ద పీట వేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెంచిన సామాజిక పింఛన్లకు సరిపడా నిధులు బడ్జెట్లో కేటాయించాలని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎన్ని నిధులు అవసరమో అంత మేర బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖమంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి సమీక్షించడంతోపాటు నవరత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బడ్జెట్ రూపకల్పన, ప్రాధాన్యతలపై రెండు మూడు దఫాలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దిగజారిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొనటంతో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తీరాల్సిందేనని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలుకు బడ్జెట్లో పెద్ద పీట వేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెంచిన సామాజిక పింఛన్లకు సరిపడా నిధులు బడ్జెట్లో కేటాయించాలని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎన్ని నిధులు అవసరమో అంత మేర బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖమంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను సీఎం సమీక్షించడంతోపాటు నవరత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బడ్జెట్ రూపకల్పన, ప్రాధాన్యతలపై రెండు మూడు దఫాలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అప్పులు తీసుకుని మళ్లించిన టీడీపీ సర్కారు... టీడీపీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్లో రూ.2.48 లక్షల కోట్ల మేరకు అప్పులు చేయగా, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.64 వేల కోట్ల వరకు అప్పులు చేశారని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులను వాటికోసం వెచ్చించకుండా ఇతర అవసరాలకు మళ్లించడంతో నిధుల కొరతతో సతమతమవుతున్నాయని వివరించారు. వివిధ రకాల పెండింగ్ బిల్లులు మొత్తం రూ.48 వేల కోట్ల వరకు ఉన్నట్లు ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. -
ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొముర అంచనా వేసింది. నొముర దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్బీఐ నుంచి నిధుల బదలాయింపు ఒకేసారి జరక్కపోవచ్చని, వరుసగా మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అందివచ్చే నిధుల్లో 45 శాతం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని, 20 శాతాన్ని బ్యాంకుల మూలధన పెట్టుబడులకు వినియోగించుకునే వీలుందని నొముర పేర్కొంది. ప్రభుత్వ రుణభారం 25 శాతానికి తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చిన మొత్తంపై ఆధారపడి మిగిలిన 10 శాతం వ్యయాలు ఉంటాయని పేర్కొంది. బ్యాంకులకిస్తే బెటర్: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరతతో ఇబ్బందులు పడుతున్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ ఇప్పటికే అభిప్రాయపడింది. ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై సిఫారసులకు గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను జూన్లో ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతున్న విభేదాల కారణంగా నివేదిక ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. జూలైలో నివేదిక సమర్పించవచ్చని సమాచారం. ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మూడు లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించవచ్చని ఈ కమిటీ సిఫారసు చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ తాజా నివేదిక అంచనా వేసింది. ఆర్బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? కేంద్రం ద్రవ్యలోటును ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10న వ్యక్తిగత కారణాలతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రకటించారు. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్లో జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఇప్పటికే మూడు కమిటీలు... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై 3 కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) వీటికి నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12% వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, థోరట్ కమిటీ 18%గా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారులకు ఓకే చెప్పింది. లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28% నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14% నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. -
వచ్చే నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. 11వ తేదీ దశమి మంచి రోజు కావడంతో ఆ రోజు సమావేశాలను ప్రారంభించాలని, 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 15 పనిదినాల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్లో నవరత్నాల అమలుకే పెట్టపీట వేయనున్నారు. ఇప్పటికే నవరత్నాల్లోని 60 శాతంపైగా అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నవరత్నాల్లోని అంశాలన్నింటికీ బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయనున్నారు. ఎన్నికల ప్రణాళికలో వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం రెండో ఏడాది నుంచి అందిస్తామని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది రబీ నుంచే రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అక్టోబర్ 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే బడ్జెట్లో రైతులకు సున్నా వడ్డీకే రుణాలకు, అలాగే పంటల బీమా కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా బడ్జెట్లో కేటాయింపులు ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా బడ్జెట్పై వచ్చే నెల 1, 2వ తేదీల్లో అన్ని శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశం కానున్నారు. -
పల్లె.. డిజిటల్!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ భారతాన్ని డిజిటల్ పుంతలు తొక్కించేందుకు ఎన్డీయే సర్కారు తన తుదిబడ్జెట్లో గట్టి ప్రయత్నమే మొదలు పెట్టింది. భారత్ నెట్ పథకం కింద అనుసంధా నించే 2.5లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో తెలపడమే ఇందుకు తార్కాణం. అంతేకాదు..వేర్వేరు ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని విశ్లేషించి వనరులను మరింత సమర్థంగా వినియోగించు కునే లక్ష్యంతో ప్రభుత్వ శాఖల్లోనూ కృత్రిమ మేథను వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కృత్రిమ మేథ టెక్నాలజీలు మరింత కచ్చితంగా వాతావరణ అంచనాలు కట్టేందుకు మాత్రమే కాకుండా.. అనేక ఇతర రంగాల్లోనూ ఉపయోగపడతాయని వాహనాల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణ, ఫొటోలు, వీడియోల విశ్లేషణ వంటివి వీటిల్లో ఉన్నాయని గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కామన్ సర్వీసెస్ సెంటర్లు కేంద్రంగా డిజిటల్ గ్రామాలు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ గ్రామాల వ్యవస్థ మొత్తం కామన్ సర్వీసెస్ సెంటర్లు కేంద్రంగా నడుస్తాయి. వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా లక్ష వరకూ గ్రామాల్లో ఈ కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చాలన్నది లక్ష్యం. గ్రామాల్లో డిజిటల్ టెక్నాల జీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కామన్ సర్వీసెస్ సెం టర్లపైనే ఉంచనున్నారు. దేశంలో ఇప్ప టికే దాదాపు మూడు లక్షల కామన్ సర్వీ సెస్ సెంటర్లు పని చేస్తున్నా యనీ, వీటి ద్వారా మరిన్ని ఎక్కువ సేవలు అందిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రభుత్వ సర్వీసులను, విధానాలను డిజిటల్ రూపంలోకి మార్చేసిందని.. వీటన్నింటి ఆధారంగా 2030 నాటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తామని వివరించారు. దేశ యువత సృష్టించే అనేక స్టార్టప్ కంపెనీలు సృష్టించే డిజిటల్ ఇండియా కారణంగా లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మొబైల్ డేటా 50 రెట్లు ఎక్కువైందని, ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ఫలితమిదని మంత్రి వ్యాఖ్యానించారు. డిజిటల్ గ్రామాల వంటి వాటి వల్ల మధ్యవర్తుల ప్రమేయం అస్సలు లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయని చెప్పారు. కృత్రిమ మేథతో అనేక లాభాలు.. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కృత్రిమ మేథ వినియోగం సర్వత్రా పెరగనుందని.. ఇందుకు తగ్గట్టుగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేథ సర్వీసుల కోసం ఓ జాతీయ పోర్టల్ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు, సేవలు, కేంద్రాలకు ఈ పోర్టల్ ద్వారా సేవలు అందిస్తామని.. ఆసక్తికర ప్రైవేట్ వ్యాపార సంస్థలు కూడా ఈ పోర్టల్ సేవలు వినియోగిం చుకోవచ్చునని మంత్రి వివరించారు. త్వరలో సిద్ధం కానున్న నేషనల్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ కృత్రిమ మేథ సర్వీసులు చాలా కీలకం కానున్నాయని మంత్రి చెప్పారు. దేశం ఇప్పటికే స్టార్టప్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని.. దీంతోపాటు కృత్రిమ మేథ తాలూకూ లాభాలను ప్రజల చెంతకు చేర్చేందుకు జాతీయ స్థాయిలో ఓ విస్తృత స్థాయి కార్యక్రమం చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా.. ఇతర అత్యున్నత నైపుణ్య కేంద్రాలు కూడా ఏర్పాటు కావడం ద్వారా ఈ కార్యక్రమానికి ఊపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేథ సర్వీసులను ఉపయోగించు కునేందుకు ఇప్పటికే తొమ్మిది రంగాలను గుర్తించామని మంత్రి అన్నారు. -
జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు..!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వచ్చే నెలలో రూ.లక్ష కోట్లను మించిపోయే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వరుసగా నవంబర్, డిసెంబర్ నెలల్లో జీఎస్టీ ఆదాయం లక్ష కోట్ల మార్కును దాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. పండుగల సీజన్ కావడం వల్ల ఈ రెండు నెలల్లో వస్తు, సేవల డిమాండ్ పెరిగి వసూళ్లు ఊపందుకోనున్నాయని భావిస్తోన్న ఆర్థిక శాఖ.. ఇదే సమయంలో పన్ను ఎగవేతలకు ఉన్నటువంటి అవకాశాలను అరికట్టడం ద్వారా రూ.లక్ష కోట్ల వసూళ్లను సునాయాసంగా అందుకోవచ్చని ప్రణాళిక వేసినట్లు వెల్లడైంది. సెప్టెంబర్ వసూళ్లు రూ.94,442 కోట్లు ఉండటం కూడా ప్రభుత్వ అంచనాలకు బలాన్ని స్తోంది. ‘రానున్నది పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడం.. వర్తకులు భారీ డిస్కౌంట్లను ప్రకటిం చనుండడం ఆధారంగా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటేందుకు అవకాశం ఉంది.’ అని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సంస్థ చార్టర్డ్ అకౌంటెంట్ రజత్ మోహన్ అన్నారు. -
రూ. 21, రూ. 51 నోట్లు రావు
న్యూఢిల్లీ: రూ. 21, రూ. 51 నోట్లను ప్రవేశపెట్టే యోచన లేదని ప్రభుత్వం శుక్రవారం లోక్సభకు తెలిపింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా తమ పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ వెల్ల డించారు. బీజేపీ ఎంపీ పరేశ్ రావెల్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే రూ. 50, రూ.100 నోట్లను రద్దు చేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద లేదన్నారు. వినియోగదారులు బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తాన్ని ఉంచకపోతే జరిమానా విధించాలన్న యోచనను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ లోక్సభలో ప్రభుత్వాన్ని, బ్యాంకులను డిమాండ్ చేసింది. -
నేటి నుంచి గరీబ్ కల్యాణ్
నల్ల కుబేరులకు మరో అవకాశం ► అప్రకటిత నగదులో 50 శాతం పన్నుగా చెల్లించి బయటపడొచ్చన్న కేంద్రం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ క్యలాణ్ యోజన(పీఎంజీకేవై)లో భాగంగా 50 శాతం పన్ను చెల్లించి బయటపడే పథకాన్ని శనివారం నుంచి అమల్లోకి తెస్తున్నామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ఈ పథకం ద్వారా అప్రకటిత నగదు ప్రకటించేందుకు నల్ల కుబేరులకు మరో అవకాశమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, పన్ను చట్టాల కింద ఎలాంటి విచారణ ఉండబోదని, మార్చి 31 వరకూ డిక్లరేషన్లు సమర్పించవచ్చని తెలిపారు. పీఎంజీకేవైలో నల్లధనాన్ని ప్రకటించకుండా... ఆదాయపు పన్ను రిటర్న్స్లో చూపితే మొత్తం 77.25 శాతం మేర పన్నులు, జరిమానా కట్టాల్సి ఉంటుందన్నారు. పీఎంజీకేవైలో, లేదా ఆదాయపు పన్ను దాఖలులో చూపకపోతే అదనంగా మరో 10 శాతం పన్ను చెల్లించాలని అధియా పేర్కొన్నారు. గరీబ్ కల్యాణ్ అమలు కోసం పన్ను చట్టాలు(రెండో సవరణ)2016 బిల్లును గత నెల్లో లోక్సభ ఆమోదించింది. శనివారం నుంచి బ్యాంకుల వద్ద దొరికే చలాన్లు నింపి డిక్లరేషన్లు సమర్పించాలని అధియా వెల్లడించారు. ముందుగా పన్నులు చెల్లించి రసీదు చూపితేనే పథకం వర్తిస్తుందని తెలిపారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రతీ బ్యాంకు ఖాతా వివరాల్ని రాబడుతోందని, ఐటీ, ఈడీ ఇతర విచారణ సంస్థలు ఖాతాల సమాచారంపై నిఘా పెట్టాయని చెప్పారు. డిసెంబర్ 30 తర్వాత విత్డ్రాపై సమీక్షిస్తాం డిసెంబర్ 30 అనంతరం ఖాతాల నుంచి విత్డ్రా పరిమితిని సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి వారానికి రూ. 24 వేలు, ఏటీఎంల నుంచి రోజుకు రూ. 2.5 వేల పరిమితి కొనసాగుతోంది. -
రూ.11,081 కోట్లతో ‘కాళేశ్వరం’
ఆర్థిక శాఖకు తుది ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: అనేక తర్జనభర్జనలు, మార్పులుచేర్పుల అనంతరం కాళేశ్వరంలోని ప్రధాన రిజర్వాయర్ల తుది అంచనాలు సిద్ధమయ్యాయి. రూ.11,081 కోట్లతో ఐదు రిజర్వాయర్ల అంచనాలు ఆర్థిక శాఖకు చేరాయి. ఇక్కడ పరిశీలన అనం తరం వచ్చే వారం పరిపాలన అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయకసాగర్ను 3 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించనుండగా, దీనికి రూ. 550 కోట్ల వ్యయం అవుతుందని తేల్చారు. ఇక 50 టీఎంసీల మల్లన్నసాగర్కు రూ.7,308 కోట్లు, 7 టీఎంసీల కొండపోచమ్మకు రూ.521.50 కోట్లు, 9.86 టీఎంసీల గంధమలు రూ.898.50 కోట్లు, 11.39 టీఎంసీల రూ.1803 కోట్లతో తుది వ్యయ అంచనాలు సిద్ధమయ్యాయి. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వాడుకలోకి తెచ్చే కసరత్తులో భాగంగా.. మరో 32 టీఎంసీల నీటి వినియోగానికి కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలత తెలిపింది. వరంగల్ జిల్లాలో 10.08 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 32 టీఎంసీ గోదావరి జలాలను కాకతీయ కాల్వకు తరలించేలా పత్తిపాక వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేయాలని వచ్చిన సూచనను సీఎం కేసీఆర్ ఓకే చెప్పినట్లుగా సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ డిజైన్ ప్రకారం, ఎల్లంపల్లికి చేరే గోదావరి జలాలను జంట టన్నెళ్ల ద్వారా మేడారం రిజర్వాయర్కు తరలించేలా డిజైన్ చేశారు. మేడారం నుంచి కాకతీయ కాల్వతోపాటు ఎస్సారెస్పీ వరద కాలువలోకి గోదావరి జలాల్ని తీసుకెళ్లి.. మిడ్ మానేరు రిజర్వాయర్కు నీటిని తరలించాలని తొలి ప్రతిపాదన ఉండగా, దీనిలో ప్రస్తుతం మార్పులు చేశారు. మేడారం నుంచి నేరుగా కాకతీయ కాల్వలోకి నీటిని తరలించకుండా మధ్యలో పత్తిపాక వద్ద 10.08 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించాలని ప్రతిపాదించినట్లుగా తెలిసింది. 352 మీటర్ల ఎఫ్ఆర్ఎల్లో ఉండే ఈ రిజర్వాయర్తో గ్రావిటీ ద్వారా కాకతీయ కెనాల్కు నీటిని తరలించవచ్చని, దీని నిర్మాణానికి రూ.3 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. -
సొమ్ములుంటేనే..!
సర్కారు బీమా ఆరోగ్యశ్రీకి క్రమంగా మంగళం పాడే కుట్ర ► రాష్ర్ట ప్రభుత్వ కొత్త ఆరోగ్య బీమా ‘పథకం’! ► ఏడాదికి రూ.1,200 కడితే అన్ని చికిత్సలు ► కొత్త పథకానికి శరవేగంగా సన్నాహాలు ► సొమ్ము కట్టినవారికే ప్రథమ సేవలు ► ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు అందని వైద్యం.. ► అందరినీ కొత్త స్కీమ్లోకి రప్పించడమే లక్ష్యం సాక్షి, అమరావతి: పేదలకు వరప్రదాయిని వంటి ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలు చెల్లించకుండా నిర్వీర్యం చేస్తూ వస్తున్న రాష్ర్టప్రభుత్వం తాజాగా ఓ కొత్త ఆరోగ్య బీమా పథకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకం కింద ఒక్కొక్కరు నెలకు రూ.100 కడితే ఆరోగ్యశ్రీ చికిత్సలన్నీ అందిస్తారని అధికారులు చెబుతున్నారు. అంటే ఏడాదికి రూ.1,200 చెల్లించాలన్నమాట. ఆరోగ్యశ్రీ చెల్లింపుల భారం నుంచి తప్పించుకోవడంతోపాటు ఉచితవైద్యం అందుకుంటున్న పేదలందరినీ క్రమంగా ఈ వందరూపాయల వైద్య బీమా పథకంలోకి తీసుకురావడం రాష్ర్టప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి బకాయిలు అందకపోవడంతో ప్రయివేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం నిరాకరిస్తున్నాయి. ఈ వందరూపాయల వైద్య బీమా పథకంలో చేరే వారికి మాత్రం అన్ని ఆసుపత్రుల్లో చికిత్సలు సకాలంలో అందేలా అధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. అంటే క్రమంగా ఆరోగ్యశ్రీ పేదలంతా ఈ వందరూపాయల వైద్య బీమా పథకంలో చేరితే మేలు అని అనుకునే పరిస్థితి తీసుకువస్తారన్నమాట. ప్రజారోగ్య బాధ్యతను గాలికొదిలేసి..అందరికీ ఉచితవైద్యం అందించాలన్న స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ పుట్టుకొస్తున్న ఈ పథకం అసలు లక్ష్యం మాత్రం ‘ఆరోగ్యశ్రీ’ని సమూలంగా సర్వనాశనం చేయడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదీ వంద రూపాయల వైద్య పథకం.. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వారు ఒక్కొక్కరు నెలకు వంద రూపాయల చొప్పున కడితే ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని జబ్బులకు చికిత్సలు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు. ప్రతినెలా రూ.100 చొప్పున చెల్లిస్తే ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు ఇచ్చినట్టే ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తారు. ఈ కార్డులను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళితే వైద్యం అందిస్తారు. కుటుంబంలో నలుగురు సభ్యులుంటే నెలకు రూ.400 చెల్లించాలి. అంటే సంవత్సరానికి రూ.4,800 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్ కింద రూ. 100 చెల్లించే వ్యక్తికి ఎన్ని లక్షల బీమా ఇవ్వాలి? ఈ పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలా లేక ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించాలా అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి త్వరలోనే మార్గదర్శకాలు జారీచేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్న ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వారు చెబుతున్నారు. అసలు లక్ష్యం ఆరోగ్యశ్రీనే... వందరూపాయల వైద్య పథకం అసలు లక్ష్యం ఆరోగ్యశ్రీ పథకాన్ని సమూలంగా నాశనం చేయడమేనని అధికారులు అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పథకంలో ఉన్న పేదలను క్రమంగా ఈ చెల్లింపుల పథకం కిందకు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అదెలాగంటే.. ఉదాహరణకు రూ.100 చెల్లించిన రోగి, ఆరోగ్యశ్రీ పథకంలోని పేద రోగి ఇద్దరూ ఒకేసారి ఆస్పత్రికి వస్తే వంద రూపాయలు చెల్లించిన రోగికి ముందుగా వైద్యానికి అనుమతులు లభిస్తాయి. ఉచితంగా వెళ్లే వారికి జాప్యం జరుగుతుంది. వంద కడితే తొందరగా అనుమతులు వస్తున్నాయి కాబట్టి ఉచితంగా వెళ్లే ఆరోగ్యశ్రీ రోగి కూడా ఈ వంద రూపాయల వైద్య పథకంలోకి చేరిపోవాలని ఆలోచిస్తాడు. దీంతో ఒక్కొక్కరే ఉచితం వైపు నుంచి వంద రూపాయల పథకంలోకి మళ్లే అవకాశం ఉంటుందని సర్కారు ఆలోచన. అందులోనూ ప్రాణాపాయ జబ్బులతో వచ్చే రోగులు మరింత వేగంగా వైద్యం అందాలని చూస్తారు. అలాంటివారంతా ఆతృతగా వంద రూపాయల స్కీములోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పేదల నుంచి వసూళ్ల కోసమే కొత్త స్కీమ్.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1.30 కోట్ల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. సుమారు 4 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నారు. అంటే మిగిలిన వారు సుమారు కోటి మంది మాత్రమే. వీరిలో సంపన్న వర్గాలు, వ్యాపారులు, ఉద్యోగులు మినహాయిస్తే పేదలు తక్కువే. దానిని బట్టి వంద రూపాయల వైద్య పథకం లక్ష్యం ఆరోగ్యశ్రీ పేదలే అన్న విషయం బోదపడుతుందని అధికారులు అంటున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి సామాన్యుల నుంచి వసూళ్లు చేసేందుకే ప్రభుత్వం ఈ కొత్త స్కీమును తెరమీదకు తెస్తున్నట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. ఏటా వెయ్యి కోట్లు ఆరోగ్యశ్రీకి ఉచితంగా ఖర్చు చేయడం తీవ్ర భారంగా ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఆ పథకాన్ని ఎలాగోలా అటకెక్కించి నెలనెలా వసూళ్లు దండుకునేందుకు కొత్త వైద్య పథకాన్ని సిద్ధం చేస్తోందని అధికారులంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా పథకానికి సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు అందాయని సమాచారం. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఇలా.. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,044 జబ్బులకు చికిత్సలు అందించాల్సి ఉంది. ఒక్కో పేద కుటుంబానికి ఏడాదికి రూ.2.50 లక్షల బీమా ఉంది. దీని ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరం ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రూ.910 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం రూ.500 కోట్లే మంజూరు చేసింది. గత ఏడాది కూడా రూ.250 కోట్లు బకాయి పెండింగ్ ఉంది. ఆ రూ.250 కోట్లు తీసేస్తే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఈ ఏడాది చెల్లించింది రూ. 250 కోట్లేనన్నమాట. అంటే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఈ ఏడాది ఇంకా రూ.660 కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అందుకే ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం చేయడం నిలిపేస్తున్నాయి. చాలా చోట్ల రోగులను తిప్పి పంపుతున్నాయి. రోజూ 2 వేల మందికి సర్జరీలు జరిగే పరిస్థితి నుంచి 200 సర్జరీలకు వైద్యం దిగజారిపోయింది. ప్రీఆథరైజేషన్ అనుమతులు భారీగా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనాసరే ఆరోగ్యశ్రీ భారాన్ని వదిలించుకోవడం కోసం ప్రభుత్వం ఈ వందరూపాయల వైద్య బీమా పథకానికి సిద్ధమౌతున్నదని అధికారులంటున్నారు. ఉద్యోగులు కట్టిన సొమ్ము ఏమైంది? నగదు రహిత వైద్యం కోసం ఉద్యోగుల నుంచి కేడర్ను బట్టి కొందరి వద్ద నెలకు రూ.120, కొందరి నుంచి రూ.90 చొప్పున రెండేళ్లుగా ప్రభుత్వం వసూలు చేస్తోంది. రెండేళ్లలో సుమారు రూ. 250 కోట్లు పైనే ప్రభుత్వం వసూలు చేసింది. కానీ నగదు రహిత వైద్యం ఇంత వరకు ప్రారంభం కాలేదు. ఆర్థిక శాఖ ఇప్పటి వరకూ ఉద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఇవ్వలేదు. పదే పదే ఈ నిధుల కోసం లేఖ రాసినా ఆర్థిక శాఖ స్పందించలేదు. దీంతో సర్కారు, ఆరోగ్యశ్రీల మధ్య ఉద్యోగులు, పెన్షనర్లు నలిగిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కట్టిన సొమ్మునే ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఇవ్వకుండా, వైద్యం చేయించకుండా ఉన్న సర్కారు ఇక పేదల నుంచి రాబట్టే వందరూపాయల వైద్య బీమా సొమ్మును చెల్లిస్తుందా.. వైద్యం అందిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. -
‘మిగులు’ తెలంగాణ
2015-16లో రూ.250 కోట్ల రెవెన్యూ మిగులు సాక్షి, హైదరాబాద్: అపారమైన వనరులున్న తెలంగాణ వరుసగా రెండో ఏడాది రెవెన్యూ మిగులు సాధించిన రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టుకుంది. 2015-16 ఆర్థిక సంవత్సరపు వార్షిక ఆదాయ వ్యయాలను పరిశీలించిన అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పద్దుల ఆధారంగా ఆదాయ వ్యయాలకు సంబంధించిన తుది గణాంకాలను ఏజీ వెల్లడించింది. పన్నులు, పన్నేతర ఆదాయంతోపాటు కేంద్ర గ్రాంట్లన్నీ కలిపితే రాష్ట్ర రెవెన్యూ రాబడి మొత్తం రూ.76,000 కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం రూ.75,750 కోట్లు కాగా, రెవెన్యూ మిగులును రూ.250 కోట్లుగా ఏజీ లెక్కతేల్చింది. ఈ మేరకు ఆర్థిక లావాదేవీల తుది ఖాతాలను రాష్ట్ర ఆర్థిక శాఖకు అందించింది. తొలి ఏడాది రాష్ట్రం రూ.368.65 కోట్ల రెవెన్యూ మిగులు నమోదు చేసింది. అదే పంథాను ఇప్పుడు కూడా కొనసాగించడంతో రాష్ట్ర ఆదాయానికి ఢోకా లేదని తేటతెల్లమైంది. -
హంద్రీ-నీవాలో 358% పెంపు
♦ పేరూరు బ్రాంచ్ కెనాల్ అంచనాలు భారీగా పెంచేశారు ♦ ఆర్థిక శాఖ, ఎస్ఎల్ఎస్సీ అభ్యంతరాలు బేఖాతర్ ♦ తనకు సన్నిహితుడైన ఎమ్మెల్సీకి కట్టబెట్టాలంటూ ‘పెదబాబు’ ఒత్తిడి సాక్షి, హైదరాబాద్ : అస్మదీయుడైతే.. పనులు చేయకున్నా ఫర్వాలేదు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలనే సాకు చూపి అంచనాలను అడ్డగోలుగా పెంచేస్తారు. పనిలో పనిగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేస్తారు. పెంచిన మేరకు వాటాలు పంచుకుతింటారు. తస్మదీయుడైతే.. నిబంధనల మేరకు పనులు చేస్తున్నా.. చేయడం లేదనే సాకు చూపి 60-సీ సెక్షన్ ప్రయోగిస్తారు. ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా పనులు రద్దు చేసేస్తారు. ఆ తర్వాత అంచనాలు పెంచేసి.. వాటిని దొడ్డిదారిన అస్మదీయుడికి అప్పగించి పెంచిన అంచనాల మేరకు వాటాలు పంచుకుతింటారు. .. ఇదీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో సాగుతోన్న అక్రమాల దందా. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం తొలి దశలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు బ్రాంచ్ కెనాల్ తవ్వి 80,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. 36వ ప్యాకేజీ కింద పేరూరు బ్రాంచ్ కెనాల్ పనులను 2005లో ఓం-రే(జాయింట్ వెంచర్) రూ.93.92 కోట్లకు దక్కించుకుంది. టీడీపీ అధికారంలోకి రాగానే పనులు చేయడం లేదనే సాకు చూపి ఒప్పందం రద్దు చేసేశారు. అదే పని అంచనా వ్యయాన్ని రూ.336.15 కోట్లకు పెంచుతూ మంగళవారం జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఉత్తర్వుల(జీవో-577)ను జారీ చేశారు. అంటే ఒకేసారి అంచనా వ్యయాన్ని 358 శాతం పెంచినట్లు స్పష్టమవుతోంది. ఈ పనిని తనకు సన్నిహితుడైన ఎమ్మెల్సీకి ‘కొటేషన్’ పద్ధతిలో కట్టబెట్టాలంటూ జలవనరుల శాఖ అధికారులపై పెదబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. భూసేకరణను వేగంగా చేసి.. పనులు సజావుగా చేయడానికి సహకరించాల్సిన సర్కార్ తద్భిన్నంగా వ్యవహరించింది. విపక్ష పార్టీకి చెందిన కాంట్రాక్టర్ అనే నెపంతో కక్ష సాధింపులకు దిగి పనులను రద్దు చేసేసింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఓ ఎమ్మెల్సీ పనుల అంచనా వ్యయాన్ని పెంచేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు అంచనా వ్యయాన్ని రూ.355.304 కోట్లకు పెంచాలంటూ గత ఏప్రిల్ 19న అనంతపురం జిల్లా సీఈ జలంధర్ జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఒకేసారి అంచనా వ్యయం నాలుగు రెట్లు పెంచడంపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ) ఆశ్చర్యం వ్యక్తం చేసి.. తోసిపుచ్చింది. అవే ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపగా.. అంచనా వ్యయం 400 శాతం పెంచడానికి అనుమతించబోమని అధికారులు తెగేసి చెప్పారు. దీనిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ అంచనా వ్యయం రూ.336.15 కోట్లకు పెంచే ఫైలుపై తానే సంతకం చేసేశారు. ఆ మేరకు జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఈ పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించాలి. కానీ.. యుద్ధప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేయాలనే సాకుతో కొటేషన్ల ద్వారా తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీకి కట్టబెట్టాలంటూ జలవనరుల శాఖపై పెదబాబు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వారంలోగా ఈ పనులు టీడీపీ ఎమ్మెల్సీకి కట్టబెడుతూ ఉత్తర్వులు వెలువడడం ఖాయమని జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఐదో లిఫ్టు పేరుతో 52 కోట్లు ఎత్తిపోత! హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల్లో ఇదో కొత్తరకం దోపిడీ... అదనపు లిఫ్టు చేపట్టాలంటూ వచ్చిన ప్రతిపాదనను రాష్ర్టప్రభుత్వం కనీసం పరిశీలించక ముందే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేశారు. ఎవరేమనుకుంటే మాకేం అన్నట్లు రూ.52.52 కోట్ల పనులకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా ఊపేశారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో.. మడకశిర బ్రాంచ్ కెనాల్(ఎంబీసీ) ద్వారా అనంతపురం జిల్లాలో మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లో 74,400 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. హంద్రీ-నీవా ప్రధాన కాలువ 304.50 కి.మీ నుంచి నాలుగు దశల్లో 121.481 మీటర్లకు 18.219 క్యూసెక్ల నీటిని నాలుగు లిఫ్టుల ద్వారా ఎంబీసీలోకి ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. లిఫ్టుల నిర్మాణానికి సంబంధించిన ఎలక్ట్రో మెకానిక్ పనులను రూ.357.80 కోట్లకు వీఆర్సీఎల్-ష్యూ-డబ్ల్యూపీఐఎల్ జాయింట్ వెంచర్(జేవీ) చేజిక్కించుకుని జూన్ 18, 2008న ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ప్రధాన కాలువ నుంచి ఎంబీసీకి నీటిని తరలించే ప్రాంతం 323.950 కి.మీకి మారినందువల్ల అదనంగా ఐదో లిఫ్టును చేపట్టాలని 2013లో కాంట్రాక్టర్ ప్రతిపాదించగా... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరస్కరించింది. టీడీపీ అధికారంలోకి రాగానే పెదబాబు ‘ఆస్థాన’ కాంట్రాక్టర్ ఆ పనులను సబ్ కాంట్రాక్టు కింద చేజిక్కించుకున్నారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే.. పెదబాబు నోటి మాటపై అదనపు లిఫ్టు పనులు చేపట్టారు. పెదబాబు ఒత్తిడి మేరకు.. ఆ పనులకు ఎస్ఎస్ఎల్సీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ), ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్) కమిటీలు అనుమతి ఇచ్చేశాయి. అదనపు లిఫ్టు పనుల విలువను రూ.52.52 కోట్లుగా నిర్ధారించాయి. టెండర్తో నిమిత్తం లేకుండా పాత కాంట్రాక్టర్కే అప్పగిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జూన్ 20న ఆమోదముద్ర వేశారు. -
16 పీఎస్యూల్లో డిజిన్వెస్ట్మెంట్కు రెడీ
♦ ఈ ఏడాది విక్రయ జాబితా సిద్ధం చేసిన ఆర్థిక శాఖ ♦ లిస్టులో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా ♦ ఖజానాకు రూ.40 వేల కోట్లు వచ్చే అవకాశం న్యూఢిల్లీ: ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)ల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్మెంట్)కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం 16 కంపెనీల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో వీటి షేర్ల విలువ ఆధారంగా ఈ వాటా అమ్మకాల ద్వారా రూ. 40 వేల కోట్లు వస్తుందని అంచనా. లిస్టులో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్, ఎంఎంటీసీ, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎన్హెచ్పీసీ, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర కంపెనీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీటిలో చాలా కంపెనీల్లో డిజిన్వెస్ట్మెంట్ను గత ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టాలని భావించినా.. స్టాక్మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా జాప్యం జరిగింది. కొన్ని కంపెనీలకు సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా లభించింది. మరోపక్క, భారీగా నగదు నిల్వలు ఉన్న కంపెనీల నుంచి షేర్ల బైబ్యాక్ ఆప్షన్ను కూడా పరిశీలించే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 10 శాతం చొప్పున వాటా అమ్మకాల ద్వారా కోల్ ఇండియా నుంచి రూ.18,000 కోట్లు, ఎన్ఎం డీసీ నుంచి రూ.3,800 కోట్లు, నాల్కో నుంచి రూ.1,000 కోట్లు లభించే అవకాశం ఉంది. ఇక ఓఎన్జీసీలో 5% వాటా విక్రయం ద్వారా రూ.9,000 కోట్లు ఖజానాకు సమకూరనుంది. ఈ ఏడాది బడ్జెట్లో 2016-17 డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని కేంద్రం రూ.56,500 కోట్లుగా నిర్ధేశించుకుంది. పీఎస్యూల్లో మైనారిటీ వాటా అమ్మకంతో రూ. 36,000 కోట్లు.. లాభాల్లో అదేవిధంగా నష్టజాతక కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయాల రూపంలో రూ.20,500 కోట్లు సమకూర్చుకోవాలనేది ప్రణాళిక. -
వేతనపెంపు వర్తించదా..?
♦ పారిశుద్ధ్య కార్మికులకు వర్తించని ‘ఔట్ సోర్సింగ్’ ♦ వేతన పెంపు జీవో 8 నెలలుగా పెండింగ్లో ♦ వేతనాల పెంపు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు ఓవైపు..చాలీచాలనీ వేతనాలు మరోవైపు.. వెరసి మున్సిపల్ తాత్కాలిక కార్మికుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. సమ్మె చేసినా ఫలితం రాకపోవడంతో అలసిపోయిన పారిశుద్ధ్య కార్మికులు తిరిగి విధుల్లో చేరి 8 నెలలు గడుస్తున్నా వేతనాల పెంపుపై మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను పెంచుతూ గత నెల 19 రాష్ట్ర ప్రభుత్వం జీవో 14 జారీ చేయడంతో మళ్లీ మున్సిపల్ కార్మికుల్లో ఆశలు చిగురించాయి. అయితే, రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న 15 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పారి శుద్ధ్య, పారిశుద్ధ్యేతర కార్మికులకు ఈ ఉత్తర్వు లు వర్తించవని రాష్ట్ర పురపాలక శాఖ తేల్చడం తో కార్మికుల ఆశలు ఆవిరయ్యాయి. గత కొన్నేళ్లుగా మున్సిపాలిటీల్లో రూ.8,300, నగర పం చాయతీల్లో రూ.7,300 నామమాత్రపు వేతనాలను తాత్కాలిక కార్మికులకు చెల్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.8,500 నుంచి రూ. 12,500కు, డ్రైవర్ల వేతనాన్ని రూ.10,200 నుం చి రూ.15,000కు పెంచుతూ గత జూలై 16న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన 67 పురపాలికల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచింది. ఇచ్చిన హామీ మరిచారు... 9వ పీఆర్సీలో 4వ తరగతి ఉద్యోగుల వేతన సిఫారసుల ఆధారంగా ... మున్సిపాలిటీల్లో రూ.8,300, నగర పంచాయతీల్లో రూ.7,300 ను కనీస వేతనంగా చెల్లిస్తున్నారు. ఉద్యోగుల తరహాలో 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని తమకూ వర్తింపజేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అందరితో పాటే మున్సిపల్ కార్మికుల వేతనాలను సైతం పెంచుతామని అప్పట్లో రాష్ట్ర ఆర్థిక శాఖ హామీ ఇచ్చింది. గత నెలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచిన ఆర్థిక శాఖ.. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపును మాత్రం మరిచిపోయింది. -
రద్దు వద్దు.. విలీనమే ముద్దు
♦ పథకాల రద్దుకు పలు శాఖల అభ్యంతరం ♦ ఆసక్తి రేపుతున్న కుదింపు ప్రక్రియ ♦ ఊపందుకోనున్న బడ్జెట్ కసరత్తు సాక్షి, హైదరాబాద్: సంఖ్యాపరంగా పథకాలను రద్దు చేసే బదులు చిన్న పథకాలను విలీనం చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. వివిధ శాఖల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్కారు ఈ దిశగా పునరాలోచనలో పడింది. కేంద్ర ప్రాయోజిత పథకాలు, వాటికి అనుసంధానంగా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలున్నందున చిన్న పథకాలనీ, అక్కర్లేనివాటినీ పక్కనబెట్టవద్దని వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు ఆర్థిక శాఖకు సూచించారు. పూర్తిగా అవసరం లేని పథకాలు వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉన్నాయని, మిగతా పథకాలన్నీ నిధులు కేటాయిస్తే మళ్లీ పట్టాలెక్కే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అందుకే తొందరపాటుగా పథకాల రద్దుకు సిఫారసు చేయకుండా.. చిన్న పథకాలు, తక్కువ ప్రాధాన్యమున్నవి రెండు మూడు కలిపి ఒకే పథకంగా పరిగణించాలని సూచించారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టి.. ఇప్పుడు పూర్తిగా అమలుకు నోచుకోని బంగారు తల్లి లాంటి పథకాలను రద్దు చేయాలని నిర్ణయించారు. మిగతా పథకాలను సంఖ్యాపరంగా పరిగణించాల్సిన అవసరం లేదని, ఇప్పటికిప్పుడు ప్రాధాన్యం లేకుంటే బడ్జెట్లో తక్కువ కేటాయింపులు ఇవ్వాలని, మొత్తంగా పథకం తీసేయాల్సిన అవసరం లేదని ఎక్కువ శాఖల అధికారులు సూచించారు. దీంతో బడ్జెట్ తయారీ కసరత్తు ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో దాదాపు 870 పథకాలున్నాయి. వీటిని సగానికి పైగా తగ్గించాలని ఆర్థిక శాఖ ప్రాథమికంగా కసరత్తు చేసింది. కానీ వీటి అమలు, ప్రాధాన్యతను నిర్ణయించాల్సింది తాము కాదని, ఆ కీలక బాధ్యతను సంబంధిత శాఖల అధిపతులకు అప్పగించింది. ఎక్కువ సంఖ్యలో పద్దులు ఉండటంతో బడ్జెట్ సంక్లిష్టంగా మారుతోందని, వీలైనంత మేరకు పద్దుల సంఖ్యను తగ్గించాలని, అమలు చేస్తున్న పథకాలను కొనసాగించి, మిగతా వాటిపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పథకాల కుదింపు ఎజెండాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారంతో ఈ సమావేశాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా వచ్చిన సూచనలు, సలహాలతో బడ్జెట్లో పొందుపరచాల్సిన పథకాల తుది జాబితా సిద్ధమవనుంది. వ్యవసాయ శాఖలో 109 పథకాలు, వైద్యారోగ్య శాఖలో 80, నీటిపారుదల శాఖలో 82 పథకాలున్నాయి. వీటిలో వీలైనన్ని పథకాలను పక్కనబెట్టాలని భావిస్తున్నారు. బడ్జెట్లో ఉన్న కొన్ని పథకాలు తెలంగాణ ప్రాంతానికి అవసరం లేకున్నా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లుగా యథాతథంగా పొందుపరిచినట్లుగా గుర్తించారు. ఇలాంటి పద్దులన్నీ రద్దు చేసి పథకాల విషయంలో అధికారులు ఇచ్చిన సలహాల మేరకు ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సమీక్ష బడ్జెట్ తయారీ కసరత్తు ఈ వారం నుంచి ఊపందుకోనుంది. పథకాల కుదింపు ప్రక్రి య ముగిసిన వెంటనే స్వయంగా సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది బడ్జెట్ తయారీపై సమీక్ష జరపనున్నారు. ప్రతి రోజు రెండు, మూడు శాఖలతో సమీక్ష నిర్వహించి బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి రెండో వారంలోగా ఈ కసరత్తు పూర్తవనుంది. -
పెన్షనర్లకు ఇప్పటికీ నిరీక్షణే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ బకాయిలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో దాదాపు 8 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు గ్రాట్యుటీ బకాయిలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ సిఫారసుల ప్రకారం రిటైరైన ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని భారీగా పెంచిన ప్రభుత్వం... బకాయిల చెల్లింపులపై మాత్రం ఉలుకూ పలుకూ లేనట్లుగా వ్యవహరిస్తోంది. రిటైరైన ఉద్యోగులకు గతంలో రూ. 8 లక్షలున్న గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచుతూ గత ఏడాది జూలైలోనే ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు...తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెరిగిన గ్రాట్యుటీ వర్తిస్తుందని ప్రకటించింది. 2015 మార్చి నుంచి రిటైరైన వారికి నగదు రూపంలో గ్రాట్యుటీ చెల్లిస్తామని, 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలు చెల్లిస్తామని పేర్కొంది. వీటికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సర్కారు తెలిపింది. కానీ ఆరు నెలలు కావస్తున్నా ఈ ఉత్తర్వులు జారీ చేయకుండా ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో బకాయిలు పొందాల్సిన పెన్షనర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ తర్వాత రిటైరైన ఉద్యోగులకు పెరిగిన గ్రాట్యుటీ చెల్లించిన ప్రభుత్వం తమకు ఇస్తామన్న బకాయిలు ఇవ్వకపోవటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందరికీ రూ. 8 లక్షల గ్రాట్యుటీ చెల్లించామని, వ్యత్యాస బకాయిల ఫైలు పెండింగ్లో ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రాట్యుటీ బకాయిలు చెల్లించేందుకు దాదాపు రూ. 200 కోట్లు కావాల్సి ఉండటం, కొత్త బడ్జెట్ తయారీ నేపథ్యంలో ఈ చెల్లింపుల ఫైలు మరో రెండు నెలల వరకు ముందుకు కదిలేటట్లు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేతన బకాయిలకు మోక్షం లేనట్లే! ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ బకాయిల చెల్లింపులకు రానున్న బడ్జెట్లోనైనా మోక్షం లభించడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంత మేరకు తగ్గించాలని సర్కారు కసరత్తు చేస్తుండటంతో బడ్జెట్లో బకాయిల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం పెరిగిన వేతనాలకు సంబంధించిన 9 నెలల బకాయిలను ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. వీటికి దాదాపు రూ. 2,500 కోట్లు అవసరమవుతాయి. ఇది భారీ మొత్తం కావటంతో ఆర్థికశాఖ బకాయిలను చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తోంది. మరోవైపు బకాయిలు నగదుగా ఇవ్వాలా లేక జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలా అనే సందిగ్ధతపై స్పష్టత లేదు. కొత్తగా చేరిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేకపోవటం, పెన్షన్దారులకు జీపీఎఫ్ వర్తించకపోవటంతో ఈ చెల్లింపులు సంక్లిష్టంగా మారాయి. బకాయిల మొత్తంలో సగం జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని, మిగతా సగం నగదు రూపంలో ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తులు ప్రభుత్వం పరిశీలనలోనే నిలిచిపోయాయి. -
దుమ్ముగూడేనికి కొత్త టెండర్లే!
రూ.7,967 కోట్ల తుది అంచనాతో ఆర్థిక శాఖకు ఫైలు సాక్షి, హైదరాబాద్: సమీకృత ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను పాత కాంట్రాక్టర్లకు అప్పగించకుండా కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడేళ్ల కింద నిర్ణయించిన స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు(ఎస్ఎస్ఆర్)ల ప్రకారం మారిన డిజైన్లకు అనుగుణంగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు అనాసక్తి చూపుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్త టెండర్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ల కింద ఇప్పటివరకూ చేసిన పనులను అనుసంధానం చేస్తూ ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేలా దుమ్ముగూడెం తుది ప్రణాళిక ఖరారైన విషయం తెలిసిందే. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 5 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో గ్రావిటీ ద్వారా 46.30 కిలోమీటర్ల దూరం గల కోయగుట్ట పంపు హౌజ్ వరకు నీటిని తరలించి అక్కడినుంచి జగన్నాథపురంలో కట్టే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా బయ్యారం చెరువు(రిజర్వాయర్) దాకా నీటిని తరలిస్తారు. ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి 50 టీఎంసీల నీటిని తరలిస్తారు. పాల్వంచ మండలం కోయగుట్ట, ముల్కంపల్లి మండలం కమలాపురం, తోగ్గూడెం, టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామాల్లో నాలుగు పంపు హౌజ్లు, ఆరు లిఫ్టులు ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయగా, మొత్తం నిర్మాణానికి రూ.7,967 కోట్లతో తుది అంచనా వేశారు. ఈ అంచనాను ఆమోదానికి ఆర్థిక శాఖకు పంపారు. ఇదే సమయంలో పనులను ఎవరికి అప్పగించాలన్న అంశమై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా బ్యారేజీలు, పంప్హౌజ్లు, ఇతర నిర్మాణాల కోసం 2007-08లో నిర్ణయించిన స్టాండర్ట్ షెడ్యూల్డ్ రేట్లు(ఎస్ఎస్ఆర్)తో పోలిస్తే ప్రస్తుత రేట్లు 30 నుంచి 40 శాతం పెరిగే అవకాశం ఉంది. గతంలో ఈపీసీ విధానంతో పాత కాంట్రాక్టులకు అప్పగించగా, ప్రస్తుతం ఆ విధానం లేదు. దీంతో పాటే డిజైన్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా టెండర్లు పిలవడం సుముచితమనే అభిప్రాయం నీటి పారుదల శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
మూడోసారీ భారీ బడ్జెట్
* రూ.1.30 లక్షల కోట్లకు చేరనున్న తెలంగాణ ఆర్థిక ప్రణాళిక * సీఎం సూచన మేరకు కసరత్తును వేగవంతం చేసిన ఆర్థిక శాఖ * నిరుటిలాగే మార్చిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పునరాలోచన * మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హౌసింగ్ పథకాలకు రుణాలే దిక్కు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడోసారి భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. 2015-16లో రూ. 1.15 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్ను సమర్పించే అవకాశాలున్నాయి. ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంత మేరకు తగ్గించి ప్రణాళిక పద్దుపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆర్థికశాఖకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వీటికితోడు వాస్తవికతకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉండాలని సూచిం చారు. దీంతో అధికారులు బడ్జెట్ కసరత్తుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రణాళిక పద్దు కేటాయింపులను ముందుగానే శాఖలవారీగా సమాచారం అందించి వాటి ఆధారంగా జిల్లాల అభివృద్ధి కార్డులను తయారీ చేసే కొత్త పంథాను అనుసరిస్తామని సీఎం ఇటీవలే ప్రకటించారు. జనవరి మొదటి వారంలోనే ఈ కసరత్తు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపుల ప్రక్రియ ఇప్పటికీ జరగలేదు. సీఎం ఆదేశాలతో హడావుడి పడ్డ ఆర్థిక శాఖ ప్రాథమికంగా శాఖల వారీ కేటాయింపుల జాబితా తయారు చేసింది. కానీ సంక్రాంతి తర్వాత జరిగిన సమీక్షలో ఆర్థికశాఖ ఇచ్చిన ఈ జాబితాకు సీఎం ఆమోదముద్ర వేయలేదని తెలిసింది. వాస్తవికతకు అద్దం పట్టేలా కేటాయింపులు లేవని, మరోసారి పునః సమీక్షించాలని సీఎం సూచించినట్లు సమాచారం. మిగతా శాఖల అధికారులతో చర్చించాక కేటాయింపుల విషయంలో తుది నిర్ణయం తీసుకుందామని సీఎం అభిప్రాయపడ్డట్లు తెలిసింది. దీంతో శాఖలవారీగా సీలింగ్ బడ్జెట్ ప్రకటించే ప్రక్రియ పెండింగ్లో పడింది. కీలక పథకాలపై ఊగిసలాట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కొన్ని పథకాలను ఈసారి బడ్జెట్లో పొందుపరుస్తారా..? లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంటింటికీ నల్లా నీటిని అందించే లక్ష్యంతో తలపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు దాదాపు రూ.30 వేల కోట్లు కావాలి. ఈ మొత్తాన్ని వివిధ సంస్థల నుంచి రుణం ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాలకు సైతం రుణాలపైనే ఆధారపడుతోంది. నాబార్డు, హడ్కో, ఎల్ఐసీ, రాష్ట్ర బ్యాంకర్ల సమితి నుంచి వీటికి రుణాలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో ప్రణాళిక పద్దులో వీటి ప్రస్తావన లేకుండా బడ్జెట్ను మిగతా పథకాలకు, పనులకు సర్దుబాటు చేయాలని యోచి స్తోంది. ఈ ఏడాది ప్రణాళిక పద్దు దాదాపు రూ. 62 వేల కోట్లకు చేరుతుందని అంచనా. బడ్జెట్లో 18 శాఖలవారీగా నిధుల కేటాయింపులుంటా యి. ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించినట్లు నీటిపారుదలశాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయిస్తే మిగతా రూ. 37 వేల కోట్లను ఇతర శాఖలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు జనాభా ప్రకారం నిధులు కేటాయించటం తప్పనిసరి. ఎస్సీ సబ్ప్లాన్కు 15.44 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్కు 9.34 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. 2015-16 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం రూ. 11,450 కోట్లు కేటాయించింది. ప్రణాళిక పద్దు పెరిగిన దామాషా ప్రకారం వచ్చే బడ్జెట్లో ఇది కాస్తా రూ.15 వేల కోట్లకు చేరుతుంది. దీంతో మిగతా రూ. 22 వేల కోట్లను ఇతర విభాగాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అందుకే కొన్ని పథకాలకు బడ్జెట్లో ఆర్థిక కేటాయింపుల్లేకుండానే రుణాల సమీకరణ ద్వారా చేపట్టే వెసులుబాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు తాజా పరిణామాలతో బడ్జెట్ సమావేశాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ కంటే ముందే...అంటే జనవరి నెలాఖరునే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి ఫిబ్రవరి మొదటి వారంలోనే బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు జారీ చేసింది. కానీ కొత్తగా ఎంచుకున్న బడ్జెట్ తయారీ పంథాతోపాటు గ్రేటర్ హైదరాబాద్, నారాయణఖేడ్ ఉప ఎన్నిక కారణంగా బడ్జెట్ తయారీ ఆలస్యమవుతోంది. గతేడాది మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది కూడా కొంచెం అటుదిటుగా మార్చి మొదటి, రెండో వారంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. -
755 కొత్త పోస్టుల మంజూరు
సాక్షి, హైదరాబాద్: వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో వివిధ పోస్టుల మంజూరుకు రాష్ర్ట ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ హోదాల్లో 82 రెగ్యులర్ పోస్టులతో పాటు 22 అవుట్ సోర్సింగ్ పోస్టులు మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఉత్తర్వుల్లో తెలిపారు. జాయింట్ రిజిస్ట్రార్ (2), కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, డెరైక్టర్(పబ్లికేషన్స్), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ (3), రీజనల్ కో ఆర్డినేటర్, డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్ (అకడమిక్), డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్(అడ్మిషన్స్), డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్(ఎగ్జామ్స్), ఫైనాన్స్ ఆఫీసర్(డిప్యూటీ రిజిస్ట్రార్ కేడర్), యూనివర్సిటీ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (7), సీనియర్ సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్, పీఎస్ టు వైస్ చాన్స్లర్, సూపరింటెండెంట్స్ (12), డ్రాట్స్మెన్, సీనియర్ అసిస్టెంట్స్ (15), వీసీకి పీఏ (సీనియర్ స్టెనోగ్రాఫర్), జాయింట్ రిజిస్ట్రార్ పీఏ (సీనియర్ స్టెనోగ్రాఫర్), జూనియర్ అసిస్టెంట్స్ (15), లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ (2), స్టాటిస్టికల్ ఆఫీసర్, డెరైక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రోగ్రామర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ (4), ట్రేసర్స్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ సబార్డినేట్(18), ఎలక్ట్రీషియన్ కమ్ జనరేటర్ ఆపరేటర్, ప్లంబర్ పోస్టులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో 147 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ పంపించిన ప్రతిపాదనలకు పరిశీలించి కొత్త పోస్టులకు ఆమోదం తెలుపుతూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పిడియాట్రిక్ ఐసీయూ, నియోనాటల్ ఐసీయూ, మెట ర్నల్ ఐసీయూ, అనస్థీషియా యూనిట్లో వివిధ పోస్టులతో పాటు ఇతర పారామెడికల్ పోస్టులను మంజూరు చేసింది. మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి 462 పోస్టులు మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి 462 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కాలేజీ సూపరింటెండెంట్ కార్యాలయానికి 55, ప్రిన్సిపల్ ఆఫీసుకు 24, క్లినికల్ స్పెషాలిటీ విభాగానికి 302, నాన్ క్లినికల్ స్పెషాలిటీ విభాగానికి 81 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది. అటవీ శాఖలో 42 పోస్టులు.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాల్లోని ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు అటవీ శాఖలో 42 సూపర్ న్యూమరీ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. వీటికి అమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, 18 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, 4 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 9 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, 2 సీనియర్ అసిస్టెంట్, 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సృష్టించారు. -
ఎట్టకేలకు 60 ఏళ్లకు ఓకే
♦ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులపై ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం ♦ పాలకవర్గ తీర్మానాలు పంపాలంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ♦ అన్ని సంస్థల తీర్మానాలు వచ్చిన తర్వాత తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మేరకు తీర్మానాలు చేసి పంపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచే విషయంపై పాలకవర్గ తీర్మానాలు చేసి పంపించాలని తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థలను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కిందట ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొంత మంది తాము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల ఉద్యోగులమేనని, తమకూ పదవీ విరమణ వయసును పెంచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులను వేర్వేరుగా చూడటానికి వీలు లేదు. తుది తీర్పు వెల్లడించేలోపు పదవీ విరమణ చేయాల్సిన ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులను కొనసాగించండి’ అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆర్థికశాఖ పై ఆదేశాలు జారీ చేసింది.పాలకవర్గాలు తీర్మానాలు పంపాక కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తుందని అధికార వర్గాల సమాచారం. -
పంట బీమాపై కేంద్ర కేబినెట్ చర్చ
న్యూఢిల్లీ: పంట బీమా పథకంపై కేంద్ర కేబినెట్ చర్చించింది. ఈ విషయంలో కీలకమైన ప్రీమియం విషయంపై పలువురు మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా చర్చించారు. గతేడాది వ్యవసాయ పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టగా.. అప్పడు దీనిపై జరిగిన చర్చలలో ప్రీమియం రేటు విషయంలో మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆహార ధాన్యాలు, నూనె గింజటపై 2.5 శాతం, ఉద్యానపంటలకు 5 శాతం ప్రీమియమ్ చెల్లించాలని మంతిత్వ శాఖ ప్రతిపాదించగా.. అన్ని పంటలకు సమానంగా 1-1.5 శాతం ప్రీమియం ఉండాలని కొందరన్నారు. దీనిపై బుధవారం కూడా చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ కొత్త పంట బీమా పథకంపై ప్రజెంటేషన్ ఇచ్చి.. దీని వల్ల రైతులకు కలిగే లాభాన్ని కూడా వివరించినట్లు తెలిసింది. 2.2-5 శాతం ప్రీమియం చెల్లించటం వల్ల కేంద్రంపై రూ.8 నుంచి 11 వేల కోట్ల భారం పడుతుందనే భావన వ్యక్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత భారం మోయటం కష్టమని ఆర్థిక శాఖ చెప్పిది. కాగా, ప్రపంచ వ్యాక్సిన్ సంస్థ (గావీ) 2016-2021 మధ్యకాలంలో భారత్లో కొత్త టీకాలను ప్రవేశపెట్టే ఒప్పందానికి ప్రతిపాదన చేసింది. బుధవారం ప్రధానితో గావీ సీఈవో సేథ్ బర్క్లీ సమావేశమయ్యారు వచ్చే ఐదేళ్లలో భారత్కు 500 మిలియన్ డాలర్ల (రూ.3.3వేల కోట్లు) విలువైన టీకాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోపక్క జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మోదీ తనను కలిసిన కశ్మీర్ యువతతో అన్నారు. -
ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 30వేల కోట్లు ఇవ్వండి
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాకు టీ ప్రభుత్వ ప్రతినిధుల విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 30 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల బృందం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాకు విజ్ఞప్తి చేసింది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.700 కోట్లు మంజూరుకు సిఫార్సు చేయాలని విన్నవించింది. రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ డిప్యూటీ చైర్మన్ నిరంజన్రెడ్డి నేతృత్వంలో ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్, ఆర్థికశాఖ సలహాదారు జి.ఆర్.రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శి రామకృష్ణ, ప్రణాళికా విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి బీపీ ఆచార్యలతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియాతో భేటీ అయ్యింది. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన బీఆర్జీఎఫ్ (వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు) నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయింపులు, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలకు నిధుల కేటాయింపును కొనసాగించడం, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు నిధుల మంజూరు అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం నిరంజన్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు సంబంధించి గతంలో సీఎంల ఉపసంఘం సిఫార్సు చేసిన 14 అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరామన్నారు. కేంద్రం స్పష్టత ఇవ్వకుంటే బడ్జెట్ రూపకల్పనలో అవరోధాలు ఏర్పడతాయని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల నుంచి సమాచారం తీసుకుని, కేటాయించాల్సిన నిధులపై స్పష్టత ఇస్తామని పనగరియా హామీ ఇచ్చారని చెప్పారు. వచ్చేనెల 15వ తేదీన ప్రారంభమయ్యే మేడారం జాతరకు రావాల్సిందిగా పనగరియాను ఆహ్వానించామన్నారు. మేడారం జాతరతోపాటు, ఆగస్టు నెలలో ఆరంభమయ్యే కృష్ణా పుష్కరాలకు నిధులు ఇవ్వాలని కోరామన్నారు. వాటర్గ్రిడ్, మిషన్ కాకతీయకు ప్రత్యేక గ్రాంట్స్ ఇవ్వడానికి ఆర్థిక శాఖకు సిఫార్సు చేయాలని విన్నవించామన్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు రూ.400 కోట్ల మంజూరు ప్రతిపాదనలపై ప్రక్రియ జరుగుతోందని పనగరియా చెప్పారని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శితో భేటీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్పీ రతన్ వతల్తో భేటీ అయ్యింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 94 కింద ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఇవ్వాలని, 13వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని, సెంట్రల్ సేల్స్ట్యాక్స్ నష్టపరిహారం చెల్లింపులో బకాయి నిధులు విడుదల చేయాలని కోరింది. కరువు నిధులు విడుదల చేయండి రాష్ట్రానికి కరువు నిధులను త్వరగా విడుదల చేయాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్కు విజ్ఞప్తి చేశారు. రాజీవ్శర్మ బుధవారం ఉదయం సిరాజ్ హుస్సేన్తో సమావేశమై రూ. 3వేల కోట్ల కరువు నిధుల ప్రతిపాదనపై చర్చించారు. -
మరో 1,069 కొలువులు
వ్యవసాయ, భూగర్భ జలశాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా వ్యవసాయ, భూగర్భ జలశాఖల్లో 1,069 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. డెరైక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ నియామకాలు చేపట్టేందుకు టీఎస్పీఎస్సీకి అనుమతి ఇచ్చింది. వీటిలో అత్యధికంగా వెయ్యి వ్యవసాయ విస్తరణ అధికారుల (గ్రేడ్-2) పోస్టులున్నాయి. మిగతావన్నీ సాంకేతిక అర్హతలున్న పోస్టులే. కేటగిరీలవారీగా పోస్టుల సంఖ్యతోపాటు వాటి వివరాలను వెల్లడిస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధితశాఖలు పంపించిన ప్రతిపాదనలను పరిశీలించటంతోపాటు వాస్తవ అవసరాలు, ఆర్థికంగా పడే భారమెంత అనే వివరాల్ని సమీక్షించి ఈ పోస్టులకు ఆమోదం తెలిపినట్లు ఆర్థికశాఖ తెలిపింది. -
జిల్లా అభివృద్ధి కార్డులకు శ్రీకారం
♦ కరీంనగర్ బడ్జెట్ ప్లాన్పై తొలి కసరత్తు ♦ అధికారులతో ఆర్థిక మంత్రి ఈటల సమీక్ష సాక్షి, హైదరాబాద్: జిల్లా అభివృద్ధి కార్డుల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా తలపెట్టిన ఈ వినూత్న కసరత్తును ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తన సొంత జిల్లా కరీంనగర్ నుంచి మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా అధికారులతో సమావేశమై ఆ జిల్లా అభివృద్ధికి కావాల్సిన 2016-17 బడ్జెట్ ప్రణాళిక రూపకల్పనపై చర్చించారు. 2015-16 బడ్జెట్లో కేటాయించిన నిధులు, మంజూరైన పనులు, అందులో పూర్తయినవి, పురోగతిలో ఉన్నవి, ఇంతవరకు గ్రౌండింగ్కాని పనుల వివరాలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. శాఖలవారీగా ఈ ఏడాది ఖర్చు చేసిన నిధులు, మార్చి వరకు ఖర్చయ్యే అంచనా నిధులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవసరమయ్యే మొత్తం నిధులపై ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. శాఖలవారీగా వీటిని క్రోడీకరించి జిల్లా అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, సంబంధిత శాఖలకు ఆ ప్రతిపాదనలు పంపించాలని మంత్రి కలెక్టర్ను ఆదేశించారు. జిల్లాల నుంచి అందే ప్రతిపాదనలను పరిశీలించి, సంబంధిత శాఖలు ఏయే జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించాలి.. ప్రాధాన్య క్రమంలో ఈ ఏడాది ఏయే కార్యక్రమాలు చేపట్టాలి, ఏయే పనులకు ఈ నిధులు వెచ్చించాలి.. అనే వాటిపై దిశానిర్దేశం చేస్తారు. అన్ని శాఖలకు కేటాయించిన నిధులు.. వాటితో చేపట్టబోయే పనులేమిటనే వివరాలన్నీ క్రోడీకరించి.. 2016-17 జిల్లా అభివృద్ధి కార్డులను జిల్లా కలెక్టర్లు రూపొందిస్తారు. ఏయే శాఖకు ఎంత నిధులు కేటాయిస్తారో సోమవారం నాటికే వెల్లడించాల్సి ఉంది. అయితే, కేటాయింపుల తుది జాబితాను సీఎం ఆమోదానికి పంపించిన తర్వాతే వెల్లడించాలని ఆర్థికశాఖ భావిస్తోంది. సీఎం ఆమోదమే తరువాయి: రెండు రోజులుగా సీఎం వరంగల్ జిల్లా పర్యటనలో ఉండటంతో ఈ కేటాయింపుల జాబితాకు ఆయన ఆమోదముద్ర పడలేదు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న వివిధ అంశాలపై నీతి ఆయోగ్తో భేటీ అయ్యేందుకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారమే ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బుధవారం సమావేశం కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతోనూ చర్చలు జరుపుతారు. దీంతో వచ్చే ఏడాది కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయి? కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం ఎంత వెచ్చించాల్సి ఉంటుంది? అనే అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. -
టార్గెట్.. ఆదాయం
-
రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్ల ముద్రణ
ముంబై: ఆర్థిక శాఖ గత రెండేళ్లలో 16 కోట్ల రూపాయి నోట్లను జారీ చేసింది. ఈ నోట్ల ముద్రణ ఆపేసిన దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో రూపాయి నోట్లను జారీ చేసింది. 1994-95లో దాదాపు 4 కోట్ల రూపాయి నోట్ల ముద్రణయ్యాయని, ఒక్కో నోటుకు ముద్రణ వ్యయం రూ.1.48 అయిందని, ఆ తర్వాత ఈ నోట్లను ముద్రించలేదని ప్రభుత్వం తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 50 లక్షలు, ఈ ఏడాదిలో 15.5 కోట్లు చొప్పున రూపాయి నోట్లను ముద్రించామని పేర్కొంది. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు వెల్లడయ్యాయి. -
టార్గెట్.. ఆదాయం
♦ చివరి త్రైమాసికంలో రూ.12,520 కోట్ల సాధన లక్ష్యం ♦ వివిధ శాఖలకు నిర్దేశించిన ఆర్థిక శాఖ ♦ రాబట్టాల్సిందేనని చెప్పనున్న మంత్రి యనమల సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో వీలైనంత ఎక్కువగా ఆదాయం ఆర్జించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఆదాయ వనరుల శాఖలకు జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఎంత ఆదాయం సంపాదించాలో లక్ష్యాలను నిర్దేశించింది. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా ఏకంగా రూ. 12,520 కోట్లను రాబట్టాలని ఆదేశాలిచ్చింది. ఇందులో వ్యాట్ ద్వారా అత్యధికంగా జనవరి నుంచి మార్చి వరకు రూ. 8,500 కోట్లు ఆర్జించాలని పేర్కొంది. వ్యాట్ ద్వారా డిసెంబర్ వరకు 21,232.43 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అంటే జనవరి నుంచి మార్చి వరకు మరో 8,500 కోట్ల రూపాయలను ఆర్జిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా మొత్తం 29,732.43 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అవుతుంది. మద్యం విక్రయాలు, రవాణా రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గనులు, ఇతర రంగాల ద్వారా ఈ ఆదాయం రాబట్టనున్నారు. ఈ లక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లోను సాధించి తీరాల్సిందిగా ఈ నెల 13న ఆయా శాఖలతో జరగునున్న సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేయనున్నారని తెలిసింది. కేంద్రం నుంచీ రాబడులు కేంద్ర పన్నుల వాటా రూపంలోను, అలాగే గ్రాంట్ల రూపంలోను, ఇతర కేంద్ర ప్రయోజిత పథకాల రూపంలో లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 41,620.23 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు. అయితే డిసెంబర్ వరకు 30,476.78 కోట్ల రూపాయలు వచ్చాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరు నాటికి 11.642.35 కోట్ల రూపాయలు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. -
ప్రణాళిక వ్యయం.. రూ.62 వేల కోట్లు!
♦ శాఖల వారీగా నేడు కేటాయింపులు ♦ తుది దశకు చేరుకున్న బడ్జెట్ కసరత్తు ♦ పలు శాఖలకు ముందుగానే వెల్లడి కానున్న వ్యయాలు ♦ కొత్త తరహా బడ్జెట్ కూర్పుపై అధికారుల్లో ఉత్కంఠ సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో ప్రణాళిక వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.62 వేల కోట్లు కేటాయించే అవకాశముంది. గతేడాదితో పోలిస్తే ప్రణాళిక వ్యయాన్ని భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆర్థిక శాఖకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖలు సంయుక్తంగా ప్రాథమిక కసరత్తు పూర్తి చేశాయి. శనివారం సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో బడ్జెట్ తయారీలో కొత్త పంథాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయిస్తారో సోమవారం వెల్లడిస్తారు. ఇప్పటికే అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు సమర్పించాయి. వీటి ఆధారంగా ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలనే అంశంపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. సీఎం ప్రకటించిన కొత్త విధానంతో బడ్జెట్ తయారీ మరింత వేగం పుంజుకుంది. ఏటా బడ్జెట్ సమయం వరకు రహస్యంగా ఉండే ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు అన్ని శాఖలకు ముందుగానే వెల్లడి కానున్నాయి. మునుపెన్నడూ ఇలాంటి విధానం లేకపోవడంతో బడ్జెట్పై అన్ని శాఖల అధికారులు ఆసక్తి కనబరుస్తున్నారు. రెండో దశలో తమకు కేటాయించే నిధులను ఏయే పథకానికి ఖర్చు చేస్తారో జిల్లాల వారీగా కసరత్తు చేసి ఆయా శాఖలు నివేదిక సమర్పించాలి. అన్ని జిల్లాల ప్రణాళికలను క్రోడీకరించి ‘జిల్లా అభివృద్ధి కార్డులు’ తయారు చేస్తారు. ఆదాయానికి తగ్గట్టు బడ్జెట్ పెరుగుదల.. ప్రస్తుతం పెరిగిన ఆదాయంతో పాటు వచ్చే ఏడాది వచ్చే ఆదాయ వనరులు అంచనా వేసుకుని ప్రణాళిక వ్యయాన్ని నిర్దేశిస్తారు. పన్నుల, పన్నేతర ఆదాయం మొత్తం పరిగణనలోకి తీసుకుంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం 15 శాతం వృద్ధి చెందింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటాలన్నీ కలిపితే దాదాపు అదే మొత్తంలో ప్రణాళిక వ్యయం పెరుగుతుందని అంచనా. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.1.15 లక్షల కోట్లతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రణాళిక వ్యయం రూ.52,383 కోట్లు. ఆదాయ వృద్ధి రేటు ప్రకారం వచ్చే ఏడాది ఈ ప్రణాళిక వ్యయం సుమారు రూ.60 వేల కోట్లకు చేరుతుంది. ప్రణాళికేతర వ్యయం తగ్గించి, ప్రణాళిక వ్యయం పెంచాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో మరో రూ.2 వేల కోట్లు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. దీంతో ప్రణాళిక వ్యయం దాదాపు రూ.62 వేల కోట్లకు చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా, రూ.25 వేల కోట్లు సాగు నీటిపారుదల శాఖకు కేటాయించనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది రైతు రుణ మాఫీకి రూ.4,250 కోట్లు కేటాయించటం తప్పనిసరి. మిగిలిన దాదాపు రూ.33 వేల కోట్లలో ఏయే శాఖకు ఎంత చొప్పున కేటాయిస్తారు.. ఏయే పథకాలకు ఎక్కువ నిధులు ఖర్చు చేస్తుంది.. తదితర అంశాలపై సోమవారం స్పష్టత రానుంది. -
ప్రత్యేక సెలవుగా సకల జనుల సమ్మె కాలం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: సకల జనుల సమ్మె కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సాధారణ సెలవు (స్పెషల్ కాజువల్ లీవ్)గా ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జేఏసీ పిలుపు మేరకు టీఎన్జీఓలు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24వ వరకు ‘సకల జనుల సమ్మె’ను నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హామీ మేరకు ఈ సమ్మె కాలాన్ని ప్రత్యేక సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. లోకల్, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ కేడర్ ఉద్యోగులందరికీ దీనిని వర్తింపజేశారు. కాగా, మల్టీ జోనల్, స్టేట్ కేడర్ ఉద్యోగుల విషయంలో మాత్రం వారి తుది కేటాయింపులకు లోబడి ప్రత్యేక సెలవులను వర్తింపజేయనున్నారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగుల సెలవుల ఖాతాల్లో సమాన సంఖ్య గల సెలవులను పునరుద్ధరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన తుది తీర్పులకు లోబడి ఈ ఉత్తర్వులు అమలు అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిటైరైన ఉద్యోగులు, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పెన్షన్లో బకాయి కింద చెల్లింపులు చేయనున్నారు. -
బాబుగారి దుబారా రూ. 600 కోట్లు
♦ ప్రత్యేక విమానాలు తప్ప మామూలు విమానమెక్కని సీఎం ♦ జిల్లాల్లో పర్యటనలకు ఆర్భాటపు ఏర్పాట్లు ♦ విజయవాడలో సమీక్షల కోసం అధికారులకు అదనపు ఖర్చులు ♦ కార్యాలయాల సోకులకు అదనంగా ఖర్చులు ♦ అవసరం లేకపోయినా కన్సల్టెంట్లకు వందల కోట్లు ♦ అమరావతి శంకుస్థాపన కోసం వృథా వ్యయం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత మరో నాలుగు రోజుల్లో రెండో కొత్త సంవత్సరం వస్తోంది. గడచిన ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన వృథా ఖర్చులను గమనిస్తే దిమ్మతిరగడం ఖాయం. ఒక పక్క నిధుల్లేవంటూ మరో పక్క ప్రత్యేక విమానాలకు, కార్యాలయాల సోకులకు, ప్రచార ఆర్భాటాలకు ముఖ్యమంత్రి దాదాపు రూ.600 కోట్ల రూపాయలు వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణానికి విరాళాలు అడుగుతూ మరో పక్క వృథాగా నిధులను వ్యయం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో గడచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చేసిన వృథా ఖర్చులను రేఖామాత్రంగా పరిశీలిద్దాం.. ప్రత్యేక విమానంలోనే ప్రయాణం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడంలో చంద్రబాబు రికార్డు సృష్టించారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతి పర్యటనకు ప్రత్యేక విమానాల్లో తిరిగిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లాలన్నా..లేదా జిల్లాల నుంచి హైదరాబాద్కు రావాలన్నా..లేదా ఢిల్లీ వెళ్లాలన్నా, సింగపూర్ వెళ్లి రావాలన్నా ప్రత్యేక విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఆయన 63 సార్లు ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. అందుకోసం ఫిబ్రవరి వరకు ఆర్థికశాఖ రూ. 15 కోట్లను చెల్లించింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ వ్యయం మరో రూ. 15 కోట్లు అవుతుందని అధికారులు లెక్క కట్టారు. కృష్ణపట్నం పోర్టుకు చెందిన వారి ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ముఖ్యమంత్రి వెంటే ఉంటాయి. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన వ్యయం కూడా తడిసిమోపెడవుతోంది. జిల్లాల పర్యటన ఏర్పాట్ల కోసం ఆర్థిక శాఖ ప్రత్యేకంగా రూ. 15 కోట్లను ఇటీవల విడుదల చేసింది. సమీక్షలు.. అధికారుల పర్యటనలు వృథా సమీక్షలు నిర్వహించడంలో కూడా ముఖ్యమంత్రి రికార్డు సృష్టించారు. జిల్లా కలెక్టర్ల సమావేశం అయినా లేదా ఇతర అధికారులతో సమావేశమైనా ఉదయం 10 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో శాంతిభద్రతలపై రాత్రి ఒంటి గంట వరకు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి సమీక్షలంటే అధికార యంత్రాంగం భయపడే పరిస్థితి నెలకొంది. చెప్పిందే చెబుతూ సమీక్షల మధ్య ఎలాంటి పురోగతీ లేకుండా సమావేశాల పేరుతో కాలం వెళ్లబుచ్చుతున్నారనే అభిప్రాయానికి అధికార యంత్రాంగం వచ్చేసింది. హైదరాబాద్లో కాదని ఈ ఏడాది మంత్రివర్గ సమావేశాలతో పాటు, ఇక అధికారిక సమీక్షలన్నీ విజయవాడలో నిర్వహిస్తుండటంతో అధికారుల ప్రయాణ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్-విజయవాడలకు అధికారులంతా నిత్యం విమానాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం టీఏ, డీఏలకు రూ.90 కోట్లను వ్యయం చేసింది. కార్యాలయాల సోకులకు రూ.103 కోట్లా..? హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నిచర్ కోసం ఏకంగా రూ.45 కోట్లను వెచ్చించారు. ఇంకో పక్క విజయవాడలోని ఇరిగేషన్ అతిధి గృహంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ సోకులు, ఏర్పాట్ల కోసం ఏకంగా రూ.42 కోట్లను వెచ్చించారు. కొత్త భవనం నిర్మించినా ఇంత ఖర్చుకాదు. అదనపు సోకుల కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేయడంపై ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం లేక్వ్యూ అతిధి గృహానికి రూ.10 కోట్లను వ్యయం చేశారు. మదీనగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్లోని అద్దె ఇళ్లకు ఏర్పాట్లు చేయడానికి రూ. 5.87 కోట్లను వ్యయం చేశారు. కన్సల్టెంట్లకు రూ. 200 కోట్లు... ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులను విదేశాలకు చెందిన కన్సల్టెంట్లకు అప్పగించి కోట్ల రూపాయలు చెల్లించడంపైన కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నూతన రాజధాని ప్రాంతంలో అవసరమైన డాక్యుమెంట్ల రూపకల్పన కోసం విదేశీ కన్సల్టెంట్లకు ఏకంగా రూ.150 కోట్లు వ్యయం చేస్తున్నారు. వీరుగాక ఏడు మిషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు కన్సల్టెన్సీలకు చెల్లించేందుకు 2015-16 బడ్జెట్లో ఏకంగా రూ.50 కోట్లు కేటాయించింది. కన్సల్టెంట్లు స్వయంగా చేసేదేమీ ఉండదని, తాము ఇచ్చిన సమాచారం ఆధారంగా అందంగా నివేదికలు తయారు చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు పేర్కొంటున్నారు. విజన్ 2029 డాక్యుమెంట్ తయారీ బాధ్యతను మెసర్స్ ఎర్నెస్ట్ యంగ్ కన్సల్టెన్సీకి అప్పగిస్తూ రూ. 12.62 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థకు రూ. 1.12 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా చెల్లించారు. మచ్చగా మిగిలిన పుష్కర ప్రచారం గోదావరి పుష్కరాల పేరుతో రూ.1,500 కోట్లకు పైగా వ్యయం చేశారు. ఇందులో ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా నిధులను పనులు చేయకుండానే పచ్చ నేతలు కాజేశారన్న విమర్శలున్నాయి. పుష్కరాల ప్రచారం కోసమే ఏకంగా రూ. 15.20 కోట్లను ఖర్చు చేశారు. పుష్కరాలలో ముఖ్యమంత్రి ప్రచార కండూతి కారణంగా తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందారు. అమరావతి శంకుస్థాపనకు రూ. 100 కోట్లు నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటాలతో నిర్వహించడంతో తాత్కాలిక ఏర్పాట్లకు రూ.100 కోట్లకు పైగా వ్యయం చేశారు. ప్రముఖుల కోసం ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేకంగా హెలిపాడ్లు నిర్మించిన విషయం తెలిసిందే. నీరు-చెట్టు ప్రచారం కోసం ఏకంగా రూ. 5 కోట్లు కేటాయించారు. స్మార్ట్ వార్డులు, స్మార్ట్ గ్రామాల పేరుతో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం ప్రచారం కోసం జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.13 కోట్లను వ్యయం చేసింది. సీఎం జిల్లాల్లో అంతర్గత పర్యటనల కోసం ప్రత్యేకించి రూ.5.50 కోట్ల తో అత్యాధునిక సౌకర్యాలు గల ప్రత్యేక బస్సును కొనుగోలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఖరీదైన బస్సుల కోసం దుబారా ఖర్చుచేస్తారా అని దేవరపల్లికి చెందిన పొగాకు రైతు సుబ్బారావు తన సూసైడ్ నోట్లో సీఎంను ప్రశ్నించిన సంగతి తెల్సిందే. -
బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు
నేటి నుంచి 19 వరకు వివిధ శాఖలతో భేటీ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో ప్రాథమిక సమీక్ష సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారీలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం.. సోమవారం నుంచి 19వ తేదీ వరకు వివిధ శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ భేటీ కావాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాను హాజరు కావాల్సిన సమావేశాలను కొద్ది రోజులు వాయిదా వేయాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. ఈలోగా అధికారుల స్థాయిలోనే సమీక్షలు జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శులు రామకృష్ణారావు, శివశంకర్ వరుసగా అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ కానున్నారు. 14వ తేదీన విద్య, వైద్యం, ఆరోగ్యం, సాధారణ పరిపాలన, 15న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక పట్టణాభివృద్ధి, 16న ఎస్సీల అభివృద్ధి, బీసీలు, ఎస్టీలు, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, మైనారిటీ సంక్షేమం, 17న వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, రోడ్లు భవనాలు, రెవెన్యూ, హోం, 18న పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, కార్మిక ఉపాధి కల్పన, యువజన సర్వీసులు, పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రణాళికలు, 19న గృహ నిర్మాణం, పర్యావరణం, అటవీ, విద్యుత్, సమాచారం, సాంకేతిక, న్యాయ, శాసనసభా వ్యవహారాల శాఖలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు వివరిస్తారు. శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన సమస్యలు, సవాళ్లు, నిధుల అవసరం తదితర అంశాలను ప్రధానంగా ఈ సమీక్షల్లో చర్చిస్తారు. ఈ ప్రతి పాదనల ఆధారంగానే ఏయే పథకానికి ఎంత నిధులు కేటాయించే అవకాశముందో ఆర్థిక శాఖ అధికారులు అంచనాకు వచ్చే అవకాశముంది. ముఖ్య కార్యదర్శుల స్థాయిలో జరిగే ఈ సమీక్ష సమావేశాల అనంతరం మంత్రి ఈటల స్వయంగా రంగంలోకి దిగుతారు. వారం పాటు ఆయన మంత్రులతో భేటీ అవుతారు. అధికారుల స్థాయిలో వచ్చిన ప్రతిపాదనలపై ఆయా శాఖలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులతో విడివిడిగా చర్చలు జరుపుతారు. ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే బడ్జెట్ ముసాయిదాను తయారు చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
స్వయం పోషకంగా స్మార్ట్ నగరాలు
అధికారులు ప్రణాళికలు రూపొందించాలి: సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: జాతీయస్థాయిలో స్మార్ట్ నగరాల పోటీకి గాను తిరుపతి, కాకినాడ, విశాఖలు స్థిరంగా, స్వయంపోషకంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల్ని రాబట్టేలా, పెద్దఎత్తున యాత్రికులను ఆకర్షించేలా ప్రణాళికలుండాలన్నారు. శనివారం రాత్రి తన కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత స్మార్ట్ నగరాలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో స్మార్ట్ నగరాల పోటీకి రాష్ట్రం నుంచి ఈ మూడు నగరాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ మూడు నగరాల నవీకరణపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి శ్రీనివాసమ్ వరకూ 1.6 కిలోమీటర్ల మేర ఆకాశమార్గాన్ని నిర్మించేలా అధికారులిచ్చిన ప్రజెంటేషన్ను ముఖ్యమంత్రి తిలకించారు. తిరుపతి స్మార్ట్ సిటీ ప్లాన్పై ముఖ్యమంత్రి పలు మార్పులు, చేర్పులు సూచించారు. మొత్తం నగర నవీకరణకు రూ.2,636 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. విశాఖ స్మార్ట్ నగరం రూపకల్పనపై మున్సిపల్ కమిషనర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆటో రిక్షాల నుంచి ఇ-రిక్షా స్థాయికి ఎదిగేలా ప్రజారవాణా వ్యవస్థను ప్రణాళికలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. అందమైన సాగరతీరం, చుట్టూ పర్వత శిఖరాలే విశాఖ నగరానికి వన్నె తెస్తున్నాయని కైలాసగిరి, మధురవాడ, కంభాలకొండ ప్రాంతాలను ఆకర్షణీయ ప్రాంతాలుగా మలిచి విశాఖను ప్రపంచ పర్యాటక గమ్య స్థానాల్లో ఒకటిగా మార్చాలని సీఎం కోరారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్, సీఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్చంద్ర, కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మా సారు కనిపిస్తే...హైదరాబాద్ రమ్మని చెప్పరా!
బీజేపీ పార్టీనుంచి గెలిచి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న ఆయన కనిపిస్తే కాస్త చెప్పండని ఆ శాఖ ఉద్యోగులు సచివాలయంలో గుసగుసలాడుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా మా శాఖకు నిధులివ్వడం లేదని, అధికారులుగా తాము ఎంత అడిగినా ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయడం లేదని, కనీసం మంత్రి వచ్చి అడిగితే ఇచ్చే పరిస్థితి ఉన్నా ఆ మంత్రి సొంత జిల్లాకే పరిమితమయ్యారని అంటున్నారు. ఇప్పటికే మా శాఖకు నిధులివ్వడం లేదన్న వార్తలు పత్రికల్లో వస్తున్నా కూడా మా మంత్రి పట్టించుకోవడం లేదని, నేరుగా చెప్పలేకపోతున్నామని కూడా అంటున్నారు. ఏదైనా సర్వీసులు ప్రైవేటుకు అప్పజెపితే ఆ సర్వీసులకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులను ముఖ్యమంత్రికి పరిచయం చేయడానికి మినహా మరెప్పుడూ సచివాలయానికి రావడం లేదని, అతి మంచితనమో, అడగలేనితనమో అర్థం కావడం లేదని అంటున్నారు. మాటకంటే ముందే ఇన్స్టిట్యూషన్లలో నిద్రలు గడిపే మా మంత్రి నిధుల కోసం ఒక్కరోజు సచివాలయంలో నిద్ర చేస్తే నిధులు వాటికవే పరిగెట్టుకుంటూ వస్తాయని ఓ ఉద్యోగి నిట్టూర్చాడు. మా మంత్రి కనిపిస్తే ఎవరైనా జిల్లాను దాటి హైదరాబాద్ వరకూ వచ్చి వెళ్లాలని చెప్పాలని ఆ ఉద్యోగి ఛలోక్తి విసిరారు. -
ఉద్యోగులకు పీఆర్సీ అలవెన్సులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పదో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) సిఫార్సు ల ప్రకారం వివిధ రకాల అలవెన్సులు వర్తింపజే స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ సిఫార్సుల ప్రకా రం అలవెన్సులకు సంబంధించిన జీవోలు ఇవ్వాలని ఉద్యోగులు నెలల తరబడి కోరుతున్నా, ప్రభుత్వం సమీక్షల పేరుతో నాన్చుతూ వచ్చిం ది. ఈ నెల 17 నుంచి అసెం బ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై విపక్షం వైఎస్సార్ సీపీ నిలదీస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్థాయిల ఉద్యోగులకు పీఆర్సీ సిఫార్సుల ప్రకారం పలు రకాల భత్యాలు (అలవెన్సులు) అమల్లోకి తెస్తున్నట్లు ఆర్థికశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసింది. ఇవీ అలవెన్సులు: ఉద్యోగుల పర్యటనల రవాణా భత్యం (టీఏ), బదిలీ రవాణా భత్యం (టీటీఏ), లీవ్ ట్రావెలింగ్ అలవెన్సు (ఎల్టీసీ), ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్సు (ఎఫ్టీఏ), న్యాయశాఖ సిబ్బందికి మిషన్ అలవెన్సు, గ్రేహౌండ్స్ - స్పెషల్ ఇంటెలిజెన్స్- కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు స్పెషల్ అలవెన్సు, ఆర్మ్డ్ పోలీసు హెడ్ కానిస్టేబుళ్లు - కానిస్టేబుళ్లకు ఇన్సెంటివ్ అలవెన్సు, ఉపాధ్యాయులకు స్కౌట్ అలవెన్సు, ఉద్యోగులకు రిస్క్ అలవెన్సు, ఎన్జీవోలకు క్లరికల్ అలవెన్సు, క్లినిక్ అలవెన్సు, నైట్ డ్యూటీ అలవెన్సు వర్తింపజేస్తున్నట్లు వేర్వేరు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే థియేటర్ అలవెన్సు, వికలాంగ ఉద్యోగులకు కన్వేయన్స్ అలవెన్సు, జమేదార్లు- డ్రైవర్లు- లిఫ్ట్ ఆపరేటర్లు- నాలుగో తరగతి ఉద్యోగులకు స్టిచ్చింగ్ ఛార్జీలు, ఈఎస్ఐ అలవెన్సు, బ్లడ్ బ్యాంకు అలవెన్సు, రేషన్ అలవెన్సు, లెప్రసీ అలవెన్సు, కబేళా (శ్లాటర్ హౌస్) అలవెన్సు, సూపర్వైజరీ అలవెన్సు, సబ్జైలు అలవెన్సు, నిర్వహణ భత్యం, స్పెషల్ పేస్ అలవెన్సు వర్తింప జేస్తున్నట్లు శుక్రవారం రాత్రి జారీ చేసిన 21 జీవోల్లో పేర్కొంది. -
ఈ నెల పింఛన్ ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా ఒకటో తారీ ఖున పింఛన్లు అందుకునే లబ్ధిదారులు గత నెల పింఛన్ల కోసం 16వ తేదీ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ నెల కూడా వారికి ఎదురుచూపులు తప్పేలా లేవు. ఈ నెల ఒకటో తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలంటే.. గత నెల 20 లోపే బడ్జెట్ రిలీజ్ ఆర్డరు (బీఆర్వో)లను ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ, అక్టోబర్ 25న బీఆర్వోలు జారీ చేయడంతో నవంబరు 16 తరువాతే పింఛన్ల పంపి ణీ జరిగింది. అయితే డిసెంబర్ నెల పింఛన్లకు అధికారులు ఇప్పటికీ బీఆర్వోలు విడుదల చేయలేదు. దీంతో ఈ నెల పింఛన్లు ఇప్పట్లో వచ్చేలా లేవని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 లక్షల మంది పెన్షనర్లు పింఛన్ కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికలు ఉన్న జిల్లాలకు... గత నెల మొదటివారంలో వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో ఆసరా పింఛన్లను పంపిణీ చేసినట్లే.. ఈ నెలలో కూడా ఎన్నికలు ఉన్న మరి కొన్ని జిల్లాల్లో పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి నెలా పింఛన్లు పంపిణీ పూర్తయ్యాక, సమయానికి పింఛను తీసుకోని వారి సొమ్ము మిగులు తోంది. తాజాగా మిగిలిన సొమ్ము సుమారు రూ.160 కోట్లు సెర్ప్ వద్ద ఉన్నట్లు సమాచారం. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ, నారాయణ్ఖేడ్ ఉపఎన్నిక ఉన్నందున మెదక్ జిల్లాలోనూ పింఛన్ల పంపిణీలో మరింత జాప్యం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న సొమ్ముతో ఆయా జిల్లాల్లో పింఛన్ల పంపిణీ చేసేందుకు సర్కారు ఆదేశాల కోసం సెర్ప్ అధికారులు ఎదురుచూస్తున్నారు. కొత్త పింఛన్లు మంజూరు ఆసరా పింఛన్ల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న 21,970 మందికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా పింఛన్లు మంజూ రు చేసింది. అయితే.. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పింఛన్లను పంపిణీ చేసే అవకాశం లేదని సెర్ప్ అధికారులు అంటున్నారు. -
బిల్లులకు డబ్బుల్లేవు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అప్పు ద్వారా సమీకరించిన నిధులను ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర ఆర్భాటాల కోసం ఎక్కువగా వెచ్చించడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోరినంత మేర అప్పునకు కూడా అనుమతించకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం కేంద్రం అనుమతిస్తేగానీ పైసా అప్పు చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో అన్నిరకాల బిల్లుల చెల్లింపును రాష్ట్ర ఆర్థిక శాఖ నిలిపివేసింది. ఈ నెలలో ట్రాన్స్కోకు చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీ నిధులను కూడా నిలిపివేసింది. అత్యవసర వేతనాల బిల్లులను మాత్రమే చెల్లించాల్సిందిగా ఖజానా కార్యాలయాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 10వ తేదీ వరకు కేవలం జీతాలను మాత్రమే చెల్లించనున్నారు. 10వ తేదీ తరువాత ప్రాధాన్యతలకు అనుగుణంగా చెల్లింపునకు అనుమతించాలని నిర్ణయించారు.రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు వస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఎక్కువగా చేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంటోందని అధికారుల కథనం. ఈ ఉద్దేశంతోనే కేంద్రం కూడా అప్పునకు వెంటనే అనుమతించడం లేదని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం ఇప్పటివరకు రూ.9,050 కోట్ల అప్పు చేసింది. తాజాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలల్లో అంటే మార్చి వరకు రూ.6 వేల కోట్లు సెక్యూరిటీల విక్రయం ద్వారా అప్పు చేసేందుకు అనుమతించాల్సిందిగా శుక్రవారం కేంద్రానికి లేఖ రాసింది. -
పసిడి బాండ్లు @ 246 కోట్లు!
