రతన్ టాటాకు బ్రిటన్ పురస్కారం | GBE: Ratan Tata recieves one of UK's top civilian honours | Sakshi
Sakshi News home page

రతన్ టాటాకు బ్రిటన్ పురస్కారం

Published Tue, May 6 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

రతన్ టాటాకు బ్రిటన్ పురస్కారం

రతన్ టాటాకు బ్రిటన్ పురస్కారం

న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాకు యునెటైడ్ కింగ్‌డమ్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. స్వాతంత్య్రానంతరం ఈ అవార్డును పొందిన తొలి భారతీయుడు ఈయనే. ‘నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (జీబీఈ)’ పేరు కలిగిన ఈ పురస్కారాన్ని క్వీన్ ఎలిజబెత్-2 తరఫున భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ జేమ్స్ బెవాన్... రతన్ టాటాకు ప్రదానం చేశారు. దైపాక్షిక సంబంధాలు, బ్రిటన్‌లో భారత పెట్టుబడుల వృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు రతన్ టాటా చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డు అందించినట్లు బ్రిటిష్ హైకమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement