Tata group
-
టెస్లా కార్లకు సప్లయర్ ‘టాటా’నే!
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కంపెనీ టెస్లాకు గ్లోబల్ సప్లయర్గా టాటా గ్రూప్ నిలిచింది. ఈమేరకు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ భాగస్వామ్యం ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెరుగుతున్న భారత్ పాత్రను, అధునాతన తయారీ, సాంకేతికతలో టాటా గ్రూప్ నైపుణ్యాన్ని నొక్కి చెబుతోంది.ఈ నివేదిక ప్రకారం.. టాటా ఆటోకాంప్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టాటా టెక్నాలజీస్ , టాటా ఎలక్ట్రానిక్స్తో సహా అనేక టాటా గ్రూప్ కంపెనీలు ఇప్పుడు టెస్లా సరఫరా గొలుసులో భాగంగా ఉన్నాయి. కీలకమైన భాగాలు, సేవలను అందిస్తున్నాయి. ఈ టాటా సంస్థలు ఇప్పటికే టెస్లాతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, వివిధ విడిభాగాలు, సేవలను సరఫరా చేస్తున్నాయని ఈటీ నివేదించింది. ముఖ్యంగా టెస్లా భారత్లో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే వారి భాగస్వామ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.టెస్లా సీనియర్ ప్రొక్యూర్మెంట్ అధికారులు నిర్దిష్ట విడిభాగాల తయారీ గురించి భారతీయ సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఈటీ పేర్కొంది. వీటిలో కాస్టింగ్స్, ఫోర్జింగ్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాబ్రికేషన్ భాగాలు ఉన్నాయి. టెస్లాకు భారతీయ సప్లయర్ల సహకారం ఇప్పటికే గణనీయంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు టెస్లాకు దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను సరఫరా చేశాయి. టెస్లా తన సరఫరా గొలుసును వైవిధ్యపరచాలని చూస్తున్న క్రమంలో భారత్ నుంచి దాని సోర్సింగ్ పెరుగుతుందని భావిస్తున్నారు.టాటా కంపెనీలు ఏం సరఫరా చేస్తున్నాయంటే..ఈటీ కథనం ప్రకారం.. వివిధ టాటా గ్రూప్ కంపెనీలు టెస్లాకు ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నాయి. వాటిలో టాటా ఆటోకాంప్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇంజనీరింగ్ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. టాటా టెక్నాలజీస్ ఎండ్-టు-ఎండ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అందిస్తోంది. టీసీఎస్ సర్క్యూట్ బోర్డు టెక్నాలజీని అందిస్తోంది.టెస్లా తయారీ యూనిట్ ఇక్కడ ఏర్పాటయ్యాక టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ చిప్లను సరఫరా చేస్తుందని భావిస్తున్నారు. ఇక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, మోటార్ కంట్రోలర్ యూనిట్లు, డోర్ కంట్రోల్ మెకానిజమ్కు కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లింగ్స్ (పీసీబీఏ) కోసం టెస్లా టాటా ఎలక్ట్రానిక్స్ వైపు చూడవచ్చు. -
టాటా డిస్ప్లే చిప్స్ వస్తున్నాయ్..
దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్.. డిస్ప్లే చిప్స్ తయారీలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా టాటా గ్రూప్ కంపెనీ టాటా ఎల్రక్టానిక్స్ తైవాన్ సంస్థ పీఎస్ఎంసీ, హైమాక్స్ టెక్నాలజీస్తో చేతులు కలిపింది. అంతేకాకుండా గుజరాత్ ప్రభుత్వంతోనూ జత కట్టింది. తద్వారా త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వెరసి గుజరాత్లో తైవాన్ కంపెనీ భాగస్వామ్యంతో డిస్ప్లే చిప్స్ తయారీకి తెరతీయనుంది.ఈ అంశాలను ఐఈఎస్ఏ విజన్ సదస్సులో టాటా ఎల్రక్టానిక్స్ సీఈవో రణదీర్ ఠాకూర్ ప్రకటించారు. టాటా ఎల్రక్టానిక్స్, పీఎస్ఎంసీ, హైమాక్స్ మధ్య అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదిరినట్లు వెల్లడించారు. పీఎస్ఎంసీ టెక్నాలజీ సహకారంతో గుజరాత్లోని ధోలెరాలో హైమాక్స్ కోసం డిస్ప్లే చిప్స్ తయారీని చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. వరుసగా నాలుగు రోజులు సెలవుమూడు విభాగాల్లోనూ.. డిస్ప్లే చిప్స్ను టీవీలతోపాటు, మొబైల్ ఫోన్ తెరలు, కెమెరాలలో ఇమేజ్ సెన్సార్లు, ఎల్ఈడీలు, ఓఎల్ఈడీలు తదితరాలలో వినియోగిస్తారు. తాజా ఒప్పందంతో టాటా ఎలక్ట్రానిక్స్ అన్ని(మూడు రకాల) సెమీకండక్టర్ తయారీ విభాగాల్లోనూ కార్యకలాపాలు విస్తరించనుంది. కంపెనీ ఇప్పటికే పీఎస్ఎంసీ సాంకేతిక భాగస్వామిగా గుజరాత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ.91,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. అస్సామ్లోనూ రూ.27,000 కోట్ల పెట్టుబడులతో చిప్ అసెంబ్లీ ప్లాంటును నెలకొల్పుతోంది. -
ఎయిర్టెల్ టీవీ, టాటా ప్లే విలీనం!
ముంబై: ప్రయివేట్ రంగ కార్పొరేట్ దిగ్గజాలు టాటా గ్రూప్, భారతీ ఎయిర్టెల్ చేతులు కలపనున్నాయి. తద్వారా నష్టాలలో ఉన్న డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్లను ఒకటి చేస్తున్నాయి. ఈ అంశంపై భారతీ ఎయిర్టెల్ తాజాగా స్టాక్ ఎక్సే్ఛంజీలకు సమాచారమిచ్చింది. శాటిలైట్, కేబుల్ టీవీ సర్వీసుల భారతీ టెలీమీడియా, టాటా ప్లే(గతంలో టాటా స్కై) విలీనానికి వీలుగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు వీలుగా షేర్ల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఇటీవల కొంతకాలంగా దేశీ వినియోగదారుల అభిరుచి కేబుళ్ల నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్స్వైపు మళ్లుతోంది. ఓటీటీల కారణంగా డీటీహెచ్ వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది. కొద్ది రోజులుగా లైసెన్స్ ఫీజు తగ్గింపునకు డీటీహెచ్ సంస్థలు అభ్యర్థిస్తున్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రస్తుత 8 శాతం ఫీజును ఏజీఆర్లో 3 శాతానికి తగ్గించేందుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 2027 చివరికల్లా ఫీజును ఎత్తివేయాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. డీటీహెచ్ యూజర్లు @ 6 కోట్లుతాజా డీల్ నేపథ్యంలో టాటా ప్లేకున్న 1.9 కోట్ల గృహాలతో ఎయిర్టెల్ కనెక్ట్ అయ్యేందుకు వీలు చిక్కనుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సైతం 1.58 కోట్లమంది వినియోగదారులను కలిగి ఉంది. దీంతో టెలికం, బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ సర్వీసులను కలిపి ట్రిపుల్ ప్లే వ్యూహాన్ని అమలు చేసేందుకు అవకాశముంటుంది. ఓవైపు రిలయన్స్ జియో టెలికం, బ్రాడ్బ్యాండ్, కంటెంట్లతో ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ సమీకృత సేవలవైపు దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ప్రస్తుతం డీటీహెచ్ వినియోగదారుల సంఖ్య దాదాపు 6 కోట్లు. ట్రాయ్ వివరాల ప్రకారం 2024 జూన్లో ఈ సంఖ్య 6.22 కోట్లుగా నమోదైంది. మొబైలేతర విభాగ ఆదాయాన్ని పెంచుకునే బాటలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కన్వర్జెన్స్పై దృష్టి పెట్టింది. దేశీయంగా డీటీహెచ్ సేవలలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న టాటా ప్లే గతంలో గ్లోబల్ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ న్యూస్ కార్ప్తో భాగస్వామ్య సంస్థ(టాటా స్కై)ను ఏర్పాటు చేసింది. అయితే 2019లో మర్డోక్ సంస్థ ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్ను వాల్ట్ డిస్నీ కొనుగోలు చేయడంతో భాగస్వామ్య వాటా చేతులు మారింది. ఇతర డీల్స్...ఎయిర్టెల్, టాటా ప్లే మధ్య డీల్ కుదిరితే డీటీహెచ్ రంగంలో రెండో అతిపెద్ద ఒప్పందంగా నిలవవచ్చు. ఇంతక్రితం 2016లో డిష్ టీవీ, వీడియోకాన్ డీ2హెచ్ విలీనమైన విషయం విదితమే. అయితే ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీంతో స్టార్ ఇండియా, వయాకామ్18 విలీనమయ్యాయి. ఫలితంగా జియోస్టార్ బ్రాండుతో దేశీయంగా అతిపెద్ద మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఆవిర్భవించింది. వీటి సంయుక్త ఆదాయం 2024లో రూ. 26,000 కోట్లుగా నమోదుకావడం గమనార్హం! 2023–24లో భారతీ టెలీమీడియా రూ. 3,045 కోట్ల టర్నోవర్, రూ. 76 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఇదే సమయంలో టాటా ప్లే నిర్వహణ ఆదాయం రూ. 4,305 కోట్లను తాకగా.. కన్సాలిడేటెడ్ నష్టం రూ. 354 కోట్లకు చేరింది. కాగా.. ఇంతక్రితం ఐపీవో చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతి పొందింది. అయితే సమాచార శాఖ కంపెనీ ఈక్విటీ నిర్మాణంలో సవరణలకు ఆదేశించడంతో లిస్టింగ్ కార్యాచరణను ఆలస్యం చేసింది. కంపెనీ ఆర్వోసీకి దాఖలు చేసిన తాజా సమాచారం ప్రకారం టాటా సన్స్ తదుపరి నెట్వర్క్ డిజిటల్ డి్రస్టిబ్యూషన్ సర్వీసెస్ ఎఫ్జెడ్ ఎల్ఎల్సీ, టీఎస్ ఇన్వెస్ట్మెంట్స్.. విడిగా 20 శాతం వాటాలతో రెండో పెద్ద వాటాదారులుగా నిలుస్తున్నాయి. టాటా ప్లేలో బేట్రీ ఇన్వెస్ట్మెంట్స్(మారిషస్) పీటీఈ సైతం 10 శాతం వాటా కలిగి ఉంది. -
దిరియాపై దేశీ దిగ్గజాల కన్ను
న్యూఢిల్లీ/దావోస్: సౌదీ అరేబియాలో దిరియా పేరుతో తలపెట్టిన అతిభారీ(గిగా) టూరిజం ప్రాజెక్టుపై దేశీ కార్పొరేట్ దిగ్గజ గ్రూప్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 63 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రూపొందనున్న ఈ ప్రాజెక్టులో దేశీ దిగ్గజాలు టాటా గ్రూప్, ఒబెరాయ్ గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు దిరియా సీఈవో జెర్రీ ఇన్జెరిల్లో పేర్కొన్నారు. సిటీ ఆఫ్ ఎర్త్గా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టును సౌదీ అరేబియా రాజధాని రియాద్ చివర్లో నెలకొల్పుతున్నారు. లక్ష మంది ప్రజలకు గృహాలు, మరో లక్ష మందికి కార్యాలయ ప్రాంతాలతో ప్రాజెక్టు రూపొందనుంది. ఈ కొత్త నగరం 40 విలాసవంత హోటళ్లు, 1,000కుపైగా షాపులు, 150 రెస్టారెంట్లు, 20,000 సీట్ల సామర్థ్యంగల మలీ్టపర్పస్ ఈవెంట్లకు వీలయ్యే ఒపేరా హౌస్సహా గోల్ఫ్ కోర్స్, కేఫ్లు, యూనివర్శిటీలు, కల్చరల్ అసెట్స్, మ్యూజియంలు తదితరాలతో ఏర్పాటుకానుంది. -
ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా
ప్రభుత్వ నియంత్రణ నిబంధనలు పాటించనందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా విధించారు. నియమాలకు విరుద్ధంగా విమానాన్ని నడపడానికి పైలట్ను అనుమతించినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పదేపదే రోస్టరింగ్ సమస్యలు, పైలట్లకు తప్పనిసరి రికెన్సీ(విమానాలను నడపడంలో నైపుణ్యం కలిగి ఉండేలా చేయడం) ఉల్లంఘనలకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అయితే అందుకు సరైన విధంగా స్పందించకపోవడం వల్ల ఈ జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.ప్రతి పైలట్ నిత్యం మూడు టేకాఫ్లు, ల్యాండింగ్లు చేయాల్సిన అవసరం లేనప్పటికీ జులై 7, 2024న విమానాన్ని నడపడానికి ఎయిరిండియా ఒక పైలట్ను అనుమతించిందని డీజీసీఏ గుర్తించింది. పైలట్ విమానం నడపడానికి ముందు ఎయిరిండియా రోస్టింగ్ కంట్రోలర్లు సీఏఈ విండోలో ప్రతిబింబించే అనేక హెచ్చరికలను పట్టించుకోలేదని డీజీసీఏ ఎత్తిచూపింది. కంపెనీ చర్యలను హైలైట్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ సంస్థ ఇచ్చిన ప్రతిస్పందనతో డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇదీ చదవండి: చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లుజనవరి 29, 2025న రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు ఇటీవల పేర్కొంది. 30 రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని జమ చేయాలని ఎయిరిండియాను ఆదేశించింది. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నొక్కి చెప్పింది. -
రైల్వేలో ఫుడ్ కేటరింగ్ మెరుగుపడనుందా..?
రైల్వే ప్రయాణీకులకు మరింత మెరుగైన ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులు అందించేందుకు భారతీయ రైల్వే క్యాటరింగ్, టికెటింగ్ అండ్ టూరిజం విభాగం ఐఆర్సీటీసీ కట్టుబడి ఉంది. ఇందుకోసం తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్తో జతకట్టింది. ఈ సహకారం వల్ల రైళ్లలో ఆహార ఆఫర్లను పునరుద్ధరించడం, ప్రయాణీకులకు అధిక నాణ్యమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటికే ఐఆర్సీటీసీ 90 పట్టణాలు, 100 రైల్వే స్టేషన్లలో వేలాది మంది వినియోగదారులకు ఫుడ్ అగ్రిగేటింగ్ ప్లాట్ఫామ్ జొమాటోతో సహకారం కుదుర్చుకుని సేవలందిస్తోంది. తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్తో చేసుకున్న ఒప్పందం రైళ్లలో లభించే ఆహారం నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రోజుకు 16 లక్షల భోజనాలను అందిస్తున్నాం. జోజనం మెనూను మెరుగుపరచడం కోసం కస్టమర్ల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. మెనూను అప్డేట్ చేసి ఫుడ్ ఆఫర్ ట్రయల్స్ త్వరలో నిర్వహిస్తాం. ఇందుకోసం తాజాగా ప్రముఖ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్యాకేజీచిన్న పరిశ్రమలకు మద్దతుకేటరింగ్, టూరిజం విభాగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) చేయూతనిచ్చేందుకు ఐఆర్సీటీసీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. వస్తువులు, సేవల కోసం సుమారు 63% ఎంఎస్ఈలపైనే ఆధారపడుతున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇది ప్రభుత్వం నిర్దేశించిన 25% కంటే చాలా ఎక్కువ. ఎంఎస్ఈలతోపాటు సంస్థ వృద్ధిపై ఐఆర్సీటీసీ దృష్టి సారించినట్లు పేర్కొంది. -
టాటా బోర్డులో ఇద్దరు వారసురాళ్లకు చోటు
సర్ రతన్ టాటా ఇండస్ట్రియల్ ఇనిస్టిట్యూట్ (SRTII) ట్రస్టీల బోర్డులో టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా కుమార్తెలు మాయ, లేహ్ నియమితులయ్యారు. వీరిరువురు అర్నాజ్ కొత్వాల్, ఫ్రెడ్డీ తలతి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.మాయ, లేహ్ టాటాల నియామకం అర్నాజ్ కొత్వాల్తో అంతర్గత విభేదాలకు దారితీసింది. టాటా ట్రస్ట్స్లో ఎగ్జిక్యూటివ్గా ఉన్న 'తారాపోరేవాలా'కు పంపిన ఈమెయిల్లో, నోయెల్ టాటా పట్టుబట్టడంతో.. అతను కోరినట్లుగా ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమస్యకు సంబంధించి సర్ దొరాబ్జీ.. టాటా ట్రస్ట్ అండ్ సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ అయిన మెహ్లీ మిస్త్రీ నుంచి కూడా తనకు కాల్ వచ్చిందని కూడా ఆమె పేర్కొన్నారు. దీనిపై టాటా ట్రస్ట్లు స్పందించ లేదు.SRTII అనేది సర్ రతన్ టాటా ట్రస్ట్ యూనిట్, ఇది మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేస్తోంది. రతన్ టాటా మరణానంతరం అక్టోబర్లో టాటా ట్రస్ట్ల ఛైర్మన్గా నియమితులైన నోయెల్ టాటాకు.. లేహ్ (39), మాయ (36), నెవిల్లే (32) ముగ్గురు పిల్లలు. వీరు టాటా ట్రస్ట్లలో ఇప్పటికే వివిధ బాధ్యతలను నిర్వర్తించారు.లేహ్ టాటాలేహ్ టాటా.. ఇండియన్ హోటల్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. అంతే కాకుండా ఈమె గేట్వే హోటల్స్ బ్రాండ్ను నిర్వహిస్తోంది. టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జేఆర్డీ అండ్ థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా ఉన్నారు.మాయ టాటామాయా టాటా.. టాటా క్యాపిటల్లోని ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆర్డీ టాటా ట్రస్ట్ మరియు జెఆర్డి మరియు థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో పని చేస్తున్నారు.నెవిల్లే టాటానెవిల్లే టాటా గత సంవత్సరం టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారాలను కలిగి ఉన్న ట్రెంట్ హైపర్ మార్కెట్ యూనిట్.. స్టార్ బజార్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అతను టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్ అండ్ ఆర్డీ టాటా ట్రస్ట్ బోర్డులలో ఉన్నారు.నోయల్ టాటాదివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే ఆయన టాటా సన్స్ బోర్డులో కూడా అడుగుపెట్టారు. 2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100టాటా సన్స్లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు. ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇప్పుడు టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. -
నెలకు 5,000 వాహన అమ్మకాలు లక్ష్యం
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా(Mahindra) అండ్ మహీంద్రా బీఈ–6, ఎక్స్ఈవీ 9ఈ టాప్ వేరియంట్ల ధరలను ప్రకటించింది. రెండు మోడళ్లూ మూడు వేరియంట్లలో లభిస్తాయి. ఎక్స్షోరూంలో టాప్ వేరియంట్స్ అయిన బీఈ–6 ప్యాక్–3 ధర రూ.26.90 లక్షలు కాగా ఎక్స్ఈవీ 9ఈ ప్యాక్–3 రూ.30.5 లక్షలు ఉంది. 2024 నవంబర్లో కంపెనీ రెండు మోడళ్లను ఆవిష్కరించి ఎలక్ట్రిక్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవీల ప్రారంభ ధర రూ.18.9 లక్షలు ఉంటుందని వెల్లడించింది. వేరియంట్నుబట్టి బీఈ–6 గరిష్టంగా ఒకసారి చార్జింగ్ చేస్తే 682 కిలోమీటర్లు, ఎక్స్ఈవీ 9ఈ 656 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాగా, నెలకు 5,000 యూనిట్లు విక్రయించాలని మహీంద్రా లక్ష్యంగా చేసుకుంది. చకన్ ప్లాంటు సామర్థ్యాన్ని నెలకు 90,000 స్థాయికి తీర్చిదిద్దుతోంది. దీనిని 1.2 లక్షల యూనిట్లకు పెంచే అవకాశమూ ఉంది. 2021–27 మధ్య ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం రూ.16,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు మహీంద్రా ఇప్పటికే వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లకు ఒకే ప్లాట్ఫామ్ఒకే ప్లాట్ఫామ్ ద్వారా రిటైల్(Retail) ఇన్వెస్టర్లు వివిధ బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలలో ఫిక్స్డ్ డిపాజిట్లు(FD) చేసేందుకు టాటా డిజిటల్ తెరతీసింది. సూపర్యాప్ ‘టాటా న్యూ’ ద్వారా ఇందుకు వీలు కల్పిస్తోంది. కస్టమర్లు పొదుపు ఖాతా లేకుండానే తమ సొమ్మును వివిధ ఫైనాన్షియల్ సంస్థలలో ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించుకోవచ్చునని టాటా డిజిటల్ తెలియజేసింది. గరిష్టంగా 9.1 శాతం వరకూ వడ్డీని ఫైనాన్షియల్ సంస్థలు ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లతో సులభంగా, భద్రంగా సొమ్మును ఎంపిక చేసుకున్న ఫైనాన్షియల్ సంస్థలలో దాచుకునేందుకు తమ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని వివరించింది. రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చని, బ్యాంకులో పెట్టుబడులకు డీఐసీజీసీ(DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకూ డిపాజిట్ బీమా ఉంటుందని తెలియజేసింది. ఎన్బీఎఫ్సీలలో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితరాలున్నట్లు పేర్కొంది. -
ఈ ఏడాది డిమాండ్ ఉండే ఏఐ మోడళ్లు
భవిష్యత్తులో చిన్న, డొమైన్ ఫోకస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడళ్లకు డిమాండ్ ఏర్పడుతుందని టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు తెలిపారు. చిన్న మోడళ్లు తక్కువ వనరులను వినియోగిస్తాయని, దాంతోపాటు సమర్థంగా పనిచేస్తాయని, వేగంగా ఫలితాలు అందిస్తాయని చెప్పారు. ఇంధన వ్యయాలను తగ్గించుకోవాలని, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్ఎంఆర్) వంటి ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన నొక్కి చెప్పారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)-తిరుచ్చి పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2023లో లార్జ్ లాంగ్వేజీ మోడల్స్కు(ఎల్ఎల్ఎం) మంచి అవకాశం వచ్చింది. కానీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దాంతో 2024లో మల్టీమోడల్ ఏఐలకు అపారమైన అవకాశాలు వచ్చాయి. 2025లో ఇందుకు భిన్నంగా స్మాల్ ల్యాంగ్వేజీ మోడళ్లకు భారీగా డిమాండ్ రానుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావాగ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సవాళ్లను ప్రస్తావిస్తూ పారిశ్రామిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల వినియోగం పెరగడం వల్ల ప్రపంచ ఇంధన అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి పెరగాలంటే ఇంధన వ్యయాలు తగ్గించుకోవాలన్నారు. -
విలువలు నేర్పిన అజరామరుడు.. రతన్ టాటా జయంతి నేడు (ఫొటోలు)
-
‘భారత్ మార్కెట్కు కట్టుబడి ఉన్నాం’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఒకటైన భారత్లో కార్యకలాపాల విస్తరణకు కట్టుబడి ఉన్నామని కేఫె చెయిన్ సంస్థ టాటా స్టార్బక్స్ వెల్లడించింది. భారత్ నుంచి స్టార్బక్స్ నిష్క్రమిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 76 నగరాల్లో 470 పైచిలుకు స్టోర్స్ను నిర్వహిస్తున్నట్లు వివరించింది. టాటా గ్రూప్లో ఎఫ్ఎంసీజీ విభాగమైన టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్), అమెరికాకు చెందిన స్టార్బక్స్ కార్పొరేషన్ కలిసి జాయింట్ వెంచర్గా టాటా స్టార్బక్స్ను ఏర్పాటు చేశాయి. నిర్వహణ వ్యయాలు భారీగా ఉండటం, నష్టాలు పెరిగిపోతుండటం, మార్కెట్లో చౌక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా స్టార్బక్స్ భారత్ నుంచి నిష్క్రమించే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.ఇదీ చదవండి: సోలారే సోబెటరూ..రెస్టారెంట్ బ్రాండ్స్ క్విప్నకు సైన్యూఢిల్లీ: రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా లిమిటెడ్(గతంలో బర్గర్ కింగ్ ఇండియా) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల జారీ(క్విప్) చేపట్టనుంది. తద్వారా రూ. 500 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచి్చనట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి ఈక్విటీ షేర్లు లేదా క్విప్నకు వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలియజేసింది. 2024 ఉద్యోగులకు షేర్ల కేటాయింపు(ఇసాప్)నకు సైతం బోర్డు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా అర్హులైన డైరెక్టర్లు, ఉద్యోగులు తదితరులకు స్టాక్ ఆప్షన్లను జారీ చేయనున్నట్లు వివరించింది. ఇసాప్లో భాగంగా దాదాపు 1.05 కోట్ల ఆప్షన్స్ను గరిష్టంగా ఆఫర్ చేసే వీలున్నట్లు తెలియజేసింది. -
పెగాట్రాన్లో వాటాలపై టాటా కన్ను
న్యూఢిల్లీ: యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ పెగాట్రాన్ భారత వ్యాపారంలో వాటాలు కొనుగోలు చేయడంపై టాటా గ్రూప్ దృష్టి సారించింది. పెగాట్రాన్ కార్యకలాపాల్లో సుమారు 60 శాతం వాటాను దక్కించుకోవడంపై టాటా ఎల్రక్టానిక్స్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై గత ఏడాది కాలంగా ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఉత్పత్తుల తయారీలో మార్జిన్లు చాలా తక్కువగా ఉండటం, ప్లాంట్లలో కారి్మకుల డిమాండ్లతో సమస్యలు వస్తున్నా, అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో ఉత్పత్తులను సరఫరా చేయాల్సి రావడం కంపెనీకి సవాలుగా ఉంటోందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాలకు సంబంధించి స్థానిక కంపెనీని భాగస్వామిగా చేసుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. తమిళనాడులో ఉన్న పెగాట్రాన్ ఫ్యాక్టరీలో 10,000 మంది వర్కర్లు ఉండగా, ఏటా యాభై లక్షల ఐఫోన్ల తయారీ సామర్థ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది భారత్లో తయారైన మొత్తం ఐఫోన్లలో 10% ఫోన్లను పెగాట్రాన్ ఉత్పత్తి చేసినట్లు అంచనా. తమిళనాడులోని హోసూర్లో ఏర్పాటు చేసే ప్లాంటు కోసం టాటా, పెగాట్రాన్ జట్టు కట్టనున్నట్లు సమాచారం. టాటా గ్రూప్ ఇప్పటికే మరో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. -
యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలు
భారత్లో యాపిల్ ఉత్పత్తుల తయారీ భాగస్వామిగా ఉన్న పెగాట్రాన్లో 60 శాతం వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఇటీవల ఈమేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. దాంతో భారత్లో యాపిల్ ఉత్పత్తులు తయారీ చేసే కంపెనీల్లో టాటా గ్రూప్ టాప్లో నిలిచింది.యాపిల్ సంస్థ చైనా భయట ఇతర దేశాల్లో తన ఉత్పత్తిని పెంచేలా ఇండియాలో ఉత్పాదకతను పెంచుతోంది. దానికోసం టాటా గ్రూప్, ఫాక్స్కాన్తోపాటు ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. కానీ కొన్ని చిన్న కంపెనీల్లోని మేజర్వాటాను ఇప్పటికే ఈ సంస్థలు కొనుగోలు చేశాయి. టాటా గ్రూప్ యాపిల్ తయారీదారుగా ఉన్న విస్ట్రన్ కంపెనీను ఇప్పటికే కొనుగోలు చేసింది. తాజాగా పెగాట్రాన్ కంపెనీలో 60 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో స్థానికంగా యాపిల్ ఉత్పత్తులను తయారీని పెంచాలని నిర్ణయించింది.తయారీదారుగా ఉండడం తేలికైన విషయం కాదు..పెగాట్రాన్, టాటా గ్రూప్నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గత ఏడాది కాలంగా ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘యాపిల్కు కాంట్రాక్ట్ తయారీదారుగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. తయారీపై మార్జిన్లు కూడా అధికంగానే ఉంటాయి. యాపిల్ ఉత్పత్తుల అధునాతన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కంపెనీలు అత్యున్నత స్థాయితో ఉత్పత్తి చేపట్టాల్సి ఉంటుంది. నిత్యం నాణ్యతను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నందున ఉత్పత్తిలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదు’ అని యాపిల్ ఉత్పత్తుల తయారీ వ్యవస్థలో భాగమైన ఒక ఉన్నత అధికారి తెలిపారు. టాటా గ్రూప్ ఇప్పటికే భారత్లో ఐఫోన్ 16 తయారీని ప్రారంభించింది.ఇదీ చదవండి: ‘సామాన్యుడిపై భారం తగ్గించండి’పెగాట్రాన్ ఉత్పత్తి సామర్థ్యంపెగాట్రాన్ గత సంవత్సరం దేశీయంగా వినియోగిస్తున్న ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 10 శాతం సహకారం అందించింది. ఈ కంపెనీకి తమిళనాడులో తయారీ యూనిట్ ఉంది. ఇందులో దాదాపు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ యూనిట్ ఏటా ఐదు మిలియన్ల ఐఫోన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. -
గుడ్బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటన
ఎయిరిండియాలో విలీనానికి ముందు నడిచిన చివరి విస్తారా ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్లో విమాన సిబ్బంది ‘గుడ్బై విస్తారా’ అంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఇటీవల నడిచిన చివరి విస్తారా ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ కెప్టెన్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.కెప్టెన్ సుధాన్షు రైక్వార్, నేహల్ చేసిన ప్రకటనకు సంబంధించిన షార్ట్ క్లిప్ను ఎక్స్ వేదికలో పంచుకున్నారు. ‘చివరి విస్తారా సర్వీస్ బ్రాండ్గా మీకు అత్యుత్తమ భద్రత, సేవలను అందించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాం. కొన్నేళ్లుగా విస్తారా వివిధ ఖండాల్లో విస్తరించి, విభిన్న సంస్కృతులు కలిగిన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. అంకితభావం, భద్రత, విశ్వసనీయతతో మీకు సేవ చేయడం మా లక్ష్యం. విస్తారా చివరి సర్వీస్ ఈ రోజు మేము అదే ఉన్నత ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం. గుడ్బై విస్తారా. మేము ఎంతో మిస్ అవుతాం’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.Captain Capt Sudhanshu Raikwar and First Officer @Nehal_404 made an emotional yet confident announcement yesterday, marking their final flight as cockpit crew with @airvistara . #Aviation #Avgeek #Pilot #vistaraflight #Vistara https://t.co/G3rvMkTSRE pic.twitter.com/OvmZSmA2JT— Aman Gulati 🇮🇳 (@iam_amangulati) November 12, 2024ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓపదేళ్లుగా కార్యకలాపాలు సాగించిన విమానయాన సంస్థ విస్తారా నవంబర్ 11 నుంచి తన సేవలు నిలిపేసింది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ సంయుక్త యాజమాన్యంలోని విస్తారా నవంబర్ 11 నుంచి ఎయిరిండియా ఎయిర్లైన్స్లో విలీనం అవుతుంది. ఈ విలీనం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా సర్వీసులో ఉన్న పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తారా, ఎయిరిండియాలో పనిచేస్తున్న పైలట్ల రిటైర్మెంట్ వయసే అందుకు కారణమని తెలియజేశారు.నవంబర్ 11 నుంచి విస్తారా ఎయిర్లైన్స్ ఎయిరిండియాలో విలీనం అవుతుంది. ఈమేరకు గతంలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఎయిరిండియా పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పైలట్ల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఇప్పటివరకు విస్తారాలో పని చేసిన పైలట్లు రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగా ఉంది. ఒకే సంస్థలో, ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసులో తేడా ఉండడంపై ఎయిరిండియా పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు తమకు 65 ఏళ్లు వచ్చేవరకు సేవ చేయవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఎయిరిండియా ఎంపిక చేసిన పైలట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదవీ విరమణ తర్వాత 65 ఏళ్ల వరకు సర్వీసు పొడిగించే పాలసీని ప్రకటించింది.ఇదీ చదవండి: పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!రూ.2,058.50 కోట్ల డీల్పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఈరోజు నుంచి కనుమరుగు కానుంది. నవంబర్ 11 నుంచి విస్తారా సేవలు నిలిపేయనుంది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
లాభాల్లో దూసుకెళ్లిన టాటా గ్రూప్ కంపెనీ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్) సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి పటిష్ట పనితీరు చూపించింది. లాభం మూడు రెట్లు పెరిగి రూ.583 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.179 కోట్లుగానే ఉంది.విమానయాన, సంస్థాగత కేటరింగ్ సేవల విభాగం ‘తాజ్శాట్స్’ స్థిరీకరణతో ఏకీకృత ఆర్జన (రూ.307కోట్లు) తోడు కావడం లాభంలో అధిక వృద్ధికి దారితీసింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,433 కోట్ల నుంచి రూ.1,826 కోట్లకు పెరిగింది. వ్యయాలు సైతం రూ.1,249 కోట్ల నుంచి రూ.1,502 కోట్లకు పెరిగాయి.‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ త్రైమాసికంలో డిమాండ్ బలంగా పుంజుకుంది. దీంతో ఆదాయం 28 శాతం పెరిగింది. హోటల్ విభాగంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెందింది. దీంతో క్యూ2లో ఇప్పటి వరకు అత్యుత్తమ ఎబిట్డా మార్జిన్ 29.9 శాతం నమోదైంది’’అని ఐహెచ్సీఎల్ ఎండీ, సీఈవో పునీత్ ఛత్వాల్ తెలిపారు. 2024–25 సంవత్సరానికి రెండంకెల ఆదాయ వృద్ధి అంచనాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలోని ల్యాండ్మార్క్ హోటల్ ‘క్లారిడ్జ్’ను 2025 ఏప్రిల్లో స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిపారు. -
నోయల్ టాటా ఎంట్రీ: ఒకేసారి రెండు బోర్డులలో..
దివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే తాజాగా ఆయన టాటా సన్స్ బోర్డులో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా వెల్లడించింది.2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. టాటా సన్స్లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు.ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇకపైన టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించనున్నారు.ఎవరీ నోయల్ టాటానోయల్ టాటా.. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. టాటా ఇంటర్నేషనల్లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్కి మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. నోయల్ టాటా గ్రూపుతో 40 సంవత్సరాల అనుభవం ఉంది. కంపెనీలోని వివిధ బోర్డుల్లో వివిధ పదవులను నిర్వహించారు. అప్పటికి కేవలం ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్.. నోయల్ సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్సైడ్ రిటైల్ చెయిన్ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుంచి 3 బిలియన్ డాలర్లకు ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్గా, టాటా స్టీల్, టైటాన్లకు వైస్ చైర్మన్గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. -
టాటా సంస్థల త్రైమాసిక ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా టెక్నాలజీస్ నికర లాభం సుమారు రెండు శాతం తగ్గి రూ.157 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో ఇది రూ.162 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం రూ.1,269 కోట్ల నుంచి రూ.1,296 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,086 కోట్ల నుంచి రూ.1,095 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన సర్వీసుల వ్యాపార విభాగం పుంజుకుందని, 2 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేసిందని సంస్థ సీఈవో వారెన్ హ్యారిస్ తెలిపారు. ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉందని, ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత మెరుగ్గా ఉండగలదని ఆయన వివరించారు. టాటా పవర్.. ఫర్వాలేదుటాటాపవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగి రూ.1,093 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,017 కోట్లుగా ఉంది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.16,029 కోట్ల నుంచి రూ.16,211 కోట్లకు చేరింది. ‘ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రెన్యువబుల్ వ్యాపారం స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అన్ని విభాగాలు చెప్పుకోతగ్గ మేర పనితీరు చూపించాయి. దీంతో వరుసగా 20వ త్రైమాసికంలోనూ నికర లాభాన్ని నమోదు చేశాం. భారత్లో తయారీ లక్ష్యానికి అనుగుణంగా తమిళనాడులో మేము చెపట్టిన 4.3 గిగావాట్ సెల్ అండ్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా.. 2 గిగావాట్ సెల్ తయారీ సెప్టెంబర్ క్వార్టర్లో మొదలైంది. వచ్చే నెల చివరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి తయారీ పెరగనుంది’ అని టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!పూర్తి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్ల మూలధన వ్యయాల ప్రణాళిక ప్రకటించగా.. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.9,100 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ తయారీ, హైడ్రో ప్రాజెక్టులపై తాము చేస్తున్న పెట్టుబడులతో దేశ ఇంధన సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు. బీఎస్ఈలో టాటా పవర్ 1 శాతం లాభపడి రూ.445 వద్ద ముగిసింది. -
రతన్ టాటా గౌరవార్థం: లండన్లో..
దేశం కోసం వేలకోట్లు ఉదారంగా దానం చేసిన దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తాయి. ఈ గౌరవంతోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో నిర్మించనున్న భవనానికి 'రతన్ టాటా' పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ భవన నిర్మాణ పనులు 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ భవనాన్ని రాడ్క్లిఫ్ అబ్జర్వేటరీ క్వార్టర్లో.. టాటా గ్రూప్, సోమర్విల్లే కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్మించనున్నాయి. దీని ద్వారా బోధన, విద్యాకార్యకలాపాల నాణ్యతను మెరుగుపరుస్తారు. ఇది అవసరమైన పరిశోధనలకు నిలయంగా ఉంటుంది.సోమర్విల్లే కాలేజ్, రతన్ టాటా మధ్య దశాబ్ద కాలంగా ఉన్న స్నేహం వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. దీనిని లండన్కు చెందిన ఆర్కిటెక్ట్ మోరిస్ కో డిజైన్ చేయనున్నట్లు సమాచారం. రతన్ టాటా పేరుతో భవనాన్ని నిర్మించానికి లండన్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది.రతన్ టాటా పేరుతో భవన నిర్మాణం ప్రకటన తరువాత, సోమర్విల్లే కళాశాల ప్రిన్సిపాల్ బారోనెస్ రాయల్ మాట్లాడుతూ.. ఈ భవనం గత దశాబ్దంలో అనేక సంభాషణలు, ఆశలు, కలల ఫలం. టాటాతో మా సుదీర్ఘ అనుబంధానికి చిహ్నం అని అన్నారు. ఇది ఒక గొప్ప వ్యక్తి, సోమర్విల్లే ప్రియమైన స్నేహితుడి జీవితానికి శాశ్వత వారసత్వంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. సోమర్విల్లే కళాశాలతో ఈ సహకారం రతన్ టాటా విలువలకు నివాళి అని అన్నారు. -
క్విక్ కామర్స్లోకి టాటా గ్రూప్?
టాటా గ్రూప్ క్విక్ కామర్స్ రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఫ్లిప్కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ధీటుగా టాటా గ్రూప్ ‘న్యూఫ్లాష్’ పేరుతో ఈ సేవలు ప్రారంభించనుంది. ఈ సర్వీసును ముందుగా మెట్రో నగరాల్లో అందించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇప్పటికే టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బిగ్బాస్కెట్ ద్వారా వినియోగదారులకు ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది.క్విక్ కామర్స్ బిజినెస్కు వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దాంతో ప్రముఖ కంపెనీలు ఈ రంగంలో సేవలందించేందుకు పూనుకుంటున్నాయి. ఇప్పటికే జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో ఈ క్విక్ కామర్స్ సేవలందిస్తున్నాయి. మొత్తంగా ఈ కంపెనీలు 85% మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ మినిట్స్ పేరుతో ఈ సేవలందిస్తోంది. రిలయన్స్ జియోమార్ట్ ఎక్స్ప్రెస్ పేరుతో ముంబయిలో ఈ సర్వీసు అందుబాటులో ఉంచింది. ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం రిలయన్స్ రిటైల్, డీమార్ట్, స్పెన్సర్స్ వంటి రిటైల్ బిజినెస్ కంటే క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దాంతో ఇప్పటికే కొన్ని రిటైల్ సర్వీసులు అందించే కంపెనీలు ఈ బిజినెస్లోకి ప్రవేశిస్తున్నాయి. టాటా గ్రూప్ కూడా వినియోగదారులను పెంచుకుని ఈ విభాగంలో సేవలందించాలని భావిస్తోంది.ఇదీ చదవండి: పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే..టాటా గ్రూప్ బిగ్బాస్కెట్ ద్వారా ఈ-కామర్స్, క్రోమా ద్వారా ఎలక్ట్రానిక్స్, టాటా క్లిక్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ సేవలు, టాటా 1ఎంజీ ద్వారా ఫార్మసీ సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాపారాల్లో సంస్థకు వినియోగదారులు ఉండడంతో కొత్తగా రాబోయే టాటా న్యూ ఫ్లాష్ బిజినెస్కు కూడా వీరి సహకారం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. -
Ratan Tata: పెంపుడు కుక్క టిటో, పనిమనిషికి కూడా..
ముంబై: పారిశ్రామికవేత్త రతన్ టాటా తన దాతృత్వాన్ని చనిపోయాక కూడా చాటుకున్నారు. తన రూ.10 వేల కోట్ల ఆస్తుల్లో తోబుట్టువులకే కాదు, పెంపుడు శునకం టిటో, పనిమనిషి సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు కూడా వాటాలు పంచుతూ వీలునామా రాశారు. టాటా గ్రూప్ చైర్మన్ మాతృసంస్థ టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ నెల 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. తనకెంతో ప్రీతిపాత్రమైన జర్మన్ షెపర్డ్ శునకం టిటో సంరక్షణ బాధ్యతలను జీవితకాలం పాటు వంట మనిషి రజన్ షా చూసుకోవాలని కోరారు. ఆస్తుల్లో సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, డియానా జీజాభాయ్లకు కొంత కేటాయించారు. టాటా సన్స్లో వాటాను రతన్ టాటా ధార్మిక ఫౌండేషన్కు బదిలీ చేయాలని కోరారు. విల్లుపై బాంబే హైకోర్టు విచారణ జరపనుందని అధికారులు తెలిపారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు చెందిన గుడ్ఫెలోస్లో పెట్టిన పెట్టుబడిని వదిలేయాలని, విదేశాల్లో చదువుకునేందుకు నాయుడుకిచ్చిన రుణం మాఫీ చేయాలని వీలునామాలో తెలిపారు. -
టాటా కంపెనీకి షోకాజ్ నోటీసులు
ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ హెల్త్ అండ్ సేఫ్టీ (డీఐఎస్హెచ్) టాటా ఎలక్ట్రానిక్స్కు షోకాజ్ నోటీసు అందజేసింది. గత నెల 28న తమిళనాడులోని టాటా యూనిట్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి వివరణ ఇవ్వాలని డీఐఎస్హెచ్ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కంపెనీ ప్రతినిధులు వారంలోపు స్పందించాలని తెలిపింది.ఫ్యాక్టరీల చట్టం ప్రకారం..ఫ్యాక్టరీ వ్యవహారాలపై అంతిమ అధికారం కలిగి ఉన్న వ్యక్తి కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టప్రకారం ఆ వ్యక్తిని ‘ఆక్యుపైయర్’గా పరిగణిస్తారు. కంపెనీ డైరెక్టర్లు లేదా సంస్థ ప్రతిపాదించిన వ్యక్తి ఈ హోదాలో ఉండవచ్చు. కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆక్యుపైయర్ తెలియజేయాల్సి ఉంటుంది. ప్రమాదానికిగల కారణాలు చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగిందో వివరించడానికి కంపెనీకి ఒక అవకాశం కల్పించడం కోసం ఇలా ఈ షోకాజు నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..ఇప్పటికే డీఐఎస్ఎహెచ్ ప్రమాదానికిగల కారణాలను అంచనా వేసిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. తమిళనాడు హోసూర్లోని టాటా ఎలక్ట్రానిక్స్కు చెందిన యానోడైజింగ్ ప్లాంట్లో థర్మోస్టాట్ నియంత్రణ వైఫల్యం కారణంగా మంటలు చెలరేగాయని కంపెనీ అధికారులు చెప్పారు. ఈ యూనిట్లో యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది. -
జాబ్ లేదా? ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు!
టాటా గ్రూప్ వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ను తెలిపారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ తయారీ విభాగాల్లో ఉద్యోగార్థులకు అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ అనే అంశంపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత్ లక్ష్యానికి తయారీ రంగం కీలకంగా మారుతుంది. ఈ రంగంలో రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉంది. ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు కల్పించలేకపోతే కేంద్ర ప్రభుత్వం తలంచిన వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోలేము. తయారీ రంగం వృద్ధి దిశగా టాటా గ్రూప్ సంస్థలు వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెంచుతోంది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ రంగాల్లో విభిన్న పరికరాలను తయారు చేసేలా టాటా గ్రూప్ చర్యలు చేపడుతోంది. అందుకోసం రాబోయే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ న్యూక్లియర్ పవర్ కొనుగోలుటాటా గ్రూప్ అస్సాంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్లు ఉన్నాయి. తయారీ రంగం వృద్ధి చెందితే దేశ దిగుమతులు తగ్గుతాయి. అందుకు అనుగుణంగా ఎగుమతులు అధికమవుతాయి. ఫలితంగా రూపాయి విలువ పెరుగుతుంది. దాంతోపాటు ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గుతుంది. దేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే లేఆఫ్స్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. దానికి బదులుగా ఉత్పాదకతను పెంచి ఎగుమతులను మెరుగుపరిస్తే ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగార్థులు కంపెనీలు ఆశించే నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. -
రతన్ వారసుడు నోయెల్
ముంబై: అంతా ఊహించినట్లే టాటా ట్రస్ట్స్ పగ్గాలు రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా (67) చేతికే లభించాయి. టాటా ట్రస్ట్స్తో పాటు అందులో భాగమైన మిగతా ట్రస్ట్లన్నింటికి కూడా చైర్మన్గా ట్రస్టీలు శుక్రవారం జరిగిన సమావేశంలో నోయెల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాటా గ్రూప్తో పాటు జాతి నిర్మాణంలోనూ దివంగత రతన్ టాటా కీలక పాత్ర పోషించారని, ఎనలేని సేవలందించారని ట్రస్టీలు నివాళులరి్పంచారు. టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. నోయెల్ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ‘రతన్ టాటా, అలాగే టాటా గ్రూప్ వ్యవస్థాపకులు అందించిన ఘన వారసత్వాన్ని ఇకపైనా కొనసాగిస్తాము. అభివృద్ధి, దాతృత్వ కార్యకలాపాలను కొనసాగిస్తూ జాతి నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించడానికి పునరంకితమవుతాము‘ అని ఈ సందర్భంగా నోయెల్ తెలిపారు.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వారసుడిని ఎన్నుకునేందుకు టాటా ట్రస్ట్స్ ట్రస్టీలు సమావేశమయ్యారు. 165 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం పరోక్షంగా టాటా ట్రస్ట్స్ నియంత్రణలో ఉంటుంది. టాటా ట్రస్ట్స్ కింద సర్ రతన్ టాటా ట్రస్ట్ .. దాని అనుబంధ ట్రస్టులు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్.. దాని అనుబంధ ట్రస్ట్లు ఉన్నాయి. వీటన్నింటికి టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ సంస్థ, ప్రమోటర్ అయిన టాటా సన్స్లో 66 శాతం వాటాలు ఉన్నాయి. ఇప్పటివరకు రతన్ టాటా నీడలో ఉన్న నోయెల్ టాటా ఇకపై సొంతంగా వీటి బాధ్యతలను చేపట్టనున్నారు. ముగ్గురు సంతానం.. టాటా సన్స్లో 18.4 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన ఆలూ మిస్త్రీని నోయెల్ వివాహం చేసుకున్నారు. ఆమె టాటా సన్స్ మాజీ చైర్మన్, దివంగత సైరస్ మిస్త్రీ సోదరి. నోయెల్, ఆలూకి ఇద్దరు కుమార్తెలు (లియా, మాయా), ఒక కుమారుడు (నెవిల్) ఉన్నారు. పెద్ద కుమార్తె లియా టాటా ప్రస్తుతం ఇండియన్ హోటల్స్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. చిన్న కుమార్తె మాయా తన ప్రొఫెషనల్ కెరియర్ను టాటా ఆపర్చూనిటీస్ ఫండ్తో ప్రారంభించారు. తర్వాత టాటా డిజిటల్కి మారారు. టాటా న్యూ యాప్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. నెవిల్ టాటా తన వ్యాపార నైపుణ్యాలతో జుడియో బ్రాండ్ను విజయవంతం చేశారు. ట్రెంట్, స్టార్ బజార్లను పర్యవేక్షిస్తున్నారు. వ్యాపార దిగ్గజం విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి కిర్లోస్కర్ను వివాహం చేసుకున్నారు.నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్లో...ఐరిష్ పౌరసత్వం ఉన్న నోయెల్ టాటా గత నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్లో ఉన్నారు. ఆయన అంతగా బైటికి కనిపించరు. రతన్ టాటా తండ్రి నావల్ టాటాకు సూనూ, సిమోన్ అని ఇద్దరు భార్యలు. వారిలో సూనూ టాటా కుమారులు రతన్ టాటా, జిమ్మీ టాటా కాగా మరో భార్య సిమోన్ కుమారుడే నోయెల్ టాటా. ఆయన ససెక్స్ యూనివర్సిటీలో (యూకే) గ్రాడ్యుయేషన్ చేశారు. ఇన్సీడ్లో (ఫ్రాన్స్) ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం చేశారు. టాటా ఇంటర్నేషనల్లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్కి మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అప్పటికి ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్ .. ఆయన సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్సైడ్ రిటైల్ చెయిన్ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది. 2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుండి 3 బిలియన్ డాలర్ల స్థాయి కి ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్గా, టాటా స్టీల్, టైటాన్లకు వైస్ చైర్మన్గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. అలాగే 2019 నుంచి టాటా ట్రస్టుల్లో ట్రస్టీగా కూడా ఉన్నారు. స్మిత్స్ పీఎల్సీ, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ కంపెనీల బోర్డుల్లోనూ నోయెల్ ఉన్నారు. -
వారసుడొచ్చాడు.. టాటా ట్రస్ట్ ఛైర్మన్ నియామకం
టాటా ట్రస్ట్ ఛైర్మన్గా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. టాటా సామ్రాజ్యానికి కీలకమైన దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్న టాటా ట్రస్టుకు అధిపతిని నియమించేందుకు శుక్రవారం సభ్యులు సమావేశమయ్యారు. అందులో రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.టాటా స్వచ్ఛంద సంస్థలకు బోర్డు ట్రస్టీగా ఉన్న మెహ్లీ మిస్త్రీ కూడా కీలక పదవిని పొందేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు టాటా ట్రస్ట్కు ఛైర్మన్గా ఉన్న రతన్టాటా(86) ఆరోగ్య సమస్యలతో మరణించడంతో తన స్థానంలో తదుపరి ట్రస్ట్ పగ్గాలు చేపట్టేది ఎవరనే చర్చసాగింది. బోర్డు సభ్యులు నోయెల్ టాటాను ఎకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చర్చలకు తెరపడినట్లయింది.రతన్ టాటా వివాహం చేసుకోలేదు. వారసులు లేకపోవడంతో తన సోదరుడు నోయెల్ టాటా ట్రస్ట్ పగ్గాలు చేపట్టాల్సి వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నవల్ టాటా, సిమోన్ టాటా దంపతులకు 1957లో నోయెల్ టాటా జన్మించారు. అతను ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫ్రాన్స్లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్కు ఎంపికయ్యారు. నోయెల్ టాటా గ్రూప్లో వివిధ నాయకత్వ హోదాల్లో విధులు నిర్వహించారు.ఇదీ చదవండి: టెస్లా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్ ఆవిష్కరణట్రెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్గా కూడా పనిచేశారు. 2010-2021 మధ్య అతని నాయకత్వంలో ఉన్న టాటా ఇంటర్నేషనల్ ఆదాయాన్ని 500 మిలియన్ డాలర్లు(రూ.4200 కోట్లు) నుంచి మూడు బిలియన్ డాలర్లు(రూ.25 వేలకోట్లు)కు చేర్చారు. 1998లో ట్రెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఒకే రిటైల్ స్టోర్ ఉండేది. దాన్ని దేశంవ్యాప్తంగా వ్యాపింపజేసి 700 స్టోర్లకు పెంచారు. -
టాటా జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం
రతన్ టాటా మరణంపట్ల వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలు, భవిష్యత్తు తరాలు తన జీవితం నుంచి గ్రహించాల్సిన అంశాల గురించి చెప్పారు.చెరగని ముద్రరతన్టాటా మరణం బాధాకరం. అత్యుత్తమ నాయకత్వం, దార్శనికత కలిగిన వ్యాపారవేత్త, దాతృత్వవాదిగా ఆయన సేవలు మన సమాజంపై చెరగని ముద్ర వేశాయి. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆయన ప్రభావితం చేసిన వ్యక్తులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రిఆయన సేవలు అజరామరంరతన్టాటాజీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. గొప్ప జాతీయవాది, దార్శనిక వ్యాపారవేత్త, టాటా గ్రూప్ చైర్పర్సన్గా తన అసాధారణ విజయాలతో భారత్కు గొప్ప పేరు తీసుకొచ్చారు. చివరి శ్వాస వరకు సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మక పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి (రోబో కారును ఆవిష్కరించిన టెస్లా)శతాబ్దానికి ఒక్కరు..టాటా ఓ గొప్ప వ్యాపార నాయకుడు. దేశాలు ఇలాంటి నేతలను శతాబ్దానికి ఒక్కరినే పొందుతాయి. టాటా గ్రూపు వృద్ధికి మించి ఆయన అభిరుచి కొనసాగింది. దాతృత్వ కార్యక్రమాల ద్వారా లక్షలాది భారతీయులకు సేవలు అందించారు – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్స్ గౌరవ చైర్మన్ ఆయన సేవలు అసమానం..ప్రపంచం అచ్చమైన దార్శనికుడు, మానవతావాదిని కోల్పోయింది. వ్యాపారం, సమాజానికి ఆయన అందించిన అసమానమైన సేవలు ఆయన వారసత్వంగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. – సంజీవ్ గోయెంకా, ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్ పరిశ్రమలు, ప్రజా జీవితాలపై ముద్రవ్యాపారాలన్నవి ఆర్థికాభివృద్ధికే కాదు, సామాజిక పురోగతికి ఉ్రత్పేరకాలూ అని నిరూపించారు. ఆయన నిర్ణయాలు ఆర్థిక అంశాలకు మించి పరిశ్రమలు, ప్రజా జీవితాలను ప్రభావితం చేశాయి. ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. – కుమారమంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ (ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటా)ఒక వ్యక్తి కాదు సంస్థరతన్ టాటా భారత్కు చెందిన ప్రముఖ, గొప్ప వ్యాపారవేత్తే కాదు, ఆయనొక సంస్థ. టాటాను అంతర్జాతీయంగా విస్తరించడం ద్వారా టాటా వారసత్వంలో ఎన్నో శాశ్వత అధ్యాయాలు లిఖించారు. భారతీయుల్లో ఆయన ఎప్పుడూ జీవించే ఉంటారు. – జీపీ హిందుజా, హిందుజా గ్రూప్ చైర్మన్ఎయిర్ఇండియాతో కలసి నడుస్తాంమిస్టర్ టాటాకు విమానయానం పట్ల ఉన్న ప్రేమ, భారత విమానయాన భవిష్యత్తు పట్ల ఆయన దూరదృష్టికి నివాళిగా, అంతర్జాతీయ విమానయాన రంగంలో భారత్కు సముచిత స్థానం కోసం ఎయిర్ ఇండియాతో కలసి నడుస్తాం. – రాహుల్ భాటియా, ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఇండిగో) ఎండీ ఆయన వారసత్వం శాశ్వతంరతన్ టాటా మరణం పట్ల మేము ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన దార్శనిక నాయకత్వం, భారత పరిశ్రమలకు అందించిన సేవలతో ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. – ఉన్సూకిమ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీప్రపంచ శక్తిగా టాటా గ్రూప్ను నిలబెట్టారురతన్ టాటా అందించిన నాయక త్వం కార్పొరేట్ బాధ్యత, ఆవిష్కరణలను పునర్నిర్వచించింది. నైతిక విలువలే పునాదిగా టాటా గ్రూప్ను ప్రపంచశక్తిగా నిలిపింది. ఆయణ మరణం పట్ల చింతిస్తున ఈ వేళ.. భారత్ నిర్మాణానికి గణనీయంగా దోహదపడిన ఆయన వారసత్వం, విలువలను గౌరవిస్తున్నాం. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ భారత ప్రగతిలో గొప్ప పాత్రభారత ఆర్థిక వ్యవస్థ చరిత్రాత్మకంగా ముందుకు దూసుకుపోతున్న స్థితిలో ఉంది. టాటా జీవితం, పని ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడంలో గొప్ప పాత్ర పోషించాయి. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆధునిక వ్యాపార మార్గదర్శి అసాధారణమైన వ్యాపార, దాతృత్వ వారసత్వాన్ని ఆయన వదిలి వెళ్లారు. భారత్లో ఆధునిక వ్యాపారాలకు మార్గదర్శకత్వం, అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం. – సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవో(చరిత్ర మరువదు.. మీ ఘనత)భారత స్ఫూర్తి ప్రదాత రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడే కాదు. భారత స్ఫూర్తి, సమగ్రత, కరుణ, గొప్ప మేలు కోసం తిరుగులేని నిబద్ధత మూర్తీ భవించిన నేత – గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ అధినేత రోల్ మోడల్ ప్రియమైన స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధిస్తోంది. విలువలతో కూడిన నాయకత్వం విషయంలో రతన్టాటా నాకు రోల్ మోడల్. నైతిక సమస్యల విషయంలో సందిగ్ధత ఎదుర్కొన్నప్పుడు ఆయన నాకు దిక్సూచిగా నిలిచారు. – నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ప్రతీ భారతీయుడికి చిహ్నం రతన్టాటా మరణంతో భారత పరిశ్రమ తన కిరీటంలో ఆభరణాన్ని మాత్రమే కోల్పోలేదు, ఆయన దార్శనికత మరియు అత్యుత్తమ వ్యక్తిగత లక్షణాలు ప్రతి భారతీయుడికి చిహ్నంగా మారాయి. విలువను సృష్టించడం ఒకరి కోసం కాదు, దేశ పురోగతికి, గొప్ప ప్రయోజనం కోసం అన్న ఆయన ఆచరణ నాకు స్ఫూర్తినిచ్చింది. – అనిల్ అగర్వాల్, వేదాంత చైర్మన్ సమాజానికి తిరిగిచ్చారు.. గౌరవనీయ వ్యాపారవేత్త. సమాజానికి తిరిగిస్తానన్న హామీకి అనుణంగా జీవించారు. యువతరానికి ఆయన స్ఫూర్తి. – ప్రియా అగర్వాల్ హెబ్బర్, హిందుస్థాన్ జింక్ చైర్పర్సన్ చిరకాల ముద్ర.. మిస్టర్ టాటా మరణం ఒక శకానికి ముగింపు. టాటా గ్రూప్ ప్రస్థానంపై చిరకాల ముద్ర వేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. టాటా గ్రూప్, రతన్టాటాతో మిస్త్రీ కుటుంబానికి దీర్ఘకాల అనుబంధం ఉంది. – షాపూర్జీ మిస్త్రీ, ఎస్పీ గ్రూప్ చైర్మన్ -
ఐదేళ్లలో ఏయే టాటా షేరు ఎంత పెరిగిందంటే..
టాటా గ్రూప్ విలువను రతన్ టాటా సారథ్య పగ్గాలు చేపట్టిన తర్వాత పరుగు పెట్టించారు. రూ.10 వేలకోట్లుగా ఉన్న సంస్థల విలువను ఏకంగా రూ.30 లక్షల కోట్లకు చేర్చారు. అంతకుమించి ప్రజల్లో తన సేవానిరతితో చేరిగిపోని చోటు సంపాదించారు. గత ఐదేళ్లలో కంపెనీ షేర్లు ఎంత శాతం పెరిగాయో తెలుసుకుందాం.ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాటాటా గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీల పరుగు..కంపెనీ పేరు షేరు ర్యాలీ(%)టాటా టెలీసర్వీసెస్ 3002 ఆటోమోటివ్ స్టాంపింగ్స్ 2211 ట్రెంట్ 1499 టాటా ఎలక్సీ 1109 టాటా ఇన్వెస్ట్మెంట్ 820 టాటా పవర్ 686 టాటా మోటార్స్ 628 టీఆర్ఎఫ్ 489 టాటా కమ్యూనికేషన్స్ 453 ఓరియంటల్ హోటల్స్ 391 ఇండియన్ హోటల్స్ 376 టాటా స్టీల్ 362 టాటా కెమికల్స్ 347 నెల్కో 333 టాటా కన్జూమర్ 304 టైటన్ కంపెనీ 176 వోల్టాస్ 165 టీసీఎస్ 111 ర్యాలీస్ ఇండియా 81 -
ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటా
రతన్ టాటా సమాజానికి చేసిన సేవ ఎనలేనిది. టాటా గ్రూప్ సంపదలో సగానికిపైగా టాటా ట్రస్ట్కు విరాళంగా అందజేస్తున్నారు. దాని ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రాజకీయాలు, అవినీతికి దూరంగా ఉండే రతన్ టాటా జీవితం ఎంతో మందికి అనుసరణీయం. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పెద్ద వయసులో తాను ఎలా సమయం గడిపారో తెలిపారు. ఎవరైనా తనను మంచి సలహా ఇవ్వమని అడిగితే ఏం చెబుతారో వివరించారు.ఇంటర్వ్యూలో టాటా మాట్లాడుతూ..‘చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నా. వారి నుంచి నిత్యం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఎనిమిది పదుల వయసు దాటాక కూడా విద్యార్థిగానే ఉన్నాను. ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎవరూ సంపూర్ణ విజ్ఞానం కలిగి ఉండరు. ఎవరైనా మంచి సలహా ఇవ్వాలని అడిగితే..మంచిసలహా అనేది సమయాన్ని బట్టి మారుతుంటుంది. కానీ మంచి పని చేయాలన్న తపన మాత్రం ఎప్పటికీ మారకుండా ఉంటుంది. అందుకే..సలహాల సంగతి ఆపేసి కష్టమైనా సరే సరైన పని చేయడంపై దృష్టి సారించాలని చెబుతుంటా! ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే..సరైన పని చేయడమే కీలకమైందని అర్థమవుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’వివిధ సందర్భాల్లో రతన్ టాటా చెప్పిన మాటలు కొన్ని..జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదొడుకులు ఉండటం చాలా ముఖ్యం. ఈసీజీలో సరళ రేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం.కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడిలేదని ప్రతివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తారు. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషమూ ఉంది.తన కోసం పని చేస్తున్న వారి మేలు కోరే వాడే ఉత్తమ నాయకుడు.వృత్తిని – జీవితాన్ని సమతులం చేయడంపై నాకు నమ్మకంలేదు. వృత్తిని – జీవితాన్ని మమేకం చేయాలి. మీ వృత్తిని, జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవాలి.ఏ ఇబ్బందినీ స్వీకరించకపోవడమే పెద్ద ప్రమాదం. అతి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాల్నూ స్వీకరించలేకపోతే అపజయం తప్పదు.ఎన్ని కష్టాలనైనా పట్టుదలతో ఎదుర్కోండి. అవే మీ విజయానికి పునాది రాళ్లు.ఎదుటివాళ్ల దయా గుణాన్ని, ప్రేమను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకండి.మీ జీవితం సాఫీగా ఉండకపోవచ్చు. సమాజంలోని సమస్యలను పరిష్కరించ లేకపోవచ్చు. అలాగని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువగా అంచనావేయొద్దు. ధైర్యం, నమ్మకం మనకో దారి చూపిస్తాయి.అవకాశాల కోసం ఎదురు చూడకూడదు. అవకాశాల్ని సృష్టించుకోవాలి.నాయకత్వమంటే బాధ్యత తీసుకోవడం.సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు దృష్టి లేదు. నిర్ణయం తీసుకొని దానిని విజయవంతం చేయడమే నా పని.విజయం అనేది నీవు చేపట్టిన పదవిపై ఆధారపడి ఉండదు. నీవు ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తున్నావన్న దానిపై ఆధారపడి ఉంటుంది. -
చరిత్ర మరువదు.. మీ ఘనత
ముంబై: ‘‘ఈ స్నేహంలో అగాధం ఇప్పుడు నాతో ఉండిపోయింది. నా మిగిలిన జీవిత కాలంలో దీన్ని పూరించేందుకు కృషి చేస్తాను’’అంటూ శంతను నాయుడు తన స్పందనను వ్యక్తం చేశారు. 31ఏళ్ల ఈ యువకుడు రతన్టాటాకు అత్యంత విశ్వసనీయ సహచరుడు. వృద్ధాప్యంలో ఆయన బాగోగులు చూసుకున్న ఆప్త మిత్రుడు. రతన్టాటా అంతిమయాత్ర వాహనం ముందు యెజ్డీ మోటారుసైకిల్ నడుపుతున్న శంతనునాయుడిని చూసే ఉంటారు. ‘‘దుఃఖం అనేది ప్రేమకు చెల్లించాల్సిన మూల్యం. గుడ్బై, నా ప్రియమైన దీపస్తంభం’’అంటూ చిన్న పోస్ట్ పెట్టాడు. టాటా గ్రూప్లో ఐదవ తరం ఉద్యోగి శంతనునాయుడు. 2014లో రతన్టాటా, శంతను కలుసుకున్నారు. వీధి శునకాల పట్ల ప్రేమ వీరిద్దరినీ కలిపిందని చెప్పుకోవాలి. వీధి శునకాలు రాత్రి వేళల్లో వాహన ప్రమాదాలకు గురి కాకుండా, వాటి కోసం మెరిసే కాలర్లను శంతను డిజైన్ చేశాడు. కుక్కల మెడలో ఈ కాలర్ను ఉంచితే, రాత్రివేళ వాహన వెలుగులకు మెరవడంతో డ్రైవర్లు వాటిని గుర్తిస్తారన్నది అతడి యోచన. ఇందుకు నిధుల సాయం కావాలంటూ రతన్టాటాకు లేఖ రాశాడు. ముంబైలోని తన కార్యాలయానికి రావాలని, తనతో కలసి పనిచేయాలంటూ రతన్ టాటా నుంచి శంతనుకు పిలుపు వచి్చంది. రతన్టాటా సహకారంతో మోటోపాస్ అనే కంపెనీని శంతను స్థాపించాడు. వృద్ధులకు తోడుగా యువ సహచరులను కలిపే స్టార్టప్ ‘గుడ్ ఫెలోస్’ను సైతం స్థాపించాడు. ఆ తర్వాత ఎంబీఏ కోసం యూఎస్ వెళుతూ. తిరిగి వచి్చన తర్వాత కలసి పనిచేస్తానని రతన్టాటాకు శంతను హామీఇచ్చాడు. తిరిగొచి్చన తర్వాత రతన్టాటా అసిస్టెంట్గా, టాటా ట్రస్ట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించాడు. రతన్టాటా తుదిశ్వాస విడిచే వరకు ఆయన వెన్నంటి ఉన్నాడు. -
టాటా వారసులెవరు..
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అస్తమించిన నేపథ్యంలో ఇక 365 బిలియన్ డాలర్ల టాటా మహాసామ్రాజ్యానికి వారసులెవరనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా పలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీటిలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటాతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మెహ్లీ మిస్త్రీ పేర్లు కూడా ఉన్నాయి. వాస్తవానికి రతన్ టాటాకు తోడబుట్టిన సోదరుడైన జిమ్మీ టాటా పేరు కూడా పరిశీలించాల్సినప్పటికీ ఆయన వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, రతన్ టాటా తండ్రి నావల్ టాటా, మారుతల్లి సిమోన్ టాటా కుమారుడైన నోయెల్ పేరు ప్రముఖంగా తెరపైకి వచి్చంది. టాటా కుటుంబసభ్యుడు కావడంతో పాటు పలు గ్రూప్ కంపెనీలను నడిపించిన అనుభవం కూడా ఉండటమనేది నోయెల్కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ సంస్థలకు చైర్మన్గా ఉన్నారు. అలాగే రతన్ టాటా ట్రస్టు బోర్డులో కూడా ఉన్నారు. టాటా సన్స్ను పర్యవేక్షించే టాటా ట్రస్ట్స్ చైర్మన్గా అయ్యేందుకు ఇది ఆయనకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రతన్ టాటా వివాహం చేసుకోకపోవడం, ఆయనకు సంతానం లేకపోవడంతో నోయెల్ సంతానానికి భవిష్యత్తులో టాటా గ్రూప్లో మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. నోయెల్కు మాయా, నెవిల్, లియా... ఈ ముగ్గురు సంతానం ఉన్నారు. టాటా మెడికల్ సెంటర్కి మాయా ట్రస్టీగా వ్యవహరిస్తుండగా, హైపర్మార్కెట్ స్టార్ బజార్కి నెవిల్ సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు. జుడియో బ్రాండ్ విస్తరించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. టాటా గ్రూప్లో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీలో లియా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సన్నిహితుడు మెహ్లీ..: మెహర్జీ పల్లోంజీ గ్రూప్ డైరెక్టర్ అయిన మెహ్లీ మిస్త్రీ, రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు టాటా గ్రూప్తో చాలాకాలంగా అనుబంధం ఉంది. 2022లో కారు ప్రమాదంలో మరణించిన టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి మెహ్లీ కజిన్ అవుతారు. వాస్తవానికి టాటా సన్స్లో పల్లోంజీ మిస్త్రీ గ్రూప్నకు 18.4 శాతం వాటా ఉన్నందున ఆ గ్రూప్ అధినేత షాపూర్ మిస్త్రీ పేరు కూడా పరిశీలనకు రావాలి. కానీ టాటాలతో మిస్త్రీలకు విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఆయనకు టాటా సామ్రాజ్యం బాధ్యతలు లభించకపోవచ్చనే అభిప్రాయం నెలకొంది. నోయెల్, మెహ్లీతో పాటు గ్రూప్లో ఉన్నవారే కాకుండా బైటి వ్యక్తుల పేర్లు కూడా అకస్మాత్తుగా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. -
30వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు!
ఉప్పు నుంచి ఉక్కు దాకా... సబ్బుల నుంచి సాఫ్ట్వేర్ అగ్రగామిగా... దేశ ప్రజల తలలో నాలుకగా మారిన టాటా గ్రూప్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. నేడు రూ.30 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువతో దేశ కార్పొరేట్ జగత్తులో అత్యంత విలువైన ‘రతనం’లా వెలిగిపోతోంది. అలుపెరుగని ఈ పయనంలో టాటా బ్రాండ్కు ఖండాంతర ఖ్యాతిని తెచి్చన ఘనత కార్పొరేట్ ‘టైటాన్’ రతన్ టాటా సొంతం! లాభార్జనే ధ్యేయంగా కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకూ తమ వ్యాపార ఫలాలను పంచిన వితరణ శీలిగా కూడా చిరస్థాయిగా నిలిచిపోయారు.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన హయాంలో టాటా గ్రూప్ను మహాసామ్రాజ్యంగా విస్తరించారు. ఇటు ప్రధానమైన వ్యాపార విభాగాలను పటిష్టం చేస్తూనే అటు పేరొందిన విదేశీ దిగ్గజ కంపెనీలను కూడా కొనేసి భారతీయ కార్పొరేట్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. మిగతా దేశీ కార్పొరేట్లకు స్ఫూర్తినిచ్చారు. విమర్శలు, హేళనలు ఎదురైనా వాటిన్నింటినీ అధిగమించి టాటా గ్రూప్ను అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజంగా మల్చారు. రతన్ పగ్గాలు చేపట్టేనాటికి గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.30 వేల కోట్లు మాత్రమే. ఇక ఆదాయం 6 బిలియన్ డాలర్ల (అప్పటి రూపాయి మారకం విలువ ప్రకారం రూ.18,000 కోట్లు) స్థాయిలో నిదానంగా పురోగమిస్తున్న టాటా గ్రూప్ ఆయన సాహసోపేత నిర్ణయాలు, దూకుడు దన్నుతో నేడు ఏకంగా 165 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్లు) ఆదాయాల స్థాయికి విస్తరించింది. టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్, టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి దిగ్గజాలు ఆయా రంగాల్లో అగ్రగాములుగా ఉన్నాయి. గ్రూప్ సంస్థల్లో ఏకంగా 10 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. గ్రూప్లో పది విభాగాల్లో ప్రధానంగా 30 కంపెనీలు ఉండగా వీటిలో 26 లిస్టెడ్ కంపెనీలున్నాయి. వీటికి అనుబంధంగా పలు సంస్థలు కూడా ఉన్నాయి. 2024 మార్చి 31 నాటికి వాటి టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా 365 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.30 లక్షల కోట్లు) అధిగమించడం విశేషం. టాటా సామ్రాజ్యంలోని సంస్థలు ఆరు ఖండాల్లో 100 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 6 బిలియన్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు.. రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా సన్స్ చైర్మన్గా వ్యవహరించారు. వివిధ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న 95 కంపెనీలు గ్రూప్లో ఉండేవి. కెమికల్స్, హోటల్స్, ఉప్పు, ఉక్కు, సబ్బులు, వాచీలు మొదలైన విభాగాల్లో ఇవన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తూ, ఒకదానితో మరొకదానికి పెద్దగా సంబంధం లేని విధంగా ఉండేవి. రతన్ టాటా వచ్చాక వాటన్నింటినీ పునర్వ్యవస్థీకరించడం, కార్యకలాపాలను క్రమబదీ్ధకరించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ అనుబంధ సంస్థలన్నింటికి కూడా ఒకే కార్పొరేట్ గుర్తింపు ఉండాలని నిర్దేశించారు. దేశీ మార్కెట్పైనే ప్రధానంగా దృష్టి పెట్టి, నిదానంగా నడుస్తున్న గ్రూప్ను అంతర్జాతీయ స్థాయి విస్తరించారు. ఐఐఎం బెంగళూరు పరిశోధన పత్రం ప్రకారం ఆయన హయాంలో గ్రూప్ ఆదాయాలు 6 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 18,000 కోట్ల నుంచి రూ. 5.5 లక్షల కోట్లకు) ఎగిశాయి. గ్రూప్ మార్కెట్ విలువ 9.5 బిలియన్ డాలర్ల నుంచి 91.2 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 30,000 కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లకు) పెరిగింది. కీలక కొనుగోళ్లు.. కోరస్: ఆంగ్లో–డచ్ ఉక్కు దిగ్గజం కోరస్ను 2007లో టాటా స్టీల్ ఏకంగా 12 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. ఒక విదేశీ కంపెనీని ఇంత భారీ మొత్తం వెచి్చంచి కొనుగోలు చేయడం అప్పటిదాకా కనీవినీ ఎరుగనిది. ఈ కొనుగోలుతో టాటా స్టీల్ ఒక్కసారిగా ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు దిగ్గజాల జాబితాలోకి చేరిపోయింది. గ్రూప్ మార్కెట్ విలువను గణనీయంగా పెంచింది. అప్పటిదాకా ఎక్కువగా దేశీ మార్కెట్పైనే దృష్టి పెట్టిన టాటా స్టీల్, కోరస్ కొనుగోలుతో యూరప్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. జాగ్వార్ ల్యాండ్రోవర్: రతన్ టాటా 2008లో మరో సాహసోపేతమైన ముందడుగు వేశారు. ఈసారి దిగ్గజ బ్రిటీష్ కార్ల బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్రోవర్పై గురి పెట్టారు. 2.3 బిలియన్ డాలర్లు పెట్టి కొనేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆ తర్వాత అదొక మాస్టర్స్ట్రోక్ అని రతన్ టాటా నిరూపించారు.గ్లోబలైజేషన్ బాటలో గ్రూప్.. ప్రధానంగా భారత్పై దృష్టితో కార్యకలాపాలు సాగిస్తున్న గ్రూప్ను గ్లోబల్ ప్లేయర్గా రతన్ టాటా తీర్చిదిద్దారు. ఇందుకోసం దూకుడుగా విదేశీ కంపెనీలను కొన్నారు. 2008లో బ్రిటీష్ లగ్జరీ కార్ల బ్రాండ్లు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేయడం ద్వారా అంతర్జాతీయ ఆటోమోటివ్ మార్కెట్లో టాటా మోటార్స్ను ప్రముఖ సంస్థగా నిలిపారు. అంతకన్నా ముందుగా 2000లో టెట్లీని కొనుగోలు చేయడం ద్వారా గ్లోబల్ టీ మార్కెట్లో టాటా గ్రూప్ కూడా ప్రధాన ప్లేయర్గా ఎదిగింది.టీసీఎస్.. ఐటీ కోహినూర్!టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ (టీసీఎస్) పాత్ర చాలా కీలకం. 1968లోనే ఏర్పడినప్పటికీ రతన్ టాటా సారథ్యంలో టీసీఎస్కి రెక్కలొచ్చాయి. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకి వచి్చంది. ఏకంగా రూ. 4,713 కోట్లు సమీకరించింది. అప్పటి నుండి అద్భుతమైన పనితీరుతో టీసీఎస్ దూసుకెళ్తోంది. టీసీఎస్తో పాటు టాటా మోటర్స్, టాటా స్టీల్, టాటా పవర్ దన్నుతో గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ. 30 లక్షల కోట్లకు ఎగిసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
అక్షరాలా భారత రత్నమే!
నిదానంగా కదులుతూ... ముక్కుసూటిగా మాట్లాడుతూ... విలువలను ఎత్తిపడుతూ కూడా అన్యులకు అసాధ్యమైన సమున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆరు దశాబ్దాల తన ఆచరణతో దేశానికి చాటిచెప్పిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన అక్షరాలా రత్నం. సార్థక నామధేయుడు. చెదరని వినమ్రత, సడలని దృఢ సంకల్పం, లక్ష్యసాధనకు ఎంత దూరమైనా వెళ్లే లక్షణం... విశాల టాటా సామ్రాజ్యంలో ఆయనను విలక్షణ వ్యక్తిగా నిల బెట్టాయి. కనుకనే మూడు దశాబ్దాల పాటు ఆ సామ్రాజ్యానికి ఆయన అక్షరాలా చక్రవర్తిగానే వ్యవహరించారు. నిజమే... ఆయన 1962లో సాధారణ ఉద్యోగిగా చేరిననాటికే దేశంలో అదొక అత్యున్నత శ్రేణి సంస్థ కావొచ్చుగాక. పైగా సంస్థ సారథులకు ఆయన అతి దగ్గరివాడు, బంధు వర్గంలో ఒకడు కూడా! కానీ ఆయన ఎదుగుదలకు తోడ్పడినవి అవి కాదు. ఆయన అంకితభావం, దీక్షాదక్షతలు, నిరంతర తపన ఆయనను అంచెలంచెలుగా పైపైకి చేర్చాయి. పేరుకు ఒక సంఘటిత సంస్థే అయినా, అప్పటికే లక్షలమంది సిబ్బందికి చల్లని నీడనిచ్చే కల్పవృక్షంగా పేరుతెచ్చుకున్నా... టాటాల సామ్రాజ్యం విభిన్న సంస్థల సమాహారం మాత్రమే! అందులో సమష్టితత్వం, దిశ, దశా నిర్దేశించే ఉమ్మడి తాత్విక భూమిక శూన్యం. జమ్షెడ్జీ టాటా, జేఆర్డీ టాటా వంటివారు నేతృత్వం వహించిన ఆ సంస్థలో నాయకత్వ స్థానం దక్కాలంటే అడుగడుగునా అవరోధాలు తప్పలేదు. నెత్తురు చిందకపోవచ్చు... గాయాల జాడ లేకపోవచ్చు, కానీ రోమన్ సామ్రాజ్యకాలం నాటి కలోసియంలను తలపించే బోర్డు రూంలో తన ఆలోచనలనూ, తన భావనలనూ బలంగా వినిపించి ప్రత్యర్థుల వాదనలను పూర్వపక్షం చేయటం మాటలు కాదు. తన ప్రతి పలుకూ, ప్రతి వివరణా నిశితంగా గమనించే, ప్రశ్నించే ఆ బోర్డు రూంలో గెలవటం సాధారణం కానే కాదు. కానీ రతన్ అవన్నీ అవలీలగా చేయగలిగారు. నిష్క్రమిస్తున్న చైర్మన్జేఆర్డీ టాటా ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నా అప్పటికే భిన్న సంస్థలకు సారథులైనవారు సామాన్యులు కాదు. అప్పటికింకా టిస్కోగానే ఉన్న టాటా స్టీల్కు రూసీ మోదీ సారథి. పారిశ్రామిక రంగంలో ఆయన మోత మోగిస్తున్నాడు. జమ్షెడ్ఫూర్లో కొలువుదీరిన ఆ సంస్థకాయన మకుటంలేని మహారాజు. అజిత్ కేర్కర్ ఇండియన్ హోటల్స్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. దర్బారీ సేల్ టాటా కెమికల్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వీళ్లెవరూ రతన్ టాటాను సీరియస్గా తీసుకోలేదు. అతన్ని అవలీలగా అధిగమించవచ్చనుకున్నారు. రతన్ తన పేరులో చివరున్నరెండక్షరాల పుణ్యమా అని ఇంత దూరం వచ్చాడు తప్ప ‘సరుకు’ లేదనుకున్నారు. ఆయన రాకపై ఆలోచించటం సమయాన్ని వృథా చేసుకోవడమే అనుకున్నారు. కానీ రతన్ పరిశీలనాశక్తి అమోఘ మైనది, అనితర సాధ్యమైనది. ఈ మహాసామ్రాజ్యంలో ఏం జరుగుతున్నదో, లోపాలేమిటో అచిర కాలంలోనే పసిగట్టాడు. తళుకుబెళుకులకు తక్కువేం లేదు. మదుపుపరులకు ఎప్పటికప్పుడు లాభాల పంటా పండుతోంది. కానీ అట్టడుగున అవాంఛనీయమైన పోకడలు కనబడుతున్నాయి. వాటిని చక్కదిద్దితేసంస్థను మరిన్ని రెట్లు పెంచి ఘనతరమైనదిగా తీర్చిదిద్దటం అసాధ్యమేమీ కాదని ఆయన నిర్ణయించుకున్నాడు. 1991 నాటికే దేశంలో అడుగుపెట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పాత పద్ధతిలోనే టిస్కోను కొనసాగిస్తే త్వరలోనే అది గ్రూపు చేజారటం ఖాయమన్న నిర్ణయానికొచ్చాడు.జేఆర్డీ మంచితనమో, గమనించలేని తత్వమో గానీ... టాటా స్టీల్లో అప్పటికి టాటాలకున్న ప్రమోటర్ వాటా కేవలం అయిదు శాతం మాత్రమే. ఇదే కొనసాగితే ఏదోనాటికి అది ఎవరి చేతుల్లోకైనా పోవచ్చని రతన్ గ్రహించారు. అదొక్కటే కాదు... గ్రూపు సంస్థల్లో ఏ ఒక్కటీ చేజారకుండా ప్రమోటర్ వాటాను గణనీయంగా పెంచారు. సొంత సంస్థలను పదిలపరచుకోవటమే కాదు, ఖండాంతర ఆంగ్లో–డచ్ స్టీల్ సంస్థ కోరస్ను వశపరుచుకున్నారు. ఒకప్పుడు తనకు అవరోధంగా నిలిచిన అమెరికన్ దిగ్గజ సంస్థ ఫోర్డ్ నుంచి జాగ్వార్ ల్యాండ్రోవర్ను టాటాల తీరానికి చేర్చారు.వర్తమానంలో పారిశ్రామికవేత్తల ఎదుగుదల ఎలా సాధ్యమవుతున్నదో బాహాటంగానే కనబడుతోంది. కానీ రతన్ టాటా ఇందుకు భిన్నం. టాటా సంస్థలపై మచ్చపడకుండా, వక్రమార్గాల జోలికిపోకుండా నిదానంగా తన ప్రస్థానం సాగించారు. ఆయన పట్టిందల్లా బంగారమేనని చెప్పడానికి లేదు. కోరస్ టేకోవర్ అయినా, నానో కారు ఉత్పత్తి ఉబలాటమైనా, టాటా గ్రూప్ సంస్థల చైర్మన్గా సైరస్ మిస్త్రీ ఆగమన, నిష్క్రమణల్లో అయినా రతన్ వైఫల్యాలు స్పష్టంగా కనబడతాయి. అందుకాయన విమర్శలను ఎదుర్కొనక తప్పలేదు. అలాగే టాటా స్టీల్ను దాదాపు 1,200 కోట్ల డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దినప్పుడూ, దేశీయ విద్యుత్ ఆధారిత వాహన రంగంలో టాటా మోటార్స్ను మార్కెట్ లీడర్గా ముందుకు ఉరికించినప్పుడూ ఆయన గర్వం తలకెక్కించుకోలేదు. ఇవాళ్టి రోజున బహుళజాతి సంస్థల సమాహారంగా ఖండాంతరాల్లో వెలుగు లీనుతున్న టాటా గ్రూప్ నిరుటి రెవెన్యూ 16,500 కోట్ల డాలర్లు. ఆయన వ్యక్తిగత ఆదాయమే కొన్ని వందల కోట్లు. అయినా చివరి వరకూ అతి సాధారణ జీవితం గడిపి, అసహాయులకు అండదండలందించి జీవితాన్ని ధన్యం చేసుకున్న రతన్కు కొందరు కోరుకుంటున్నట్టు ‘భారతరత్న’ ప్రకటిస్తే అది ఆ అత్యున్నత పురస్కారానికి మరింత వన్నె తెస్తుంది. ఆ మహామనీషికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తున్నది. -
క్రీడల్లోనూ రతన్ ముద్ర
న్యూఢిల్లీ/ముంబై: భారత పారిశ్రామిక రంగంలోనే కాదు... క్రీడారంగంలోనూ ‘టాటా’ చెరగని ముద్ర వేసింది. స్వాతం్రత్యానికి పూర్వంలో భారత్ 1920లో అంట్వర్ప్ ఒలింపిక్స్కు టాటా గ్రూపే స్పాన్సర్గా వ్యవహరించింది. అప్పటి నుంచి క్రీడలపై కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తూనే వచ్చింది. రతన్ టాటా వచ్చాక ఇది మరింతగా పెరిగింది. జీవనశైలిలో క్రీడలు భాగమేనని రతన్ అనే వారు. ‘టాటా’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), టాటా స్టీల్ చెస్ ఇలా ఒకటేమిటి ఆర్చరీ, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్ ఫుట్బాల్), అథ్లెటిక్స్లలో రతన్ ఉదారత, దార్శనీయత, నిబద్ధత నిరుపమానమని పలువురు క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు. » 1991లో జేఆర్డీ టాటా స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పిన నాటి నుంచి ఫుట్బాల్, హాకీ, ఆర్చరీ, ఈక్వె్రస్టియన్, బాక్సింగ్, కరాటే, రాకెట్ స్పోర్ట్స్ ఇలా 19 క్రీడాంశాలకు ప్రసిద్ధ శిక్షణ సంస్థగా టాటా స్పోర్ట్స్ అకాడమీ ఎదిగిందని ఇందులో రతన్ పాత్ర చాలా కీలకమని అకాడమీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు అన్నారు. » 1924లో ఏర్పాటైన భారత ఒలింపిక్ సంఘానికి తొలి అధ్యక్షుడు సర్ దోరబ్జి టాటా కావడం విశేషం. నెదర్లాండ్స్లో జరిగే టాటా స్టీల్ చెస్ను కొందరు చెస్ దిగ్గజాలు ‘వింబుల్డన్ ఆఫ్ చెస్’గా అభివర్ణిస్తారు. 2007 నుంచి టాటా స్టీల్ సంస్థ స్పాన్సర్షిప్లోనే ఈ టోర్నీ జరుగుతోంది. స్వాతం్రత్యానంతరం పది మంది గొప్ప వాళ్ల జాబితాను తయారు చేస్తే అందులో రతన్ అగ్రస్థానంలో ఉంటారు. తన కోసం కాకుండా దేశం కోసం ఒక వ్యక్తి ఓ వ్యవస్థను ఎలా మార్చగలడో, ఓ పరిశ్రమను ఎలా సృష్టించగలడో నిరూపించిన దిగ్గజం రతన్ టాటా. గొప్ప మానవతావాది. మూగజీవాల పట్ల కారుణ్యం, సమాజం పట్ల బాధ్యత ఉన్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. నేను ఆయన్ని చాలాసార్లు కలిశాను. ఆయన చాతుర్యం అపారం. ఆయనెప్పుడు మన మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. దేశం కోసం ఆయనేం చేశాడో, భారత పారిశ్రామిక రంగాన్ని దశదిశలా వ్యాప్తిచేసిన ఆయన గురించి ఎంత చెప్పినా... వర్ణించినా తక్కువే –కపిల్దేవ్, భారత క్రికెట్ దిగ్గజం పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వానికి నిలువెత్తు రూపం రతన్ టాటా ఇక లేరనే వార్త అత్యంత విచారకరం. చెస్ టోర్నీ ఆయన ఎంతో చేశారు. టాటా స్టీల్ చెస్లో ఆడటమే గొప్ప గౌరవంగా భావించేలా ఆ టోర్నీని మార్చేశారు. –చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ శ్రీ రతన్ టాటా మరణవార్త నన్ను దుఃఖంలో ముంచేసింది. ఆయన దూరదృష్టి అద్భుతం. ఆయనతో నేను గడిపిన క్షణాలు, సంభాషణ జీవితంలో మరచిపోలేను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్థస్తున్నా. –ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా రతన్ టాటా చూపిన మార్గం, చేసిన దిశానిర్దేశం దేశం ఎప్పటికి మరచిపోదు. మేమంతా మిమ్మల్ని అనుసరిస్తాం. –బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రతన్ ఒక్క పారిశ్రామిక రంగానికే కాదు... భారత సమాజానికి ఎనలేని సేవలందించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. –దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే -
టేకోవర్ స్టోరీ: రతన్.. ఇక టాటా గ్రూప్ పగ్గాలు తీసుకుంటావా?
టాటా గ్రూప్ గౌరవ్ చైర్మన్ రతన్ టాటా అస్తమించారు. 86 ఏళ్ల వయసులో ఆయన లోకాన్ని వీడారు. జేఆర్డీ టాటా 1991 మార్చిలో టాటా గ్రూప్ పగ్గాలను రతన్ టాటాకు అప్పగించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ మరింత పెద్దదైంది. అయితే టాటా గ్రూప్ బాధ్యతలను రతన్ టాటా తీసుకోవాలని జేఆర్డీ టాటా ఎలా కోరారో తెలుసా?టాటా గ్రూప్నకు అధినేతగా వ్యవహరించిన ఆయన అసలు టాటా గ్రూప్ పగ్గాలను ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో చేపట్టారో ఒకసారి ఓ షోలో రతన్ టాటా వివరించారు. గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన తర్వాత జేఆర్డీ టాటా తనకు కంపెనీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.“మేము ఒక ఫంక్షన్ కోసం జంషెడ్పూర్లో ఉన్నాం. నేను వేరే పని మీద స్టుట్గార్ట్కు వెళ్లవలసి వచ్చింది. నేను తిరిగి వచ్చినప్పుడు ఆయనకు(జేఆర్డీ టాటా) గుండె సమస్య వచ్చిందని, బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఉన్నారని విన్నాను. ఆయన ఒక వారంపాటు అక్కడే ఉన్నారు. నేను రోజూ వెళ్లి చూసొచ్చేవాడిని. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులకు ఆఫీస్కి వెళ్లి కలిశాను” అంటూ రతన్ టాటా చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది..!"ఆయన్ను(జేఆర్డీ టాటా) ఎప్పుడు కలిసినా 'సరే, ఇంకేంటి?' అని అడిగేవారు. జే (జేఆర్డీ టాటా) నేను నిన్ను రోజూ చూస్తున్నాను. కొత్తగా ఏముంటుంది? అని నేను చెప్పావాడిని. 'సరే, నేను నీకు కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. కూర్చో. జంషెడ్పూర్లో నాకు జరిగిన సంఘటన (అనారోగ్యం) తర్వాత నేను తప్పుకోవాలనుకుంటున్నాను. (టాటా గ్రూప్ చైర్మన్గా) నా స్థానం నువ్వే తీసుకోవాలి' అన్నారు. అదే ప్రతిపాదనను బోర్డుకి తీసుకెళ్లారు(కొన్ని రోజుల తర్వాత)” అని టాటా గుర్తుచేసుకున్నారు. -
ఇకపై టాటా గ్రూప్ సారథులు వీరేనా..?
దేశంలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్టాటాకు పెళ్లి కాకపోవడంతో తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించేవారు లేకుండాపోయారు. దాంతో రతన్ టాటా తర్వాత దాదాపు రూ.30 లక్షల కోట్ల టాటా గ్రూప్ సంస్థలను ఎవరు ముందుకు తీసుకెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సామర్థ్యం ఎవరికి ఉందనే చర్చ కొనసాగుతుంది.అయితే తన ఫ్యామిలీకే చెందిన తన సోదరుడు నోయెల్టాటా కుమార్తెలు లేహ్, మాయా, కుమారుడు నెవిల్లీలకు రతన్ టాటా వ్యాపార మెలకువలు నేర్పినట్లు పలు సంస్థలు నివేదించాయి. టాటాగ్రూప్ను ముందుకు నడిపే సత్తా వారికి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కానీ సంస్థతో వారికున్న అనుబంధం, వారి నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు తెలిస్తే టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని తెలుస్తోంది.లేహ్ టాటానోయెల్ టాటా పెద్ద కుమార్తె.మాడ్రిడ్లోని ఐఈ బిజినెస్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తాజ్ హోటల్స్ రిసార్ట్స్ & ప్యాలెస్లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా తన కెరియర్ ప్రారంభించారు. సేల్స్ విభాగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.మాయా టాటాలేహ్ టాటా సోదరి మాయా టాటా.మాయా టాటా రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో తన కెరియర్కు మొదలుపెట్టారు. ఆమె పోర్ట్ఫోలియో మేనేజర్గా, ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజంటేటివ్గా పని చేశారు.యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. టాటా క్యాపిటల్, ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీలో కీలకస్థానంలో పనిచేశారు.టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయా ఉన్నారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడునెవిల్లే టాటానోయెల్ టాటా చిన్న కుమారుడు.నెవిల్లే టాటా కూడా బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ట్రెంట్ హైపర్మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్కు సారథ్యం వహిస్తున్నారు. ఇది టాటా గ్రూప్ బ్రాండ్లైన వెస్ట్సైడ్ , స్టార్ బజార్లకు మాతృసంస్థగా ఉంది. -
వర్షంలో తడిసిన ఆ నలుగురే ‘నానో’కు పునాది
రతన్ టాటాతోపాటు గతంలో సంస్థ పగ్గాలు చేపట్టిన సారథులు ఇండియాను ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా చూడాలనుకున్నారు. అందుకే పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎక్కువగా కృషి చేశారు. అందులో భాగంగానే రతన్ టాటా ‘నానో’ కారును విడుదల చేశారు. అయితే ఈ కారు ఆవిష్కరణకు పునాది ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకసారి రతన్టాటా తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక దంపతులిద్దరు, ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే..వెంటనే ఆయన పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా దాదాపు రూ.ఒక లక్ష ధర ఉండేలా ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు? అని భయపెట్టారు. కొంత మంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజినీర్లను పిలిపించారు. కానీ వారు లక్ష రూపాయల్లో కారుని తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా అంతటితో ఆగిపోలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ‘నానో’ను ఆవిష్కరించారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు విఫలమైంది. నానో కారు తయారుచేయడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల.ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. దాంతో మొత్తం ప్లాంట్ను పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్కు తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. -
‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’
రతన్ టాటా మృతిపట్ల ప్రముఖులు వివిధ మాధ్యమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ రతన్ టాటాతో చివరిసారిగా గడిపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆ వివరాలు పంచుకుంటూ టాటా మృతికి సంతాపం తెలియజేశారు.‘గూగుల్ క్యాంపస్లో రతన్ టాటాను చివరిసారి కలిసినప్పుడు ‘వేమో’(అధునాతన అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ) పురోగతి గురించి మాట్లాడాం. ఈ విభాగంలో ఆయన ఆలోచన విధానాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అసాధారణమైన వ్యాపార, దాతృత్వ వారసత్వం ఆయన సొంతం. భారతదేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో రతన్ టాటా కీలకపాత్ర పోషించారు. భారత్ను ఆర్థికంగా మరింత మెరుగుపరిచేందుకు ఆయన ఎంతో శ్రద్ధ చూపారు. అతని మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సుందర్ తెలిపారు.My last meeting with Ratan Tata at Google, we talked about the progress of Waymo and his vision was inspiring to hear. He leaves an extraordinary business and philanthropic legacy and was instrumental in mentoring and developing the modern business leadership in India. He deeply…— Sundar Pichai (@sundarpichai) October 9, 2024రతన్ టాటాపై ఇలోన్మస్క్టాటా ప్రపంచ ప్రఖ్యాత సంస్థల సారథులకు స్ఫూర్తిగా నిలిచారు. అమెరికన్ జర్నలిస్ట్ చార్లీ రోస్తో 2009లో ఇలోన్మస్క్తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా దూరదృష్టిని మస్క్ ప్రశంసించారు. ఇంటర్వ్యూలో భాగంగా భారతీయ మార్కెట్లో టాటా తక్కువ ధరకే కారు(నానో) అందిస్తున్నారని మస్క్ దృష్టికి తీసుకొచ్చారు. ‘రతన్ టాటా ఇండియాలో విప్లవాత్మక మార్పునకు తెరతీశారు. కేవలం రూ.ఒక లక్షకు కారు అందించడం గొప్ప విషయం. కారు సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే దూరదృష్టి టాటాది’ అని మస్క్ బదులిచ్చారు.He fulfilled his promise to build the world's cheapest car.- Ratan Tata wanted to build a car, which the middle class of India could afford and so he delivered on his promise and launched Tata Nano for just $1,200 (₹1 lakh) in 2008.- @ElonMusk also shared his views on the… pic.twitter.com/QqTY5KuQLK— Nico Garcia (@nicogarcia) August 26, 2024రతన్ టాటాపై బిల్ గేట్స్‘రతన్ టాటా దూరదృష్టి కలిగిన నాయకుడు, సామాన్యుల జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం ఎనలేనిది. అతడి వ్యక్తిత్వం భారతదేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. ప్రజలకు సేవ చేసేందుకు రతన్ టాటాతో కలిసి అనే సందర్భాల్లో వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. అతడి మరణం రాబోయే తరాలకులోటు. కానీ అతడు అనుసరించిన విలువలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’ అని బిల్గేట్స్ తెలిపారు.ఇదీ చదవండి: సినీనటి సంతాపం.. అప్పట్లో ఇద్దరి మధ్య ప్రేమ?మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, ముఖేష్ అంబానీ వంటి వ్యాపార ప్రముఖులు, రాజకీయ, సినీ దిగ్గజాలు ఆయనకు సంతాపం తెలిపారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో టాటా తుది శ్వాస విడిచారు. -
ఎన్సీపీఏకు రతన్ టాటా పార్దివదేహాం తరలింపు (ఫొటోలు)
-
రతన్ టాటాను చంపాలనుకున్నారట!
మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. వంటి లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు?టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్గా రతన్ టాటా ఎన్నో సేవలందించారు. గతంలో తాను సామాజిక మధ్యమంలో పంచుకున్న వివరాల ప్రకారం..కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ బెదిరించాడని, వేరే వాళ్లతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్నకు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు. రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్ స్టర్ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్ స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్స్టర్ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది. తలవంచని నైజంలేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో..దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడుచంపేందుకు పోటీదారులతో ఒప్పందంజైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన పోటీదారులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు రూ.లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. -
‘లేరని ఊహించుకోవడం చాలా కష్టం’
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. టాటా అస్తమయం ఆత్మీయులకు తీరనిలోటు. టాటా కన్నుమూశారనే వార్త విని ఒకప్పటి సినీనటి సిమి గరేవాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా నివాళులు అర్పించారు. గతంలో ఈమెతో రతన్టాటా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కాలంలో ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.సిమీ గరేవాల్ స్పందిస్తూ..‘మీరు వెళ్లిపోయారనే వార్త విన్నాను. మీ లేరని ఊహించుకోవడం చాలా చాలా కష్టం. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ద్వారా సంతాపం తెలిపారు. ఒక సమావేశంలో టాటా మాట్లాడుతూ తాను నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, పెళ్లికి దగ్గరగా వచ్చానని తెలిపారు. కానీ కొన్ని సంఘటనల వల్ల పెళ్లి చేసుకోలేదని చెప్పారు. ‘భార్య, కుటుంబం లేకపోవడంతో చాలాసార్లు ఒంటరిగా గడిపాను. కొన్నిసార్లు అందిరిలాగే భార్య, పిల్లలు, కుటుంబం ఉండాలని ఆశపడ్డాను. మరికొన్నిసార్లు వేరొకరిపై ఆధారపడడంతో వచ్చే ఆందోళనల గురించి చింతించకుండా స్వేచ్ఛగా ఉండాలని అనుకున్నాను’ అని చెప్పారు.They say you have gone ..It's too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024రతన్ టాటా అమెరికాలో ఉన్నపుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆమె భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి తనను కలవలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడుప్రజల సందర్శన కోసం టాటా భౌతికకాయంరతన్ టాటా భౌతికకాయానికి ప్రజలు నివాళులర్పించేందుకు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ)లో ఉంచనున్నారు . -
రతన్ టాటా విశిష్టతలు ఎన్నో... (ఫొటోలు)
-
బనీను ధరించి తలుపు తీసిన టాటా
రతన్టాటా చాలా సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతారు. టాటా నానో కారునే ఎక్కువగా వాడేవారట. ఆయన జీవితాన్ని చూసిన ప్రతిఒక్కరూ నిరాడంబరత నేర్చుకోవాల్సిందేనని పలువురు చెబుతారు. ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ!రతన్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ..‘సరైన నిర్ణయాలు’ తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేనొక నిర్ణయం తీసుకుంటాను. అది సరైనదే అయ్యేలా చేస్తాను. అంతే...’ అని అన్నారు. అందుకే కావొచ్చు, ఆయన హయాంలో టాటా గ్రూపు ఆదాయం 50 రెట్లు మించి పెరిగింది. ఇవాళ టాటా గ్రూపు విలువ దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేరుకుంది.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడురాజకీయాలకు దూరంగా..రాజకీయ రణరంగంలో రతన్ టాటా గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయనపై అస్త్రాలు సంధిస్తూ పార్టీలు పరస్పరం ఎన్నడైనా ఆరోపణలు చేసుకోవటం చూశామా? లేదుకదా. అదీ రతన్ టాటా ప్రత్యేకత. సంస్థ ఎదగడమే కాదు..అనేకమంది జీవితాల్లో వెలుగులు పంచాలన్నది ఆయన సిద్ధాంతం. టాటా గ్రూపు సంస్థలకు సామాజిక సేవంటే చాటింపు వేసుకుని మీడియాకు పోజులిచ్చే సందర్భం కాదు. నెరవేర్చి తీరాల్సిన పవిత్ర కర్తవ్యం. అందుకే ‘టాటా సన్స్’ ఈక్విటీల్లో 66 శాతం టాటా ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. వాటిపై వచ్చే డివిడెండ్లు నేరుగా ట్రస్టులు నిర్వహించే సేవాకార్యక్రమాలకు తోడ్పడతాయి. -
టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో
టాటా గ్రూప్ విస్తరణ ఎలా జరిగింది..? దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్ ఎలాంటి వ్యాపారం చేస్తోంది..? స్టీల్ నుంచి టీ వరకు, ఉక్కు నుంచి సాఫ్ట్వేర్ సేవల వరకు టాటా సంస్థలు ఎలాంటి వ్యాపారాలు సాగిస్తున్నాయో తెలియజేస్తూ ‘దిప్యామిలీకట్’ అనే యూట్యూబ్ ఛానల్ గతంలో ఒక వీడియోను విడుదల చేసింది. 2018లో విడుదల చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 15 లక్షల కంటే ఎక్కువ వ్యూసే వచ్చాయి. కంపెనీ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడు -
మంచితనంలో అపరకుబేరుడు
వ్యాపార దార్శనికుడుమనసున్న మారాజుసహనశీలి.. మూగ జీవాల ప్రేమికుడుఎందరో వ్యాపారులకు గురువుఅవమానాలను సైతం తట్టుకుని నిలబడిన సృష్టికర్తప్రేమ విఫలమైనా కుంగిపోని ఉక్కు మనిషికంపెనీలో 66 శాతం దాతృత్వానికే కేటాయించిన మేరునగంధనవంతుల జాబితాలో పేరు లేకపోయినా మంచితనంలో అపరకుబేరుడుఒక శకం ముగిసింది. వ్యాపారం సామ్రాజ్యంలో అంచెంలంచెలుగా ఎదుగుతూ రూ.10 వేలకోట్ల వ్యాపారాన్ని రూ.లక్షల కోట్లకు చేర్చిన దూరదృష్టి కలిగిన అజరామరుడు రతన్ టాటా ఇకలేరు. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ నావల్ టాటా(86) బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపించిన వ్యక్తి రతన్ టాటా. ఆయన గతకొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో సోమవారం ముంబయిలో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా చాలామంది తన ఆరోగ్యం గురించి పెద్ద సంఖ్యలో ఆరా తీశారు. వెంటనే సామాజిక మాధ్యమాల్లో స్పందించిన రతన్టాటా జనరల్ చెక్-ఆప్ కోసం ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. కాగా, బుధవారం రాత్రి ఆయన కన్నుముశారు.దేశంలోనే అతి పెద్ద కంపెనీలుగా పేరున్న రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ మూడు కలిపినా కూడా టాటా గ్రూప్ విలువతో సరితూగవు. అంత పెద్ద కంపెనీ అయినా ఏనాడూ ఆ సంస్థకు చెందిన ప్రముఖులు అత్యంత ధనవంతుల జాబితాలో లేరు. సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ గురించి, దాన్ని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం.టాటా కంపెనీ మొదట ఒక టెక్స్టైల్ మిల్గా ప్రారంభమైంది. జంషెడ్జీ టాటా ఈ గ్రూప్ను 1868లో ప్రారంభించారు. ఈ కంపెనీ తరతరాలుగా తమ వారసుల చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని ప్రారంభించింది టాటా సంస్థే. రెండో ప్రపంచ యుద్ధం తరువాత దాన్ని ఎయిరిండియా పేరుతో జాతీయం చేశారు. 2022లో ఎయిరిండియా సంస్థను టాటా తిరిగి దక్కించుకుంది. ఇదొక్కటే కాదు ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, దేశంలోనే మొదటగా తాజ్ హోటల్ను స్థాపించింది కూడా టాటా కంపెనీయే. ఇలా మన దేశానికి ఈ సంస్థ ఎన్నో కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది. దేశ నిర్మాణం, అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. టాటా గ్రూప్ సంస్థకు చాలా మంది సారథ్యం వహించినా రతన్ టాటాకు ప్రత్యేక స్థానం ఉంది.ఇదీ చదవండి: వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' అస్తమయంరతన్ టాటా డిసెంబర్ 28, 1937లో అప్పటికే దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీ టాటా రతన్ టాటాను ఇండియాకు వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇచ్చారు. దాంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.1991లో జేఆర్డీ టాటా రతన్ టాటాను టాటా గ్రూప్ ఛైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవంలేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్లందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. రూ.10 వేలకోట్లుగా ఉండే వ్యాపారాన్ని దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేర్చారు.ఇంత పెద్ద కంపెనీకి సారథ్యం వహిస్తున్నప్పటికీ రతన్ టాటా ప్రపంచంలో, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో ఏనాడూ స్థానం సంపాదించలేదు. ఎందుకంటే టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో దాదాపు 66% శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థలకే విరాళం ఇస్తున్నారు. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవ సంస్థలకు కాకుండా రతన్ టాటాకు చెందితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండేవారు.బ్రిటిష్ వారికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి..రతన్టాటా తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు..1998లో రతన్ టాటా, టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదట సంవత్సరం ఆశించినమేర విక్రయాలు జరగలేదు. దాంతో అందరూ టాటా ఇండికా విభాగాన్ని అమ్మేయాలని సలహా ఇచ్చారు. దాంతో ఫోర్డ్ కంపెనీని ఆశ్రయించారు. కార్ల తయారు చేయడం తెలయనప్పుడు ఎందుకు సాహసం చేయడమని అవమానించారు. క్రమంలో ఇండికాను లాభాలబాట పట్టించారు. యూరప్కు చెందిన కోరస్ స్టీల్ కంపెనీను కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్కు చెందిన టెట్లీ టీ కంపెనీను కొని ‘టాటా టీ’లో విలీనం చేశారు. దాంతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టీ కంపెనీగా టాటా ఎదిగింది. ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకుని టాటాను ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు రతన్ టాటా. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్లైతే భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వారికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.పెళ్లికి దూరంగా టాటా..రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన అమెరికాలో ఉన్నప్ప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.యువతంటే నమ్మకం..రతన్ టాటాకు యువత, వారి వినూత్న ఆలోచనలు, శక్తిని అమితంగా నమ్మేవారు. అందుకే స్నాప్డీల్, పేటీఎం, కార్దేఖో, బ్లూస్టోన్, ఓలా, షావోమీ..వంటి దాదాపు 39కి పైగా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడపెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాల్లో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. అందుకే భారతీయుల్లో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది.ప్రాణాలు కోల్పోయిన టాటా ఉద్యోగులు..నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ సొంతం. తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఏ ఉద్యోగి తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ హోటల్లోని సుమారు 1500 మందికి పైగా అతిథులను కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంతో మంది ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు. దీన్ని బట్టి టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో ప్రపంచానికి అర్థమైంది.విద్యార్థులకు స్కాలర్షిప్లు..టాటా ట్రస్ట్..దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది. ఇప్పటికి మన దేశంతో పాటుగా విదేశాల్లో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందిస్తున్నారు. తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన, చనిపోయిన కుటుంబాలకు రతన్టాటా ప్రత్యేకంగా సేవలందించారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకు రూ.300 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఒక భవనానికి గౌరవంగా ‘టాటా హాల్’ అని పేరు పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషంట్ల కోసం ఏకంగా రూ.1000 కోట్లు దానం చేశారు. కుక్కులు వంటి మూగ జీవాలపై అమిత ప్రేమను చూపించేవారు.ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరంచింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను వివిధ డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం గర్వించదగిన విషయం.వీటన్నిటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసులో నిలపడంలో 100 శాతం విజయాన్ని సాధించారు. డబ్బుపరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు. కానీ మంచితనంలో ఆయన అపరకుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరు ఇష్టపడే గౌరవించే బిజినెస్ మాన్గా రతన్ టాటా నిలిచిపోయారు. ఆయనకు ఇదే అశ్రునివాళి. -
Ratan Tata Photos: దివికేగిన వ్యాపార సామ్రాజ్యాధిపతి రతన్ టాటా...(ఫొటోలు)
-
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముక పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(86) ఇక లేరు. అనారోగ్యం కారణంగా ముంబైలోని బ్రీచ్కాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుదవారం రాత్రి ఆయన మరణించారు.1937 డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. గత కొంత కాలంగా రతన్ టాటా అనారోగ్యంతో బాదపడుతున్నారు. రతన్ టాటా మరణించినట్టు టాటా సన్స్ గ్రూప్ ప్రకటించింది. -
రతన్టాటా ప్రేమ విఫలం.. పెళ్లికి దూరం
టాటా సన్స్ ఛైర్మన్ రతన్టాటా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తీవ్ర ఆనారోగ్య పరిస్థితుల వల్ల రతన్టాటా ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో రతన్ టాటా స్పందించారు. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. జనరల్ చెక్-అప్ల కోసం హాస్పటల్కు వచ్చానని చెప్పారు. ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా ఉన్న టాటాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) టాటా గ్రూప్ను 1868లో 'జమ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా' (జంషెడ్జీ) ప్రారంభించారు. ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ.30 లక్షల కోట్ల పైమాటే.రతన్ టాటా 1937 డిసెంబరు 28న జన్మించారు.ఆయనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు.రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్కు వెళ్లారు.ఆయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా.రతన్ టాటా ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా అనే పుస్తకాలు రాశారు.86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. ప్రేమలో విఫలం అయ్యాక ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు.పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకు లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు.తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు.టాటాకు సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు.ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. దాంతో ధనవంతుల జాబితాలో ఉండలేకపోతున్నారు.ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. ఆయన గతకొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో సోమవారం ముంబయిలో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అందుకు సంబంధించిన వార్తలుకాస్తా వైరల్గా మారాయి. -
‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన అవసరం లేదు’
ఢిల్లీ : తాను అస్వస్థతకు గురయ్యానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా ఖండించారు. ఈమేరకు ఆయన ఓ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తాను ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి రతన్ టాటా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ప్రకారం.. రతన్ టాటా రక్తపోటు తగ్గడంతో ఆదివారం అర్థరాత్రి 12:30 నుండి 1:00 గంటల మధ్య టాటాను ఆయన కుటుంబ సభ్యులు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారని జాతీయ మీడియా కథనాలు, ట్వీట్లు వెలుగులోకి వచ్చాయి. Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024 ఆస్పత్రికి వచ్చిన వెంటనే టాటాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స అందిస్తున్నారని,ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని రతన్ టాటా ఖండించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తాను ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. దీంతో టాటా ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లైంది. -
మొరాకోలో టాటా డిఫెన్స్ ఫ్యాక్టరీ.. విదేశాల్లో స్వదేశీ బ్రాండ్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మొదటిసారి విదేశాల్లో డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. మొరాకోలోని కాసాబ్లాంకాలో కంపెనీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే విదేశీ గడ్డపై అడుగుపెట్టిన మొట్టమొదటి స్వదేశీ రక్షణ కర్మాగారంగా టాటా రికార్డ్ క్రియేట్ చేయనుంది.ఫ్యాక్టరీ ప్రారంభమైన తరువాత కంపెనీ మొదట రాయల్ మొరాకో ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్లను (WhAP) ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. ఆ తరువాత ఆఫ్రికన్ మార్కెట్ కోసం ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీ ఏడాది లోపల ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ కర్మాగారంలో ప్రతి ఏటా 100 యుద్ధ వాహనాలను ఉత్పత్తి చేయనుంది.టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో WhAPని అభివృద్ధి చేసింది. సైన్యం కోసం వాహనాలను ఎంపికచేసి ముందు.. ఆఫ్రికా ఎడారుల్లోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించారు. ఆ తరువాత టాటా గ్రూప్ మొరాకోలో సాయుధ వాహనాలను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది.ఇదీ చదవండి: అక్టోబర్లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ప్రస్తుతం టాటా మోటార్స్ భారత సైన్యం కోసం వాహనాలను తయారు చేస్తోంది. వీటిని మన ఆర్మీ ఇప్పుడు వినియోగిస్తుంది కూడా. అయితే ఈ వాహనాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ తయారు చేసే వాహనాలు చాలా దృడంగా ఉంటాయి. -
వామ్మో.. ఐఫోన్ 16 ని 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్న టాటా గ్రూప్
-
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్లో మూడు సంస్థల విలీనం పూర్తి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్లో (టీసీపీఎల్) మూడు అనుబంధ సంస్థల విలీన ప్రక్రియ పూర్తయింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ఇతరత్రా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావడంతో దీన్ని పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. విలీనమైన వాటిల్లో టాటా కన్జూమర్ సోల్ఫుల్, నరిష్ కో బెవరేజెస్, టాటా స్మార్ట్ఫుడ్జ్ ఉన్నాయి. వ్యాపారాన్ని క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు టీసీపీఎల్ తెలిపింది. టీసీపీఎల్కు రూ. 15,206 కోట్ల కన్సాలిడేటెడ్ టర్నోవరు ఉంది. టీ, కాఫీ, ఉప్పు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు, స్నాక్స్, మినీ మీల్స్ లాంటివి కంపెనీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. టాటా టీ, టెట్లీ, టాటా కాఫీ గ్రాండ్ తదితర కీలక బెవరేజ్ బ్రాండ్స్ను విక్రయిస్తోంది. -
టాటా.. గుడ్బై.. విస్తారా ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఇక కనుమరుగు కానుంది. నవంబర్ 12 నుంచి టాటా గ్రూప్లో భాగమైన మరో సంస్థ ఎయిరిండియాలో విలీనం కానుంది. విస్తారా సేవల నిలిపివేతకు నవంబర్ 11 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. నవంబర్ 12 లేదా ఆ తర్వాత చేసే ప్రయాణాలకు సంబంధించి సెపె్టంబర్ 3 నుంచి బుకింగ్స్ నిలిచిపోతాయని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత నుంచి తమ వెబ్సైట్లో బుకింగ్స్ అన్ని ఎయిరిండియా సైటుకు రీడైరెక్ట్ అవుతాయని పేర్కొంది. నవంబర్ 12 తర్వాత ప్రయాణాలకు బుక్ చేసుకున్నవారి ఫ్లయిట్ నంబర్లను సెపె్టంబర్లో దశలవారీగా ఆటోమేటిక్గా ఎయిరిండియాకు మారుస్తారు. కస్టమర్లకు ఆ వివరాలు తెలియజేస్తారు. మరింత విస్తృత నెట్వర్క్, విమానాలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ విలీనం తోడ్పడగలదని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. ఎయిరిండియాలో ఎస్ఐఏకి 25.1 శాతం వాటా.. విలీన డీల్లో భాగంగా ఎయిరిండియాలో రూ. 2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టే ప్రతిపాదనకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రక్రియ పూర్తి కావచ్చని సింగపూర్ ఎయిర్లైన్స్ తెలిపింది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కి 25.1 శాతం వాటా లభిస్తుంది. ఫిట్మెంట్ ప్రక్రియ ప్రారంభం.. ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియపై ప్యాసింజర్లకు స్పష్టతనిచ్చేందుకు ఇప్పటికే ఎఫ్ఏక్యూలను (సందేహాలు, సమాధానాలు) సిద్ధం చేశారు. అలాగే ఫిట్మెంట్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్గా విస్తారా 2015 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. విస్తారాకు 70 విమానాలు ఉండగా, 50 పైచిలుకు గమ్యస్థానాలకు సరీ్వసులు నిర్వహిస్తోంది. ఎయిరిండియాలో కంపెనీ విలీనాన్ని 2022 నవంబర్లో ప్రకటించారు. 2023 సెపె్టంబర్లో ఈ డీల్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. నష్టాల్లోనే కొనసాగుతున్న ఎయిరిండియా, విస్తారాలో 23,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా గ్రూప్ గొడుగు కింద ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
‘పది’ పాసైన మహిళలకు ‘టాటా’ ఉద్యోగం
టాటా గ్రూప్ 4000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకుంటామని ప్రకటించింది. తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ఉత్పత్తుల విడిభాగాల తయారీ, అసెంబ్లీ ప్లాంట్లలో పనిచేయడానికి ఉత్తరాఖండ్కు చెందిన మహిళలకు రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్ఏటీఎస్), నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఏపీఎస్) ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని టాటా గ్రూప్ తెలిపింది. ఈ మేరకు రిక్రూట్మెంట్ ప్రక్రియ గురించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రణాళిక విభాగానికి తెలియజేసింది. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి నేతృత్వంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు టాటా గ్రూప్ పేర్కొంది. ఈ డ్రైవ్లో ఎంపికయ్యే మహిళలు తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ప్లాంట్లలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పింది. తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని కోలార్ ప్లాంట్లపై టాటా ప్రత్యేకంగా దృష్టి సారించింది.ఇదీ చదవండి: డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్డ్రాఎన్ఏపీఎస్లో దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. 10, 12వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత సాధించినవారు ఎన్ఏటీఎస్కు అర్హులని కంపెనీ తెలిపింది. ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన వారిని షాప్ ఫ్లోర్ టెక్నీషియన్లుగా నియమిస్తారు. నిర్ణీత వేతనంతో పాటు అభ్యర్థులకు వసతి, ఆహారం, రవాణా సౌకర్యాలను అందిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. ఇదిలాఉండగా, త్వరలో కంపెనీలో చేరబోయే నాలుగు వేలమంది మహిళలతో టాటా ఉత్పాదకత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో రానున్న రోజుల్లో ఉత్పత్తులు పెరిగి మార్కెట్ డిమాండ్ తీరుతుంది. ఫలితంగా కంపెనీ రెవెన్యూ అధికమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
చేనేత పనితనాన్ని చూసే ఛాన్స్.. లైవ్లూమ్స్
విజయవాడ: చేనేత కళాకారుల పనితనం గురించి వినడమే కానీ... ప్రత్యక్షంగా చూసే అవకాశం అందరికీ కలగదు. ఈ నేపధ్యంలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బ్రాండ్ తనైరా.. చేనేత వస్త్రాల విక్రయ షోరూమ్స్లో లైవ్ లూమ్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిని ఇటీవలే విజయవాడలో ప్రారంభించి త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ సందర్భంగా తనైరా ప్రతినిధులు పంచుకున్న వివరాల ప్రకారం...వైభవానికి ప్రతీక..సంప్రదాయ దుస్తులలో తనదైన ప్రత్యేకత కలిగిన టాటా తనైరా. భారతీయ చేనేత వైభవాన్ని దశదిశలా విస్తరించాలని యోచిస్తోంది. మారుతున్న అభిరుచులు పెరిగిన సాంకేతికతో పోటీ పడలేక అంతరించే దశకు చేరిన ఎన్నో చేనేత కళారూపాలకు పునర్జీవనం పోసేందుకు కృషి చేస్తోంది. అలనాటి చేనేత వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేయటంతో పాటుగా ప్రాంతీయ అరుదైన పనితనంతో అద్భుతాలు అందదించడంలోని శ్రమను, సంక్లిష్టతను తెలియజెప్పేలా.. సంప్రదాయ నేత పద్ధతులతో కస్టమర్లను మళ్లీ అనుసంధానించడానికి తనైరా స్టోర్లలో ఈ లైవ్ లూమ్లని ఏర్పాటు చేసింది. ఇక్కడ, నైపుణ్యం కలిగిన నేత కార్మికులు తమ పనితనం, కళాత్మకతను కస్టమర్స్కి ప్రదర్శిస్తారు. ఉప్పాడ, మంగళగిరి, కలంకారి, ఇకత్లతో సహా గద్వాల్, నారాయణపేట, బనారస్, చందేరి, మహేశ్వర్ తదితర ప్రత్యేకమైన క్రాఫ్ట్ల కళాత్మక వైభవాన్ని మరింత అందంగా ప్రదర్శిస్తుంది.ఎనిమిదేళ్లుగా..తమ కార్యకలాపాలను 2017లో ప్రారంభించిన తనైరా, దేశవ్యాప్తంగా మహిళలను ఆకర్షిస్తూ రూ. 50,000 కోట్ల ఎత్నిక్ వేర్ మార్కెట్లో భారీ వాటాను సొంతం చేసుకుంది. స్థానిక కళాకారుల సహకారంతో సంప్రదాయ నేత పద్ధతులను పునరుద్ధరించడానికి ఈ బ్రాండ్ కట్టుబడి ఉంది, తద్వారా చేనేతల వారసత్వాన్ని కాపాడే పనిలో నిమగ్నమైంది. అరుదైన అంతగా తెలియని బాలుచారి, రంగకత్, వైరౌసి, పటాన్ పటోలా డోలీ బరాత్ వంటి విభిన్న శ్రేణి భారతీయ చేనేతలు సైతం తనైరా ఎంపికలో ఉన్నాయి.విపణిలో నిలిపేలా.. వీవర్శాలసాంప్రదాయ చేనేత పద్ధతులను సంరక్షించడంతో పాటు ఆధునీకరించే లక్ష్యంతో తనైరా గత 2022లో ’వీవర్శాల’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారణాసి, చంపా, కోయంబత్తూర్, బారుయ్పూర్, ఫులియా, మంగళగిరి లాంటి ప్రాంతాల్లో దాదాపు వంద మంది కళాకారులతో 20 వీవర్శాలలల ఏర్పాటు ద్వారా బహుళ తరాలకు చెందిన కళాకారులతో కలిసి పనిచేస్తోంది. -
నిజమవుతున్న రతన్ టాటా కల.. ఇక చైనా అవసరం లేనట్లే!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన తరువాత చాలా దేశాలు సెమీకండక్టర్ చిప్ కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' స్వదేశీ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు నిజం కాబోతోంది.భారతదేశంలో సెమీకండక్టర్ చిప్లను తయారు చేస్తే.. మన దేశం చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. రతన్ టాటా అనుకున్న విధంగానే చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మోరిగావ్ జిల్లాలోని జాగిరోడ్లో ప్లాంట్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమక్షంలో జరిగింది.అస్సాంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ. 27 వేలకోట్లు ఖర్చవుతుందని సమాచారం. నిర్మాణం పూర్తయిన తరువాత సుమారు 27000 కంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. సెమీకండక్టర్ తయారీలో అగ్రగామిగా ఉన్న చైనా మీద.. భారత్ ఆధారపడటం తగ్గుతుంది. దీనికోసం టాటా కంపెనీ కోట్లాది సెమీకండక్టర్లను తయారు చేయడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో భారత్ సెమికండక్టర్ చిప్ ఎగుమతిదారుగా కూడా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: తులం బంగారం కేవలం రూ.63.. మరి ఇప్పుడో..!టాటా సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ 2025 నాటికి సిద్ధమవుతుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన ఐదు నెలల వ్యవధిలోనే ప్లాంట్ నిర్మాణం ప్రారంభించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
బ్రిటిషర్లు కొట్టిన దెబ్బ! ‘టాటా’ సాహసోపేత నిర్ణయం..
భారతీయ పరిశ్రమ పితామహుడిగా భావించే జమ్షెడ్జీ టాటా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా భారతదేశ వ్యాపార ప్రపంచాన్ని మార్చిన జమ్షెడ్జీ టాటా బ్రిటిష్ పాలకులు కొట్టిన దెబ్బతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్లో తొలి సంస్థ మూతపడింది...1890లలో టాటా షిప్పింగ్ లైన్ను మూసివేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో వివరించారు. క్లిష్ట సమయంలో నష్టాలను తగ్గించుకోవడానికి, మరింత ఆచరణీయమైన వెంచర్లపై దృష్టి పెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో జమ్షెడ్జీ టాటా చతురతను ఈ వ్యూహాత్మక చర్య తెలియజేస్తుంది. టాటా గ్రూప్నకు చెందిన వెటరన్లు ఆర్ గోపాలకృష్ణన్, హరీష్ భట్ రాసిన "జమ్సెడ్జీ టాటా - పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్" అనే పుస్తకంలో అప్పటి పరిస్థితులను వివరించారు.అది 1880, 90ల కాలం. భారతదేశం నుంచి షిప్పింగ్లో ఇంగ్లండ్కు చెందిన P.&O సంస్థదే ఆధిపత్యం. ఆ గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ జమ్షెడ్జీ టాటా 'టాటా లైన్'ను ప్రారంభించారు. టాటా పేరును కలిగి ఉన్న మొదటి వ్యాపారం ఇదే. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం మద్దతుతో P.&O భారతీయ వ్యాపారులకు అధిక సరుకు రవాణా రేట్లు విధించింది. బ్రిటిష్, యూదు సంస్థలకు మాత్రం ఎక్కువ రాయితీలను అందించింది.టాటా లైన్ ప్రస్థానం..తన వస్త్ర వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని అనుభవించిన జమ్షెడ్జీ టాటా జపాన్లోని అతిపెద్ద షిప్పింగ్ లైన్ అయిన నిప్పాన్ యుసెన్ కైషా (NYK)తో కలిసి పనిచేయడానికి జపాన్కు వెళ్లారు. జమ్షెడ్జీ టాటా సమానమైన రిస్క్ తీసుకుని, నౌకలను స్వయంగా నిర్వహించినట్లయితేనే తమతో భాగస్వామ్యానికి ఎన్వైకే అంగీకరించింది. దీంతో టాటా 'అన్నీ బారో' అనే ఆంగ్ల నౌకను నెలకు 1,050 పౌండ్లకు అద్దెకు తీసుకున్నారు. ఇది 'టాటా లైన్'లో తొలి నౌక.తాను ప్రారంభించిన ఈ వ్యాపారం మొత్తం భారతీయ వస్త్ర పరిశ్రమకు షిప్పింగ్ రేట్లను తగ్గిస్తుందని, P.&O. గుత్తాధిపత్యాన్ని ఛేదించి టన్ను సరుకు రవాణాకు రూ. 19 నుంచి రూ. 12 వరకు తగ్గుతుందని జమ్సెడ్జీ విశ్వసించారు. అనతికాలంలోనే రెండవ ఓడ 'లిండిస్ఫార్న్'ను అద్దెకు తీసుకున్నారు. 1894 అక్టోబరులో ది ట్రిబ్యూన్ పత్రిక జమ్సెడ్జీ ప్రయత్నాలను ప్రశంసించింది.టాటా లైన్ వ్యాపారాన్ని దెబ్బకొట్టేందుకు P.&O సంస్థ ఎత్తుగడ వేసింది. టాటా లైన్, ఎన్వైకే షిప్లను ఉపయోగించని వ్యాపారులకు షిప్పింగ్ చార్జీని టన్నుకు 1.8 రూపాయలకు తగ్గిస్తామని ప్రకటించింది. దీంతోపాటు ఇలా అంగీకరించిన కొంతమంది వ్యాపారులకు ఉచితంగా రవాణాను కూడా అందించింది. 'లిండిస్ఫార్న్' నౌక పత్తి రవాణాకు పనికిరాదని పుకార్లు వ్యాప్తి చేసింది.క్రమంగా P.&O ప్రభావానికి భయపడి భారతీయ వ్యాపారులు టాటా లైన్తో వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నారు. టాటా లైన్ను మూసివేస్తే భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని హెచ్చరించినప్పటికీ వారు అర్థం చేసుకోలేదు. ఫలితంగా జమ్షెడ్జీ టాటా నష్టాలను చవిచూశారు. ప్రతి నెలా రూ. వేలల్లో నష్టాలు.. ధరల పోటీ ముగిసే సమయానికి టాటా లైన్లో రూ. లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత టాటా లైన్కు స్థిరమైన మార్గం లేదని నిర్ధారించుకున్న జామ్సెడ్జీ విజయవంతమైన వ్యాపారవేత్తగా తన ప్రతిష్టను పణంగా పెట్టి వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. లీజుకు తీసుకున్న ఓడలను ఇంగ్లండ్కు తిరిగి పంపించి టాటా లైన్ను ముగించేశారు. అయితే ఎంప్రెస్ మిల్స్, స్వదేశీ మిల్స్, అహ్మదాబాద్ అడ్వాన్స్ మిల్స్, టాటా స్టీల్ టాటా పవర్తో సహా జమ్షెడ్జీ టాటా స్థాపించిన అనే వ్యాపారాలు విజయవంతమయ్యాయి. -
టాటా స్టీల్.. 2,800 ఉద్యోగాలు కోత
టాటా స్టీల్ తన ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తామన్న ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. బ్రిటన్ తయారీ యూనిట్లోని ‘కార్బన్ ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్’ మూసివేత ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పింది. ఈమేరకు టాటా స్టీల్ గ్లోబల్ సీఈఓ టీవీ నరేంద్రన్ రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్రిటన్లోని టాటా స్టీల్ తయారీ ప్లాంట్లో ఉద్యోగులు కోత ఉండబోతుందని గతంలోనే ప్రకటించాం. ఆ ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదు. ఇప్పటికే ఒక కార్బన్-ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్ను మూసివేస్తున్నట్లు చెప్పాం. ఆమేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. స్టీల్ ముడిసరుకుగా ఉన్న ఐరన్ఓర్ ధరలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం లేదు. యూకే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపించాం. తయారీ యూనిట్లోని మరో బ్లాస్ట్ ఫర్నేస్ను సెప్టెంబర్లో మూసివేసేలా చర్చలు జరుగుతున్నాయి. రెండు ఫర్నేస్లు మూతపడడంతో సౌత్ వేల్స్లోని పోర్ట్ టాల్బోట్ యూనిట్లో 2,800 వరకు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగులు తొలగింపు అంశం యూనియన్లు, కంపెనీ, ప్రభుత్వం సమష్టి బాధ్యత. కేవలం కంపెనీ నిర్ణయాలే వాటిని ప్రభావితం చేయవు’ అని చెప్పారు.ఇదీ చదవండి: జులైలో పెరిగిన జీఎస్టీ వసూళ్లుబ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ జులైలో మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం టాటా స్టీల్ ప్రతినిధులతో చర్చించి ఉద్యోగులు కోతను నివారించేలా చర్యలు చేపడుతుందన్నారు. ప్లాంట్ నుంచి తక్కువ కార్బన్ విడుదలయ్యేలా అవసరమయ్యే సాంకేతిక సహాయం అందిస్తుందని చెప్పారు. ‘లోకార్బన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్’ను నిర్మించడంలో సహాయం చేయడానికి గత ప్రభుత్వం టాటా స్టీల్తో చేసుకున్న 500 మిలియన్ పౌండ్ (రూ.5,318 కోట్లు) ఒప్పంద ప్యాకేజీపై కొత్త ప్రభుత్వం సంతకం చేయాల్సి ఉంది. -
పారిశ్రామిక దిగ్గజం.. ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి
భారతీయ దిగ్గజ సంస్థ 'టాటా గ్రూప్' నేడు ఈ స్థాయిలో ఉందంటే దాని వెనుక ఎంతోమంది కృషి ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 'జేఆర్డీ టాటా' (జహంగీర్ రతన్జీ దాదాభోయ్ టాటా). 1904 జులై 29న జన్మించిన ఈయన సుమారు 53 సంవత్సరాలు టాటా గ్రూప్ సంస్థకు ఛైర్మన్గా ఉన్నారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే కంపెనీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.జేఆర్డీ టాటా ఛైర్మన్గా ఉన్న కాలంలోనే టీసీఎస్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టైటాన్ వంటి విజయవంతమైన వెంచర్లతో సహా 14 కొత్త కంపెనీలను ప్రారంభించారు. అంతే కాకుండా 1956లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) తరహాలో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (TAS)ని స్థాపించారు.జేఆర్డీ టాటా సంస్థలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం విరివిగా విరాళాలు అందించారు. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని అనే భావన ప్రవేశపెట్టిన ఘనత జేఆర్డీ టాటా సొంతం. అంతే కాకుండా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య సేవలు, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ప్రారంభించారు. ప్రమాదాల సమయంలో కార్మికులకు నష్టపరిహారం అందించే విధానం కూడా ఈయనే మొదలుపెట్టారు.1936లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) స్థాపించారు. ఆ తరువాత 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR), నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా స్థాపించారు. 1968లో టాటా కంప్యూటర్ సెంటర్గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్థాపించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. ఆ తరువాత 1987లో టైటాన్ను స్థాపించారు.15 సంవత్సరాల వయసులోనే ఫైలట్ కావాలని, విమానయాన రంగంలో వృత్తిని కొనసాగించాలని నిశ్చయించుకున్న జేఆర్డీ టాటా 24 ఏళ్ల వయసులో ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. దీంతో ఈయన భారతదేశంలో మొట్టమొదటి ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత టాటా ఎయిర్ సర్వీస్ ప్రారంభించారు. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే చివరికి ఈ సంస్థ మళ్ళీ ఎయిర్ ఇండియాగా టాటా గ్రూపులోకే వచ్చింది.టాటా గ్రూప్ అభివృద్ధికి మాత్రమే కాకుండా.. ఉద్యోగుల జీవితాల్లో కూడా మార్పులు తీసుకువచ్చిన జేఆర్డీ టాటా 1993 నవంబర్ 29న జెనీవాలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. పారిశ్రామిక రంగంలో ఈయన చేసిన కృషికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రధానం చేసింది. దీంతో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన ఏకైక పారిశ్రామికవేత్తగా జేఆర్డీ టాటా చరిత్ర సృష్టించారు. -
ఈపీఎఫ్ఓ-టాటా మోటార్స్ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో విచారణ
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఉద్యోగుల భవిష్య నిధిని ఈపీఎఫ్ఓకు బదిలీ చేసే అంశంపై చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. గతంలో కంపెనీ చెల్లించిన ఈపీఎఫ్ఓ పెన్షన్ ఫండ్ను తిరిగి సంస్థ అకౌంట్లో జమ చేయాలని కోరుతుంది. అయితే సంస్థలోని ఉద్యోగులు, కంపెనీ ఆర్థికస్థితికి సంబంధించి వివరణాత్మక డాక్యుమెంటేషన్ సమర్పించాలని ఈపీఎఫ్ఓ తెలిపింది. దీనిపై ఇరు సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టులో ఆగస్టు 8న విచారణ జరగనుంది.టాటా మోటార్స్ 2019-20, 2020-21, 2021-22 వరుసగా మూడు సంవత్సరాలు నష్టాలను చవిచూసింది. దాంతో యాక్చురియల్ వాల్యుయేషన్(ఆస్తులు, ఖర్చులను పోల్చి చూసే విశ్లేషణ పత్రం) ద్వారా పెన్షన్ ఫండ్ చెల్లింపులను రద్దు చేయాలని కోరింది. 2019లో కంపెనీ మినహాయింపు పొందిన పెన్షన్ ఫండ్ను సరెండర్ చేయడానికి ఈపీఎఫ్ఓకు దరఖాస్తు చేసింది.ఇదీ చదవండి: నిఫ్టీ 25,000 పాయింట్లకు..?భవిష్య నిధికి సంబంధించిన కార్పస్ బదిలీకి ఈపీఎఫ్ఓ అంగీకరించింది. కానీ, అధికారులు పెన్షన్ స్కీమ్ వివరాలను కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల పెన్షన్ కార్పస్కు సంబంధించిన పత్రాలు, రికార్డులు, ఇతర సమాచారాన్ని అందించాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది. గతంలో కంపెనీ సమర్పించిన నగదు బదిలీని అనుమతించడానికి అవసరమయ్యే నిర్దిష్ట ఖాతాల సమాచారం అస్పష్టంగా ఉందని పేర్కొంది. ఈ అంశం ఆగస్టు 8న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. -
ఎయిరిండియాలో కొత్తగా నారోబాడీ ఎయిర్క్రాఫ్ట్
ప్రీమియం ఎకానమీ సీట్లు కలిగిన ‘ఏ320 నియో’ నారోబాడీ(వెడల్పు తక్కువగా ఉండే) విమానం ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్ల్లోకి చేరింది. ఫ్రాన్స్లోని ఎయిర్బస్ సంస్థ దీన్ని రూపొందించినట్లు ఎయిరిండియా తెలిపింది. ఇటీవలే ఇది దిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి.ఎయిరిండియా తెలిపిన వివరాల ప్రకారం..ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్కు భిన్నంగా, సరికొత్త లివరీ(ఇంటెరియర్ డిజైన్)తో ఈ విమానాన్ని తయారుచేశారు.ఇదీ చదవండి: ‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ఎయిరిండియా సంస్థ తిరిగి టాటా గ్రూప్ అధీనంలోకి వచ్చాక కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. విమానాల ఆధునికీకరణ ప్రారంభమైంది. కొత్త విమానాలను కొనుగోలు చేస్తామని, ఉన్నవాటిలో సదుపాయాలను మెరుగుపరుస్తామని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దేశీయంగా టైర్ 2, టైర్ 3 నగరాలకు విమాన సర్వీసులు అందించాలని ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. దాంతో విమానయాన కంపెనీలు అందుకు అవసరమయ్యే ఎయిర్క్రాఫ్ట్లను సమకూర్చుకుంటున్నాయి. దేశీయ మార్గాల్లో ఎయిరిండియా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఏ320 నియో’ నారోబాడీ విమానాన్ని వచ్చే నెల నుంచి నడపనుంది. -
భారత్లోనే విలువైన బ్రాండ్
భారత్లో అత్యంత విలువైన బ్రాండ్ల్లో టాటా గ్రూప్ టాప్లో నిలిచింది. ఈ మేరకు బ్రాండ్ ఫైనాన్స్ తాజాగా విడుదల చేసిన విలువైన బ్రాండ్ ర్యాంకింగ్స్ టైటిల్ను టాటా గ్రూప్ దక్కించుకుంది. డిజిటలైజేషన్, ఈ-కామర్స్, ఈవీ, ఎలక్ట్రానిక్స్..వంటి రంగాలపై దృష్టి సారించిన ఈ సంస్థ బ్రాండ్ విలువ గతంలో కంటే 9 శాతం పెరిగి 28.6 బిలియన్ డాలర్ల(రూ.2.3 లక్షల కోట్లు)కు చేరుకుంది. గతేడాది ఈ టైటిల్కు దక్కించుకున్న టాటా గ్రూప్ ఈసారీ తన స్థానాన్ని నిలుపుకుంది.బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం..దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూప్ టాప్లో నిలిచింది. 14.2 బిలియన్ డాలర్ల(రూ.1.18 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ మూడో స్థానం (రూ.86 వేలకోట్లు) సాధించింది. గతేడాదిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం అవ్వడంతో ఈ స్థానం దక్కింది. ఎల్ఐసీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ గ్రూప్, ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, లార్సెన్ & టూబ్రో, మహీంద్రా బ్రాండ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ సావియో డిసౌజా మాట్లాడుతూ..‘టాటా గ్రూప్ దాని అనుబంధ సంస్థల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తోంది. వ్యూహాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్షిప్లు, ఎయిరిండియా వంటి కంపెనీ వాటాను సొంతం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ డొమైన్లో ప్రత్యేకత చాటుకుంటోంది. దాంతో కంపెనీ వినియోగదారులకు మరింత చేరువైంది. భారత్లోనే అత్యంత విలువైన బ్రాండ్గా స్థానం సంపాదించింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అత్యంత ధనవంతులపై ‘సంపద పన్ను’..?రంగాల వారీగా చూస్తే టెలికాం రంగం తన బ్రాండ్ విలువలో గతంలో కంటే 61 శాతం వృద్ధి సాధించింది. బ్యాంకింగ్ 26 శాతం, మైనింగ్, ఇనుము, ఉక్కు రంగాలు 16 శాతం చొప్పున వృద్ధి నమోదు చేశాయి. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో వెస్ట్సైడ్ బ్రాండ్(టాటా గ్రూప్- 122 శాతం వృద్ధి) అగ్రస్థానంలో ఉంది. -
ఎయిరిండియా భోజనంలో మెటల్ బ్లేడ్..!