బాండ్లు ఓకే... డిపాజిట్లే నిరుత్సాహం * తాజా పసిడి పథకాలపై ప్రభుత్వం అభిప్రాయం * డిపాజిట్ల మెరుగుకు మరిన్ని చొరవలు న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన పసిడి పథకాల విషయంలో... బాండ్లకు మంచి స్పందన లభించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డిపాజిట్ల పథకం నిరుత్సాహకరంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. నవంబర్ 5 నుంచి 20 వతేదీ మధ్య తొలి దశ గోల్డ్ బాండ్ స్కీమ్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే... గోల్డ్ బాండ్ల కోసం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 63,000 దరఖాస్తులు అందాయి. విలువ రూపంలో రూ. 246 కోట్లు. ఇది చక్కటి స్పందన అని ఆర్థిక శాఖ తెలిపింది. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా దాదాపు 917 కేజీల పరిమాణంగల బంగారం బాండ్లకు డిమాండ్ వచ్చినట్లు పేర్కొంది. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ విషయానికి వస్తే... స్పందన నామమాత్రంగా ఉంది. ఈ స్కీమ్ కింద ఆదాయపు పన్ను, కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. స్పందన మరింత పెరగడానికి ఏడు కీలక నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకుంది. సేకరణ, స్వచ్ఛత పరిశీలన కేంద్రాలతో సంబంధం లేకుండా... బ్యాంకులకు ఆమోదయోగ్యమైన రిఫైనర్కు బంగారాన్ని ప్రత్యక్షంగా ఇచ్చి, ప్యూరిటీ సర్టిఫికేట్ పొందవచ్చన్న నిర్ణయం ఇందులో ప్రధానమైనది. అవిభాజ్య కుటుంబాలు, సంస్థల విషయంలో బల్క్ డిపాజిట్లకు ఈ చొరవ దోహదపడుతుందన్నది ప్రభుత్వ భావన. ముద్రణ, సోషల్ మీడియా, రేడియో, టెలివిజన్ విభాగాల ద్వారా ప్రజల్లో డిపాజిట్ పథకం పట్ల మరింత విస్తృత కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. రిఫైనరీల లెసైన్సింగ్ అంశాలను మరింత సరళతరంగా, పటిష్టంగా మలచాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గోల్డ్ రిఫైనరీల లెసైన్సుల సంఖ్య దాదాపు 20కి చేరే అవకాశం ఉంది. పథకానికి సంబంధించి పసిడి సేకరణ, స్వచ్ఛత పరిశీలన సెంటర్ల నిర్వహణకు లెసైన్సులు ఉన్న 13,000 మంది ఆభరణాల వర్తకుల నుంచి దరఖాస్తులను బీఐఎస్ ఆహ్వానించింది. ఈ ఏడాది చివరికల్లా వీరిలో 55 మందిని రిజిస్టర్ చేసుకునే వీలుంది. బీఐఎస్, ప్యూరిటీ సెంటర్లు అన్నీ అనుసంధానించడం ద్వారా డిపాజిట్ల స్కీమ్కు మరింత ప్రోత్సాహానికి కృషి. * ప్రస్తుతం స్కీమ్ కింద 33 సీపీటీసీలు, అయిదు గోల్డ్ రిఫైనరీలు నోటిఫై అయ్యాయి. * టెస్టింగ్, రవాణా, రిఫైనింగ్, సీపీటీసీ, రిఫైనరీల్లో నిల్వ సేవల విషయంలో అయ్యే వ్యయాలకు సంబంధించి బ్యాంకులకు చెల్లించే ఫీజులను తిరిగి చెల్లించేయడం జరుగుతుంది. * దేశంలో దాదాపు రూ.52 లక్షల కోట్ల విలువైన 20,000 టన్నుల పసిడి బీరువాలకు పరిమితమవుతోందన్న అంచనాలు ఉంటే... గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా నవంబర్ 18 నాటికి కేవలం 400 గ్రాముల పసిడి డిపాజిట్ అయిన సంగతి తెలిసిందే. * సంబంధిత వర్గాల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ స్కీమ్లను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.489 కోట్లు అవుట్... ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే గోల్డ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల నుంచి నిధుల వరద కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య దాదాపు రూ.489 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి వెళ్లినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇలా వెళ్లిన మొత్తం రూ.1,016 కోట్లు కావడం గమనార్హం. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా ఈటీఎఫ్ల నుంచి రూ. 2,293 కోట్లు, రూ.1,475 కోట్లు మళ్లాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలలతో పోల్చితే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నెలల్లో ఈటీఎఫ్ల నుంచి మళ్లిన మొత్తాలు తక్కువగా ఉండడానికి... ఈక్విటీ మార్కెట్ల బలహీనత కూడా కొంత కారణమని సంబంధిత వర్గాలు అంచనావేస్తున్నాయి. కాగా మార్చి నాటికి ఈటీఎఫ్ నిర్వహణ విలువ రూ.6,655 కోట్లు కాగా, ఈ పరిమాణం ఆగస్టు నాటికి రూ.6,226 కోట్లకు తగ్గింది. 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచీ మార్కెట్లో పలు మ్యూచువల్ ఫండ్ గోల్డ్ స్కీమ్లు ఉన్నాయి. 14 గోల్డ్ ఆధారిత స్కీమ్లు ప్రస్తుతం ఉన్నాయి. -
నీటి శాఖకు నిధుల మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు పేరుతో తెలంగాణ సర్కారు రాష్ట్ర వార్షిక ఆర్థిక ప్రణాళికను పక్కదారి పట్టిస్తోందా..? బడ్జెట్ మౌలిక సూత్రాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన సమగ్ర అభివృద్ధి భావనలకు భిన్నంగా కొత్త ప్రయోగానికి తెర లేపిందా..? అరవై ఏళ్లుగా ఉన్న బడ్జెట్ పద్దులను ఇష్టారాజ్యంగా నీటిపారుదల శాఖకు అనుకూలంగా మలుస్తోందా? 2016-17 బడ్జెట్కు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటకీ ఒకే పద్దు కింద రూ.25 వేల కోట్లు కేటాయించేందుకు సర్కారు తీసుకున్న నిర్ణయం ఈ సందేహాలకు తావిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు, నిపుణులందరినీ విస్మయానికి గురి చేస్తోంది. నేరుగా నిధుల కేటాయింపు సీఎం కేసీఆర్ సారథ్యంలో శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ, ఆర్థికశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రాజెక్టుల వారీగా కాకుండా.. ఒకే పద్దు కింద నీటి పారుదల శాఖకు నిధులివ్వాలని ఈ సందర్భంగా ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావు తన ప్రతిపాదనను లేవనెత్తారు. ఒకే పద్దు కింద చెల్లించాలంటే.. అకౌంటెంట్ జనరల్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఏజీ ఆమోదిస్తే ఇచ్చేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర బదులిచ్చినట్లు తెలిసింది. కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేందుకు అనువుగా బడ్జెట్ కేటాయింపులను నేరుగా నీటి పారుదలశాఖ ఖర్చు పెట్టేలా కొత్త విధానం రూపొందించాలని, ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నందున పనులను బట్టి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయకు ఆ నిధుల చెల్లింపు జరపాలని సీఎం అధికారులను ఆదేశించటం గమనార్హం. దీంతో 5 నిమిషాల్లోనే ఈ సమావేశం ముగిసింది. సమావేశానికి ఏజీ డుమ్మా ముందుగా ప్రకటించిన మేరకు సీఎం సమీక్ష సమావేశానికి అకౌంటెంట్ జనరల్ హాజరు కావాల్సి ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గంపగుత్తగా నిధులను ఒకే పద్దుపై కేటాయించే కొత్త విధానంపై చర్చించాలనే అజెండాను చూసి ఏజీ ముందు రోజే ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. బడ్జెట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా.. ఒక శాఖ ఇష్టాయిష్టంగా ఖర్చు చేసేలా ఈ కొత్త సంప్రదాయమేమిటనీ ఏజీ కార్యాలయం ఆర్థిక శాఖను ఆరా తీసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం సమావేశానికి ఏజీ హాజరు కాకపోవటం.. ఎందుకు రాలేదని సీఎం ఆరా తీయటం హాట్టాపిక్గా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అప్పటికప్పుడు ఏజీతో ఫోన్లో మాట్లాడారు. సచివాలయానికి రప్పించి సీఎంతో సమావేశమయ్యేలా చూశారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తోచ్వాంగ్, అకౌంటెంట్ జనరల్ లతా మల్లికార్జున్ సీఎంను కలుసుకున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్ రూపకల్పనకు తీసుకుంటున్న చర్యలు, నీటి పారుదల శాఖకు నేరుగా బడ్జెట్ కేటాయింపులు చేసే విషయాన్ని వీరి వద్ద సీఎం ప్రస్తావించారు. రాత పూర్వకంగా ప్రతిపాదన పంపించాలని ఏజీలు సీఎంకు చెప్పినట్లు తెలిసింది. కొత్త విధానం వివాదాస్పదం సాగునీటి ప్రాజెక్టులకు వార్షిక బడ్జెట్లో వేలాది కోట్లు కేటాయించటం కొత్తేమీ కాదు. విడివిడిగా ప్రాజెక్టులు, ప్రాంతాల వారీగా నిధులను కేటాయించాల్సి ఉంటుంది. కానీ అదేమీ పట్టనట్లుగా ఇరిగేషన్ శాఖకు రూ.25 వేల కోట్లు అని గంపగుత్తగా కేటాయించటం ప్రజాస్వామ్యంలో మంచి సంప్రదాయం కాదని, ఇది బడ్జెట్ స్ఫూర్తికే విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తీరుగా నాలుగు శాఖలకు భారీ పద్దులు ఇస్తే.. బడ్జెట్ రూపకల్పనకు అర్థమే మారిపోతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న ప్రాజెక్టులన్నీ ఒప్పందం మేరకు జరుగుతున్నవే. ఏ ఏడాది ఎంత మేరకు పని చేయాలి.. ఎంత కాలంలో పూర్తి చేయాలనేది ఒప్పందంలో స్పష్టంగా ఉంటుంది. దీంతో ఏ ప్రాజెక్టుకు ఈ ఏడాది ఎన్ని నిధులు కావాలో అంచనా వేయటం సులభం. కానీ తమకు నిధులిస్తే.. తర్వాత ఖర్చులు వెల్లడిస్తాం అన్నట్లుగా ఇరిగేషన్ విభాగం చేస్తున్న వాదన బడ్జెట్ స్ఫూర్తిని కాలరాస్తోందంటున్నారు. -
గ్రాట్యుటీ పరిమితి రూ.10 లక్షలే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ముందు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇస్తోందని సాక్షి చెప్పినట్లే దీపావళి తరువాత శుక్రవారం ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిపై ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన తరువాత ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని రూ.పది లక్షలకు పరిమితం చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ శుక్రవారం జీవో-139 జారీ చేశారు. పదవ వేతన సరవణ కమిషన్ (పీఆర్సీ) మాత్రం ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.12 లక్షలకు పెంచాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.ఈ సిఫార్సు మేరకో లేదా అంత కన్నా ఎక్కువగానో గ్రాట్యుటీని గత ప్రభుత్వాలు నిర్ణయిస్తూ వచ్చాయి. చంద్రబాబు సర్కారు మాత్రం పీఆర్సీ చేసిన సిఫార్సుల్లో రూ.రెండు లక్షల కోత విధిస్తూ గ్రాట్యుటీని ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల నుంచి రూ. పది లక్షలకే పెంచుతూ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ సిఫార్సులు 2013 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాగా ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఇచ్చే గ్రాట్యుటీ పెంపు మాత్రం శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే జూలై 2013వ తేదీ నుంచి జూలై 2014 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితి గతంలో ఉన్న రూ.8 లక్షలే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శుక్రవారం తరువాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే గ్రాట్యుటీ రూ. పది లక్షల వరకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన తరువాత ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని రూ. పది లక్షలకే పరిమితం చేస్తూ ఈ నెల 2న విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని ‘సాక్షి’ ముందుగానే తెలియజేసిన విషయం తెలిసిందే. ‘ఇక గ్రాట్యుటీ వంతు’ శీర్షికన గ్రాట్యుటీ గరిష్ట పరిమితికి కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని గత వారం ‘సాక్షి’ వార్త ప్రచురించింది. తొమ్మిదవ వేతన సవరణ కమిషన్ గ్రాట్యుటీ రూ.ఆరు లక్షలు ఇవ్వాలని సిఫార్సు చేయగా అప్పటి ప్రభుత్వం అదనంగా మరో రూ.రెండు లక్షలు పెంచుతూ గ్రాట్యుటీ రూ. 8 లక్షలు చేసింది. ఇప్పుడు పీఆర్సీ సిఫార్సు చేసినంత కూడా ఇవ్వకుండా తగ్గించడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. లక్షల మొత్తంలో కోల్పోతామంటున్నారు. కోతను అంగీకరించం ఉద్యోగుల గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. 10 లక్షలుగా నిర్ణయించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రశ్నేలేదు. పీఆర్సీసిఫార్సుల ప్రకారం గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచాల్సిందే. త్వరలోనే మేము సీఎంను, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసి గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచాలని డిమాండు చేస్తాం. పీఆర్సీ సిఫార్సులకు విరుద్ధంగా గ్రాట్యుటీని రూ. 10 లక్షలకు పరిమితం చేయడం ఉద్యోగులకు అన్యాయం చేయడమే. దీన్ని అంగీకరించం. - చంద్రశేఖర్రెడ్డి,జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ -
అప్రాధాన్య ఖర్చులు తగ్గించండి
సాక్షి, హైదరాబాద్: నాన్ ప్లాన్ పద్దుల్లో ఖర్చులు తగ్గించాలని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు ఎక్కువ నిధులు వెచ్చించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆర్థిక శాఖకు దిశానిర్దేశం చేశారు. వరుసగా రెండు రోజుల పాటు ఈ ఆర్థిక సంవత్సరపు ఆదాయ వ్యయాలను ప్రభుత్వం సమీక్షించింది. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంగళవారం సచివాలయంలో సీఎస్ రాజీవ్శర్మ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు గడిచిన ఏడు నెలల్లో ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పద్దును సీఎం ఈ సందర్భంగా పరిశీలించారు. నెలనెలా ఆశించిన మేరకు ఆదాయం వస్తున్నా.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఎందుకుందని ఆరా తీశారు. ప్రధానంగా వచ్చే ఆదాయంలో సగం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఖర్చవుతుందని ఆర్థిక శాఖ అధికారులు వివరించారు. దీంతో కొత్త రిక్రూట్మెంట్, తాజా డీఏ పెంపు, పీఆర్సీ బకాయిలు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్తో పాటు పెండింగ్లో ఉన్న చెల్లింపులన్నింటికీ అదనంగా ఎంత భారం పడుతుందని సీఎం అడిగి తెలుసుకున్నారు. డీఏ పెంపుతో నెలనెలా రూ.70 కోట్లు అవసరమవుతాయని, పీఆర్సీ బకాయిలు దాదాపు రూ.2,500 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ సీఎంకు నివేదించింది. అప్రాధాన్యంగా ఉన్న పథకాలకు నిధులు కేటాయించవద్దని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎంచుకున్న పథకాలకే అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. దీంతో పాటు వీలైనంత మేరకు పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని ఆదేశించారు. నాబార్డు నిధులు వాడుకోండి: సీఎస్ నాబార్డు నుంచి తీసుకున్న రుణంతో చేపట్టే పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆర్థిక శాఖకు సూచించారు. ఈ ఏడాది దాదాపు రూ.700 కోట్ల రుణంతో వివిధ విభాగాల్లో పనులు మంజూరు చేశారు. వీటి వినియోగం నిదానంగా ఉందని అయిదో వంతు నిధులు కూడా ఖర్చు కాలేదని చర్చ జరిగింది. దీంతో ఈ పనులు, బిల్లుల చెల్లింపులు వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు బీఆర్వోలు మంజూరు చేసినా ఖర్చుకు సంబంధించిన నిధులు చూపించటం లేదని వివిధ శాఖలు చెబుతున్నాయని, వెంటనే వీటిని సరిదిద్దాలని ఆర్థిక శాఖను అప్రమత్తం చేశారు. -
ఇరిగేషన్లో 108 అదనపు పోస్టులు
♦ భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ♦ కొత్తగా 8 సీఈ, 7 ఎస్ఈ, 21 ఈఈ, ♦ 55 డీఈఈ పోస్టులు ♦ పాలమూరు ప్రాజెక్టుకు 26, కాళేశ్వరానికి 30, డిండికి 16, పెన్గంగకు 14 పోస్టులు ♦ కొత్తగా డీఏఓ, సీఏఓ పోస్టుల మంజూరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం 108 అదనపు పోస్టులకు పచ్చజెండా ఊపింది. కృష్ణా, గోదావరి నదులపై పాలమూరు-రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం, పెన్గంగ వంటి కొత్త ప్రాజెక్టులను నిర్మించడంతోపాటు ఎస్సారెస్పీలాంటి పాత ప్రాజెక్టులను కూడా బలోపేతం చేస్తున్నందున అందుకు అవసరమైన అధికారులను నియమించుకోవాలని భావించింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా ఏఈలు, ఏఈఈల నియామక ప్రక్రియ సాగుతున్నందున సీనియర్ అధికారులందరికీ పదోన్నతులు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం, కొత్తగా 108 ఉన్నతాధికారుల పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి జీతభత్యాల రూపేణా ఏటా రూ.9.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే 33 భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు గత బడ్జెట్లో రూ.8 వేల కోట్లు కేటాయించారు. మరోపక్క రూ.2 వేల కోట్లతో 9 వేల చెరువుల పునరుద్ధరణ పనులు పుంజుకున్నాయి. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు ఉంటాయని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను 2017 నాటికి పూర్తి చేసేలా, కొత్త ప్రాజెక్టులను అప్పటిలోగా పాక్షికంగా పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం నీటిపారుదల శాఖలో కేవలం నలుగురు మాత్రమే పూర్తిస్థాయి చీఫ్ ఇంజనీర్ పోస్టుల్లో ఉండగా, మరో పది చోట్ల అదనపు బాధ్యతలు చూస్తున్నారు. చిన్న నీటిపారుదల శాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, హైడ్రాలజీ, నాగార్జునసాగర్, కరీంనగర్, మహబూబ్నగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ల పోస్టుల్లో ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్లంతా అదనపు బాధ్యతలు చూస్తున్నవారే. దీనికితోడు ప్రస్తుతం ఇంజనీర్ ఇన్ చీఫ్లుగా బాధ్యతలు చూస్తున్న ముగ్గురికి పదవీకాలం పొడిగించారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టులను వెంటనే భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 22 మంది సీఈలు.. 46 మంది ఎస్ఈలు తాజా నిర్ణయంతో ఇప్పటికే ఉన్న 14 మంది సీఈ (చీఫ్ ఇంజనీర్)లకు తోడుగా మరో 8 మందిని, ప్రస్తుతమున్న 39 మంది ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజనీర్)లకు తోడుగా మరో ఏడుగురిని నియమించే అవకాశం లభించింది. ఇకపై మొత్తంగా సీఈలు 22, ఎస్ఈలు 46 మంది ఉండనున్నారు. ఇక వీటితోపాటే ప్రస్తుతమున్న 183 మంది ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)లకు తోడుగా మరో 21 మందిని, ఇప్పుడున్న 619 మంది డీఈఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)లకు తోడుగా మరో 55 మందిని, కొత్తగా 15 మంది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లు (డీఏఓ), ఇద్దరు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ల (సీఏఓ) పోస్టులను శాఖాపరమైన పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో పాలమూరు రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం, పెన్గంగ, కాడా, విజిలెన్స్లతో పాటు మరో రెండు విభాగాలకు కొత్తగా చీఫ్ ఇంజనీర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో పాలమూరు ప్రాజెక్టుకు సీఈ, ఎస్లతో పాటు 5మంది ఈఈలను, 13 మంది డీఈఈలను, 6 మంది డీఏఓలను అంటే మొత్తంగా 26 పోస్టులను కేటాయించగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఈ, 2 ఎస్ఈ, 7 ఈఈ, 16 డీఈఈ, 4 డీఏఓ పోస్టులను అంటే మొత్తంగా 30 పోస్టులను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. డిండికి మొత్తంగా 16 పోస్టులు, పెన్గంగకు 14 పోస్టులను భర్తీ చేయనుంది. -
పండుగకు పచ్చడి మెతుకులేనా..!
సాక్షి, హైదరాబాద్: ప్రతినెలా 5వ తేదీలోపు అందాల్సిన ఆసరా పింఛన్లు ఈనెల 10వ తేదీ వచ్చినా పత్తాలేవు. దీంతో పింఛన్దారులు పండుగ నాడు పచ్చడి మెతుకులే గతి అయ్యేలా ఉందని వాపోతున్నారు. ప్రతి నెలా 1నుంచి 5లోగా పింఛను పంపిణీలో హడావిడిగా ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన (సెర్ప్) అధికారులు 10వ తేదీ వచ్చినా కిమ్మనడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింది వివిధ కేటగిరీల్లో సుమారు 36 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతినెలా దాదాపు రూ.394 కోట్ల విలువైన పింఛన్లు అందజేస్తారు. పింఛన్ పంపిణీ నిమిత్తం అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ ఆర్థిక శాఖ నుంచి నిధులు అందకపోవడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని సెర్ప్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతినెలా 25 లోగా బడ్జెట్ రిలీజ్ ఉత్తర్వులు ఇచ్చే ప్రభుత్వం అక్టోబర్ 30న బీఆర్వోలు జారీచేసింది. అయితే, ఐదారు రోజులు మాత్రమే ఆలస్యమవుతుందని భావించిన అధికారుల్లో 10వ తేదీ వచ్చినా డబ్బు అందకపోవడంతో నిరుత్సాహం ఆవహించింది. ఇదిలా ఉంటే.. ప్రతినెలా 5వ తేదీలోపు పింఛన్లు అందుకునే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులు, బీడీ కార్మికులు ఈ నెల పింఛన్ సొమ్ముకోసం బ్యాంకులు, పోస్టాఫీసులు, మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక శాఖ వద్దే ఆలస్యం... నిధుల విడుదల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లింపు తర్వాత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చేది పింఛన్ చెల్లింపులకే. అయితే, గత నెలలో రావాల్సినంత ఆదాయం రాలేదో... లేక ఆర్థికశాఖ అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ పెన్షనరలకు నిరీక్షణ తప్పడం లేదు. ఒకవేళ ఇప్పటికప్పుడు (మంగళవారం) ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసినా పెన్షనర్లకు చేరేసరికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని, ఫలితంగా దీపావళి నాటికి పెన్షనర్లకు పింఛన్లు అందజేసే అవకాశం లేదని సెర్ప్ అధికారులు సిబ్బంది చెబుతున్నారు. పెద్ద దిక్కులేని సెర్ప్... గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పెద్దదిక్కు లేకుండాపోయింది. సెర్ప్ సీఈవోగా ఉన్న ఐఎఎస్ అధికారి మురళిని గత వారం బదిలీచేసిన ప్రభుత్వం ఆ పోస్టులో వేరెవరినీ నియమించలేదు. ఇన్చార్జి బాధ్యతలు చేపట్టాల్సిన అధికారి కూడా బిహార్ ఎన్నికల విధుల్లో ఉండడంతో కొద్దిరోజులుగా సెర్ప్ కార్యక్రమాలు పడకేశాయి. ఆసరా పెన్షన్లు, తెలంగాణ పల్లె ప్రగతి, పల్లె సమగ్ర సేవాకేంద్రాలు, స్వయం సహాయక సంఘాలకు డ్వాక్రా రుణాలు, జీవనోపాధుల కల్పన.. తదితర కార్యక్రమాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎన్నికలున్న జిల్లాలకు ఆగని పింఛన్లు! రాష్ట్రవ్యాప్తంగా ‘ఆసరా’లబ్ధిదారులకు నవంబర్ నెల పింఛన్ల పంపిణీ కోసం నిధులు విడుదల చేయని ప్రభుత్వం.. వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం పింఛన్ల పంపిణీని వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. వరంగల్ జిల్లాలో లోక్సభ ఉప ఎన్నికలు, హైదరాబాద్లో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో పంపిణీ కాని పింఛన్ సొమ్మును ఈ రెండు జిల్లాల్లో లబ్ధిదారులకు అందించాలని సర్కారు సూచించింది. దీంతో పింఛన్ల పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న సెర్ప్ అధికారులు తమ వద్ద మిగిలి ఉన్న రూ.59 కోట్లలో వరంగల్ జిల్లాకు రూ.40 కోట్లు, హైదరాబాద్ జిల్లాకు రూ.19 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు తెలిసింది. -
డీఏ పెంపు లేనట్లే!
♦ దీపావళికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ♦ ఫైలును పెండింగ్లో పెట్టేందుకు సర్కారు నిర్ణయం ♦ ఒకట్రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశం ♦ నాలుగు నెలలుగా పీఆర్సీ బకాయిల ఊసే లేదు ♦ చెల్లింపుల విధానంపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ ముందు ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే మిగలనుంది. రేపో మాపో కరువు భత్యం (డీఏ) పెంపు ఉత్తర్వులు వస్తాయన్న ఉద్యోగుల ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం గండికొట్టింది. ఈ ఫైలును కొద్దిరోజుల పాటు పెండింగ్లో పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితిని బట్టి డీఏ పెంపును కొంతకాలం వాయిదా వేయాలనే యోచనతో.. ఆర్థిక శాఖ ఈ ఫైలును పక్కన పెట్టినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు భత్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం డీఏను చెల్లించాల్సి ఉంది. ఏటా కేంద్రం జనవరి, జూలై నెలల్లో ఉద్యోగులకు డీఏను ప్రకటిస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తుంది. కేంద్రం జూలై డీఏ సెప్టెంబర్ 23న పెంచింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏ పెంపుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే ప్రకటన ఎప్పుడు వెలువడినా.. పెరిగిన డీఏ జూలై నుంచి వర్తిస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని డీఏ పెంపు ఉత్తర్వులను నాలుగైదు నెలలు ఆలస్యంగా ఇస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పెరిగిన డీఏ ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక శాఖ సెప్టెంబర్ 23న జారీ చేసింది. జూలై నుంచి పెరగాల్సిన డీఏ ఉత్తర్వులను ఇంకా విడుదల చేయలేదు. దీపావళి కానుకగా డీఏ పెంచితే డిసెంబర్ ఒకటో తేదీన అందుకునే జీతం పెరిగిన డీఏతో కలిపి అందుతుందని ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ ఆర్థిక పరిస్థితి కుదుటపడే దాకా వేచి చూడాలనే ధోరణిని సర్కారు కనబరుస్తోంది. దీంతో మరో నెలా, రెండు నెలలు ఆలస్యంగా డీఏ పెంపు ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. బకాయిలపైనా దాటవేత! ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలపైనా ప్రభుత్వం స్పందించడం లేదు. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2014 జూన్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి 2015 మార్చి వరకు తొమ్మిది నెలలకుగాను సుమారు రూ.2,500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు భారీగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చెల్లింపును వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే బకాయిలను నగదుగా ఇవ్వాలా, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలా? అన్న సందిగ్ధత ఇప్పటికీ వీడకపోవడం కూడా జాప్యానికి కారణమవుతోంది. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేసేందుకు ఆర్థిక శాఖ మొగ్గు చూపుతోంది. కానీ 2004 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేవు. వారితో పాటు పెన్షన్దారులకు జీపీఎఫ్ వర్తించదు. పెన్షన్దారులకు నగదు ముట్టజెప్పినా... జీపీఎఫ్ ఖాతాల్లేని ఉద్యోగులకు బకాయిల చెల్లింపుపై పీటముడి పడింది. వీరి పేరిట కొత్తగా జీపీఎఫ్ ఖాతాలు తెరిచే ప్రతిపాదన ఆచరణ సాధ్యంగా లేదని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త ఖాతాలు తెరవాలంటే అకౌంటెంట్ జనరల్ అనుమతి తీసుకోవాలి. దీంతో బకాయిల చెల్లింపు మొత్తం ఎఫ్ఆర్బీఎం నిబంధనల పరిధిలోకి చేరుతుంది. అందుకే జీపీఎఫ్ ఖాతాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే కొత్త ఉద్యోగుల పేరిట ప్రత్యామ్నాయ ఖాతాలు తెరిచే ఆలోచనపై కసరత్తు చేస్తున్నారు. అప్పటివరకు బకాయిల చెల్లింపు పెండింగ్లోనే ఉంటుందని స్పష్టమవుతోంది. -
ఇక గ్రాట్యుటీ వంతు...
సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ ప్రకటించి ఇప్పటికి 11 నెలలు కావస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన జీవోలను జారీ చేయకుండా ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రాట్యుటీ విషయంలో వారికి వెన్నుపోటు పొడవడానికి సమాయత్తమవుతోంది. పదవీ విరమణ చేసిన తర్వాత ఇచ్చే గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచాలని పదో పీఆర్సీ సిఫారసు చేయగా, దాన్ని రూ.10 లక్షలకే పరిమితం చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.10 లక్షలకు పరిమితం చేస్తూ రూపొందించిన ఫైలును రహస్యంగా ఉంచారని, సంబంధిత సెక్షన్లో కిందిస్థాయి అధికారులకు సైతం తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. పీఆర్సీ సిఫారసుకు భిన్నంగా గరిష్ట పరిమితిని తగ్గిస్తే.. ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతుందని, అందుకోసమే రహస్యంగా ఫైలును రూపొందించారని విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది. రూ.15 లక్షలకు పెంచాలని ఉద్యోగుల డిమాండ్ పదో పీఆర్సీ సిఫారసు ప్రకారం కనీస మూలవేతనం రెట్టింపయిన నేపథ్యంలో రిటైర్మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.15 లక్షలకు పెంచాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. అదనపు పెన్షన్కు అనుమతించని సర్కారు గ్రాట్యుటీకి కోత వేయడానికి సిద్ధమైన ప్రభుత్వం.. పెన్షనర్ల సంక్షేమానికీ కోత పెట్టనుంది. 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని పదో పీఆ ర్సీ సిఫారసు చేసింది. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఫిట్మెంట్ ప్రకటించిన సమయంలో.. ఈ సిఫారసును పరిగణనలోకి తీసుకోకుండానే పింఛనర్లకు పెన్షన్ను ఖరారు చేసిన విషయం విదితమే. పీఆర్సీ నివేదికను పూర్తిగా అమలు చేసే సమయంలోనూ ఈ సిఫారసును పరిగణనలోకి తీసుకోకూడదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. గ్రాట్యుటీ అంటే..: ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాల్లో గ్రాట్యుటీ ముఖ్యమైనది. ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీసు కాలానికి 15 రోజుల జీతాన్ని గ్రాట్యుటీగా ఇస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి 30 సంవత్సరాల సర్వీసు ఉంటే.. 15 నెలల జీతాన్ని గ్రాట్యుటీగా చెల్లిస్తారు. అయితే దీనికి గరిష్ట పరిమితి ఉంటుంది. గరిష్ట పరిమితి ప్రస్తుతం రూ.8 లక్షలు ఉంది. అంటే.. గ్రాట్యుటీ గణింపు సూత్రం ప్రకారం రూ.8 లక్షలు దాటినా, ఉద్యోగికి రూ.8 లక్షలే చెల్లిస్తారు. ఈ పరిమితిని రూ.12 లక్షలకు పెంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది. ఈ మేరకు పెంచినప్పటికీ.. సగటు ఉద్యోగి గ్రాట్యుటీ ఈ పరిమితిని దాటుతుంది. దాన్ని రూ.10 లక్షలకే పరిమితం చేస్తే.. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లో దాదాపు అందరూ నష్టపోక తప్పదు. -
రాజధాని వ్యవహారం రహస్యమా?
రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీ.వీ.రమేశ్కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ లేఖ సాక్షి, హైదరాబాద్: రాజధాని విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, విధానాలపట్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మరోసారి మండిపడ్డారు. రాజధాని వ్యవహారంలో అంతా రహస్యంగా చేస్తున్నారని, పారదర్శకత లోపించిందని తప్పుపట్టారు. అంతేగాక రాజధాని పేరిట నీటిని, నిధుల్ని కృష్ణా-గుంటూరు జిల్లాలకు తరలిస్తూ.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్ని దోచేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలోను, అటు రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈమేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్కు శనివారం నాలుగు పేజీల లేఖ రాశారు. రాజధాని విషయంలో రాష్ట్రప్రజానీకాన్ని చీకట్లోపెట్టి వ్యవహారాలు చేయడం రాజకీయ నాయకత్వానికి,అధికారయంత్రాంగానికి సమంజసం కాదని చురకలేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. అంతులేని అవినీతికి, నల్లధనం విచ్చలవిడిగా ప్రవహించడానికి వీలు కల్పిస్తాయన్నారు. ముఖ్యాంశాలివీ.. నిధులెలా వస్తాయి? : సింగపూర్ కన్సల్టెంట్ రూపొందించిన అమరావతి మాస్టర్ప్లాన్, ఏపీ రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ(ఏపీఎస్ఈఐఏఏ) జారీచేసిన పర్యావరణ అనుమతి(ఈసీ)లో విధించిన షరతులు, ఆంక్షలతోపాటు 35 ఏళ్ల బడ్జెట్ కేటాయింపుల నిబంధనల అమలుకు నిధుల్ని రాష్ట్రప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుంది? ► రాజధాని నీటి అవసరాలకోసం ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో బ్యారేజీ నిర్మించాలి. ఇప్పటికే పట్టిసీమపై భారీగా నిధులు ఖర్చుపెట్టిన ప్రభుత్వం..మరోప్రాజెక్టుకు నిధులు ఖర్చుపెట్టగలదా? ఇంకా రాజధానికోసం పలు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వీటికి నిధులు కేటాయించే సామర్థ్యం రాష్ట్ర బడ్జెట్కుంటుందా? ► దిగ్భ్రాంతి కలిగించే నిధులవ్యయానికి ఎఫ్ఆర్బీఎం చట్టం అంగీకరిస్తుందా? భారీగా రుణాలు తెచ్చుకుంటే.. రాష్ట్రం తీవ్ర ఆర్థికసంక్షోభంలో కూరుకుపోతుంది. ► విలువైన భూములిస్తేనో.. భారీగా ఆదాయం సమకూరుతుందని భావిస్తేతప్ప ప్రైవేటు పెట్టుబడుదారులు భారీగా పెట్టుబడులు పెట్టరు. ఒక దశ తర్వాత.. కేంద్రమూ చేతులు దులుపుకుంటుందేతప్ప.. భారీ ఆర్థికభారాన్ని మోయడానికి సిద్ధపడదు. కనీసం పదేళ్లకాలానికైనా సరే.. బడ్జెట్ వ్యయంపై ఆర్థికశాఖ ఆలోచించిందా? భారీ కేటాయింపులు సాధ్యంకాదని రాజకీయ నాయకత్వానికి చెప్పకపోతే.. దీనిపై బహిరంగచర్చ జరిగే రోజొస్తుందని మరిచిపోకూడదు. ఉత్తరాంధ్ర, సీమ జిల్లాల్ని దోపిడీ చేయడమే.. ► రాష్ట్రంలో జిల్లాలమధ్య అసమానతల అంశమూ ఇందులో ఉంది. కృష్ణా, గోదావరి నదుల నీటిని తరలించడంతోపాటు భారీగా నిధుల్ని అమరావతిపై వెచ్చించడమంటే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రజలను దోపిడీచేసి కేవలం ఒక ప్రాంతానికి మేలు చేయడం కిందకే వస్తుంది.వీటిని దృష్టిలో పెట్టుకొని నీటిపారుదలశాఖ కనీసం చర్చకోసమైనా విధానపత్రం రూపొందించిందా? ► రుసుం వసూలు చేయకుండానే మాస్టర్ప్లాన్ రూపొందించడానికి విదేశీ కంపెనీలు ఆసక్తి చూపించడం వెనుక వారి అసలు ఉద్దేశాలపై అనుమానాలున్నాయి. ► మాస్టర్ప్లాన్లో పేర్కొన్న మేరకు 12 శాతం భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు. ప్రజావసరాలకోసం ప్రజలనుంచి తీసుకున్న భూమిని వాణిజ్య అవసరాలకు మళ్లించడం.. అదీ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతితో అభివృద్ధి చేయడానికి లీగల్గా సాధ్యమవుతుందా? ► సీఆర్డీఏ, ఇతర కంపెనీలు, కన్సల్టెంట్ల మధ్య జరిగిన ఒప్పందాల్లో ఎక్కడా పారదర్శకత లేదు. ఒక్కఒప్పందాన్నీ బహిరంగపరచకపోవడం గమనార్హం. బాక్సైట్ జీవో రాజ్యాంగ విరుద్ధం విశాఖపట్నం జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతినిస్తూ జారీచేసిన జీవో నంబరు 97 రాజ్యాంగవిరుద్ధమని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కార్యదర్శి అశోక్ లావాసా, డెరైక్టర్ జనరల్ ఎస్ఎస్ నేగి, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావులకు శనివారం లేఖరాశారు. ఈ జీవో ప్రకారం 1,212 హెక్టార్లలో బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు ఏపీ ఖనిజాభివృద్ధిసంస్థకు అనుమతి లభించిందన్నారు. అయితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇంతకుముందెన్నడూ ట్రైబల్ ఎడ్వయిజరీ కౌన్సిల్లో చూపలేదన్నారు. అందువల్ల ఈ జీవో జారీ రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు నిబంధనలకు విరుద్ధమన్నారు. -
‘మాఫీ’ కోసం అప్పుతెద్దాం!
♦ రైతులకు ఒకేసారి పూర్తిగా రుణమాఫీపై వ్యవసాయ శాఖ ప్రతిపాదన ♦ ఎఫ్ఆర్బీఎం సడలింపుపై ఆశలు ♦ సీడ్ కార్పొరేషన్ ద్వారా రుణ సమీకరణ యోచన ♦ వడ్డీ తడిసి మోపెడు అవుతుందంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం ♦ దాదాపు రూ.1,300 కోట్ల భారం పడుతుందని అంచనా ♦ అవకతవకలపై తేల్చాకే ముందుకెళ్లాలని సూచన సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీలో మిగతా నిధులను ఒకేసారి చెల్లించడంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. నిధులన్నీ ఒకేసారి చెల్లించడం కోసం అప్పులు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెంపుపై ఆశలు పెట్టుకుంది. సీడ్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలు సమీకరించాలని భావిస్తోంది. కానీ ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వడ్డీ తడిసిమోపెడు అవుతుందని, రుణమాఫీలో పక్కదారి పట్టిన సొమ్ముకూడా గల్లంతు అవుతుందని హెచ్చరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిగా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల ప్రకటించారు. రుణమాఫీ నిధులను ఒకేసారి చెల్లించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని సడలిస్తే రూ.4,000 కోట్లు అప్పు తెచ్చుకునే వీలు ఏర్పడుతుందని, దీనితో రుణమాఫీకి నిధులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎఫ్ఆర్బీఎం సడలింపుపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేదు. సడలించినా అంత మేరకు నిధులను డిస్కంల విద్యుత్ బాండ్లపై తీసుకున్న అప్పుల బకాయిలు తీర్చాలనే షరతు విధించటం ఖాయమైంది. సీడ్ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇదే వ్యవధిలో రుణమాఫీ నిధుల సమీకరణకు వ్యవసాయ శాఖ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా సీడ్ కార్పొరేషన్ ద్వారా రుణ సమీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రైవేటు బ్యాంకుల నుంచి రూ.8,000 కోట్లు రుణంగా తీసుకోవాలని... దానితో రుణమాఫీ బకాయిలు ఒకేసారి చెల్లించడం సాధ్యమవుతుందనే అభిప్రాయం వెలిబుచ్చింది. ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. అయితే ఈ ప్రతిపాదనపై ఆర్థికశాఖ మొదట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. లెక్కలు తేలాలి రుణమాఫీ బకాయిలకు మరో రూ. 8,000 కోట్లు కావాలని ఆర్థిక శాఖ లెక్కలు వేస్తోంది. పక్కాగా ఆడిటింగ్ జరిగితే ఈ మొత్తం కొంతవరకు తగ్గిపోతుందని అంచనా వేస్తోంది. ఇటీవల ఆడిట్ విభాగం పది జిల్లాలో చేపట్టిన శాంపిల్ సర్వేలో బోగస్ రుణాలు, బోగస్ పట్టాలు, డబుల్ ఎంట్రీల ద్వారా రుణమాఫీలో పది శాతం దాకా అక్రమాలు, అవకతవకలు జరిగాయని తేల్చింది. బ్రాంచీల వారీగా సమగ్ర విచారణ జరిపితే కనీసం రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్లు ఆదా అవుతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. అందుకే ఆడిటింగ్ పూర్తయ్యే వరకు వన్ టైం సెటిల్మెంట్ జోలికి వెళ్లడం సరికాదని పేర్కొంటోంది. తొందరపడి అప్పు తెచ్చి రుణమాఫీ నిధులు చెల్లిస్తే.. పక్కదారి పట్టిన రూ.500 కోట్లు గల్లంతవుతాయని, వడ్డీ భారం కూడా కలిపి దాదాపు రూ.1,300 కోట్లు అవుతుందని స్పష్టం చేస్తోంది. భారీగా వడ్డీ భారం.. రుణమాఫీ చేసేందుకు కొత్తగా రుణం తీసుకుంటే వడ్డీ భారం భారీగా పెరిగిపోతుందని ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం రైతుల పంట రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం, కేంద్రం 3 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. అదే కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుంటే 9 నుంచి 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 5 నుంచి 6 శాతం వడ్డీ భరించాల్సి వస్తుంది. రూ. 8,000 కోట్లు అప్పు తీసుకుంటే ఏడాదికి రూ. 400 కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.800 కోట్లు వడ్డీ చెల్లించాలి. దీంతో ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ‘‘బ్యాంకుల దగ్గర రుణం తీసుకొని.. బ్యాంకుల్లో ఉన్న రైతు రుణాల మాఫీకి చెల్లించే సంప్రదాయం ఆర్థిక వ్యవహారాల్లో సరైంది కాదు.. దీంతో ప్రభుత్వానికి, రైతులకు ఒరిగే ప్రయోజనం కంటే బ్యాంకులే ఎక్కువగా లాభపడుతాయి..’’ అని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
మిగులు రూ. 2,076 కోట్లు!