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా విమానంలో ఏర్పాటుచేసిన భోజనంలో మెటల్ బ్లేడ్ గుర్తించినట్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కంపెనీ వర్గాలు స్పందిస్తూ ఘటనను ధ్రువీకరించాయి.ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ..‘మా విమానంలో ఒక ప్రయాణికుడి భోజనంలో మెటల్ వస్తువు గుర్తించారు. దానిపై వెంటనే దర్యాప్తు జరిపాం. కూరగాయలు కట్ చేసేందుకు ఉపయోగించే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఆ మెటల్ వస్తువు వచ్చినట్లు తెలిసింది. మా క్యాటరింగ్ భాగస్వామి సదుపాయాలు, పరిసరాలను నిత్యం తనిఖీ చేయడంతో పాటు, ముఖ్యంగా ఏదైనా గట్టి కూరగాయలను తరిగే క్రమంలో జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతామని హామీ ఇస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్.. కారణం..ఇటీవల ఎయిరిండియా విమానయాన సంస్థలో సరిగా ఉడకని ఆహారం తనకు ఇచ్చారని, సీటు సరిగాలేదని మరో ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం..న్యూదిల్లీ నుంచి నెవార్క్ వెళ్లేందుకు ఎయిర్ఇండియాలో ప్రయాణించాలని నిర్ణయించుకుని బిజినెస్క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. విమానం టేకాఫ్ అయిన దాదాపు 30 నిమిషాల తర్వాత పడుకోవాలనుకున్నాడు. దాంతో సీటును ఫ్లాట్బెడ్(పడుకునేందుకు వీలుగా)మోడ్కు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దాంతో తీవ్ర నిరాశకుగురైనట్లు ప్రయాణికుడు చెప్పాడు. దాంతోపాటు అదే విమానంలో సరిగా ఉడకని ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నాడు. -
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్పూర్లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్పూర్లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
టైమ్ జాబితాలో రిలయన్స్, టాటా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. 2024కి గాను ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీలతో టైమ్ దీన్ని రూపొందించింది. ఈ లిస్టులో రిలయన్స్ చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. 2021లో కూడా ఈ జాబితాలో రిలయన్స్ ఉంది. కంపెనీలను అయిదు విభాగాలుగా వర్గీకరించగా టైటాన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటాలను టైమ్ చేర్చింది. పయొనీర్స్ కేటగిరీలో సీరమ్ ఉంది. 58 ఏళ్ల క్రితం టెక్స్టైల్, పాలీయెస్టర్ కంపెనీగా ఏర్పాటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిందని టైమ్ పేర్కొంది. 1868లో ప్రారంభమైన టాటా గ్రూప్.. సాల్ట్ (ఉప్పు) నుంచి సాఫ్ట్వేర్ వరకు వివిధ రంగాల్లో విస్తరించిందని తెలిపింది. 2023లో ఐఫోన్లను అసెంబుల్ చేసే తొలి భారతీయ కంపెనీగా నిలి్చందని వివరించింది. అటు సీరమ్ ఏటా 3.5 బిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వేక్సిన్ల తయారీ సంస్థగా ఉందని టైమ్ పేర్కొంది. -
టాటా గ్రూప్లో ఆశా కిరణం లియా టాటా!
పెదనాన్న రతన్ టాటా బాటలో టాటా గ్రూప్ లో తనదైన ముద్ర వేస్తున్నారు లియా టాటా. రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా పెద్ద కుమార్తె ఈ లియా టాటా. మంచి విద్యా నేపథ్యం, బిజినెస్ కెరియర్తో దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.విద్యా నేపథ్యంటాటా గ్రూప్లో తనదైన అద్భుత కెరీర్ను ఏర్పరుచుకుంటున్న లియా టాటాకు బలమైన విద్యా నేపథ్యం ఉంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని ప్రతిష్ఠాత్మక ఐఈ బిజినెస్ స్కూల్ లో మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె కార్పొరేట్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను సమకూర్చుకున్నారు.తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా 2006లో తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించారు లియా టాటా. కొన్నేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తాజ్ హోటల్స్ లో డెవలప్ మెంట్ అండ్ ఎక్స్ టెన్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హోటల్ కంపెనీలో భాగమైన లగ్జరీ హోటల్ చైన్ వృద్ధి, వ్యూహాత్మక కార్యక్రమాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు.టాటా గ్రూప్లో కీలక పాత్రఇండియన్ హోటల్ కంపెనీలో అంతర్భాగమై, దాని కార్యకలాపాలు, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు లియా టాటా. ఈ ఇండియన్ హోటల్ కంపెనీ ప్రఖ్యాత తాజ్ హోటల్స్తో సహా టాటా గ్రూప్ హోటళ్ళ విస్తృతమైన నెట్వర్క్ను నిర్వహిస్తుంది. బ్రాండ్ శ్రేష్ఠత, ఆతిథ్యం వారసత్వాన్ని కొనసాగించడంలో లియా టాటా కృషి గణనీయంగా ఉంది.తాజ్ హోటల్స్ లో బాధ్యతలతో పాటు, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధనకు అంకితమైన టాటా గ్రూప్ విభాగమైన టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో కూడా లియా టాటా కొనసాగుతున్నారు. 2022 నవంబర్లో జరిగిన ఈ నియామకం ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన దశ. సంస్థలో క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకుంటున్న లియా టాటాకు ఆమె వృత్తిపరమైన ప్రయాణానికి రతన్ టాటా మార్గనిర్దేశం చేస్తున్నారు. -
నిమిషానికి 90 టీ-షర్ట్స్ సేల్.. దూసుకెళ్లిన అమ్మకాలు
టాటా గ్రూప్ ఫ్యాషన్ చైన్ జూడియో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నిమిషానికి 90 టీ-షర్టులు, 17 లిప్స్టిక్లను విక్రయించినట్లు మాతృ సంస్థ ట్రెంట్ తన వార్షిక నివేదికలో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.జూడియో ప్రతి నిమిషానికి 20 డెనిమ్లు విక్రయిస్తూ.. యువ కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రెంట్ ఆదాయం 36.1 మిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. అంతే కాకుండా సంస్థ కొత్తగా మరో 46 నగరాల్లో స్టోర్స్ ప్రారంభించింది.2016లో ప్రారంభించిన జుడియోకి 2024 మార్చి నాటికి 161 నగరాల్లో 545 స్టోర్స్ ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 86 జూడియో ఔట్లెట్లు, గుజరాత్లో 82 ఉన్నాయి. కర్ణాటకలో 58, ఢిల్లీలో 14 ఔట్లెట్లు జూడియోకు ఉన్నాయని మే 18న విడుదల చేసిన నివేదిక పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కింలలో ఒక్కో స్టోర్ ఉన్నాయి. కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసి.. కస్టమర్లకు చేరువ్వడం వల్ల అమ్మకాలు పెరుగుతున్నాయని సంస్థ తెలిపింది. -
ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
ఎయిరిండియా విమానంలో సౌకర్యాలపై ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. అకల్ ధింగ్రా న్యూయార్క్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియాలో విమానంలో ప్రయాణించారు. ప్రయాణంలో తాను ఆహారం, చైర్లు ఇతర సదుపాయాలపై అసౌకర్యానికి గురయ్యాడు. మరో నెలలో ఢిల్లీ నుంచి న్యూయార్క్కు వెళుతున్నానని, పొరపాటున కూడా ఎయిరిండియా విమానం ఎక్కబోనంటూ ఆ వీడియోలో తెలిపాడు.అకల్ ధింగ్రా వీడియోలో స్లైడింగ్ టేబుల్ సరిగా పనిచేయకపోవడం, దెబ్బతిన్న హెడ్ఫోన్ జాక్ వంటి అనేక సమస్యల్ని ఎత్తి చూపాడు. విమానంలో అందించిన ఆహారం కూడా నాణ్యతగా లేదని కూడా చెప్పాడు. చివరగా.. ‘న్యూయార్క్ నుండి ఢిల్లీకి నా ఎయిర్ ఇండియా విమానం విపత్తు!’ అని వీడియో క్యాప్షన్లో జతచేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఎయిరిండియా విమాన ప్రయాణంలో తమకు చేదు అనుభవాలున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akul Dhingra (@akuldhingra) -
పదేళ్లలో ఫస్ట్టైమ్! టీసీఎస్ను మించిన మరో టాటా కంపెనీ..
టాటా గ్రూప్లోని కంపెనీలన్నింటిలో అత్యంత లాభదాయక కంపెనీగా ఉన్న దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను మరో టాటా కంపెనీ అధిగమించింది. ఇలా జరగడం గత పదేళ్లలో ఇదే తొలిసారి.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.17,407 కోట్ల నికర లాభంతో టాటా మోటార్స్ టీసీఎస్ నికర లాభం రూ.12,434 కోట్లను అధిగమించింది. టాటా మోటార్స్ లాభం ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.5,407.79 కోట్లు ఉండగా ఈ ఏడాది ఏకంగా 221.89 శాతం పెరిగింది. మరోవైపు టీసీఎస్ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.11,392 కోట్ల నుంచి 9.1 శాతం వృద్ధిని సాధించింది.టాటా మోటర్స్ చివరిసారిగా 2014 జూన్ త్రైమాసికంలో టాటా గ్రూప్లో అత్యంత లాభదాయకమైన కంపెనీ స్థానాన్ని ఆక్రమించింది. అయితే గ్రూప్లోని మరో పెద్ద కంపెనీ టాటా 2024 క్యూ4 ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. టాటా మోటార్స్ టీసీఎస్ త్రైమాసిక లాభాలను అధిగమించినప్పటికీ , వార్షిక ప్రాతిపదికన టాటా గ్రూప్లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా టీసీఎస్ కొనసాగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ మొత్తం లాభం రూ.45,908 కోట్లు కాగా టాటా మోటార్స్ మొత్తం లాభం రూ.31,399 కోట్లు. -
ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్ర క్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఇ రు సంస్థలకు చెందిన 7 వేల మంది ఉద్యోగుల ఫిట్ మెంట్ (ప్రస్తుత ఉద్యోగులను విలీన సంస్థలో వారికి అప్పగించే బాధ్యతలు) ప్రక్రియ జూన్ కల్లా పూర్తి కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రెండు సంస్థల ఉద్యోగులతో దాదాపు గంటన్నర పా టు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయాలు వి వరించినట్లు పేర్కొన్నాయి. ఇరు కంపెనీల్లో ప్రస్తుతం 23,500 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో తమకు జాయింట్ వెంచరుగా ఉన్న విస్తారను, ఎయిరిండియాను విలీనం చేయనున్నట్లు 2022 నవంబర్లో ప్రకటించింది. ఈ డీల్ పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ కు 25.1% వాటా ఉంటుంది. అలాగే ఎయిరిండియా అతి పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది. -
సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముకుమ్మడిగా సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగులను తొలగించింది. సెలవు అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఉద్యోగులు విధులకు రాకపోవడంతో బుధవారం సంస్థ దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.‘సిక్లీవ్ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్ లేటర్లో కంపెనీ తెలిపింది.బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..ఇదిలాఉండగా, ఎయిరిండియా వైఖరిపట్ల సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను ఎయిర్ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు లేఖ రాసింది. -
ఎయిరిండియాలో ఆకస్మిక సమ్మె
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్ క్రూలోని 200 మందికి పైగా సిబ్బంది మంగళవారం రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామంతో ఎయిరిండియా 100 వరకు దేశీయ, అంతర్జాతీయ సరీ్వసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా, కోచి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సరీ్వసుల రద్దు విషయం కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో తెలిపారు. దీంతో, వారు ఎయిరిండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. వేసవి రద్దీ దృష్ట్యా మార్చి చివరి వారం నుంచి రోజూ 360 సరీ్వసులను నడుపుతోంది. టాటా గ్రూప్నకే చెందిన విస్తారాను ఎయిరిండియాతో, అదేవిధంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను ఏఐఎక్స్ కనెక్ట్తో విలీనం చేయాలన్న నిర్ణయం క్యాబిన్ క్రూలోని సీనియర్ల అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు. నిర్వహణ లోపం సీనియర్ ఉద్యోగుల నైతికతను దెబ్బతీసిందని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. విమాన సర్వీసుల రద్దుపై బుధవారం కేంద్ర పౌరవిమాన యాన శాఖ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ నుంచి వివరణ కోరింది. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. రద్దయిన సరీ్వసులకు టిక్కెట్ చార్జీలను వాపసు చేస్తామని, కోరిన పక్షంలో మరో తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తామని వివరించారు. -
భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ భారత్లో కార్యకలాపాలపై ఆసక్తిగా ఉందని తెలుస్తుంది. తాజాగా ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ సరఫరా చేసేందుకు భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ తయారీకి టాటా గ్రూప్నకు చెందిన టైటాన్ కంపెనీతో, మురుగప్ప గ్రూప్తో యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే కుపెర్టినో కంపెనీ తన కార్యకలాపాలను చైనాతోపాటు భారత్లో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కుపెర్టినో కంపెనీ చైనాలో ఐఫోన్ కెమెరాలను తయారుచేస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి మరో 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. టైటాన్ గడియారాలు, ఇతర ఆభరణాల తయారీలో ప్రత్యేకత చాటుకుంటోంది. చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న మురుగప్ప గ్రూప్నకు ఇంజినీరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్స్ రంగంలో 100 ఏళ్ల అనుభవం ఉంది. ఈనేపథ్యంలో ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని నోయిడాకు చెందిన కెమెరా మాడ్యూల్ తయారీ సంస్థ మోషిన్ ఎలక్ట్రానిక్స్లో మురుగప్ప గ్రూప్ 76% వాటాను కొనుగోలు చేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న టైటాన్ కంపెనీ ఇంజినీరింగ్, ఆటోమేషన్లో సేవలందిస్తోంది. హై ప్రెసిషన్ కాంపోనెంట్ తయారీ, ఇంజినీరింగ్ డిజైన్ సర్వీస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లోను సేవలందిస్తోంది. యాపిల్ జనవరి నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్లో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ఐఫోన్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో స్థానికంగా ఆ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఇండియాలో తయారవుతున్న దాదాపు 70 శాతం ఐఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచంలోని రద్దీ ఎయిర్పోర్ట్ల్లో భారత విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా యాపిల్ భారత్లో తయారీకి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. -
ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం
టెస్లా తన కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈమేరకు కొన్ని వార్తామీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. కొన్నినెలల కొందట టాటా గ్రూప్ సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్ తయారీ నేపథ్యంలో టాటాగ్రూప్ గ్లోబల్ క్లయింట్లను సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగా టెస్లాతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టెస్లా భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఈవీపాలసీ నిబంధనలతో దాదాపు ఆ సంస్థ భారత్ ప్రవేశానికి లైన్ క్లియరైంది. ఈ తరుణంలో ఇండియాలో తమ తయారీ ప్లాంట్ పెట్టేందుకు టెస్లా సిద్ధపడుతోందని తెలిసింది. ఈనెల 21న ఎలొన్మస్క్ ఇండియా రానున్నారు. ఈమేరకు దానిపై కీలక నిర్ణయం వెలువడనుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ తప్పు చేస్తాం..’ 10వేల డాలర్లు ఆఫర్.. ఈ పరిణామాల నేపథ్యంలో టాటాగ్రూప్ టెస్లాతో సెమీకండక్టర్ల విషయంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరు కంపెనీల మధ్య ఎంత విలువ చేసే డీల్ కుదిరిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మస్క్ భారత్ పర్యటనలో భాగంగా దాదాపు 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అమెరికన్ ఈవీ దిగ్గజ సంస్థ దేశంలో తమ ఉత్పత్తుల తయారీకోసం రిలయన్స్తో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. -
Tata Group: ఇన్వెస్టర్లకు పండగే.. టాటా గ్రూప్ నుంచి వరుస ఐపీఓలు
-
ఫుడ్ డెలివరీలోకి టాటా న్యూ
ముంబై: టాటా గ్రూప్ రూపొందించిన మలీ్టపర్పస్ సూపర్ యాప్ టాటా న్యూ వచ్చే ఏడాది రెండో వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో డిజైన్ను సరికొత్తగా మార్చే యోచనలో ఉంది. అంతేకాకుండా ఆన్లైన్ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)ను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాల ప్రకారం సాంకేతిక అంశాల కారణంగా యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ)ను బ్లాక్ నుంచి వైట్ బ్యాక్గ్రౌండ్లోకి మార్చనుంది. 2022 ఏప్రిల్ 7న టాటా గ్రూప్ సూపర్ యాప్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత క్లోజ్డ్ యూజర్ గ్రూప్తో టాటా న్యూ యాప్ ప్రారంభంకాగా.. రెండు నగరాల(బెంగళూరు, ఢిల్లీ)కే పరిమితమైంది. ప్రస్తుతం ఓఎన్డీసీతోపాటు మ్యాజిక్పిన్ సహకారం ద్వారా ఫుడ్ డెలివరీ సరీ్వసులను ప్రవేశపెట్టనుంది. గతేడాది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా మ్యాజిక్పిన్ ఫుడ్ ఆర్డర్లు రెట్టింపయ్యాయి. కాగా.. గత నెలలో కొత్త సీఈవోగా సీఈవో నవీన్ తహిల్యానికి బాధ్యతలు అప్పగించడంతోపాటు పలు మార్పులకు టాటా న్యూ తెరతీసింది. వివిధ బిజినెస్ చీఫ్లతో నవీన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పరిస్థితులపై ఉద్యోగులతో సర్వే చేపట్టారు. -
Ratan Tata Photos: ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా టాటా.. మరెన్నో ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
ఐకానిక్ భవనాన్ని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎందుకంటే..
ఎయిరిండియాకు చెందిన ముంబయిలోని ప్రతిష్ఠాత్మక ఐకానిక్ భవనం యాజమాన్య హక్కులను మహారాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఈ భవనాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,601 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో దక్షిణ ముంబయిలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న ఎయిరిండియా భవనం యాజమాన్య హక్కులను కేంద్రం.. మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆస్తుల బదిలీకి తాజాగా ఆమోదం తెలిపింది. 1970ల్లో కేవలం ఈ భవనంలోని ఎలివేటర్ను ఎక్కడం కోసమే ప్రజలు క్యూ కట్టేవారట. జేఆర్డీ టాటా ఆలోచనలకు తగ్గట్లుగా న్యూయార్క్ ఆర్కిటెక్ట్ జాన్ బర్గీ డిజైన్ చేసిన ఈ 23 అంతస్తుల భవనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకుంది. దీన్ని సచివాలయంలోని కొన్ని విభాగాల కోసం ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. కంపెనీ బకాయిపడిన రూ.298.42 కోట్లను మాఫీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఇదీ చదవండి: ‘రాజకీయంగా దాడి చేశారు.. వారు దెబ్బతినడం బాధించింది’ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎయిరిండియాను టాటాలకు విక్రయించినప్పుడు ఎయిర్లైన్స్కు చెందిన నాన్-కోర్ ఆస్తుల్ని అందులో చేర్చలేదు. దీంతో సంస్థకు చెందిన భూమి, భవనాలు వంటి రూ.14,718 కోట్ల విలువైన వాటిని ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ కంపెనీ(ఏఐఏహెచ్ఎల్)కు బదిలీ చేసింది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాను టాటా గ్రూపు 2021 అక్టోబరులో రూ.18,000 కోట్లకు బిడ్డింగ్లో దక్కించుకుంది. -
2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్
ధోలేరా (గుజరాత్): టాటా ఎల్రక్టానిక్స్ తలపెట్టిన ధోలేరా (గుజరాత్) ప్లాంటు నుంచి చిప్ల తొలి బ్యాచ్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్ నోడ్ల చిప్స్ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్నకు చెందిన రెండు, సీజీ పవర్కి చెందిన ఒక చిప్ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
రెండు కంపెనీలుగా టాటా మోటార్స్
టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. వాణిజ్య వాహనాలు ఒక సంస్థగా, ప్రయాణికుల వాహనాలు మరో కంపెనీగా ఏర్పాటుకానుంది. తద్వారా వృద్ధి అవకాశాలను మరింత బలంగా అందిపుచ్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంటోంది. న్యూఢిల్లీ: ఆటో రంగ లిస్టెడ్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు కంపెనీలుగా విడిపోయేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు టాటా మోటా ర్స్ వెల్లడించింది. వీటి ప్రకారం సంబంధిత పెట్టుబడులతో కలిపి వాణిజ్య వాహన విభాగం ఒక సంస్థగా ఏర్పాటుకానుంది. విలాసవంత కార్ల యూనిట్ జాగ్వార్ ల్యాండ్రోవర్సహా ప్యాసింజర్ వాహనాల(పీవీ) బిజినెస్ మరో కంపెనీగా ఆవిర్భవించనుంది. దీనిలో సంబంధిత పెట్టుబడులతోపాటు ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) విభాగంసైతం కలసి ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు టాటా మోటార్స్ తెలియజేసింది. ఎన్సీఎల్టీ నిబంధనలకు అనుగుణంగా విడదీతను చేపట్టనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ వాటాదారులు 2 లిస్టెడ్ సంస్థలలోనూ యథాతథంగా వాటాలను పొందుతారని స్పష్టం చేసింది. టర్న్ అరౌండ్ గత కొన్నేళ్లలో కంపెనీ బలమైన టర్న్అరౌండ్ను సాధించింది. మూడు ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్లూ స్వతంత్ర నిర్వహణలో కొనసాగుతూ నిలకడైన పనితీరును చూపుతున్నాయి. తాజా విడదీతతో మార్కెట్ కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోనున్నాయ్. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా మోటార్స్ 12–15 నెలలు కంపెనీ విడదీతతో కస్టమర్లకు సేవలు విస్తృతమవుతాయని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని, వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. విడదీత ప్రణాళికకు రానున్న నెలల్లో బోర్డుసహా.. వాటాదారులు, రుణదాతలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందనున్నట్లు తెలియజేశారు. విడదీత పూర్తికి 12–15 నెలలు పట్టవచ్చని అంచనా వేశారు. కంపెనీ విడదీత ఉద్యోగులు, కస్టమర్లు, వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్నీ చూపబోదని స్పష్టం చేశారు. కాగా.. వాణిజ్య, ప్రయాణికుల వాహన విభాగాల మధ్య పరిమితమైన ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు 88 అనుబంధ సంస్థలు, మూడు సంయుక్త కంపెనీలు, రెండు సంయుక్త కార్యకలాపాలు తదితరాలతో విస్తరించాయి. తాజా వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు రూ. 996 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టం. చివరికి నామమాత్ర నష్టంతో రూ. 987 వద్ద ముగిసింది. -
సెమీకండక్టర్ ఎకోసిస్టమ్పై మంత్రి వీడియో
భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను వివరిస్తూ సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాలుగు నిమిషాల నిడివిగల వీడియో, దేశంలో పటిష్ఠమైన సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను రూపొందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. ఇటీవల మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల స్థాపనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఈ వీడియో వైరల్ మారుతుండడం విశేషం. అందులో టాటా గ్రూప్ 2 ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా.. జపాన్కు చెందిన రెనెసాస్ భాగస్వామ్యంతో సీజీ పవర్ ఒక ప్లాంటు నిర్మించనుంది. ఇవి రాబోయే 100 రోజుల్లో నిర్మాణాన్ని ప్రారంభించనున్నాయి. వీటి వల్ల మొత్తం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇదీ చదవండి: 3000 ఎకరాల్లో కృత్రిమ అడవిని నిర్మించిన కొత్త పెళ్లికొడుకు మంత్రి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ గురించి వివరిస్తున్న వీడియోలో డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఏటీఎంపీ (అసెంబ్లీ-టెస్టింగ్-మార్కింగ్-ప్యాకేజింగ్) సర్క్యూట్ వంటి ముఖ్యమైన విభాగాల గురించి మాట్లాడటం గమనించవచ్చు. సెమీకండక్టర్ ఎకోసిమ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ప్రభుత్వం దృష్టిసారించినట్లు చెప్పారు. అందుకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్(ఏడీఏ) టూల్స్ చాలా ఖరీదైనవన్నారు. కేవలం ఒక లైసెన్స్ కోసం రూ.10-15 కోట్ల వరకు ఖర్చవుతుందని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఈ ఈడీఏ సాధనాలను దేశంలోని 104 యూనివర్సిటీలకు పంపిణీ చేసిందని తెలిపారు. #WATCH | Delhi | During his media interaction after the cabinet approval of 3 more semiconductor units, Union Minister Ashwini Vaishnaw explains the development of India’s semiconductor ecosystem on the whiteboard in his office. pic.twitter.com/D9RHfhAryE — ANI (@ANI) March 1, 2024 -
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ బంపరాఫర్!
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శుభవార్త చెప్పింది. చెక్ ఇన్ బ్యాగేజీ లేకుండా ప్రయాణించడానికి ఇష్టపడే ప్రయాణీకులకు తగ్గింపు ధరలలో టికెట్ల ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎక్స్ప్రెస్ లైట్ ద్వారా ప్రయాణికులు సాధారణ ఛార్జీల కంటే తక్కువ ధరలో విమాన టికెట్లను పొందవచ్చు. ఎక్స్ ప్రెస్ చెక్ ఇన్ ఫ్లయర్ కౌంటర్లు, బ్యాగేజీ బెల్ట్ వద్ద క్యూలను నివారించేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా బుక్ చేసుకుంటే 15 కిలోలు, 20 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీలపై డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. ఎక్స్ప్రెస్ లైట్ ఛార్జీలపై ప్రయాణించే ప్రయాణికులు కాంప్లిమెంటరీ కింద అదనంగా 3 కిలోల బ్యాగేజీని ఫ్రీగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎయిర్ పోర్ట్ ఎయిర్ లైన్ కౌంటర్లలోని ప్రయాణికులు చెక్ ఇన్ బ్యాగేజీ సేవలను వినియోగించుకోవచ్చని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
‘సాహో’ రతన్ టాటా!.. టాటా గ్రూప్ మరో సంచలనం..