♦ ఉద్యోగుల వేతన నిధులపై రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా ♦ 1.42 లక్షల ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వం భర్తీ చేయకపోవడమే కారణం ♦ {పస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల వ్యయంపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతనాల కోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో రూ.2,076 కోట్ల మిగులు ఏర్పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలంలో ఏ రంగానికి ఎంత వ్యయం చేశారు...వచ్చే ఏడాది మార్చి వరకు ఎంత వ్యయం చేయనున్నారనే దానిపై సీఎం చంద్రబాబు ఇటీవల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ 15 పేజీలతో ప్రజెంటేషన్ ఇచ్చింది. ఉద్యోగుల వేతనాల కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.11,827 కోట్లు వ్యయం చేసినట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు మరో రూ.16,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం రూ.30,403 కోట్లు కేటాయించగా ఇందులో రూ.28,327 కోట్లే వ్యయం అవుతుందని, రూ.2,076 కోట్ల మిగులు ఏర్పడుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మిగులుకు ప్రధాన కారణం.. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా వేల సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొల గించింది. దీంతో వేతనాల కేటాయింపుల్లో ఖర్చులుపోగా మిగులు ఏర్పడుతోంది. జీతాలేతర వ్యయంలోనూ మిగులే జీతాలేతర వ్యయంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.225 కోట్లు మిగులుతాయని ఆర్థికశాఖ అంచనా వేసింది. జీతాలేతర వ్యయానికి బడ్జెట్లో రూ.2,839 కోట్లు కేటాయించారు. దీంట్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.1,009 కోట్లు ఖరుచ చేయగా, అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రూ.1,605 కోట్లు ఖర్చవుతుందని అంచనా. -
నడి వీధిలో పట్టభద్రులు
♦ ఏపీ నిరుద్యోగ సేనలో 20 లక్షల మంది డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారే.. ♦ ఈ యేడు జతకలవనున్న మరో 50 వేల మంది పట్టభద్రులు ♦ ఖాళీగా పడి ఉన్న లక్షన్నర ఉద్యోగాల భర్తీ జోలికి వెళ్లని ప్రభుత్వం ♦ మరో లక్ష మందిని రెగ్యులరైజ్ చేయకుండా తొలగించే ప్రయత్నాలు ♦ బాబొస్తే జాబొస్తుందన్న ఎన్నికల హామీని ఎగతాళి చేస్తున్న ప్రభుత్వం ♦ ఇన్ని లక్షల మందికి ఉపాధి దొరకాలంటే... పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాల్సిందేనంటున్న నిపుణులు ♦ అందుకు ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో 20 లక్షల మంది పట్టభద్రులే (ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు). వీరి సంఖ్య ప్రతి ఏటా 50 వేల మంది చొప్పున పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 27.23 లక్షల మంది నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు గత నెల 18, 19 తేదీల్లో విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఓ నివేదిక ద్వారా తెలిపింది. అనధికార లెక్కల ప్రకారం నిరుద్యోగుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పేర్లు నమోదు చేసుకోలేకపోయిన వారు, నైపుణ్యంలేని (అన్స్కిల్డ్) వారిని ఇందుకు ఉదాహరిస్తున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు నిరుద్యోగులు, యువతకు స్పష్టమైన హామీలు ఇచ్చిన టీడీపీ... అధికారంలోకి వచ్చాకఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని, దీనివల్ల యువత ఉద్యోగాలు రాక, ఉపాధి అవకాశాలు లేక అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఉందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీల అమలేదీ? యువత ఓట్లకు గాలం వేసేందుకు టీడీపీ గత ఎన్నికల్లో అనేక హామీలను గుప్పించింది. బాబొస్తే జాబొస్తుందని ప్రచారం చేసింది. ఇంటికో ఉద్యోగం, ఇవ్వలేకపోతే రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజ్, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ఉపాధ్యాయుల నియామకం, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల సృష్టి... తదితర హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాల భర్తీ ఊసెత్తడం లేదు. ఇంకోవైపు మరో లక్ష మందిని రెగ్యులరైజ్ చేయకుండా తొలగిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకపోగా మంత్రుల కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ వస్తోంది. న్యాయస్థానం తీర్పు అడ్డు వస్తోందంటూ 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయకుండా సాకులు చూపుతోంది. 60 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయడానికి నిరాకరిస్తోంది. కనీసం వారి వేతనాల పెంపుపైనా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేకపోయింది. మరో పక్క చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే 12 వేల మంది ఆదర్శ రైతులను ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే ఉపాధి హామీ పథకంలో భాగమైన 6 వేల మంది క్షేత్రస్థాయి అధికారులను ఉద్యోగాల నుంచి పీకేశారు. అలాగే గృహ నిర్మాణ సంస్థలో వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న 6వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను, రాజీవ్గాంధీ స్వస్థీకరణ అభియాన్ కింద పనిచేస్తున్న 1500 మంది కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించారు. 20 వేల మంది డ్వాక్రా యానిమేటర్లు గత ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున ఇవ్వగా... టీడీపీ అధికారంలోకి రాగానే వారికి ఆ కొద్ది వేతనం ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. దీంతో వారంతా ఉపాధిని కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 1,42,828 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. ఇందులో రాష్ట్ర స్థాయి పోస్టు లు 4,081, మల్టీ జోనల్ స్థాయిలో 1,184, జోనల్ స్థాయిలో 22,462, జిల్లా స్థాయిలో 1,15,101 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందులో ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదు. ప్రత్యేక హోదా... ఒక్కటే మార్గం వీరందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పాలి. పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా... ఒక్కటే మార్గం. ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు నేరుగా పరిశ్రమలకే వెళ్తాయి. తద్వారా పారిశ్రామివేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున దక్కుతాయి. అయితే, ఈ హోదా సాధించాలన్న ఆసక్తి, చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తిగా కొరవడింది. తద్వారా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఏటా పెరుగుతున్న నిరుద్యోగులు.. రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ స్థాయి వరకు మధ్యలో చదువు మానేస్తున్న వారి సంఖ్య 22 లక్షలని ప్రభుత్వం గుర్తించింది. వీరంతా తమ కుటుంబ ఆర్థిక స్థితిగతులతోపాటు ఇతర సమస్యల కారణంగా మధ్యలోనే చదువు మానేస్తున్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుతున్న వారి సంఖ్య లక్ష, డిగ్రీ, పీజీ కాలేజీల్లో చదువుతున్న వారి సంఖ్య 1.50 లక్షల వరకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న 27.23 లక్షల మందికి తోడు నమోదు చేసుకోలేకపోయిన వారు, ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువు మధ్యలో మానేసిన వారు, అన్స్కిల్డ్ నిరుద్యోగు లు... వెరసి లక్షలాది మంది యువతీ, యు వకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఏటా వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో రాష్ట్రంలో యువత అభద్రతా భావంతో అశాంతికి లోనవుతోంది. -
పరుగులు పెట్టాలంటే... పైసలివ్వాల్సిందే
♦ ప్రాజెక్టుల్లో పూర్తయిన పనులకు తక్షణం నిధులు చెల్లించాలి ♦ ప్రణాళిక బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో ఆటంకాలు లేకుండా చూడాలి ♦ లక్ష్యం మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఇవి తప్పనిసరి ♦ రాష్ట్ర ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ విన్నపాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలంటే.. అందుకు తగ్గట్లే నిధుల కేటాయింపుతో పాటు వాటి విడుదలలో ఆర్థిక శాఖ సహకారం అవసరమని నీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నొక్కి చెప్పింది. పూర్తయిన పనులకు నిధులు విడుదల చేయడంలో ఆటంకాలు లేకుండా చూడటం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారాల కల్పనలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేసింది. ఆర్థిక సాంత్వన కల్పిస్తేనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయగలమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి కావాల్సిన సహకారంపై నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి వినతితో కూడిన ప్రత్యేక నోట్ను సమర్పించింది. సీఎం సూచనల మేరకే... రాష్ట్రంలో ప్రస్తుతం 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తే వీటి పనులు పూర్తవుతాయి. వీటితో పాటే కొత్తగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటికి మరో రూ.80 వేల కోట్ల మేర నిధులు అవసరం. అలాగే చిన్న నీటి వనరుల కోసం సుమారు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని భావిస్తోంది. ఇందుకు తొలి దశలో ఇప్పటికే రూ.2,600 కోట్ల మేర నిధులు కేటాయించగా, రెండో విడతకు మరో రూ.3 వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. కొత్త ప్రాజెక్టులను పాక్షికంగా అయినా పూర్తిచేయాలని భావిస్తోంది. అయితే నిర్ణీత లక్ష్యం మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఆర్థిక శాఖ సహకారం ఎంతో అవసరం. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ఆర్థిక నివేదికల తయారీ, విధానాల ప్రక్రియను సరళతరం చేయాల్సి ఉంటుంది. పరిపాలనా అనుమతులు, మంజూరు, విడుదలలో ఆటంకాలు లేకుండా చూడాల్సి ఉంటుందని ఇటీవల ప్రాజెక్టులపై సమీక్ష సంసదర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. విధాన ప్రక్రియ సరళీకరణ, ఆర్థిక శాఖ సహకారంపై నోట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించి దానిపై చర్చించాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు నోట్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. నిధుల విడుదలలో ఆటంకాలు ఉండొద్దు.. ప్రాజెక్టులకు నిధుల విడుదలలో ఆర్థిక శాఖ ఎలాంటి ఆటంకాలు కల్పించరాదని నీటి పారుదల శాఖ గట్టిగా కోరుతోంది. సాగునీటి రంగానికి చెందిన ప్రణాళిక బడ్జెట్ను ఎప్పుడు అడిగినా ఇవ్వాలంటోంది. జరిగిన పనులకు జరిగినట్లుగా నిధుల విడుదల చేయాలని కోరుతోంది. సీఈ, ఎస్ఈ, ఈఈ స్థాయి అధికారుల బదిలీలను ప్రతిసారీ ఆర్థిక శాఖకు చెప్పి చేయడం కాక.. వారిని శాఖ పరిధిలోనే మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతోంది. దీంతో పాటే మిషన్ కాకతీయ పనులను డిసెంబర్ లేదా జనవరిలో ఆరంభించేలా కసరత్తు చేస్తున్న దృష్ట్యా, అందుకు అనుగుణంగా చెరువుల పరిపాలనా అనుమతులను నవంబర్ నెలాఖరుకే పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి విన్నవించింది. -
పన్ను సమస్యలను పరిష్కరిస్తాం
విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థిక శాఖ హమీ * దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ) పన్ను సంబంధిత ఆందోళనలన్నింటినీ వీలైనంతం వేగంగా పరిష్కరిస్తామని కేంద్రం హామీనిచ్చింది. అయితే, దేశంలో శాశ్వత కార్యకలాపాలను ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరుతున్నట్లు కూడా పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) బడ్జెట్ కసరత్తులో భాగంగా మంగళవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు దిగ్గజ ఎఫ్పీఐలతో భేటీ అయ్యారు. సిటీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్, ఫిడిలిటీ, గోల్డ్మన్ శాక్స్, బ్లాక్రాక్ సహా రెండు డజన్లకుపైగా అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఈ భేటీలో ఎఫ్పీఐలు అనేక సూచనలు, సలహాలను ఇచ్చారు. ప్రభుత్వం వీటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పన్ను సంబంధ సమస్యలు సహజంగా ఉత్పన్నమైనవే. దేశంలో ఫండ్ మేనేజ్మెంట్ పరిశ్రమ స్థితిగతులపై కూడా మేం చర్చించాం’ అని ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్బీఐ, సెబీ, సీబీడీటీలకు చెందిన ఉన్నతాధికారులకు కూడా ఈ సమావేశానికి హజరయ్యారు. ప్రస్తుతం ఎఫ్పీఐలు భారత్తో ద్వంద్వ పన్ను నిరోధక ఒప్పందం(డీటీఏఏ) ఉన్న దేశాల నుంచి తమ నిధులను ఇక్కడికి తరలిస్తున్నారని.. దీనివల్ల వారికి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తున్నట్లు దాస్ చెప్పారు. అయితే, ఆయా సంస్థలు భారత్లోనే తమ కార్యకాలాపాలను నెలకొల్పినట్లయితే ఇక్కడి చట్టాల ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందన్నారు. కార్పొరేట్ బాండ్లపై 5 శాతం విత్హోల్డింగ్ పన్ను అంశాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు నోమురా ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఎండీ నీరజ్ గంభీర్ చెప్పారు. 2017తో ఈ 5 శాతం పన్ను విధింపునకు గడువు ముగియనుంది. ఈ ఏడాది వృద్ధి 7.5 శాతం పైనే... * ఎస్అండ్పీ అంచనాలతో విబేధం భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) వెలిబుచ్చిన అనుమానాలను శక్తికాంత దాస్ తోసిపుచ్చారు. అది కేవలం ఆ సంస్థ అభిప్రాయం మాత్రమేనని.. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.5 శాతంపైనే ఉంటుందని తాము అంచనావేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృద్ధి జోరందుకోవాడానికి ప్రభుత్వం మరిన్ని సంస్కరణ చర్యలను చేపట్టనున్నట్లు కూడా దాస్ వెల్లడించారు. భారత్ ఆర్థిక మూలాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయన్నారు. కాగా, భారత్ సార్వభౌమ రేటింగ్ను ఇప్పుడున్న బీబీబీ(మైనస్) స్థాయిలోనే కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా రేటింగ్ పెంచే అవకాశాల్లేవని స్పష్టం చేసింది. పెట్టుబడులకు సంబంధించి ఇదే అత్యల్ప స్థాయి రేటింగ్. కాగా, విధాన, సంస్కరణల పరంగా తాము ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని... రేటింగ్ అప్గ్రేడ్ చేయాలంటూ ఆర్థిక శాఖ చాన్నాళ్లుగా కోరుతున్న సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు దసరా నిరాశే!
♦ పీఆర్సీ బకాయిలు ఇప్పట్లో రానట్టే ♦ జీపీఎఫ్లో జమ చేసేందుకు యోచన ♦ జీపీఎఫ్ ఖాతాల్లేని వారికి బాండ్లు ♦ ముఖ్యమంత్రికి సిఫారసు చేసిన ఆర్థిక శాఖ సాక్షి,హైదరాబాద్: దసరా పండుగ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశనే మిగల్చనుంది. తమకు రావాల్సిన పీఆర్సీ బకాయిలను పండుగ లోపు ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశపడ్డ ఉద్యోగులు, పెన్షన్దారులు భంగపడ్డారు. అక్టోబరు ఆరంభంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో బకాయిల చెల్లింపులపై సర్కారు వెనక్కి తగ్గింది. పీఆర్ సీ ప్రకటించిన రోజున సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలని యోచిస్తోంది. రెండేళ్లపాటు ఉద్యోగులు ఆ సొమ్మును డ్రా చేసుకోకుండా ఆంక్షలు విధించాలని ఆర్థిక శాఖ సిఫారసు చేసింది. ఇటీవలే ఈ ఫైలును సీఎం ఆమోదానికి పంపింది. బకాయిల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని.. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే పలుమా ర్లు ఆర్థిక శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశాయి. సీఎం ఆమోదం తర్వాత... పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2014 జూన్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చాయి. 2015 మార్చి నుంచి నగదు రూపంలో చెల్లించిన ప్రభుత్వం.. అప్పటివరకు చెల్లించాల్సిన తొమ్మిది నెలల మొత్తాన్ని బకాయిలుగా పెండింగ్లో పెట్టింది. వీటిపై తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని పీఆర్సీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఉద్యోగులందరూ తమ వేతనాలను సవరించుకోవడంతో.. పెరిగిన జీతాల ప్రకారం బకాయిల చెల్లింపులకు ఎంత మొత్తం కావాలో ఆర్థిక శాఖ స్పష్టమైన అంచనాకు వచ్చింది. మొత్తం రూ.2,500 కోట్లు అవసరమవుతాయని లెక్కలేసుకుంది. బకాయిలు పొందే లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా విభజించింది. సర్వీసులో ఉన్న ఉద్యోగుల్లో జీపీఎఫ్ ఖాతాలు ఉన్నవారు.. లేని వారుండగా.. మూడో కేటగిరీలో పెన్షన్దారులున్నారు. 2004 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానంలో ఉన్నందున వీరికి జీపీఎఫ్ ఖాతాలు లేవు. వీరితో పాటు పెన్షన్దారులకు జీపీఎఫ్ వర్తించదు. జీపీఎఫ్ ఖాతాలున్న ఉద్యోగులకు రూ.1,500 కోట్లు అవసరమవుతాయని, వీటిని జీపీఎఫ్లో జమ చేయాలని భావిస్తోంది. పెన్షన్దారులకు నగదు చెల్లించక తప్పదని నిర్ణయించింది. జీపీఎఫ్ ఖాతాల్లేని ఉద్యోగులకు, ఖాతాలు ఉన్న ఉద్యోగులకు తేడా లేకుండా చెల్లింపులు చేయాలని సిఫారసు చేసింది. అందుకే జీపీఎఫ్ ఉన్న వారికి ఖాతాలో జమ చేసి.. లేని వారికి రెండేళ్ల తర్వాత నగదు వర్తించే బాండ్లు అందజేయాలని ప్రత్యామ్నాయం సూచించింది. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత బకాయిల చెల్లింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. -
ధరలు పెరిగితే.. అదనపు చెల్లింపులు
♦ కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు ♦ ‘పాలమూరు-రంగారెడ్డి’లో ప్రవేశపెట్టే అవకాశం సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పటికప్పుడు పెరిగే ధరలకు అనుగుణంగా ధరల సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కాంట్రాక్టర్లకు కల్పించే అంశమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాల మూరు కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న బిడ్ డాక్యుమెంట్లో ఈ వెసులుబాటును నీటి పారుదల శాఖ పొందుపరచగా, దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిజానికి ఇప్పుడు అమలవుతున్న ఈపీసీ విధానంలో సిమెంట్, స్టీలు, ఇంధన ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు కాం ట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయాలనే నిబంధన ఉంది. కార్మికుల వ్యయాన్ని పెంచకూడదనే నిబంధనను ప్రభుత్వం అనుసరిస్తోంది. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో తమకు గిట్టుబాటు కావడం లేదంటూ కాం ట్రాక్టర్లు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. సకాలంలో భూ సేకరణ పూర్తి కాకపోవడం, అటవీ అనుమతులు రాకపోవడంతో మెటీరియల్, లేబర్ ధరలు భారీగా పెరిగి ఆర్ధిక నష్టాలను కలిగిస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ వినతిని పరిశీలించిన నీటి పారుదల శాఖ పాలమూరు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బిడ్ డాక్యుమెంట్లో లేబర్, ఇసుక, కంకర వంటి ఇతర మెటీరియల్కు పెరిగే ధరలకు అనుగుణంగా ధరలను సర్దుబాటు చేయాలనే వెసులుబాటును చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ విధానం ప్రపంచబ్యాంకు, జైకా సహకారంతో జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో మా త్రమే అమల్లో ఉంది. దీన్ని ప్రస్తుతం కొత్తగా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ బిడ్ డాక్యుమెంట్ను న్యాయ, ఆర్థిక శాఖ ఆమోదించాల్సి ఉండగా ఇప్పటికే న్యాయ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆర్ధిక శాఖ దీనిపై పరిశీలన చేస్తోంది.. అక్కడ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ధరల సర్దుబాటు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైనా కారణంతో ఆలస్యం జరిగి, ధరలు పెరిగినా కాంట్రాక్టర్ వెనక్కిపోకుండా ఉండేందుకే ఇలాంటి వెసులుబాటును చేర్చామని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. -
మళ్లీ లారీల సమ్మె చేస్తాం
ప్రభుత్వానికి యజమానుల సంఘం హెచ్చరిక సాక్షి, హైదరాబాద్ : లారీల త్రైమాసిక పన్ను తగ్గింపు, రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వేచ్ఛగా తిరిగేం దుకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీ డిమాండ్లపై లారీ యజమానుల సంఘం ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. డిమాండ్లను ఆమోదించకపోతే ఈ నెల 28 తర్వాత మళ్లీ సమ్మెకు దిగుతామని పేర్కొంది. గతంలో సమ్మె చేసినప్పుడు వాటి పరి ష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. శనివా రం సంబంధిత విభాగాధిపతులు లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యి వాటిపై చర్చించారు. పన్ను తగ్గింపు అంశాన్ని పరిశీలించేందుకు వీలుగా ఆర్థిక శాఖకు వివరాలను అందించినట్టు రవాణాశాఖ కార్యదర్శి సునీల్శర్మ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వసూలవతున్న పన్ను వివరాలను రవాణాశాఖ కమిషనర్ సుల్తానియా వివరిస్తూ ఆర్థిక శాఖకు లేఖ రాసినట్టు వెల్లడించారు. సంవత్సరానికి రూ.5 వేలతో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇచ్చేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించినట్టు చెప్పారు. తాము అందుకు సిద్ధంగా ఉన్నందున వారు కూడా అంగీకరించాలని సూచించారు. లోడింగ్, అన్లోడింగ్ చార్జీలు, లారీ సిబ్బంది వద్ద వసూళ్లు చేయటంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించారు. ఓవర్లోడ్ నివారణ, ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అనంతరం సంఘం ప్రతినిధులు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్శర్మను కలసి వినతిపత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా టోల్గేట్ల తొల గింపు, లారీ అద్దెలపై టీడీఎస్ రద్దు తదితర డిమాండ్లను కూడా అందులో పేర్కొన్నారు. సమావేశంలో లారీ యజమానుల సంఘం పక్షాన భాస్కర రెడ్డి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