టాటా గ్రూప్ కంపెనీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. టాటా గ్రూప్ కంపెనీల విలువ దాయాది దేశం పాకిస్తాన్ జీడీపీని దాటిందని ఎకనమిక్స్ టైమ్స్ (ET) నివేదించింది. ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ రంగాల వరకు తన సర్వీసుల్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న టాటా గ్రూప్ కంపెనీల అన్నీ స్టాక్స్ గత ఏడాది నుంచి ఊహించని లాభాల్ని గడిస్తున్నాయి. ఫలితంగా టాటా గ్రూప్ కంపెనీల మొత్తం విలువ పాకిస్తాన్ జీడీపీని అధిగమించిందని పేర్కొంది. ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం.. టాటా గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూ సుమారు 365 బిలియన్ డాలర్లు. అంటే భారత్ కరెన్సీలో అక్షరాల రూ.30లక్షల కోట్లు. ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం.. పాకిస్తాన్ జీడీపీ 341 బిలియన్ డాలర్లు. టీసీఎస్ హవా స్టాక్ మార్కెట్లో లిస్టైన టాటా గ్రూప్ మొత్తం కంపెనీల్లో టీసీఎస్ విలువ సుమారు 15లక్షల కోట్లుగా ఉంది. ఈ మొత్తం టీసీఎస్ విలువ పరిమాణం పాకిస్తాన్ ఎకానమీలో దాదాపూ సగం ఉంది. ప్రస్తుతం పాక్ ఆర్ధిక వ్యవస్థ అప్పుల్లో కూరుకుపోవడం అందుకు కారణమని తెలుస్తోంది. సత్తా చాటిన మల్టీ బ్యాగర్ స్టాక్స్ అన్ని టాటా గ్రూప్ కంపెనీలు తమ మెరుగైన పనితీరుతో మార్కెట్ విలువ పెరుగుదలకు దోహదపడగా, టాటా మోటార్స్, ట్రెంట్లు మల్టీబ్యాగర్ స్టాక్స్లో ఆకట్టుకున్నాయి. టాటా మోటార్స్ షేర్లు కేవలం ఏడాది వ్యవధిలో 110 శాతం పెరగ్గా, ట్రెంట్ 200 శాతం భారీగా లాభపడింది. ఇది టాటా టెక్నాలజీస్, టీఆర్ఎఫ్, బెనెరాస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్ట్సన్ ఇంజినీరింగ్ స్టాక్స్ పనితీరు కంటే మెరుగ్గా రాణించాయి. 25కి పైగా లిస్టెడ్ కంపెనీలు కాగా, పలు నివేదిక ప్రకారం.. టాటా గ్రూప్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టైన కంపెనీలు కనీసం 25 ఉన్నాయి. వాటిలో టాటా కెమికల్స్ పనితీరు కారణంగా దాని విలువ 5 శాతం మాత్రమే తగ్గింది. అన్లిస్టెడ్ కంపెనీల జాబితాలో టాటా గ్రూప్లో టాటా సన్స్, టాటా క్యాపిటల్, టాటా ప్లే, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎయిరిండియాతో సహా అనేక అన్లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యాపారాలను పరిగణనలోకి తీసుకుంటే టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయమైన పెరుగుదలను చూస్తుంది. వచ్చే ఏడాది ఐపీఓకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న టాటా క్యాపిటల్ అన్లిస్టెడ్ మార్కెట్లో దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల విలువను కలిగి ఉంది. -
హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి
ఇక్కడ ఫొటోలో చూడగానే ఎక్కడో చూసామనే భావన చాలా మందికి కలుగుతుంది. పుస్తకం చేతపట్టిన సరస్వతీ పుత్రుడుగా కనిపించే ఈయన దేశం గరించదగ్గ మహానుభావుడు, ఉన్నదాంట్లో అంతా దానం చేయగల విశాలమైన హృదయం ఉన్న వ్యక్తి. ఇప్పటికే ఈయనవరో దాదాపు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే మన 'రతన్ టాటా'. ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 'రతన్ టాటా' గురించి భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు తెలుసు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్కు ఛైర్మన్గా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఈయన 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు కంపెనీ కంపెనీ తాత్కాలిక ఛైర్మన్గా ఉన్నారు. 1937 డిసెంబర్ 28న పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించిన రతన్ టాటాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు విడిపోయారు, ఆ తరువాత ఆయన్ను అమ్మమ్మ నవాజ్బాయి పెంచారు. చదువు పూర్తయిన తరువాత టాటా గ్రూప్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. రతన్ టాటా చాలా వరకు ఎక్కువ మొత్తంలో డబ్బును సమాజ సేవకు వెచ్చిస్తారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేసి వాటి పురోగతికి పాటు పడ్డారు, భారతదేశంలో కరోనా విజృంభించిన సమయంలో వేలకోట్లను విరాళంగా ఇచ్చి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఇదీ చదవండి: యూపీఐ పేమెంట్స్ ఏ దేశాల్లో చేయొచ్చో తెలుసా.. పారిశ్రామిక రంగంలో రతన్ టాటా చేసిన కృషి అనన్య సామాన్యం.. ఆయన దాతృత్వం అపారం. ఇవన్నీ గుర్తించిన భారత ప్రభుత్వం రతన్ టాటాకు 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇవి మాత్రమే కాకుండా ఈయనకు 2006 మహారాష్ట్ర భూషణ్, దశాబ్దపు పరివర్తన నాయకుడు, ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి లెక్కకు మించిన అవార్డులు ఆయన్ను వరించాయి. -
టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత 'ముఖేష్ అంబానీ' సబ్స్క్రిప్షన్ బేస్డ్ శాటిలైట్ టీవీ అండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన టాటా ప్లేలో 29.8% వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్లు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశ టెలివిజన్ పంపిణీ రంగంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్, జియోసినిమా పరిధిని విస్తరించడానికి ముఖేష్ అంబానీ ఈ వ్యహాత్మక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్కు టాటా ప్లేలో 50.2 శాతం వాటా ఉంది. దేశీయ దిగ్గజానికి మాత్రమే కాకుండా సింగపూర్ ఫండ్ టెమాసెక్కు టాటా ప్లేలో 20 శాతం వాటా ఉంది. ఇప్పటికే టాటా ప్లేలో తన వాటాను టాటా గ్రూప్కు విక్రయించడానికి టెమాసెక్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల సారాంశం ఇంకా బయటపడలేదు. అయితే ఇప్పుడు రిలయన్స్, టాటాల మధ్య ఒప్పందం కుదిరితే.. టాటా గ్రూప్, రిలయన్స్ మధ్య కుదిరిన మొదటి ఒప్పందం ఇదే అవుతుంది. ఒప్పందం కుదిరితే.. రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ జియోసినిమా పరిధిని టాటా ప్లే కస్టమర్లకు అందించనుంది. ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - దినదినగండంగా టెకీల పరిస్థితి! -
విశాఖలో వోల్టాస్ 3వ స్టోర్
హైదరాబాద్: టాటా గ్రూప్నకు చెందిన ప్రముఖ ఏసీ కంపెనీ, వోల్టాస్ విస్తరణ ప్రణాళికలో భాగంగా విశాఖపట్నంలో మూడవ స్టోర్ను ప్రారంభించింది. దీనితో రాష్ట్రంలో సంస్థ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ స్టోర్ సంఖ్య 11కు చేరింది. విశాఖ స్టోర్ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రదీప్ బక్షి ప్రారంభించారు. వినియోగదారులకు వినూత్న ఉత్పత్తి శ్రేణిని అందించాలన్నది తమ లక్ష్యమని ఈ సందర్భంగా బక్షి పేర్కొన్నారు. కొత్త తరం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను సంస్థ అందిస్తోందని తెలిపారు. -
చరిత్ర సృష్టించిన 'టాటా' - ఏకంగా రూ.30 లక్షల కోట్లు..
18 సంస్థలతో కూడిన టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (TCS అండ్ టాటా మోటార్స్) భారీ ర్యాలీతో ఏకంగా రూ. 30 లక్షల కోట్లను దాటింది. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా టాటా ఓ సరికొత్త రికార్డ్ కైవసం చేసుకుంది. టాటా గ్రూప్ కంపెనీలైన టీసీఎస్, టాటా పవర్ మొదలైన కంపెనీ షేర్లు బాగా పెరగటం వల్ల సంస్థ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. ఇందులో కూడా టీసీఎస్ షేర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ TCS మార్కెట్ క్యాప్ మొదటిసారి రూ. 15 లక్షల కోట్ల మార్కును తాకింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించి యూరప్ అసిస్టెన్స్ ఐటీ ఆపరేటింగ్ మోడల్ను మార్చడానికి ఏర్పడిన ఒప్పందం కూడా షేర్లు పెరగటానికి దోహదపడ్డాయి. మార్కెట్ క్యాప్ లీడర్బోర్డ్లో రిలయన్స్ గ్రూప్ రూ. 21.60 లక్షల కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. అదానీ గ్రూప్, వివిధ మౌలిక సదుపాయాల రంగాలు రూ. 15.54 లక్షల కోట్ల మార్కెట్ విలువతో మూడవ స్థానంలో ఉంది. మంగళవారం నాటికి టాటా మోటార్స్, టైటాన్ సంస్థల మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లని దాటాయి. ఇదీ చదవండి: లే ఆఫ్స్.. 32000 మంది టెకీలు ఇంటికి - అసలేం జరుగుతోంది? టాటా మోటార్స్ మూడో త్రైమాసికంలో కూడా మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. వాహన డిమాండ్ పెరడటం, ముడి సరుకుల ధరలు కొంత తగ్గడం కారణంగా కంపెనీ ఫలితాలు కొంత వృద్ధి చెందాయి. కాగా.. ఇప్పుడు షేర్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో టాటా గ్రూప్ మరింత గొప్ప ఫలితాలను పొందనున్నట్లు పలువురు భావిస్తున్నారు. -
ఇక మేడిన్ ఇండియా హెలికాప్టర్లు!
ముంబై: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజ గ్రూప్ టాటాతో ఎయిర్బస్ హెలికాప్టర్స్ చేతులు కలిపింది. ఇరు సంస్థలు దేశీయంగా హెలికాప్టర్స్ తయారీకి భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నాయి. టాటా గ్రూప్తో జత కట్టడం ద్వారా హెలికాప్టర్స్ తయారీలో తుది అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్) యూనిట్ను నెలకొల్పనున్నట్లు ఎయిర్బస్ హెలికాప్టర్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ప్లాంటు ద్వారా పౌర విమాన శ్రేణిలో దేశీయంగా ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. వీటిలో కొన్నింటిని పొరుగు దేశాలకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా హెలికాప్టర్ తయారీకి ప్రైవేట్ రంగంలో తొలి ఎఫ్ఏఎల్ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఇది భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమానికి భారీస్థాయిలో ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించింది. డెలివరీలవరకూ.. భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్బస్ హెలికాప్టర్స్తో కలసి టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) ఎఫ్ఏఎల్ను ఏర్పాటు చేయనుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మేక్రన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఎయిర్బస్ హెలికాప్టర్ తాజా ప్రకటన జారీ చేసింది. గణతంత్ర దినోత్సవాలలో ప్రధాన అతిథిగా పాల్గొనేందుకు మేక్రన్ భారత్కు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రధాన విడిభాగాల అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ నియంత్రణల ఇన్స్టలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్లు, విమాన కంట్రోళ్లు, ఇంధన వ్యవస్థతోపాటు ఇంజిన్ కూర్పు తదితరాలను జేవీ నిర్వహించనున్నట్లు ఎయిర్బస్ హెలికాప్టర్స్ వివరించింది. అంతేకాకుండా భారత్ తదితర ప్రాంతాలలో హెచ్125ల టెస్టింగ్, క్వాలిఫికేషన్తో సహా.. డెలివరీలను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. 24 నెలల్లోగా ఎఫ్ఏఎల్ ఏర్పాటవుతుందని, 2026లో దేశీయంగా తయారైన తొలి (మేడిన్ ఇండియా) హెచ్125ల డెలివరీ చేసే వీలున్నట్లు అంచనా వేసింది. తయారీ యూనిట్ ఏర్పాటుచేసే ప్రాంతాన్ని సంయుక్తంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. కీలక పాత్ర... జాతి నిర్మాణంలో హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని ఎయిర్బస్ సీఈవో గిలామ్ ఫారీ పేర్కొన్నారు. నవ భారత సామర్థ్యాలపై గల నమ్మకానికి మేడిన్ ఇండియా పౌర హెలికాప్టర్ ప్రతీకగా ఉంటుందని అభివర్ణించారు. తద్వారా దేశీయంగా హెలికాప్టర్ మార్కెట్కున్న భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ప్రయివేట్ రంగంలో తొలి హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటుకు సంతోషిస్తున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తుది అసెంబ్లీ లైన్ ద్వారా ప్రపంచంలోనే ఎయిర్ బస్కు చెందిన అత్యుత్తమ హెచ్125 సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ను భారత్తోపాటు, ఇతర మార్కెట్లకు కూడా అందించనున్నట్లు తెలియజేశారు. -
2028 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా ‘టాటా గ్రూప్’
ప్రపంచ వ్యాప్త క్రికెట్ అభిమానుల్ని చూరగొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్షిప్ను భారత దిగ్గజ సంస్థ ‘టాటా’ గ్రూప్ పొడిగించుకుంది. ఐదేళ్ల కాలానికి రూ.2500 కోట్ల భారీ మొత్తంతో కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ సీజన్ నుంచి 2028 వరకు మళ్లీ టాటా ఐపీఎల్గా అలరించనుంది. టాటా సంస్థ గత రెండేళ్లుగా ఐపీఎల్తో కొనసాగుతోంది. 2022, 2023 సీజన్లలో టైటిల్ స్పాన్సర్గా ఉంది. తాజా ఒప్పందం విలువ ఐపీఎల్ టైటిల్ హక్కుల చరిత్రలోనే అత్యధిక మొత్తమని బీసీసీఐ తెలిపింది. -
2023 మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్.. టాప్లో టాటా - మూడో స్థానంలో అదానీ
ముంబై: గత క్యాలండర్ ఏడాది(2023)లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలలో టాటా గ్రూప్ భారీగా లాభపడింది. గ్రూప్లోని షేర్లు లాభాల దౌడు తీయడంతో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 35 శాతం దూసుకెళ్లింది. ఉమ్మడిగా రూ. 28.68 లక్షల కోట్లను తాకింది. దీంతో మార్కెట్ క్యాప్రీత్యా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ముకేశ్ అంబానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ దాదాపు 11 శాతం ఎగసింది. రూ. 19.42 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా అదానీ గ్రూప్ను అధిగమిస్తూ ద్వితీయ స్థానాన్ని అందుకుంది. అయితే 2022లో రిలయన్స్ గ్రూప్ను వెనక్కి నెట్టిన అదానీ గ్రూప్ వెనకడుగు వేసింది. మార్కెట్ విలువ దాదాపు 28 శాతం క్షీణించడంతో రూ. 14.2 లక్షల కోట్లకు పరిమితమైంది. వెరసి మూడో ర్యాంకులో నిలిచింది. 2022లో టాటా గ్రూప్ విలువ రూ. 21.2 ట్రిలియన్లుకాగా.. అదానీ గ్రూప్ రూ. 19.7 ట్రిలియన్లు, రిలయన్స్ రూ. 17.6 ట్రిలియన్లుగా నమోదయ్యాయి. రంగాలవారీగా తీరిలా దేశీ కార్పొరేట్ బిజినెస్ గ్రూప్లలో ప్రధానంగా ఆటోమోటివ్, ఇంజినీరింగ్, భారీయంత్ర పరికరాలు(క్యాపిటల్ గూడ్స్), విద్యుత్, మౌలిక సదుపాయాలు(ఇన్ఫ్రాస్ట్రక్చర్), రిటైల్ రంగాలు గతేడాది మెరుగైన పనితీరు చూపాయి. అయితే కమోడిటీలు, ఎనర్జీ, ఫైనాన్స్ విభాగాలు మందగించాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మురుగప్ప గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు 53 శాతం జంప్చేసి రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. రిటైల్ ఫైనాన్స్, ఇంజినీరింగ్, పవర్ ఎక్విప్మెంట్, సుగర్, ఆగ్రోకెమికల్స్, అబ్రాసివ్స్ తయారీలో ఉన్న మురుగప్ప గ్రూప్ మార్కెట్ విలువ రీత్యా టాప్–10 జాబితాలో చోటు(9వ ర్యాంకు) సాధించింది. 2022లో గ్రూప్ విలువ రూ. 2.2 ట్రిలియన్లు మాత్రమే. ఈ బాటలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ రూ. 2.39 ట్రిలియన్ల నుంచి రూ. 3.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా 10వ ర్యాంకును సాధించింది. ఇందుకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిస్టింగ్(రూ. 44,000 కోట్ల విలువ) జత కలిసింది. రాహుల్ బజాజ్ గ్రూప్ విలువ రూ. 8.21 ట్రిలియన్ల నుంచి 23 శాతంపైగా బలపడి రూ. 10.12 లక్షల కోట్లను తాకింది. వెరసి మరోసారి నాలుగో ర్యాంకులో నిలిచింది. ఆదిత్య బిర్లా గ్రూప్ 33 శాతం ఎగసి ఐదో ర్యాంకును అందుకుంది. విలువ రూ. 4.98 లక్షల కోట్ల నుంచి రూ. 6.6 ట్రిలియన్లకు చేరింది. గ్రూప్లు అటూఇటుగా టెలికం రంగ దిగ్గజం భారతీ(ఎయిర్టెల్) గ్రూప్ మార్కెట్ విలువ రూ. 5.17 ట్రిలియన్ల నుంచి 27 శాతంపైగా జంప్చేసి రూ. 6.59 లక్షల కోట్లను తాకినప్పటికీ ర్యాంకింగ్లో 5 నుంచి 6కు నీరసించింది. ఐటీ సేవల హెచ్సీఎల్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 41 శాతం దూసుకెళ్లి రూ. 3.98 ట్రిలియన్లను తాకింది. రెండు స్థానాలు మెరుగుపడి 7కు చేరింది. ఆటో రంగ దిగ్గజం ఎంఅండ్ఎం రూ. 3.95 కోట్ల మార్కెట్ విలువతో ఒక స్థానం తగ్గి 8వ ర్యాంకుకు పరిమితమైంది. నిజానికి 2022లో ఎంఅండ్ఎం మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లు మాత్రమే. -
‘రతన్ టాటా గూండాగిరి’
ఉప్పు నుంచి ఉక్కు వరకు. టీ నుంచి ట్రక్ వరకు.. వాచెస్ నుంచి హోటెల్స్ వరకు.. కెమికల్స్ నుంచి కార్స్ వరకు.. ఇలా పదుల సంఖ్యలో కంపెనీల్ని ముందుండి నడిపించిన గొప్ప లీడర్. వందల ఏళ్ల చరిత్ర.. 150 కి పైగా దేశాల్లో కంపెనీలు.. 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు.. 28 కి పైగా లిస్టెడ్ కంపెనీలు.. రూ.27.61 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ (డిసెంబర్ 26,2023 నాటికి) భారత్లోనే కాకుండా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ కంపెనీని నడిపిస్తూ ఇసుమంతైనా గర్వం లేని పద్మ విభూషణుడు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా. డిసెంబర్ 28న రతన్ టాటా 86వ జన్మదినం సందర్భంగా కోట్లాది మంది అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో రతన్ టాటా కోట్లాది మంది ప్రజల హృదయాల్ని గెలుచుకున్న సందర్భాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అవేంటంటే ఈ కుక్క మీదేనా రతన్ టాటాకి మూగజీవాలంటే ప్రాణం. ఓ సారి ముంబై వీధుల్లో గాయాల పాలైన ఓ కుక్కను గమనించారు. వెంటనే దానికి చికిత్స చేయించారు. అనంతరం ఆ కుక్క గురించి వివరాలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ముంబైలోని నా ఆఫీస్ సమీపంలో గాయాలపైన ఓ కుక్కను గుర్తించాం. అత్యవసర చికిత్స కోసం సియాన్ ఆస్పత్రికి తరలించాం. మీరు ఆ కుక్క సంరక్షకులైతే కొన్ని ఆధారాలతో reportlostdog@gmail.comకు ఇమెయిల్ చేయండి” అని పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ కుక్క ప్రస్తుతం మా సంరక్షణలోనే ఉంది. చికిత్సను చేయిస్తున్నాం అని పోస్ట్లో పేర్కొన్నారు. ఒకే ఒక్కడు.. గ్యాంగస్టర్, అతని 200 గూండాలతో రతన్ టాటా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 1980వ సంవత్సరంలో టాటా గ్రూప్ ఛైర్మన్గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టిన 15 రోజుల తర్వాత ఓ గ్యాంగ్స్టర్కు వ్యతిరేకంగా నిలబడ్డారు. వాస్తవానికి అప్పట్లో టాటా మోటార్స్ కంపెనీలో లేబర్ ఎన్నికలు జరిగేవి. ఆ సమయంలో అసంతృప్తితో ఉన్న కొంత మంది కార్మికులను ఒక గ్యాంగ్స్టర్ ప్రేరేపించాడు. లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. గ్యాంగ్స్టర్ తన అనచరులైన 200 మంది గూండాలతో కలిసి ప్లాంట్లోని 4000 మంది ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడు. సిబ్బంది విధులు నిర్వహించకుండా సమ్మె చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో భయబ్రాంతులైన ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు బయపడి పోయారు. దీంతో ‘‘ నాన్న పందులు గుంపులుగా..గుంపులుగా వస్తే సింహం సింగిల్ వస్తుందంటూ’’ రతన్ టాటా నేరుగా రంగంలోకి దిగి గ్యాంగ్స్టర్ను ఎదుర్కొన్నారు. రతన్ టాటా తన ఇంటిని వదిలేసి స్వయంగా ప్లాంట్లోనే కొద్దిరోజులపాటు ఉన్నారు. కార్మికులకు ధైర్యం చెబుతూ వారితో పనిచేయించారు. అయితే కొద్ది రోజుల తర్వాత గ్యాంగ్స్టర్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇలా ఓ గ్యాంగ్స్టర్ను రతన్ టాటా చాలా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. 16 ఏళ్ల యువకుడికి సాయం.. మహరాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన అర్జున్ దేశ్ పాండే 16 ఏళ్ల వయస్సులో ఉండగా తనకు ఓ హృదయ విదారకరమైన సంఘటన ఎదురైంది. దేశ్ పాండే ఓ రోజు ఫివర్ ట్యాబ్లెట్ తెచ్చుకునేందుకు స్థానికంగా ఉన్న ఓ మెడికల్ షాపుకి వెళ్లాడు. అయితే ఆ షాప్ వద్ద 70 ఏళ్ల వృద్దుడు క్యాన్సర్తో బాధపడుతూ తన భార్యకు కావాల్సిన మెడిసిన్ కోసం అదే షాపుకు వచ్చాడు. తన కావాల్సిన మెడిసిన్ ఈ షాప్లో ఉన్నా.. అత్యధిక ధర కావడంతో తాను ఆ మెడిసిన్ను కొనలేకపోతున్నానంటూ బాధపడటాన్ని గమనించాడు. కానీ ఏం చేయలేకపోయాడు. ఆ బాధలో నుంచి జనరిక్ ఆధార్ అనే స్టార్టప్ పుట్టింది. అర్జున్ దేశ్ పాండే దీనిని స్థాపించాడు. ఈ స్టార్టప్ ముఖ్య ఉద్దేశ్యం దేశ వ్యాప్తంగా ఉన్న 80 - 90 శాతం తగ్గింపుతో జనరిక్ మెడిసిన్ అందిస్తుంది. ఓ రోజు తనకు ఎదురైన సంఘటన, స్టార్టప్ ప్రారంభం వంటి అంశాలను అర్జున్ టెడెక్స్లో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన రతన్ టాటా సైతం వెంటనే జనరిక్ ఆధార్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ టర్నోవర్ అక్షరాల రూ.500 కోట్లు. ఒక్క ఫోన్ కాల్తో భారత్లో స్టార్టప్ జపం నడుస్తోంది. ఏదైనా బిజినెస్ చేయాలంటే జనాన్ని ఆకట్టుకోవాలి. అలాంటి బిజినెస్ ఐడియా ఉంటే చాలు. పర్ఫెక్ట్ ప్లాన్తో ఆ బిజినెస్ ఐడియాను అప్లయ్ చేస్తే చాలు కోట్లు కొల్లగొట్టొచ్చు. ఇలాగే ‘రెపోస్ ఎనర్జీ’ ఫౌండర్లు, భార్య భర్తలైన చేతన్ వాలుంజ్, అతిధి బోస్లే వాలుంజ్లు అనుకున్నారు. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, నిత్యవసర వస్తువులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే క్షణాల్లో వచ్చేస్తున్నాయి. అదే వినియోగదారులకు కావాల్సిన పెట్రోల్ను మనం ఎందుకు డెలివరీ చేయకూడదు అని అనుకున్నారు. ఐడియా బాగుంది. చేతిలో తగినన్ని నిధులు లేవు. పైగా ప్రజల్లోకి కంపెనీ పేరును బలంగా తీసుకెళ్లాలని అనుకున్నారు. అందుకే సాయం కోసం రతన్ టాటా ఆఫీస్ డోర్ తట్టారు. ఓ లెటర్ను రతన్ టాటాకు పంపారు. ప్రయత్నం అయితే చేశారు కానీ మనసులో ఎక్కడో చిన్న అనుమానం. టాటాకు పంపిన లెటర్ అందుతుందా? ఆ లెటర్ చదివి టాటా తమకు సాయం చేస్తారా? ఇలా ఎన్నో రకాలుగా అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆ అనుమానాన్ని పటాపంచలు చేశారు రతన్ టాటా. ‘మీ లెటర్ నేను చదివాను. ఒక్కసారి మనం కలుసుకోగలమా? అంటూ రతన్ టాటానే స్వయంగా చేతన్, అతిధిలకు ఫోన్ చేశారు. కట్ చేస్తే రెపోస్ ఎనర్జీ రూ.200 కోట్ల విలువైన కంపెనీ ప్రసిద్ధి కెక్కింది. మనసున్న మారాజు.. అతడే రతన్ టాటా అంటూ రతన్ టాటా తన పెంపుడు కుక్కలు టాంగో, టిటో అంటే మహా ఇష్టం. ఆ ఇష్టం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఈ సంఘటనే అందుకు ఉదాహరణ. టాటాకు యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్తో సత్కరించేందుకు సిద్ధమైంది. అవార్డ్ ఇస్తున్నట్లు ప్రిన్స్ చార్లెస్ టాటాకు సమాచారం అందించారు. అ తర్వాత ముందుస్తు ప్లాన్ ప్రకారం.. లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హోమ్ ప్యాలెస్లో అవార్డ్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ అవార్డ్ల ప్రధానోత్సవానికి రతన్ టాటా హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? టాంగో, టిటోల వల్లే. తాను లండన్ బయలు దేరే ముందు టాంగో, టిటోలు అనారోగ్యానికి గురయ్యాయని, వేడుకకు తాను రాలేకపోతున్నాననే సమాచారాన్ని తనతో పాటు లండన్ వచ్చేందుకు సిద్ధమైన వ్యాపార వేత్త సుహెల్ సేథ్కి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇదే విషయం ప్రిన్స్ చార్లెస్కు చెప్పగా.. మనసున్న మారాజు.. అతడే రతన్ టాటా అంటూ ప్రశంసలు కురిపించారంటూ నాటి సంఘటనను గుర్తు చేశారు. అందుకే రతన్ టాటా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. -
రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ 'రతన్ టాటా' (Ratan Tata) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన ఈయన నేటితో 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. రతన్ టాటా జన్మదినం సందర్భంగా ఈ కథనంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రతన్ టాటా గురించిన 5 ఆసక్తికరమైన విషయాలు 👉రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్కు వెళ్లారు. ఈయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా. 👉రతన్ టాటా "ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా' అనే పుస్తకారు రాశారు. 👉86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. గతంలో ఈయన నాలుగు సార్లు పెళ్లికి దగ్గరగా వచ్చినట్లు సమాచారం, కానీ ప్రతి సారీ ఏదో ఒక భయం, లేదా ఇతర కారణాల వల్ల వెనక్కి తగ్గారు. 👉పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకే లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధర వద్ద లభించే కారు కావడంనా గమనార్హం. చిన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారుని లాంచ్ చేసినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. భారతదేశంలోని అనేక మంచి కార్యక్రమాల కోసం రతన్ టాటా లెక్కకు మించిన డబ్బును విరాళంగా ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు. -
టాటా రాకతో ఆ కంపెనీ దశ తిరిగింది!
కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ యాజమాన్యంలో నష్టాలబాటలో పయనించిన 'నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్' (NINL), టాటాల చేతికి చిక్కడంతో అభివృద్ధి బాటలో పరుగులు తీస్తూ.. నేడు వేలకోట్లు ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 2500 ఎకరాల ప్రాంగణంలో విస్తరించిన కంపెనీ ఒకప్పుడు పాములు, తేళ్లకు నిలయంగా మారి యంత్రాలన్నీ తుప్పు పట్టిన దశలో ఉన్న కంపెనీని.. రూ.12100 కోట్ల చెల్లింపుతో 2022 జులై 04న టాటా స్టీల్ ఒడిశాకు చెందిన నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (NINL) కొనుగోలు చేసింది. 'ఎన్ఐఎన్ఎల్' టాటా చేతిలో పడ్డ కేవలం 90 రోజుల్లోనే తిరిగి ప్రారంభమైందని.. కంపెనీ ఎండీ అండ్ సీఈఓ 'సుధీర్ కుమార్ మెహతా' వెల్లడించారు. అంతే కాకుండా.. అప్పులతో సతమవుతున్న కంపెనీ లాభాల బాట పట్టి ఇప్పుడు ఆర్థికంగా మంచి పనితీరు కనబరుస్తోందని తెలిపారు. అప్పులతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీ గత ఏడాది నుంచి ఇప్పటికే రూ.4600 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సమాచారం. ఆగస్ట్లో టేక్ ఓవర్ అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగులందరికీ మొత్తం జీతం చెల్లించినట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: స్టార్టప్లూ వదిలిపెట్టలేదు! ఈ ఏడాది ఎంతమందిని తొలగించాయంటే.. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు 120 కి.మీ దూరంలో ఉన్న కళింగనగర్లోని NINL సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న పెద్ద కంపెనీ. నిధుల కొరతతో సహా వివిధ కారణాలతో ఈ ప్లాంట్ సుమారు మూడేళ్లపాటు మూతపడింది. ఆ తరువాత టాటా గ్రూపు చేజిక్కించుకుని 2024 అక్టోబర్ 24న మొదటి బిల్లెట్ను విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ ఆశించిన స్థాయికంటే కూడా బాగా లాభాలను ఆర్జిస్తోందని తెలుస్తోంది. -
ఎయిరిండియా సిబ్బందికి కొత్త యూనిఫాం.. ఎలా ఉందో చూశారా?
డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ ఆధీనంలో ఉన్న ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఎయిరిండియాని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థ తీర్చిదిద్దేలా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఆ సంస్థ లోగోని మార్చిన యాజమాన్యం.. తాజాగా అందులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ధరించేందుకు కొత్త యూనిఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. తన క్యాబిన్ సిబ్బంది, పైలట్లకు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో యూనిఫాంను డిజైన్ చేయించింది. మహిళా క్యాబిన్ సిబ్బందికి మోడ్రన్ లుక్లో ఓంబ్రే చీరలు, పురుషులకు బ్యాండ్గ్లస్, కాక్పిట్లో విధులు నిర్వహించే ఉద్యోగులు క్లాసిక్ బ్లాక్ సూట్స్ ఉన్నాయి. ఈ కొత్త యూనిఫామ్ను దశల వారీగా పూర్తిస్థాయిలో పరిచయం చేసేలా ఎయిరిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న నెలల్లో ఎయిరిండియా తొలి ఎయిర్ బస్ ఏ350 సర్వీసుల్ని ప్రారంభించనుంది. ఆ సమయంలో ఈ కొత్త యూనిఫామ్ను ధరించి సిబ్బంది విధులకు హాజరవుతారని సమాచారం. మహిళా సిబ్బంది యూనిఫాం ఎలా ఉండబోతుందంటే? మహిళా సిబ్బందికి ఈజీగా, స్టైలిష్గా, యూనిక్ లుక్లో సంప్రదాయాన్ని మేళవించేలా ఈ కొత్త యూనిఫాం ఆకట్టుకుంటుందని ఎయిరిండియా ఓ ప్రకటనలో పేర్కొంది. సీనియర్ మహిళా క్యాబిన్ సిబ్బంది కోసం ఓంబ్రే చీరలు, వంకాయ బ్లేజర్లతో కలిపి ఎరుపు-గోధుమ రంగులో ఉంటాయి. జూనియర్ మహిళా క్యాబిన్ సిబ్బంది ఎరుపు రంగు బ్లేజర్లతో కలిపి ఎరుపు - ఊదా రంగు చీరలను ధరిస్తారు. కాక్పిట్ సిబ్బంది యూనిఫారం క్లాసిక్ బ్లాక్ డబుల్ బ్రెస్ట్డ్ సూట్ను అందంగా డిజైన్ చేశారు మల్హోత్రా. ఈ సందర్భంగా మనీష్ మల్హోత్రా మాట్లాడుతూ “ఎయిరిండియా కోసం యూనిఫాం డిజైన్ చేసే అవకాశం నాకు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. జాతీయ జెండాను మోసే (రతన్ టాటాను ఉద్దేశిస్తూ) వ్యక్తికి ఫ్యాషన్ విభాగం నుంచి దోహదపడటం ఆనందంగా ఉంది. నా లక్ష్యం దేశ విభిన్న సంస్కృతి, సంప్రదాయాల సారాంశం ఉట్టిపడేలా యూనిఫారాలను రూపొందించడం, ఆధునిక అధునాతన డిజైన్లను అందించడమేనని అన్నారు. -
మార్కెట్లోకి కొత్త వాహనాలు.. ప్రత్యేకతలివే..
సరకు రవాణా అవసరాలు తీర్చేందుకు టాటా మోటార్స్ కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు, నిర్వహణ వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో కొత్త తేలికపాటి వాణిజ్య వాహనాలను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్టీ+, ఇంట్రా వీ50 పేర్లతో వాటిని విపణిలోకి తీసుకొచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు సరుకు రవాణాతో అధిక లాభాలు సంపాదించేందుకు వీటిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమర్ల అవసరాలకు అనుకూలమైన వాహనాన్ని ఎంచుకునేలా వీటిని తయారుచేసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్షిప్ల్లో ఈ వాహనాల బుకింగ్లు ప్రారంభమయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడారు. ‘టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనాలు కస్టమర్ల జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాహనాలతో వినియోగదారులకు మరింత సేవలందించేలా కంపెనీ కృషిచేస్తోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచి, అధిక పేలోడ్లను మోస్తూ ఎక్కువ దూరం వెళ్లేలా వీటిని రూపొందించాం. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్, లాజిస్టిక్స్, సరకు రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయి’ అని అన్నారు. ఇదీ చదవండి: రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం ఇంట్రా వీ70 పేలోడ్ సామర్థ్యం 1700కేజీలు. ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్తో 9.7 అడుగుల పొడవైన లోడ్ బాడీతో దీన్ని తయారుచేసినట్లు అధికారులు తెలిపారు. ఇంట్రా వీ20 గోల్డ్ 800 కిమీల డ్యుయల్ ఇంజిన్ పికప్ సామర్థ్యంతో 1200 కేజీ పేలోడ్ను మోసుకెళ్తుందని కంపెనీ చెప్పింది. ఏస్ హెచ్టీ+ 900 కేజీ పేలోడ్ కెపాసిటీతో 800సీసీ డీజిల్ ఇంజిన్ కలిగి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం
ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీతో సహా 7,000 మందిని అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఇద్దరు బిలియనీర్లతో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా జనవరి 22, 2024న జరిగే ఈ వేడుకలకు హాజరవనున్నట్లు సమాచారం. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపింది. ప్రముఖ టీవీ సీరియల్ 'రామాయణం'లో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయోధ్యలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కరసేవకుల కుటుంబాలను సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. వీవీఐపీల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురువు రామ్దేవ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీలు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50 దేశాల నుంచి ఒక్కొక్కరిని ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామాలయ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను ఆహ్వానించాం. న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపాం’ అని తెలిపారు. సాధువులు, పూజారులు, మత పెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సంగీత విద్వాంసులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలకు ఆహ్వానం పంపినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా! అయోధ్యలో రామమందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లు. ఆలయ నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల ద్వారా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. హిందూ దేవతల విగ్రహాల కోసం ట్రస్ట్ స్థలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27, 2021 వరకు శ్రీ రామ జన్మభూమి మందిర్ నిధి సమర్పణ్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు రూ.2100 కోట్ల నిధులు సేకరించినట్లు సమాచారం. ఈ మందిర నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రారంభించింది. మందిరంలో వినియోగించే టెక్నాలజీని టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ అందిస్తోంది. 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవుతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. -
Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా..
ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగిన ఎయిర్ ఇండియా తన సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటాగ్రూప్ నిర్వహిస్తోన్న ఈ కంపెనీపై సివిల్ ఏవియేషన్ చర్యలు చేపట్టింది. ఏకంగా రూ.10 లక్షలు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మే-సెప్టెంబర్లో షెడ్యూల్డ్ డొమెస్టిక్ ఆపరేటర్ల కోసం దిల్లీ, కొచ్చిన్, బెంగళూరు విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, నష్టపరిహారానికి సంబంధించిన అంశాలను పరిశీలించింది. అయితే వీటిని పాటించటంలో ఎయిర్ ఇండియా విఫలమైందని తనిఖీల్లో వెల్లడైంది. ఇదీ చదవండి: రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు ఫలితంగా సంస్థ నిబంధనలు పాటించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ నవంబర్ 3న ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎయిర్ ఇండియా ఇచ్చిన వివరణను సమీక్షించిన తర్వాత.. సీఏఆర్ నిబంధనలు పాటించడంలో టాటా గ్రూప్ సంస్థ విఫలమైందని నిర్ధారించారు. ఆలస్యమైన విమానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు హోటల్ వసతి లేకపోవడం, కొంతమంది గ్రౌండ్ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం, కొందరు సర్వీస్లేని సీట్లలో ప్రయాణించవలసి రావడం వంటి అంశాలను పరిగణలోని తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించడంలో సంస్థ విఫలం అయిందని గుర్తించారు. దాంతో సంస్థకు రూ.10 లక్షలు జరిమానా విధించారు. -
Tata Tech: గంటలోనే అమ్ముడైన 4.5 కోట్ల షేర్లు
ఇరవై ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ వచ్చింది. మదుపరులు ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22న ప్రారంభమయింది. నవంబర్ 24తో సబ్స్క్రిప్షన్ ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.3042.5 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 22వ తేదీన 4,50,29,207 (నాలుగున్నర కోట్లు) షేర్లను అందుబాటులో ఉంచగా ఐపీఓ మొదలైన గంటలోనే పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యాయి. టాటా మోటార్స్కు చెందిన టాటా టెక్నాలజీస్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ. టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్రోవర్ సహా టాటా గ్రూప్లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఐపీఓలో భాగంగా టాటా మోటార్స్ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించనుంది. ఇతర ప్రైవేటు ఈక్విటీ సంస్థలైన ఆల్ఫా టీసీ హోల్డింగ్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం చొప్పున తమ వాటాలను విక్రయించనున్నాయి. ఐపీఓలో భాగంగా టాటా టెక్నాలజీస్, టాటా మోటార్స్ ఉద్యోగులకు 10 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. టాటా టెక్నాలజీస్ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం ఉదయం 11 గంటలకు 8,73,22,890 బిడ్లు దాఖలయ్యాయి. అంటే 1.94 రెట్లు సబ్స్క్రైబ్ అయినట్లు తెలుస్తోంది. కేటగిరీ వారీగా నాన్ ఇన్స్టిట్యూషనల్ మదుపర్లు 2.72 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ మదుపర్ల 1.98 రెట్లు, రిటైల్ విభాగంలో 1.63 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి టాటా టెక్ రూ.791 కోట్లు సమీకరించింది. -
ఐదేళ్లలో 3,000 ఉద్యోగాలు
ముంబై: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ రానున్న ఐదేళ్ల కాలంలో 3,000కుపైగా ఉద్యోగాలను కల్పించనుంది. వీటిలో ఇంజినీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్ తదితర విభాగాలలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ తదితర ఆధునిక విభాగాలలో ప్రత్యేకతలున్న నిపుణులను ఎంపిక చేసుకోనున్నట్లు వివరించింది. ఐదేళ్ల కాలంలో రూ. 1,00,000 కోట్ల బిజినెస్ను అందుకునే బాటలో ప్రయాణిస్తున్నట్లు టైటన్ తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా విభిన్న విభాగాలలో ప్రత్యేకత కలిగిన నిపుణులను ఉద్యోగాలలోకి తీసుకునే వ్యూహాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ సొంత సిబ్బందిసహా.. వివిధ విభాగాలలో యువ వృత్తి నిపుణులను జత కలుపుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వృద్ధి, ఆవిష్కరణలతోపాటు పరిశ్రమలో కంపెనీ స్థానాన్ని పటిష్టపరచుకోనున్నట్లు టైటన్ హెచ్ఆర్(కార్పొరేట్, రిటైల్) హెడ్ ప్రియా ఎం.పిళ్లై పేర్కొన్నారు. 60:40 ప్రస్తుతం కంపెనీ సిబ్బందిలో 60 శాతం మెట్రో నగరాలలో సేవలందిస్తుండగా.. మరో 40 శాతం మంది ద్వితీయస్థాయి నగరాల(టైర్–2, 3)లో పనిచేస్తున్నట్లు టైటన్ వెల్లడించింది. వర్ధమాన మార్కెట్లలో కార్యకలాపాల పటిష్టతను కొనసాగిస్తూనే స్థానిక నిపుణులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో) మధ్య భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
రతన్ టాటా తర్వాత గ్రూప్ సారథులు వీరే..?
దేశంలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్టాటాకు పెళ్లి కాకపోవడంతో తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించేవారు లేకుండాపోయారు. దాంతో దాదాపు రూ.20 లక్షల కోట్ల టాటా గ్రూప్ సంస్థలను ఎవరు ముందుకు తీసుకెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సామర్థ్యం ఎవరికి ఉందనే చర్చ కొనసాగుతోంది. అయితే తన ఫ్యామిలీకే చెందిన తన సోదరుడు నోయెల్టాటా కుమార్తెలు లేహ్, మాయా, కుమారుడు నెవిల్లీలకు రతన్ టాటా వ్యాపార మెలకువలు నేర్పుతున్నట్లు జీక్యూ ఇండియా ప్రచురించింది. టాటాగ్రూప్ను ముందుకు నడిపే సత్తా వారికి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కానీ సంస్థతో వారికున్న అనుబంధం, వారి నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు తెలిస్తే టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని తెలుస్తోంది. లేహ్ టాటా నోయెల్ టాటా పెద్ద కుమార్తె. మాడ్రిడ్లోని ఐఈ బిజినెస్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తాజ్ హోటల్స్ రిసార్ట్స్ & ప్యాలెస్లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా తన కెరియర్ ప్రారంభించారు. సేల్స్ విభాగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాయా టాటా లేహ్ టాటా సోదరి మాయా టాటా. మాయా టాటా రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో తన కెరియర్కు మొదలుపెట్టారు. ఆమె పోర్ట్ఫోలియో మేనేజర్గా, ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజంటేటివ్గా పని చేశారు. యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. టాటా క్యాపిటల్, ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీలో కీలకస్థానంలో పనిచేశారు. టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయా ఉన్నారు. నెవిల్లీ టాటా నోయెల్ టాటా చిన్న కుమారుడు. నెవిల్లే టాటా కూడా బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ట్రెంట్ హైపర్మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్కు సారథ్యం వహిస్తున్నారు. ఇది టాటా గ్రూప్ బ్రాండ్లైన వెస్ట్సైడ్ , స్టార్ బజార్లకు మాతృసంస్థగా ఉంది. ఇదీ చదవండి: ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్! టాటా గ్రూప్ సంస్థల స్వరూపం టాటా గ్రూప్ సంస్థలను 1868లో జెమ్షేడ్జీ టాటా స్థాపించారు. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో 30 కంపెనీలు ఉన్నాయి. ఆరు ఖండాల్లోని 100 కంటే ఎక్కువ దేశాలలో సేవలందిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ, డిజిటల్ వ్యాపార సేవలందిస్తోంది. టాటా స్టీల్ సంవత్సరానికి 33 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. టాటా మోటార్స్ కార్లు, యుటిలిటీ వెహికల్స్, బస్సులు, ట్రక్కులు, డిఫెన్స్ వాహనాలను తయారుచేస్తోంది. టాటా కెమికల్స్ బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి చేస్తోంది. టాటా పవర్ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ. ఇండియన్ హోటల్స్ టూరిజం, ట్రావెల్ ఇండస్ట్రీలో ప్రపంచస్థాయి సేవలందిస్తోంది. టైటాన్ కంపెనీ ద్వారా ఆభరణాలు, కళ్లద్దాలు తయారుచేస్తున్నారు. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల రూ.3 లక్షల కోట్లు దాటింది. టాటా ఎలెక్సీ ఇంజినీరింగ్ డిజైన్, సాంకేతిక సేవలు అందిస్తోంది. టాటా డిజిటల్ ద్వారా వినియోగదారుల అవసరాలు తెలుసుకుని మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 నాటికి టాటా గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,71,467 కోట్లుగా ఉంది. -
ఇండియన్ హోటల్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్లో కన్సాలిడేటెడ్ నికర లాభం 37 శాతం జంప్చేసి రూ. 167 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 122 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,258 కోట్ల నుంచి రూ. 1,481 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,101 కోట్ల నుంచి రూ. 1,249 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో కొత్తగా 8 హోటళ్లను తెరవడంతోపాటు.. మరో 17 ప్రారంభించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ చాట్వల్ పేర్కొన్నారు. అనుబంధ సంస్థ పియమ్ హోటల్స్లో న్యూ వెర్నాన్ ప్రయివేట్ నుంచి 6.8 శాతం వాటాకు సమానమైన 2.59 లక్షల ఈక్విటీ షేర్లను షేర్ల స్వాప్, నగదు ద్వారా సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ హోటల్స్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 375 వద్ద ముగిసింది. -
రూ.1000 కోట్ల డీల్ - భారత్లో టాటా ఐఫోన్స్ తయారీ..
ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లోనూ దిగదినాభివృద్ది చెందుతున్న దేశీయ దిగ్గజం 'టాటా' ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగు పెట్టనుంది. దీని కోసం కంపెనీ పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి సిద్ధమైంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో టాటా గ్రూప్ ఐఫోన్స్ తయారు చేయనుంది. మరో రెండున్నర సంవత్సరాల్లో విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి సన్నద్దవుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' తెలిపారు. టాటా కంపెనీ ఇండియాలో ఐఫోన్లను తయారు చేయడానికి తైవాన్ బేస్డ్ సంస్థ 'విస్ట్రాన్ కార్ఫ్' (Wistron Corp) భారతదేశంలోని విభాగాన్ని 125 మిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1000 కోట్లు కంటే ఎక్కువ) కొనుగోలు చేయనుంది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో మొట్ట మొదటి ఐఫోన్లను ఉత్పత్తి చేసే సాఫ్ట్వేర్ కంపెనీగా అవతరించింది. ఇదీ చదవండి: పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట భారత ప్రభుత్వం గ్లోబల్ ఇండియా కంపెనీల వృద్ధికి మద్దతు ఇస్తుందని, ప్రపంచానికి భారతదేశ విశ్వసనీయతను, ప్రతిభను చాటి చెప్పడానికి బ్రాండ్లకు సపోర్ట్ చేస్తుందని చంద్రశేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. PM @narendramodi Ji's visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports. Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 27, 2023 -
వోల్టాస్ లాభం రూ.36 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీ వోల్టాస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్తో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.36 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. దీంతో పోలిస్తే పనితీరు మెరుగుపడినట్టు తెలుస్తోంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,833 కోట్ల నుంచి రూ.2,364 కోట్లకు వృద్ధి చెందింది. రెడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీలు) జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని వోల్టాస్ బోర్డు నిర్ణయించింది. చైన్నై, గుజరాత్లోని వాఘోడియాలో నూతన ప్లాంట్లపై ఈ నిధులను వ్యయం చేయనున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో వోల్టాస్ షేరు ఒక శాతం లోపు పెరిగి రూ.839 వద్ద ముగిసింది. -
వ్యక్తిగా వినమ్రుడు... వ్యవస్థగా త్రివిక్రముడు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎనభై ఆరేళ్ల రతన్ నావల్ టాటాను పరి చయడం చేయడమంటే సూర్యుణ్ణి దివిటీతో చూపే ప్రయత్నం చేయటం. టాటా గురించి మళ్లీ మళ్లీ చెప్పుకోవడం ఎందుకంటే క్యాలెండర్ మారిన ప్రతిసారీ ఆయన కొత్తగా కనిపిస్తారు. పారిశ్రామిక రంగాన్ని సమస్యలు చుట్టిముట్టిన ప్పుడల్లా ఆయన సరికొత్తగా వెలుగులీనుతారు. తోటి పారి శ్రామికవేత్తలకు మాత్రమే కాదు, సమాజం మొత్తానికి భరోసాగా నిలుస్తారు. బడా పారిశ్రామికవేత్తగానే కాదు... వ్యక్తిగా కూడా రతన్ టాటా సమున్నతుడు. చదువయ్యాక అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒకమ్మాయిపై రతన్ మనసు పారేసుకున్నారు. ఆమె కూడా ఆయన్ను ప్రేమించింది. ఈలోగా 1962లో భారత–చైనా యుద్ధం వచ్చింది. అంతే! ఈ వివాహానికి తొలుత అంగీకరించిన ఆమె తల్లిదండ్రులు భయంతో మీమాంసలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో నాయనమ్మ నవాజ్ బాయ్ టాటాకు ఒంట్లో బాగోలేదని కబురంది రతన్ భారత్ వెళ్లాల్సి వచ్చింది (రతన్కు పదేళ్ల వయసున్నప్పుడే తల్లితండ్రులు నావల్ టాటా, సూనీ టాటా విడాకులు తీసుకున్నారు. అందుకే రతన్ నాయనమ్మ పెంపకంలో పెరిగారు). అంతా సవ్యంగా పూర్తయి అమెరికా వెళ్లేసరికి ప్రియురాలు తల్లితండ్రుల మాట విని వేరే పెళ్లి చేసుకుంది. పర్యవసానంగా రతన్ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ! ‘సరైన నిర్ణయాలు’ తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేనొక నిర్ణయం తీసుకుంటాను. అది సరైనది అయ్యేలా చేస్తాను. అంతే...’ అని అన్నాడాయన ఒకసారి. అందుకే కావొచ్చు, ఆయన హయాంలో టాటా గ్రూపు ఆదాయం 40 రెట్లు మించి పెరిగింది. ఇవాళ టాటా గ్రూపు బ్రాండ్ విలువ 2,600 కోట్ల డాలర్లు. మొన్న మార్చి నాటికి ఆ గ్రూపు మార్కెట్ వ్యాల్యూ 21.1 లక్షల కోట్లు. ఆయన నెట్వర్త్ అక్షరాలా రూ. 8,250 కోట్లు! ఇది ముఖేశ్ అంబానీ నెట్వర్త్ రూ. 9,610 కోట్లతో పోలిస్తే కాస్త తక్కువే కావొచ్చు. మరో పారిశ్రామికవేత్త అదానీ నెట్వర్త్ 5,510 కోట్లతో పోలిస్తే కొంచెం ఎక్కువే కావొచ్చు. కానీ రాజకీయ రణరంగంలో ఆ ఇద్దరి పేర్లూ తప్ప రతన్ టాటా గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయనపై అస్త్రాలు సంధిస్తూ పార్టీలు పరస్పరం ఎన్నడైనా ఆరోపణలు చేసుకోవటం చూశామా? లేదు. అదీ రతన్ టాటా ప్రత్యేకత. సంస్థ ఎదగడమే కాదు... అనేకమంది జీవితాల్లో వెలుగులు పంచాలన్నది ఆయన సిద్ధాంతం. అందుకే ఇద్దరు పిల్లలున్న మధ్యతరగతి కుటుంబం ఒక స్కూటర్పై ఇరుక్కుని కూర్చుని హోరు వానలో ప్రయాణిస్తుండగా చూసి తనకు ‘నానో’ కారు ఐడియా వచ్చిందని రతన్ చెబితే దేశం విశ్వసించింది. టాటా గ్రూపు సంస్థలకు సామాజిక సేవంటే చాటింపు వేసుకుని మీడియాకు పోజులిచ్చే సందర్భం కాదు. నెరవేర్చి తీరాల్సిన పవిత్ర కర్తవ్యం. అందుకే ‘టాటా సన్స్’ ఈక్విటీల్లో 66 శాతం టాటా ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. వాటిపై వచ్చే డివిడెండ్లు నేరుగా ట్రస్టులు నిర్వహించే సేవాకార్యక్రమాలకు తోడ్పడతాయి. ఇంకో సంగతి ప్రత్యేకించి చెప్పుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఈ మధ్య ఒక అంటువ్యాధిలా మారిన లే–ఆఫ్లకు టాటా గ్రూపు అనుబంధ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టీసీఎస్ పూర్తి వ్యతిరేకం. టాటా గ్రూప్లో సాల్ట్ నుంచి స్టీల్ వరకూ ఉన్న సంస్థల్లో సైతం ఎక్కడా సిబ్బందిని అన్యాయంగా తొలగించారన్న నింద ఏనాడూ రాలేదు. దేశ నిర్మాణంలో, మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో చేసిన గణనీయమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రతన్ టాటాకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించి గౌరవించింది. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ఎయిరిండియా-విస్తారా విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా-విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిర్ ఇండియా–విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదించింది. తన విమానయాన వ్యాపారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి సంబంధించి టాటా గ్రూప్కు ఇది ఒక ప్రధాన ముందడుగు. ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ పై చేసిన ఒక పోస్టింగ్లో విలీనానికి ఆమోదముద్ర వేసినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెలిపింది. (ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన) ‘‘ఎయిరిండియాలో టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్ విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. పారీ్టలు అందించే స్వచ్ఛంద కట్టుబాట్లకు, విధి విధానాలకు లోబడి ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ నిర్దిష్ట వాటాలను కొనుగోలు చేస్తుంది‘ అని సీసీఐ పేర్కొంది. విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్లైన్స్కు విస్తారాలో 49% వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51%గా ఉంది. ఎయిరిండియా లో 25.1% వాటాను సింగపూర్ ఎయిర్లైన్స్ కొను గోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గతేడాది నవంబర్లో టాటా గ్రూప్ ప్రకటించింది. -
సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్
DGCA finds lapses in Air India టాటా నేతృత్వంలోని ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిరిండియా విమానాల్లో అంతర్గత భద్రతా ఆడిట్లలో లోపాలను కనుగొంది.ఇద్దరు సభ్యుల తనిఖీ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. అంతేకాదు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. జూలై 25- 26 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్లోని ఎయిరిండియా కార్యాలయ తనిఖీల్లో DRFలో లోపాలను ప్రస్తావించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ విక్రమ్ దేవ్ దత్ తెలిపారు.కొనసాగుతున్న విచారణ కారణంగా, తాము వివరాలను వెల్లడించలేమని పేర్కొన్నారు. DGCAకి సమర్పించిన తనిఖీ నివేదిక ప్రకారం, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎగ్జామినేషన్ (పైలట్లు ఆల్కహాల్ తీసుకున్నారా?లేదా?అనే పరీక్ష)కు సంబంధించి స్పాట్ చెక్ను నిర్వహించి నప్పటికీ, అంతర్గత ఆడిటర్ మాండేటరీ చెక్లిస్ట్ ప్రకారం వ్యవహరింలేదని, కొన్ని తప్పుడునివేదికలను అందించిందని టీం ఆరోపించింది. అలాగే క్యాబిన్ నిఘా, కార్గో, ర్యాంప్ అండ్ లోడ్ వంటి పలు అంశాల్లో క్రమం తప్పకుండా సేఫ్టీ స్పాట్ చెక్లను నిర్వహించాల్సి ఉంది, అయితే 13 సేఫ్టీ పాయింట్ల తనిఖీల్లో మొత్తం 13 కేసుల్లో ఎయిర్లైన్ తప్పుడు నివేదికలు సిద్ధం చేసిందని రిపోర్ట్ చేసింది. (లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్) అయితే సాధారణ భద్రతా నిబంధనలకు లోబడే తమ విధానాలున్నాయని ఎయిరిండియా ప్రతినిధి స్పందించారు. ఈ విషయాన్ని నిరంతరం అంచనా వేయడానికి, మరింత బలోపేతం చేసుందుకు తాము ఇలా ఆడిట్లలో చురుకుగా పాల్గొంటామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సంబంధిత అధికారి లేవనెత్తిన ఏవైనా విషయాలను ఎయిర్లైన్ నేరుగా పరిశీలిస్తుందన్నారు. -
లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా?
టాటా గ్రూప్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు 'రతన్ టాటా' (Ratan Tata). భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు ఈయన పేరు సుపరిచయమే. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ పారిశ్రామిక దిగ్గజం కంపెనీ బాధ్యతలను త్వరలోనే తమ తరువాతి తరం టాటాలకు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే ఈ బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారు? వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా గ్రూప్ సంస్థ బాధ్యతలను 'మాయా టాటా' (Maya Tata)కు అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ. 20,71,467 కోట్ల విలువైన కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారా.. అని ఇప్పటికే చాలామందిలో తెలుసుకోవలసిన ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు సమాధానంగా మాయా టాటా పేరు వినిపిస్తోంది. నిజానికి ఇటీవల కాలంలోనే 'మాయా టాటా' మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఈమె మాత్రమే కాకుండా ఆమె సోదరుడు నెవిల్లే, సోదరి లేహ్ కూడా కంపెనీలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ కూడా రతన్ టాటా ఆధ్వర్యంలో వ్యాపార పాఠాలు నేర్చుకున్న వారే. ఇదీ చదవండి: గుడ్న్యూస్.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు - వారికి మాత్రమే! రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా & అలూ మిస్త్రీ దంపతుల కుమార్తె ఈ 'మాయా టాటా'. ఈమె యూకేలోని బేయెస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదువుకున్నట్లు సమాచారం. ఆ తరువాత కాలంలో టాటా క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తరువాత టాటా డిజిటల్ కంపెనీలో పనిచేసింది. ప్రస్తుతం టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు మెంబరుగా ఉన్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ బాధ్యతలను మాయా టాటా స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 34 సంవత్సరాలకే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించనున్న మహిళగా రికార్డ్ సృష్టించనుంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఇంకా దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు టాటా గ్రూప్ సామ్రాజ్యాధినేత ఎవరనేది తెలిసిపోతుంది. -
రతన్ టాటాను చంపాలనుకుంది ఎవరు?
మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. ఈ నాలుగు లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటాం. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో టాటా గ్రూప్ ఛైర్మన్గా రతన్ టాటా తన తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ బెదిరించాడని, ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్కు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. శాంతి మంత్రమే అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు.రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్ స్టర్ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్ స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్స్టర్ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది. ఎక్కడా తలవంచలేదు ఇలా, లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో.. దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. టాటాను చంపేందుకు కుట్ర జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన కాంపిటీటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. టాటా మోటార్స్ లేబర్ ఎన్నికలు సజావుగా జరిగేలా గ్యాంగ్స్టర్తో వ్యవహరించేటప్పుడు రతన్ టాటా కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నా..శాంతి యుతంగా తాను ఆ సమస్య నుంచి బయటపడిన విధానం, తీసుకున్న నిర్ణయాల పట్ల తానెప్పుడు చింతించలేదని రతన్ టాటా ఆ వీడియోలో మాట్లాడారు. చదవండి👉 మహీంద్రాతో పాక్ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి? -
ఎయిరిండియా ఆఫర్: రూ. 1471లకే విమానం ఎక్కేయొచ్చు!
AirIndia Sale: గతవారం ఎయిర్క్రాఫ్ట్ లివరీ, కొత్త బ్రాండింగ్ తరువాత టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన ప్యాసింజర్ల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో ప్రయాణిలకు ఆకర్షణీయమైన ఛార్జీలతో విమాన టికెట్లను అందిస్తోంది. తాజా ప్రకటన ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎకానమీ విమాన టికెట్ల ఛార్జీలు రూ. 1470, బిజినెస్ క్లాస్ ఛార్జీలు రూ.10.130 లనుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాలకు ఆకర్షణీయమైన ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా ఎంపిక చేసిన ప్రాంతాల ఎకానమీ క్లాస్ టికెట్లు (అన్నీ ఛార్జీలు కలిపి) రూ.1470, బిజినెస్ క్లాస్కు రూ.10,130 నుండి ప్రారంభమవుతాయి. ఆగస్టు 20వరకు అందుబాటులో ఉండే నాలుగు రోజుల సేల్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రయాణించవచ్చు. ఎయిరిండియా వెబ్సైట్, మొబైల్ యాప్తో పాటు, అధీకృత ట్రావెల్ ఏజెంట్లు , ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్లు చేయవచ్చు. పరిమిత సీట్లు, పరిమిత కాలఆఫర్గా అందిస్తున్న ఈసేల్లో టికెట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా తెలిపింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు సంబంధించి ఎయిరిండియా విమాన టికెట్ చార్జ్ కేవలం రూ.1931గా ఉంటుంది.ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా సర్వీస్ ఛార్జ్ లేకుండా బుకింగ్ చేసుకోవచ్చు. వెబ్సైట్,మొబైల్ యాప్తో పాటు నేరుగా అధీకృత ట్రావెల్ ఏజెంట్లు,ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్లు చేసుకోవచ్చు. కాగా ఎయిరిండియా తొలి ఎయిర్బస్ A350 కొత్త లైవరీలో విమానాల్లోకి ప్రవేశించినఅనంతరం డిసెంబర్ 2023 నుండి ప్రయాణికులు తమ ప్రయాణంలో కొత్త లోగోను చూడొచ్చని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. రెడ్, గోల్డెన్, పర్పుల్ రంగులతో కూడిన కొత్త లోగో ఎయిర్లైన్ భవిష్యత్తు దృక్పథాన్ని సూచిస్తుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
టీసీఎస్లో అమెరికా కాంగ్రెస్ బృందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రో ఖన్నా సారథ్యంలోని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం హైదరాబాద్లోని టీసీఎస్ కార్యాలయాన్ని సందర్శించింది. టాటా గ్రూప్, టీసీఎస్ కార్యకలాపాల గురించి ఈ సందర్భంగా వారికి టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి రాజన్న వివరించారు. అమెరికాకు విజిటర్ వీసాల ప్రాసెసింగ్ను వేగవంతం చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆయన కోరారు. అమెరికన్ ఎంబసీ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్, తెలంగాణ ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీ, తెలంగాణ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ బాలయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
హీరోలా ఉన్న ఈ బిజినెస్మెన్ ఎవరో గుర్తుపట్టారా?
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రముఖ పారిశ్రామిక వేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఈ రోజు ఎలా ఉంటాడనేది అందరికి తెలుసు. అయితే ఒకప్పుడు యువకుడుగా ఉన్న సమయంలో ఎలా ఉండేవాడని చాలా మందికి తెలియకపోవచ్చు. టాటా గ్రూప్ ఉన్నతికి ఎంతో కృషి చేసిన ఈయన యంగేజ్లో హీరోలా ఉండటం ఇక్కడ చూడవచ్చు. కరోనా సమయంలో దేశ ప్రజల కోసం వేల కోట్లు వెచ్చించిన ఈ నిరాడంబరురుని సేవను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను కూడా ప్రధానం చేసింది. సామాన్య ప్రజలకు సైతం కారు అందుబాటులో ఉండాలనే సదుద్దేశ్యంతో నానో కారుని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈయన సొంతమే. ఇదీ చదవండి: ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ ప్రస్తుతం టాటా నానో ఎలక్ట్రిక్ కారుగా విడుదలకావడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రతన్ టాటా కలల కారు ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలైతే బడా సంస్థలకు కూడా గట్టిపోటీ ఇస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఎనిమిది పదుల వయసు దాటిన తరువాత కూడా దేశం కోసం ఆలోచించే మహానుభావుడు రతన్ టాటా అనటంలో ఎటువంటి సందేహం లేదు. -
లెజెండ్ రతన్టాటాకు ‘మహా’ గౌరవం: ప్రశంసల వెల్లువ
టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాను మరో అవార్డు వరంచింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్యోగ రత్న అవార్డును ఆయన దక్కించు కున్నారు. తమ సరికొత్త అవార్డుతో ఆయనను సత్కరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ ఈ విషయాన్ని ప్రకటించారు. (ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) ఈ ఏడాది నుంచి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రత్న అవార్డును ప్రవేశపెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్లు పాల్గొన్న సమావేశంలో ఈ ఏడాది పారిశ్రామికవేత్తకు తొలి ఉద్యోగ రత్న అవార్డుకు రతన్ టాటాను ఎంపిక చేశారు.విశిష్ట వ్యక్తులకు అందించే అత్యున్నత రాష్ట్ర గౌరవం మహారాష్ట్ర భూషణ్ అవార్డు సంప్రదాయాన్ని అనుసరించి, ఈ సంవత్సరం నుండి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రత్న అవార్డును ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యువ పారిశ్రామికవేత్త, మహిళా పారిశ్రామికవేత్త, మరాఠీ పారిశ్రామికవేత్తలకు కూడా అవార్డులు అందించనుంది.మహారాష్ట్ర ఉద్యోగ రత్న అవార్డును వ్యాపారం, పరిశ్రమలు, విద్య, రియల్ ఎస్టేట్, పర్యాటకం, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, బ్యాంకింగ్, ఐటీ, ఆహార రంగాలలో అపారమైన కృషి చేసిన వ్యక్తులు , సంస్థల ప్రయత్నాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఈ అవార్డును తొలి గ్రహీత టాటా గ్రూపు నిలిచింది. అయితే రతన్ టాటా తొలి అవార్డు దక్కించుకోవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే లెజెండ్ రతన్ టాటాకు మహా అవార్డుపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రతన్ టాటా విశిష్టమైన కెరీర్లో అనేక ఇతర ప్రశంసలతో పాటు, భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు పౌర పురస్కారాలు: 2008లో పద్మవిభూషణ్, 2000లో పద్మభూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. (ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!) ఉప్పు నుంచి విమానాల దాకా సేవలందిస్తూ దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో టాటా గ్రూపు. కంపెనీని విజయపథంలో నడిపించిన,ఇప్పటికీ గ్రూపు గౌరవ ఛైర్మన్గా కొనసాగుతున్న రతన్ టాటా జీవన శైలి ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి దాయకం. టీసీఎస్, టాటా ఎయిరిండియా లాంటి ఎన్నో సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. -
బ్రిటన్లో టాటా గిగాఫ్యాక్టరీ!