పసిడి పథకాల మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ : పసిడి బాండ్లు (జీబీఎస్), డిపాజిట్లకు (జీఎంఎస్) సంబంధించి ఆవిష్కరించిన రెండు పథకాల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. ఈ రెండింటి వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంకుతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆఫీస్ మెమోలో ఆర్థిక శాఖ పేర్కొంది. కరిగింపు చార్జీల వివరాలను కూడా ఇందులో ప్రస్తావించింది. దీని ప్రకారం 100 గ్రాముల పరిమాణం దాకా లాట్కు కనీస చార్జి రూ. 500గాను, 900-1,000 గ్రాముల దాకా పరిమాణానికి దాదాపు రూ. 13,400 దాకా ఉంటుంది. కడ్డీలు తదితర భౌతిక రూపంలో బంగారానికి డిమాండ్ను తగ్గించే దిశగా ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెడుతోంది. జీఎంఎస్ కింద ఏడాది నుంచి 15 ఏళ్ల కాల వ్యవధికి బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. మరోవైపు, ఫిజికల్ గోల్డ్కు ప్రత్యామ్నాయంగా బాండ్లను (జీబీఎస్) ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇవి 2,5,10, 50, 100 గ్రాముల పరిమాణంలో 5-7 సంవత్సరాల కాలవ్యవధికి లభిస్తాయి. -
పెండింగ్కు సర్కారు బాసట
* ప్రాజెక్టుల పూర్తికి ఆర్థిక శాఖ మద్దతు * నీటి పారుదల శాఖ వినతికి సుముఖం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తమవంతు సహాయం అందించేందుకు ఆర్థిక శాఖ సమ్మతించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నిలిచిపోయిన పనులకు మద్దతుగా నిలవడంతో పాటు, జిల్లాలో 2,500 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.100కోట్ల నిధులను ఇచ్చేందుకు అంగీకరించింది. పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ శాఖ ఫైళ్ల పరిష్కార విషయమై మంగళవారం ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్తో సచివాలయంలో సమావేశమయ్యారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు సైతం హాజరయ్యారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల జైకా, నాబార్డ్, ట్రిపుల్ ఆర్, ఏఐబీపీ, ఎస్సీపీ నిధులతో జరగాల్సిన 96 సాగునీటి పథకాల పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పథకాలను పూర్తి చేస్తే 96వేల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వస్తుందని, వీటికి అవసరమైన భూసేకరణకు నిధులు మంజూరు చేస్తే వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆగిపోయిన పనులకు కాంట్రాక్టులను రద్దు చేసే అధికారాన్ని చీఫ్ ఇంజనీర్లకు కట్టబెట్టాలనే ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. మిగిలిన పనులను కొత్తరేట్లతో అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని, వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఒప్పందాలు చేసుకొని పనులు ఆరంభించాలని సమావేశంలో నిర్ణయించారు. వీటితో పాటే ప్రైస్ ఎస్కలేషన్ జీవో ఆర్థిక శాఖ వద్దకు రాగానే క్లియర్ చేయాలని, తోటపల్లి రిజర్వాయర్ టెండర్ రద్దు ప్రతిపాదన ఫైల్కు ఆమోదం తెలపాలని కోరగా అందుకు సానుకూలత వ్యక్తమైంది. కాగా, ఇదే సమయావేశంలో నాగార్జునసాగర్ పరిధిలో ప్రపంచబ్యాంకు నిధులతో జరుగుతున్న ఆధునికీకరణ పనులపైనా చర్చ జరిగింది. ఈ పనుల తీరుపై ఇటీవల ప్రపంచబ్యాంకు బృందం సంతృప్తి వ్యక్తం చేసిన అంశాన్ని మంత్రి హరీశ్రావు వివరించారు. -
అర్చకుల వేతనాలకు ప్రత్యేక విభాగం
ఖజానా నుంచి కాకుండా సర్కారు మధ్యే మార్గం జేఏసీకి ప్రతిపాదించిన ప్రభుత్వం.. నేడు మరోసారి చర్చలు సాక్షి, హైదరాబాద్: దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించటం సాధ్యం కాదని దాదాపు తేల్చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఆర్థిక శాఖ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, దేవాలయ విరాళాలను నిధిగా చేసి దాని ద్వారా ఏకరూప వేతనాలు చెల్లించే యోచనలో ఉంది. దీనిపై శుక్రవారం చర్చల్లో స్పష్టత ఇచ్చే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆలయ అర్చక, సిబ్బంది జేఏసీ 10 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆలయ ఉద్యోగులు, అర్చకుల నియామకాలు ఓ పద్ధతిగా జరగకపోవటం, చాలామందికి కనీసం నియమాక ఉత్తర్వులు కూడా లేనందున ఖజానా నుంచి వేతనాలు చెల్లించటం సాంకేతికంగా సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దేవాలయ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలనే డిమాండ్ సాధ్యమేనని అధికారులు చెప్పారు. రెగ్యులరైజ్ చేయటమంటే నియామకాలను క్రమబద్ధం చేసినట్లే గదా.. అలాంటప్పుడు ఖజానా నుంచి వేతనాలు చెల్లించటం సాధ్యమే కదా అని ప్రతి నిధులు పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ ఆ దేవాలయం వరకే సాధ్యమని, అది ప్రభుత్వ నియామకంగా మార్చటం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఖజానా నుంచి వేతనాల పట్టు వీడితే ప్రభుత్వం వారికి ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రత్యామ్నాయాన్ని చూపుతుందని పేర్కొన్న మంత్రి.. ఆర్థిక శాఖ ద్వారా చెల్లించే అంశాన్ని ప్రస్తావించారు. ఆర్జేసీ మొదలు ఈఓల వరకు చెల్లిస్తున్న వేతనంతోపాటు వారికి అందుతున్న ఇతర ప్రయోజనాలన్నీ వస్తే తమకు ఆమోదయోగ్యమేనని, దేవాదాయశాఖ అధికారుల పెత్తనం ఉండకూడదని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. వెంటనే సమ్మె విరమించాలని మంత్రి కోరారు. అయితే ఆ వివరాలను స్పష్టం చేసిన తర్వాత, అవి ఆమోదయోగ్యంగా ఉంటే సమ్మె విరమిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాల ప్రతినిధులతో తాము భేటీ అవుతున్నామని, ఈ చర్చలకు మంత్రి రావాలని వారు కోరారు. ఈ వ్యవహారంపై ఏర్పాటైన కమిటీ మరో వారంలో నివేదిక ఇచ్చే అవకాశముందని, అది రాగానే తుది నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి చెప్పడంతో శుక్రవారం నాటికి విషయం తేలుతుందో లేదో సందిగ్ధంగా మారింది. -
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రతన్
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖలో కేంద్రం కీలక మార్పులు, చేర్పులు చేసింది. ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా రతన్ పి. వాతాల్ను (59) సోమవారం నియమించింది. 1978 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారి రతన్... ఆర్థిక శాఖలో అత్యంత సీనియర్. ఆర్థిక శాఖలో అత్యంత సీనియర్ కార్యదర్శికే ఫైనాన్స్ సెక్రటరీ హోదా దక్కుతుంది. ఆయన నియామకాన్ని ప్రధాని మోదీ ఆమోదించినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, శక్తికాంత దాస్ను ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగాను, హస్ముఖ్ అధియాను రెవె న్యూ కార్యదర్శిగాను కేంద్రం నియమించింది. అధియా, దాస్ బాధ్యతలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్పై సెప్టెంబర్ 4 నుంచి కసరత్తు మొదలవనున్న నేపథ్యంలో తాజా నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శకి ్తకాంత దాస్ 1980 బ్యాచ్ తమిళనాడు క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారి. -
రూ.850 కోట్లు దుర్వినియోగం
సాక్షి, హైదరాబాద్: పంట రుణమాఫీ నిధులు భారీ మొత్తంలో దుర్వినియోగమయ్యాయి. ఈ పథకంలో జరిగిన అవకతవకలతో కనీసం పది శాతం నిధులు అంటే సుమారు రూ.850 కోట్లు పక్కదారి పట్టినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఇటీవల స్థానిక నిధుల ఆడిట్ విభాగం మెదక్ జిల్లాలో నిర్వహించిన ఆడిట్లో అక్రమాలు బయటపడ్డాయి. బోగస్ పేర్లు, నకిలీ పాసు పుస్తకాలు, ఒకే సర్వే నంబర్తో వేర్వేరు పట్టాదారు పాసు పుస్తకాలు, ఒక ఎకరం భూమి ఉంటే.. పక్కన సున్నా చేర్చి పది ఎకరాలు ఉన్నట్లుగా రుణాలు పొందడం, వేర్వేరు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందుకోవడం... ఇలా రకరకాలుగా ఈ అవకతవకలు జరిగినట్లు ఆడిట్ అధికారులు ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించారు. ఈ జిల్లాలో రుణమాఫీ పథకంలో లబ్ధి పొందిన రైతుల్లో.. మచ్చుకు పది శాతం మందికి సంబంధించిన ఖాతాలను, భూములను, వ్యక్తులను క్షేత్రస్థాయిలో పేరుపేరునా పరిశీలించింది. అందులో గుర్తించిన అవకతవలన్నింటినీ సమగ్రంగా ఇందులో పొందుపరిచింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ ఆడిట్ చేయించి.. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకుంది. ఆడిట్ నివేదికల ఆధారంగా మరోసారి క్షేత్రస్థాయి విచారణకు సర్కారు ఆదేశించింది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం సంగారెడ్డికి వెళ్లి విచారణ నిర్వహించారు. ఆడిట్లో తేలిన అంశాలను ధ్రువీకరించుకునేందుకు కొన్ని బ్యాంకర్ల రికార్డులను, రైతుల ఖాతాలను పరిశీలించారు. ప్రభుత్వం రూ.17 వేల కోట్లు రుణమాఫీ పథకానికి కేటాయించగా, ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.8,500 కోట్లు చెల్లించింది. రెండో విడత చెల్లింపులకు ముందే ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఆర్థిక శాఖ కలెక్టర్ల సారథ్యంలో ప్రయోగాత్మకంగా సర్వే చేయించింది. అప్పుడే రుణమాఫీలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయని అంచనాకు వచ్చింది. తాజాగా ఆడిట్ విభాగం మెదక్ జిల్లాలో చేపట్టిన ఆడిట్తో అవకతవకల స్వరూపం మొత్తం బయటపడింది. కనీసం పది శాతం నిధులు దుర్వినియోగమైనట్లు అంచనా వేస్తున్నామని, వీటికి అడ్డుకట్ట వేయటం ద్వారా ప్రభుత్వానికి కనీసం రూ.850 కోట్లు మిగులుతాయని ఆర్థిక శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఆడిట్ నివేదిక ఆధారంగా ఆర్థిక శాఖ అధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి స్థాయి విచారణ పూర్తయితే ఎంత మొత్తం దుర్వినియోగమైందనేది పక్కాగా లెక్క తేలుతుందన్నారు. అక్రమంగా జరిగిన చెల్లింపులను సైతం రికవరీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెప్పారు. -
రుణమాఫీలో అవకతవకలు
{పభుత్వ సర్వేలో బట్టబయలు బోగస్ రైతులను తొలగించేందుకు ప్రయత్నాలు అందుకు బాధ్యులైన బ్యాంకులపైనా చర్యలు సొమ్ము రికవరీకి సర్కారు కసరత్తు హైదరాబాద్: రైతులకు మొదటి విడత విడుదల చేసిన రుణమాఫీ సొమ్ములో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు స్పష్టమైన సమాచారం అందిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రుణమాఫీలో అవకతవకలపై జిల్లాల్లో ర్యాండమ్ సర్వేకు ఆర్థికశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. దాదాపు 10 శాతం ఖాతాలను సర్వే చేసినట్లు తెలిసింది. సర్వే అనంత రం నివేదిక సమర్పించారు. అనేక అక్రమాలు జరిగినట్లు నివేదికలో నిర్ధారించారు. అయితే ఎంత మొత్తంలో అక్రమాలు జరిగాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. దీనిపై సర్కారు కసరత్తు చేస్తోంది. బ్యాంకులు, రైతులపై చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ. లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించింది. ఆ ప్రకారం రూ. 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించి, 35.82 లక్షల రైతు ఖాతాలను గుర్తించింది. మొదటి విడతగా గత ఏడాది రూ. 4,230 కోట్లను రుణమాఫీ కింద జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. బ్యాంకులు ఇప్పటివరకు రూ. 4,086.22 కోట్లను రైతుల ఖాతాల్లో మాఫీ అయినట్లు జమచేశాయి. సర్కారు రెండో విడతకింద ఈ ఏడాది రూ. 4,083 కోట్లు రెండు దఫాలుగా అందజేసింది. మొదటి విడతలో అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనేక అక్రమాలు జరిగాయని సర్కారు భావించింది. దీనిపై నిర్వహించిన ర్యాండమ్ సర్వేలో అక్రమాలు బట్టబయలయ్యాయి. అయితే అక్రమాలకు ప్రధాన కారణం బ్యాంకులేనని చెబుతున్నారు. బ్యాంకు రికార్డుల ఆధారంగానే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతు రుణమాఫీ లబ్ధిదారుల జాబితా రూపొందించిందని, కాబట్టి బ్యాంకు అధికారులే అక్రమాలకు బాధ్యులని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అందువల్ల సంబంధిత బ్యాంకు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. మరోవైపు బోగస్ రైతులకూ నోటీసులు జారీచేస్తారా లేదా చూడాల్సి ఉంటుందంటున్నారు. అలా నోటీసులిస్తే సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని, కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఎలాగైనా అక్రమంగా వెళ్లిన సొమ్మును రికవరీ చేయాల్సిందేనని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు బోగస్ రైతులనూ రుణమాఫీ జాబితాల్లోంచి తొలగిస్తారని అంటున్నారు. -
మొండిబకాయిల సెగ..
ఆమోదయోగ్య స్థాయిని మించిపోయాయ్ ♦ పీఎస్బీల్లో ఎన్పీఏ పరిస్థితులపై ♦ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ♦ బ్యాంకులు సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలవని ధీమా న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(పీఎస్బీ) మొండిబకాయిల (ఎన్పీఏ) పరిమాణం ఆమోదయోగ్య స్థాయిని మించిపోయాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఎన్పీఏలను తగ్గించేందుకు, పీఎస్బీల ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వివేచన లోపించడం, క్రియాశూన్యత, ఎకానమీలో కొన్ని రంగాలు సవాళ్లు ఎదుర్కొంటుండడం మొదలైనవి అన్నీ కూడా ఎన్పీఏల పెరుగుదలకు తలా కొంత కారణమయ్యాయని ఇండియన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం పీఎస్బీల్లో స్థూల ఎన్పీఏలు రూ. 2.67 లక్షల కోట్ల మేర ఉన్నాయి. మొత్తం బ్యాంకింగ్ రంగం స్థూల ఎన్పీఏలు రూ. 3.09 లక్షల కోట్లు కాగా.. పీఎస్బీల వాటా ఆందోళనకర స్థాయిలో 86 శాతం పైగా ఉంది. కొత్త ఎన్పీఏలు తగ్గుముఖం పట్టినా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా దేశీ బ్యాంకులకు మొండిబకాయిల భారం తప్పదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనాలు వేసింది. ఎన్పీఎల తగ్గుదలకు చర్యలు.. ఉక్కు, విద్యుత్, డిస్కమ్లు, జాతీయ రహదారులు మొదలైన రంగాల్లోనే ఎక్కువగా మొండిబకాయిలు పేరుకుపోయాయని జైట్లీ చెప్పారు. కొన్ని దేశీయ, మరికొన్ని అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం రంగాలవారీగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెడుతోన్నట్లు ఆయన వివరించారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో బ్యాంకులు సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోగలవని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. బ్యాంకుల నిర్వహణను మెరుగుపర్చడం, ప్రభుత్వం వాటికి మరింత మూలధనం సమకూర్చడం మొదలైనవన్నీ అందులో భాగమేనని జైట్లీ చెప్పారు. ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం బ్యాంకులకు నాలుగేళ్లలో రూ. 1.80 లక్షల కోట్ల మూలధనం అవసరం కాగా.. ఇందులో ప్రభుత్వం రూ. 70,000 కోట్లు సమకూర్చనుందని ఆయన వివరించారు. ఇక, పీఎస్బీలకు అవసరాన్ని బట్టి అత్యుత్తమ నైపుణ్యం గలవారిని ప్రైవేట్ రంగం నుంచి కూడా రిక్రూట్ చేస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఎకానమీకి ప్రాణాధారమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల అభివృద్ధికి దోహదపడేవేనని ఆయన చెప్పారు. పీఎస్బీలంటే ప్రజల సొమ్ముకు ట్రస్టీల్లాంటివని, అవి సరిగ్గా, సమర్థవంతంగా పనిచేయాలని ఒత్తిడి చేసే హక్కు ప్రజలకు ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. పేమెంట్ బ్యాంకులు ప్రజల బ్యాంకింగ్ అలవాట్లను మార్చేస్తాయ్.. ప్రతిపాదిత పేమెంట్ బ్యాంకులు.. ప్రజల బ్యాంకింగ్ అలవాట్లను, దేశీ ఎకానమీ స్వరూపాన్ని మార్చేయగలవని జైట్లీ చెప్పారు. చిన్న మొత్తాలైనా..పెద్దమొత్తాలైనా ప్రజలు ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు బ్యాంకింగ్ వ్యవస్థనే ఉపయోగిస్తారన్నారు. మరింత మంది ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారని ఆయన తెలిపారు. మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రాబోయే రోజుల్లో బ్యాంకింగ్లో టెక్నాలజీ మరింత పెరుగుతుందని జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకింగ్ నెట్వర్క్ భారీగా విస్తరిస్తుండటం సంతోషించతగ్గదే అయినప్పటికీ.. చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, పోస్టల్ డిపార్ట్మెంట్ తదితర 11 సంస్థలు పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేసేం దుకు రిజర్వ్ బ్యాంక్ సూత్రప్రాయ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. -
రూ. 4 వేల కోట్లపైనే...
‘పీఆర్సీ’ బకాయిలపై సర్కారు ప్రాథమిక అంచనా * పే ఫిక్సేషన్ ఆధారంగా వివరాల సేకరణ * పే అండ్ అకౌంట్స్, ట్రెజరీల నుంచి సమాచారం కోరిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ వేతన సవరణ ప్రకారం చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం లెక్కలేసుకుంటోంది. ఈ భారం దాదాపు రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల మధ్యలో ఉంటుందని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసుకుంది. ఉద్యోగుల కొత్త పే ఫిక్సేషన్ ప్రకారం వారికి రావాల్సిన పీఆర్సీ బకాయిలు ఎంత...? మొత్తంగా తొమ్మిది నెలల బకాయిలకు ఎంత చెల్లించాల్సి ఉంది...? అనే వివరాల సేకరణలో సర్కారు నిమగ్నమైంది. వెంటనే ఈ సమాచారం అందించాలని పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ కార్యాలయాలను కోరింది. మార్చి నెలలోనే పదో పీఆర్సీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కొత్త వేతన సవరణకు అనుగుణంగా వేతనాల స్థిరీకరణ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. పెరి గిన వేతనాలు అందుకుంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు సైతం పెరిగిన పింఛన్ను పొందుతున్నారు. ఈ మేరకు నెలసరి చెల్లింపుల వివరాలన్నీ పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ కార్యాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి ఆధారంగా వారికి ఇవ్వాల్సిన బకాయిలకు ఎంత సొమ్ము కావాలనేది లెక్క తేలిపోతుంది. అందుకే పే అండ్ అకౌంట్స్, ట్రెజరీల నుంచి వచ్చే సమాచారంతో పీఆర్సీ బకాయిల ఫైలును సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించిం ది. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2014 జూన్ నుంచి 2015 మార్చి వరకు బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ ఉత్తర్వులిచ్చే సమయంలోనే బకాయిలపై సర్కారు మల్లగుల్లాలు పడింది. బాండ్లు జారీ చేయటం.. లేదా నగదు చెల్లింపులు చేయటం.. జీపీఎఫ్ ఖాతాలో జమ చేయటం.. ఈ మూడు అంశాలను పరిశీలించింది. భారీ మొత్తం కావటంతో జీపీఎఫ్లో జమ చేస్తే... ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర రుణ పరిమితి తగ్గిపోతుంది. నగదు చెల్లింపులు చేయాలన్నా... విడతల వారీగా చెల్లించాలన్నా... ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు నిధుల్లో కోత పెట్టాల్సి వస్తుంది. మధ్యేమార్గంగా బాండ్లు జారీ చేసే దిశగా ఆలోచనలు చేసింది. ఈలోగా బాండ్ల జారీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటనలు జారీ చేశాయి. దీంతో ప్రభుత్వం బకాయిల అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని పీఆర్సీ జీవోల్లో ప్రస్తావించి తాత్కాలికంగా దాటవేసింది. ఈ జీవోలు వచ్చి అయిదు నెలలు కావస్తోంది. తాజాగా బకాయిలపై ఆర్థిక శాఖలో ఫైలుకు మళ్లీ కదలిక వచ్చింది. బకాయిలకు ఎంత మొత్తం అవసరమనేది నిక్కచ్చిగా తేలి తేనే... వాటిని ఎలా చెల్లించాలనేది నిర్ణయం తీసుకునే వీలుంటుందని అధికారులు తాజా కసరత్తు ప్రారంభించటం గమనార్హం. కేబినెట్కు చేరిన డీఏ ఫైలు: ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం (డీఏ) ఫైలును ఆర్థిక శాఖ కేబినెట్ ఆమోదానికి పంపించింది. 3.144 శాతం డీఏను ఖరారు చేసింది. తదుపరి జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాతే పెరిగిన డీఏ అమల్లోకి వస్తుంది. తిరస్కరించిన సిఫారసులిక అంతే... పదో పీఆర్సీ చేసిన సిఫారసులు కొన్నిం టిని ప్రభుత్వం పక్కన బెట్టింది. ఉద్యోగుల సర్వీసు వెయిటేజీ, పెన్షనర్లకు అదనపు పింఛన్ చెల్లింపు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్, చెవిటి ఉద్యోగులకు అలవెన్స్ అంశాలపై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి పెన్షన్ పొందేం దుకు రిటైర్మెంట్ నాటికి 33 ఏళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన ఉంది. గత పీఆర్సీ దీన్ని ఐదేళ్ల పాటు సడలించింది. దీన్ని 8 ఏళ్లకు పెంచాలని పదో పీఆర్సీ చేసిన సిఫారసులను ప్రభుత్వం తోసిపుచ్చింది. పెన్షనర్లకు వయస్సు పెరిగేకొద్ది అదనంగా చెల్లించే పెన్షన్ (అడిషనల్ క్వాంటమ్ పెన్షన్)ను 70 ఏళ్ల నుంచే అమలు చేయాలనే సిఫారసుకు హేతుబద్ధత లేదని తిరస్కరించింది. దీంతో ఇప్పుడున్న 70 ఏళ్ల విధానమే అమలవుతోంది.