ముంబై/లండన్: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా బ్రిటన్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీల తయారీ కోసం గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా 4 బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 42,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు తెలిపింది. తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) వాహనాలతో పాటు ఇతరత్రా సంస్థల కోసం కూడా ఇందులో బ్యాటరీలను తయారు చేయనున్నట్లు పేర్కొంది. 2026 నుంచి ఈ గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలో బ్యాటరీల వాటా దాదాపు సగం పైగా ఉంటుంది. వేల కొద్దీ ఉద్యోగాలకు ఊతం.. గిగాఫ్యాక్టరీపై పెట్టుబడులతో స్థానికంగా 4,000 పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాలు, సరఫరా వ్యవస్థలో పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించగలదని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2030 నాటికి తమకు అవసరమయ్యే బ్యాటరీల్లో ఈ ప్లాంటు దాదాపు సగభాగం ఉత్పత్తి చేయగలదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మళ్లాలన్న తమ లక్ష్యం మరింత వేగవంతంగా సాకారం కాగలదని వివరించారు. భారీగా సబ్సిడీలు.. గిగాఫ్యాక్టరీ కోసం బ్రిడ్జ్వాటర్ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు జేఎల్ఆర్ మాతృ సంస్థ టాటా సన్స్ తెలిపింది. 40గిగావాట్అవర్స్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో ఇది యూరప్లోని భారీ గిగాఫ్యాక్టరీల్లో ఒకటిగాను, భారత్కు వెలుపల టాటా గ్రూప్నకు తొలి భారీ గిగాఫ్యాక్టరీగా నిలవనుంది. 1980ల్లో నిస్సాన్ రాక తర్వాత బ్రిటన్ ఆటోమోటివ్ రంగంలో ఇది అత్యంత భారీ పెట్టుబడి కానుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం టాటా గ్రూప్నకు ప్రభుత్వం నుంచి వందల కొద్దీ మిలియన్ పౌండ్ల మేర ప్లాంటుకు సబ్సిడీల హామీ లభించి ఉంటుందని పేర్కొన్నాయి. విద్యుత్, గ్రాంటు, సైటుకు రహదారిని మెరుగుపర్చటం తదితర రూపాల్లో 500 మిలియన్ పౌండ్ల మేర సబ్సిడీలు అందించాలని ప్రభుత్వాన్ని టాటా గ్రూప్ కోరినట్లు సమాచారం. అయితే, ఇటు టాటా గ్రూప్, అటు బ్రిటన్ ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వలేదు. పారదర్శక విధానాల్లో భాగంగా వీటిని తర్వాత ప్రచురించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్లో ప్రస్తుతం ఒక్క బ్యాటరీల తయారీ ప్లాంటు ఉంది. కొత్తగా మరో ఫ్యాక్టరీ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్లో 35 పైచిలుకు ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే పనిచేస్తుండగా, కొన్ని నిర్మాణంలోనూ, కొన్ని ప్రతిపాదనల దశల్లోనూ ఉన్నాయి. అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు.. ‘బిలియన్ల కొద్దీ పౌండ్ పెట్టుబడులు, అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసే ప్లాంటు.. ఆటోమోటివ్ రంగం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లేందుకు తోడ్పడగలదు. ఇప్ప టికే బ్రిటన్లో వివిధ రంగాల్లో మా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. బ్రిటన్లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపేందుకు తాజా ఇన్వెస్ట్మెంట్ నిదర్శనం‘ అని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ‘భారత్కు వెలుపల తమ తొలి భారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పాలని టాటా గ్రూప్ నిర్ణయం తీసుకోవడమనేది బ్రిటన్ కార్ల తయారీ పరిశ్రమ, నిపుణులపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. మా ఆటోమోటివ్ రంగంలో అత్యంత భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది’ – బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ -
కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం
Tata Steel CFO Koushik Chatterjee: కొడితో కొట్టాలి..సిక్స్ కొట్టాలి... అన్నట్టు ఏదైనా టాప్ కంపెనీలో జాబ్ కొట్టాలి. లక్షల్లో ప్యాకేజీ అందుకోవాలి..ఇదేగా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతీవారి కల. కానీ కంపెనీలో టాప్ పొజిషన్ కాకపోయినా, టాప్ శాలరీ అందుకోవడం విశేషం కదా మరి. అలా రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూపు ఉద్యోగి ఒకరు రోజుకు ఏకంగా లక్షల్లో సంపాదిస్తున్నారు. టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్వో కౌశిక్ ఛటర్జీ. టాటా గ్రూప్లో అత్యధిక వేతనం పొందుతున్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లలో కౌశిక్ ఒకరు. రూ. 1,43,175 కోట్ల మార్కెట్ క్యాప్ ఫ్లాగ్షిప్ కంపెనీకి ఆర్థిక వ్యవహారాల విభాగానికి ఇన్చార్జ్గా ఉన్నాడు.టాటా స్టీల్ వార్షిక నివేదిక ప్రకారం ఛటర్జీ ఇప్పటికీ రూ. 14,21,18,000 (రూ. 14.21 కోట్లు) తీసుకున్నారు. అంటే రోజుకు రూ.3.89 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అయితే ఇటీవల టాటా మోటార్స్కు చెందిన పీబీ బజాలీ, ఛటర్జీని అధిగమించారు. గత ఏడాదితో పోల్చితే వేతనంలో ఈ ఏడాది స్వల్పంగా తగ్గినప్పటకీ 15,17,18,000 (రూ. 15.17 కోట్లు) అందుకున్నారు. అలాగే 2023లో ఛటర్జీతో పోలిస్తే టాటా స్టీల్లో రూ. 18.66 కోట్లతో సీఈఓ టీవీ నరేంద్రన్కు మాత్రమే ఎక్కువ వేతనం అందుకోవడం గమనార్హం. (మళ్లీ పరుగందుకున్న పసిడి, వెండి అయితే ఏకంగా) టాటా గ్రూప్లో పని చేయడానికి ముందు, కౌశిక్ బ్రిటానియా ఇండస్ట్రీస్, ఆడిట్ కంపెనీ ఎస్బీ బిల్లిమోరియా కంపెనీల్లో పనిచేశారు. కేవలం 36 సంవత్సరాల వయస్సులో, కౌశిక్ 2006లో టాటా స్టీల్లో VP ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అతను 2012 నుండి సీఎఫ్వోగా ఉన్నారు. ఛటర్జీ జనవరి 1, 2023 నుండి 3 సంవత్సరాల కాలానికి IFRS ఫౌండేషన్ ఆరు కొత్త ట్రస్టీలలో ఒకరిగా నియమితులయ్యారు. అతను సలహా సభ్యునిగా కూడా ఉన్నారు. భారీ సంపాదన ఉన్నప్పటికీ చాలా నిడాడంబరమైన జీవిన శైలితో కౌశిక్ ఛటర్జీ కూల్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అని సహోద్యోగులు భావిస్తారు. కౌశిక్ పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాల నుండి పాఠశాల విద్యను, కోలకతాలో బీకాం డిగ్రీని సాధించారు. ఆ తరువాత చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేశారు. -
తుది దశలో టాటా-విస్ట్రాన్ డీల్
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్కు చెందిన కర్ణాటక ప్లాంటును టాటా గ్రూప్ కొనుగోలు చేసే అంశం తుది దశలో ఉన్నట్లు సమాచారం. అనుబంధ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా టాటా గ్రూప్ ఈ డీల్ను కుదుర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తయితే యాపిల్ ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ సంస్థగా టాటా నిలవనుంది. అలాగే, ఈ ప్లాంటులో ఐఫోన్లతో పాటు ఇతరత్రా కొత్త యాపిల్ ఉత్పత్తులను కూడా అసెంబుల్ చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుతం తైవాన్కు చెందిన విస్ట్రాన్తో పాటు ఫాక్స్కాన్, పెగాట్రాన్ వంటి సంస్థలు యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. -
అనిల్ అగర్వాల్కు మరో దెబ్బ? టాటా గ్రూపుతో ఫాక్స్కాన్ చర్చలు?
తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ రూ.1.6 లక్షల కోట్ల(19.5 బిలియన్ల డాలర్ల) ప్రాజెక్టును వెనక్కి తీసుకుని చైర్మన్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూపునకు భారీ షాక్ ఇచ్చింది. భారతదేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి కోసం జాయింట్ వెంచర్ (జేవీ) నుండి వైదొలగాలని సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించిన సంస్థ దేశీయంగా మరో టాప్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టాటా గ్రూప్తో సంభావ్య టై-అప్ కోసం ఫాక్స్కాన్ అన్వేషిస్తోందని సీఎన్బీసీ ఆవాజ్ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా, టాటా గ్రూప్ ఇటీవలి సెమీకండక్టర్ ప్రయత్నాలలో ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రాజెక్టుకు ఫాక్స్కాన్ కట్టుబడి ఉందనీ, దేశం ఒక బలమైన సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను విజయవంతంగా స్థాపించాలని చూస్తోందని ఫాక్స్కాన్ మంగళవారం మరోసారి స్పష్టం చేసింది. సరైన భాగస్వాముల కోసం సమీక్షిస్తున్నామని, దేశీయ, అంతర్జాతీయ వాటాదారులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి అప్లికేషన్ను సమర్పించే దిశగా పని చేస్తోందని ప్రకటించడం ఈ వార్తలు ఊతమిస్తోంది. (వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్ ) తరువాతి తరం వృద్ధిని ప్రారంభించే క్రమంలో దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన ఈ మెగా ప్రాజెక్టును కోసం వేదాంత ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకునేందుకు ఫాక్స్ కాన్-వేదాంత జాయింట్ వెంచర్గా గుజరాత్ లో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించాయి. అయితే పరస్పర అంగీకారంతో ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఫాక్స్కాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (90 శాతం ఉద్యోగాలు ఫట్: సిగ్గూ, శరం, మానవత్వం లేదా? సీఈవోపై పైర్) -
నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!
సాక్షి,ముంబై: టైటన్ లాభాల పంటతో ప్రముఖ ఇన్వెస్టర్ రేఖా ఝున్ఝన్వాలా సంపద భారీగా ఎగిసింది. శుక్రవారం నాటి నష్టాల మార్కెట్లోటైటన్ షేరు భారీగా లాభపడింది. టాటా గ్రూప్నకు చెందిన టైటన్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పబ్లిక్ షేర్హోల్డర్, దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝన్వాలా భార్య రేఖా ఝున్ఝన్వాలా నెట్వర్త్లో దాదాపు రూ. 500 కోట్ల మేర అదనంగా చేరింది. టైటన్లో ఝున్ఝున్ వాలాకు 5.29 శాతం ఉంది. రాకేష్ అమితంగా ఇష్టపడే, మల్టీబ్యాగర్ టాటా గ్రూప్ స్టాక్ టైటాన్ ఈ స్టాక్ శుక్రవారం ఇంట్రాడేలో కొత్త 52 వారాల గరిష్ఠ ఈ స్టాక్ ధర రూ.105.40 మేర పెరిగింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత, జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం టైటాన్ కంపెనీ షేర్లు ట్రేడింగ్లోకి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే 3.39 శాతం పెరిగి రికార్డు గరిష్ట స్థాయి రూ.3,211చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ టైమ్ హై లెవెల్ రూ. 2,85,077 కోట్లకు చేరింది. గత సెషన్లో రూ. 275,720 కోట్ల నుంచి రూ.9,357 కోట్లు పెరిగింది. (వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) టైటన్ షేరు ఏడాది కాలంలో ఏకంగా 50 శాతానికి పైగా పెరిగింది. జూలై 7, 2022 నాటికి బీఎస్సీలో రూ.2128 గా ఉన్న షేర్లు. శుక్రవారం కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.3211.10ని తాకింది. అంటే 2023లో టైటన్ షేర్లు 25 శాతం మేర లాభపడ్డాయన్నమాట. ఫలితంగా 5.29 శాతం వాటా ఉన్న ఝన్ ఝన్ వాలా రూ.494 కోట్ల విలువైన నోషనల్ లాభాలు ఆర్జించారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) టైటన్ కీలక వ్యాపారాలు రెండంకెల వృద్ధిని సాధించి క్యూ1లో ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. టైటన్ ప్రధాన ఆభరణాల వ్యాపారం సంవత్సరానికి 21 శాతం వృద్ధితో ఆకట్టుకుంది. టైటాన్ వాచీలు & వేరబుల్స్ విభాగం 13 శాతం వార్షిక వృద్ధిని, అనలాగ్ వాచీల విభాగంలో 8 శాతం వృద్ధిని, ఇతరాల్లో 84 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ విస్తరణలో భాగంగా గత త్రైమాసికంలో మొత్తం 18 స్టోర్లతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 559 చేరింది. -
‘దయ చేసి నమ్మకండి.. అవన్నీ అవాస్తవాలే’!
రతన్ టాటా..పరిచయం అక్కర్లేని పేరు. భారత్లోని దిగ్గజ పారిశ్రామికవేత్త. గొప్ప మానవతావాది..దాతృత్వం కలిగిన వ్యక్తి. టాటా గ్రూప్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొన్నా.. టాటా ట్రస్ట్కు ఛైర్మన్గా కొనసాగుతూ సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు. తాజాగా, ఆన్లైన్లో తన పేరుతో జరుగుతున్న మోసాలపట్ల నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని రతన్ టాటా కోరారు. ‘దయచేసి అప్రమత్తంగా ఉండండి. నేను ఏ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టలేదు. ఏ క్రిప్టోకరెన్సీ సంస్థలతో సంబంధం లేదు’ అని అన్నారు. క్రిప్టోకరెన్సీ కంపెనీలతో తనకు సంబంధం ఉందని ఏవైనా కథనాలు లేదా ప్రకటనలను మీరు చూసినట్లయితే, అవి పూర్తిగా అవాస్తవమని, పౌరులను మోసం చేయడానికి ఉద్దేశించినవి అని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. క్రిప్టో మోసాలకు సంబంధించి ఓ స్క్రీన్ షాట్ను షేర్ చేశారు. I request netizens to please stay aware. I have no associations with cryptocurrency of any form. pic.twitter.com/LpVIHVrOjy — Ratan N. Tata (@RNTata2000) June 27, 2023 చదవండి👉 రూ.5.3 కోట్ల ఫ్లాట్ కేవలం రూ.11లక్షలే.. ఎలా సాధ్యం? -
బట్టలు కొంటే బంగారం! హైదరాబాద్లో టాటా బ్రాండ్ నాలుగో స్టోర్
హైదరాబాద్: టాటా గ్రూప్లో భాగమైన సంప్రదాయ దుస్తుల బ్రాండ్ తనైరా హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించింది. నగరంలో తమ నాలుగో స్టోర్ను ఏర్పాటు చేసింది. సుమారు 4,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైన స్టోర్ను సంస్థ రిటైల్ హెడ్ అనిర్బన్ బెనర్జీ, సౌత్ రీజనల్ బిజినెస్ హెడ్ శరద్ ఆర్ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జూన్ 16 నుంచి 20 వరకు ప్రత్యేక గోల్డ్ కాయిన్ ఆఫర్ ప్రకటించారు. రూ. 20,000 విలువైన కొనుగోళ్లు చేసే కస్టమర్లకు 0.2 గ్రాముల తనిష్క్ బంగారం నాణెం అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. -
తనిష్క్, రిలయన్స్కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ
ప్రముఖ వ్యాపార సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించ నుంది. ఇప్పటికే పలురంగాల్లో దూసుకుపోతున్న కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని సంస్థ వేల కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆదిత్యా బిర్లా ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5000 కోట్ల పెట్టుబడితో 'నావల్ జ్యువెల్స్' అనే కొత్త వెంచర్ కింద ఆభరణాల వ్యాపారం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన డిజైన్, అధిక నాణ్యత కలిగిన ఆభరణాల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో కొత్త వెంచర్ ఉంటుందని పేర్కొంది. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) వ్యూహాత్మక పోర్ట్ఫోలియో అని, తద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ కావడానికి, సంస్థ ఉనికిని విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. ఇప్పటికే పెయింట్స్, B2B ఇ-కామర్స్లో ప్రవేశించడమే కాకుండా, మెటల్ పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఇపుడిక బ్రాండెడ్ జ్యువెలరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) దీంతో టాటా గ్రూప్నకు చెందిన తనిష్క్, రిలయన్స్ జ్యువెల్స్తో పోటీ పడనుంది ఆదిత్య బిర్లా గ్రూప్. కంపెనీ డేటా ప్రకారం, దేశీయ ఆభరణాల మార్కెట్ 2025 నాటికి సుమారు రూ. 7.43 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత రత్నాభరణాల మార్కెట్ వాటా దేశ జీడీపీలో 7 శాతం. -
టాటా మాస్టర్ ప్లాన్.. ప్రపంచ దేశాల్లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ!
దేశీయ ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి అడుగుపెట్టింది. గుజరాత్ ప్రభుత్వ అంగీకారంతో ఆ రాష్ట్రంలో రూ.13,000 కోట్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయనుంది. ఈ మేరకు టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అగరాటాస్ ఎనర్జీ స్టోరేజ్ గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. గంటకు 20 గిగావాట్ల తయారీ సామర్ధ్యంతో ప్లాంట్ను విస్తరించనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 13,000 మంది ఉపాధి పొందనున్నారు. ఇక, టాటా గ్రూప్ లిథియం బ్యాటరీ మ్యానిఫ్యాక్చరింగ్ సంబంధించిన ప్రొడక్షన్ ఈకో సిస్టంలో తోడ్పాటునందించేందుకు సిద్ధంగా ఉన్నామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. భారత్తో పాటు మరిన్ని దేశాల్లో టాటా గ్రూప్ మరో అనుబంధ ఆటోమొబైల్ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవడర్ బ్రిటన్లో ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్ నిర్మించేందుకు సిద్ధమైంది. బ్రిటన్తో పాటు ఇంగ్లాండ్, స్పెయిన్ దేశాలు సైతం ఈవీ బ్యాటరీ తయారీలో టాటా గ్రూప్కు తగిన ప్రోత్సాహకాల్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. లిథియం అయాన్ నిల్వలు.. వెలిగిపోనున్న భారత్ 2021 సంవత్సరంలో కర్నాటకలోని మండ్యా జిల్లాలో 1,600 టన్నులు, ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్లోని రియాసి జిల్లా మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం కొలువైన కొండల దిగువన సలాల్ హైమన గ్రామం వద్ద 59 లక్షల టన్నులు, రాజస్థాన్లోని డేగనా ప్రాంతంలో ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) గుర్తించింది.ఉప్పగా ఉండే రిజర్వాయర్లు, భూమి లోపల ఉండే రాళ్లలో దొరికే లిథియంతో ఎలక్ట్రిక్ విభాగంలో భారత్ వెలిగిపోనుంది. జీరో కార్బన్ ఉద్గారిణిగా ప్రధాని నరేంద్ర మోదీ 2027నాటికి భారత్ను నాటికి జీరో కార్బన్ ఉద్గారిణిగా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా చైనా, అమెరికాతో పోటీపడ్తూ ఎలక్ట్రిక్ వెహికల్ రవాణాను ప్రోత్సహిస్తున్నారు. చదవండి : ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
టాటా మెమోరియల్ సెంటర్కు ఐసీఐసీఐ రూ.1,200 కోట్ల నిధులు
ముంబై: టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) క్యాన్సర్ పేషంట్ల చికిత్సా సామర్థ్యాలను పెంచే దిశగా తలపెట్టిన మూడు సెంటర్స్ విస్తరణకు రూ.1,200 కోట్లు అందించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్తో పాటు పంజాబ్లోని ములాన్పూర్, మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలు నిర్వహించే తమ అనుబంధ విభాగం ఐసీఐసీఐ ఫౌండేషన్ .. నాలుగేళ్ల వ్యవధిలో రూ. 1,200 కోట్లు వెచ్చించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది తెలిపారు. దీనితో టీఎంసీ ఏటా మరో 25,000 మంది పేషంట్లకు చికిత్సను అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత 1.2 లక్షల పేషంట్ల వార్షిక సామర్ధ్యంతో పోలిస్తే ఇది 25 శాతం అధికమని వివరించారు. మూడు ప్రాంతాల్లోనూ హాస్పిటల్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి లభించే నిధులు కొత్త బ్లాక్ల ఏర్పాటు కోసం ఉపయోగపడతాయని టీఎంసీ డైరెక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. -
సౌత్లో మాస్టర్ ప్లాన్! విస్తరణ బాటలో టాటా కన్జ్యూమర్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ దక్షిణాది మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో పంపిణీదారుల చానల్ను ఏర్పాటు చేసుకోనున్నట్టు సంస్థ ప్రకటించింది. ‘‘దక్షిణ భారత్ అంతటా మేము విస్తరిస్తున్నాం. టీ, కాఫీ, ఉప్పు, మసాలా దినుసులను దక్షిణాది కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని విడుదల చేస్తున్నాం’’అని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. కాఫీ, టీ ఉత్పత్తుల్లో ఈ సంస్థ దక్షిణాదిన మార్కెట్ వాటా పెంచుకుంటోంది. టీ విభాగంలో చక్రాగోల్డ్, కనన్ దేవాన్ బ్రాండ్ల వాటా క్రమంగా పెరుగుతుండగా.. టాటా కాఫీ గ్రాండ్ నూతన ప్యాకేజింగ్ డిజైన్తో మార్కెట్లోకి వచ్చింది. ‘‘గ్రామీణ మార్కెట్లో అవకాశాలున్నట్టు గుర్తించాం. గ్రామీణ, చిన్న పట్టణాల్లో పంపిణీదారులను నియమించుకుంటున్నాం’’అని వివరించింది. ఇక టాటా సంపన్న్ బ్రాండ్ కింద మసాలా దినుసులను ప్రత్యేకంగా విడుదల చేసింది. ప్రస్తుత విభాగాల్లో అగ్రగామి ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదగడంతోపాటు, కొత్త విభాగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్టు వాటాదారులకు తెలిపింది. 2022–23లో డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ 15 శాతం పెరిగి, దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ అవుట్లెట్లకు చేరుకుంది. మరిన్ని సంఖ్యలో రిటైల్ స్టోర్లకు సంస్థ ఉత్పత్తులను చేరువ చేయడానికి ఇది సాయపడింది. సంస్థ ఈ కామర్స్ అమ్మకాల చానల్ వేగంగా వృద్ధి చెందుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆధునిక అంగళ్లు ద్వారా అమ్మకాలు 21 శాతం పెరిగాయి. ఇదీ చదవండి: మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం.. కొత్తగా 1000 ఉద్యోగాలు -
టాటా ఐఫోన్! ఇక ఐఫోన్ 15 తయారీ ఇక్కడే..
iPhone 15 Manufacturing: దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయబోతోంది. భారత్లో రాబోయే ఐఫోన్ 15 (iPhone 15), 15 ప్లస్ (15 Plus) ఫోన్లను తయారు చేసేందుకు యాపిల్ (Apple) సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా తైవాన్కు చెందిన ఓ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంటోంది. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! టాటా సంస్థ భారత్లో యాపిల్ కోసం నాలుగో ఐఫోన్ తయారీ భాగస్వామిగా ఉంటుందని తైవాన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ ‘ట్రెండ్ఫోర్స్’ పేర్కొంది. టాటా భాగస్వామ్యంతో భారత్లో యాపిల్ మొత్తం ఐఫోన్లలో ఎంత శాతం ఉత్పత్తి చేయనుందో కచ్చితంగా తెలియదు. యాపిల్కు భారత్లో ఇప్పటికే విస్ట్రాన్, ఫాక్స్కాన్, పెగాట్రాన్ అనే మూడు తయారీ భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. అదే విధంగా భారత్లో రెండు రిటైల్ స్టోర్లను యాపిల్ ప్రారంభించింది. టాటా గ్రూప్పై యాపిల్ దృష్టి ట్రెండ్ఫోర్స్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ల తయారీ కోసం భారత్లోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటిగా ఉన్న టాటా గ్రూప్పై యాపిల్ దృష్టి సారిస్తోంది. ఇది నిజమైతే ఐఫోన్ 15 తొలి షిప్మెంట్లు మొదట భారత్లోనే అందుతాయి. సాధారణంగా ఐఫోన్లు భారత్లోకి ఆలస్యంగా వస్తాయి. ఇక భారత్లోనే తయారైతే ఐఫోన్ 15 సిరీస్ ధరలు కూడా తక్కువ ఉండేందుకు దోహదం చేస్తుంది. దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో ఉనికిని విస్తరించాలని చూస్తున్న టాటా గ్రూప్నకు ఇది గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కోవిడ్ పరిమితులు, సప్లయి చైన్ సమస్యల కారణంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇటీవలి కాలంలో దాని తయారీ స్థావరాలను విస్తరించాలని చూస్తోంది. కంపెనీ ఇప్పటికే ఐఫోన్14, ఐఫోన్ SE, ఐఫోన్13లతో సహా కొన్ని ఫోన్లను భారత్లోనే తయారు చేస్తోంది. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! -
రతన్ టాటాకు మరో అరుదైన పురస్కారం: ఫోటోలు వైరల్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త, టాటాసన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాకు అరుదైన పురస్కారం లభించింది. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం రతన్ టాటాను వరించింది. ఆస్ట్రేలియా-భారత్ ద్వైపాక్షిక సంబంధానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను భారతదేశంలోని ఆస్ట్రేలియన్ రాయబారి బారీ ఓ' ఫారెల్ ట్విటర్లో షేర్ చేశారు. పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా వ్యాపారంలోనే కాదు, దాతృత్వంలో కూడా గొప్ప వ్యక్తిగా నిలిచారని ప్రశంసించారు. టాటా సహకారం ఆస్ట్రేలియాలో గణనీయమైన ప్రభావాన్ని తీసుకొచ్చిం దన్నారు. ఆస్ట్రేలియా-భారత్ బంధానికి టాటా సుదీర్ఘ నిబద్ధతకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గౌరవాన్ని ప్రదానం చేయడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. టాటా వపర్ సదరన్ ఒడిశా డిస్టట్రీబ్యూషన్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ రంజన్ కూడా లింక్డ్ఇన్ పోస్ట్లో సత్కార వేడుక ఫోటోలను చేశారు. బిజినెస్లోనూ, ఫిలాంత్రఫీలోనే టాటా చేసిన సేవలు భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయ్యాయన్నారు. అనేక విజయవంతమైన వెంచర్ల వెనుక చోదక శక్తిగా రతన్ టాటా ఉన్నారు. ఆయన లీడర్ షిప్, విజన్ ఎంతోమందికి తమ కలల సాకారంలో గొప్ప స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు Ratan Tata is a titan of biz, industry & philanthropy not just in 🇮🇳, but his contributions have also made a significant impact in 🇦🇺. Delighted to confer Order of Australia (AO) honour to @RNTata2000 in recognition of his longstanding commitment to the 🇦🇺🇮🇳relationship. @ausgov pic.twitter.com/N7e05sWzpV — Barry O’Farrell AO (@AusHCIndia) April 22, 2023 -
ఎయిరిండియా, విస్తారా విలీనంపై ముందడుగు
న్యూఢిల్లీ: ఫుల్ సర్వీస్ విమానయాన సంస్థలైన ఎయిరిండియా, విస్తారాలను విలీనం చేసేందుకు అనుమతుల కోసం కాంపిటీషన్ కమిషన్ ఇండియా (సీసీఐ)కి టాటా గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ (ఎస్ఐఏ), టాటా సన్స్ (టీఎస్పీఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ అయిన టాటా సియా ఎయిర్లైన్స్ (టీఎస్ఏఎల్).. విస్తారా బ్రాండ్ కింద విమానయాన కార్యకలాపాలు సాగిస్తోంది. టీఎస్ఏఎల్లో టీఎస్పీఎల్కు 51 శాతం, ఎస్ఐఏకి 49 శాతం వాటాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్.. తమకు వాటాలు ఉన్న విస్తారాను కూడా అందులో విలీనం చేయాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత డీల్ ప్రకారం విలీనానంతరం ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో టీఎస్పీఎల్కు 51 శాతం, ఎస్ఐఏకి 25.1 శాతం వాటాలు ఉంటాయి. అటు ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా)ను ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో విలీనం చేసే ప్రక్రియ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్టోబర్ గణాంకాల ప్రకారం ఎయిరిండియా, విస్తారా మార్కెట్ వాటా 18.3 శాతంగా (రెండింటిదీ కలిపి) ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ కూడా కలిస్తే దేశీయంగా టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్లైన్స్ మొత్తం మార్కెట్ 25.9 శాతానికి పెరుగుతుంది. తద్వారా ఎయిరిండియా భారత్లో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్గాను, దేశీ రూట్ల విషయానికొస్తే రెండో పెద్ద విమానయాన సంస్థ గాను నిలుస్తుంది. -
టాటా చేతికి ఐఫోన్ ప్లాంట్.. కొత్త రంగంలోకి దేశీయ దిగ్గజం
దేశీయ మార్కెట్లో ఎంతోమంది ప్రజలకు నమ్మికైనా టాటా గ్రూప్ బెంగళూరులోని విస్ట్రాన్ ఐఫోన్ ప్లాంట్ను ఏప్రిల్ చివరి నాటికి కొనుగోలు చేసే అవకాశం ఉందని నివేదికల చెబుతున్నాయి. ఇదే జరిగితే యాపిల్ ఉత్పత్తుల కోసం భారతదేశం మొదటి స్వదేశీ ఉత్పత్తి శ్రేణిగా అవతరిస్తుందనటంలో సందేహం లేదు. టాటా గ్రూప్ ఇప్పటికే ఈ విస్ట్రాన్ ప్లాంట్లో కొన్ని మార్పులను చేయడం కూడా ప్రారంభించింది. అయితే ఈ ప్లాంట్ సొంతం చేసుకునే క్రమంలో సుమారు రెండు వేల మంది కార్మికులను తొలగించే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో మధ్య స్థాయి ఉద్యోగుల నుంచి, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్ల వరకు ఉండటం గమనార్హం. టాటా గ్రూప్ ఈ కంపెనీని సొంతం చేసుకున్న తరువాత ఐఫోన్ 15ను తయారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విస్ట్రాన్ ప్లాంట్లోని ఎనిమిది ఉత్పత్తి లైన్లలో ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 14 తయారవుతున్నాయి. టాటా బెంగళూరు ప్లాంట్ను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆపిల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ఏకైక ప్లాంట్ విస్ట్రాన్ పూర్తిగా దేశీయ మార్కెట్కు దూరంగా ఉంటుంది. ఇవన్నీ టాటా గ్రూప్ సొంతమవుతాయి. యాపిల్ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ సుమారు 600 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ టేకోవర్ ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆపిల్ చైనా నుండి షిఫ్ట్ను ప్లాన్ చేస్తోంది, ఈ కారణంగానే ఇండియాలోని ప్లాంట్ టాటా ద్రౌప్ స్వాదీనం చేసుకునే అవకాశం ఏర్పడింది. గత ఏడాది కాలిఫోర్నియాకు చెందిన కుపెర్టినో కంపెనీ చైనా, అమెరికా మధ్య విభేదాలు ఏర్పడిన కారణంగా తమ ఉత్పత్తిలో 25శాతం భారతదేశానికి మార్చాలని దాని కోసం తన ప్రణాళికలను కూడా ప్రకటించింది. మన దేశంలో ఆపిల్ ఉత్పత్తులను అసెంబ్లింగ్ చేసే మూడు తైవాన్ కంపెనీలలో విస్ట్రాన్, పెగాట్రాన్, ఫాక్స్కాన్ వున్నాయి. ఇప్పుడు 'విస్ట్రాన్'లో కంపెనీ ఉత్పత్తులు నిలిపివేయగా.. ఫాక్స్కాన్, పెగాట్రాన్లలో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే భారతదేశంలో టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. దీనికోసం కొత్త ఉత్పత్తులను ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఐఫోన్ కోసం పెగాట్రాన్ తయారీ యూనిట్లను టాటా కొనుగోలు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. -
15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్ఝున్వాలా
సాక్షి, ముంబై: ప్రముఖ మహిళా వ్యాపారవేత్త రేఖా ఝున్ఝున్వాలా మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలంలో 15 నిమిషాల్లో కోట్లాది రూపాయలను ఆర్జించారు. తన పోర్ట్ఫోలియోలోని టాటాగ్రూపునకు చెందిన టైటన్, టాటా మోటార్స్ షేర్ల లాభాలతో ఆమె మరింత ధనవంతురాలిగా మారిపోయారు. ఏకంగా 400కోట్ల రూపాయలను తన నెట్వర్త్కు జోడించుకున్నారు. ఈ ఆర్థికసంవత్సరంలో వ్యాపార వృద్ది, ఇతర వ్యాపార అప్డేట్స్తో సోమవారంనాటి మార్కెట్లో టైటన్, టాటా మోటార్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. రేఖా పోర్ట్ ఫోలియోలోని షేర్ల మార్నింగ్ డీల్స్తో ఆమె నికర విలువ ఆకాశానికి ఎగిసింది. ట్రేడింగ్ ఆరంభం 15 నిమిషాల్లోనే, టైటన్ షేరు ధర రూ. 2,598.70 గరిష్టాన్ని తాకింది. మునుపటి ముగింపుతో పోలిస్తే రూ. 50కు పైనే ఎగిసింది. అదేవిధంగా, టాటా మోటార్స్ షేరు ధర రూ. 32.75 పెరిగింది. రేఖా ఝున్ఝున్వాలా నెట్వర్త్ జూమ్ 2022 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికానికి టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, రేఖాకు 4,58,95,970 టైటాన్ షేర్ల ఉన్నాయి. ఇది కంపెనీ మొత్తం చెల్లించిన మూలధనంలో 5.17 శాతం. కాబట్టి, సోమవారం సెషన్లో మొదటి 15 నిమిషాల్లో టైటాన్ షేరు ధర పెరిగిన తర్వాత రేఖా నికర విలువ దాదాపు రూ.230 కోట్లు (రూ50.25 x 4,58,95,970) పెరిగింది. అలాగే టాటా మోటార్స్ షేర్లు 5,22,56,000 షేర్లు లేదా కంపెనీలో 1.57 శాతం వాటా. కాబట్టి, రేఖా నికర విలువలో మొత్తం పెరుగుదల దాదాపు రూ.170 కోట్లు (రూ.32.75 x 5,22,56,000). కాగా ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేశ్ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా. -
సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?
ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే నైతికత, నిబద్ధత చాలా అసవరం. కానీ చాలా సంస్థలు దీన్ని పెద్దగా పట్టించుకోవు. కానీ రతన్ టాటా ఆధ్వర్యంలోని టాటా గ్రూప్, తమ కార్పొరేట్ పాలనలో, వ్యాపారం చేసే విధానంలో నైతికతను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తుంది. ఇటీవలికాలంలో కంపెనీ సుదీర్ఘ చరిత్రలో తొలిసారి చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ నియమించుకుంది. తాజాగా హెచ్డీఎఫ్సీ ఈ కోవలో చేరింది. కంపెనీ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్గా మాజీ ఈడీ అధికారి ప్రసూన్ సింగ్ను నియమించింది. అసలు ఏవరీ ప్రసూన్ సింగ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ పోస్టును సృష్టించి మరీ ప్రసూన్ సింగ్కు కీలక పోస్ట్ను ఇవ్వడం విశేషం. రూ. 9,24,235 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంకుకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న ప్రసూన్ సింగ్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్గా ఎలా ఎదిగారు. (సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్లో వీడియో హల్చల్) ప్రసూన్ సింగ్ ఎవరు? బిహార్లోని ముజఫర్ లోని సెయింట్ జేవియర్స్ స్కూల్ నుండి పాఠశాల విద్యను,. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఇక్కడ నుంచే బీఏ ఆనర్స్ చేశారు. నవీ ముంబైలోని సీఎస్ఎంయూలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అతను MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. (రోజుకు కేవలం రూ.73: యాపిల్ ఐఫోన్ 12మినీ మీ సొంతం!) ప్రసూన్ సింగ్ కరియర్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్ మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అతను ముంబైలో పోస్టింగ్ పొందారు. ఏడేళ్లు పనిచేసిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కి వెళ్లారు. ఆతరువాత ఏడేళ్లకు పైగా ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. జూలై 2013ల ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా చేరారు. నాలుగేళ్ల తర్వాత ప్రైవేట్ రంగంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా చేరారు. అక్కడ కూడా ఏడేళ్లపాటు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. దీని తర్వాత, అతను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీకి మారారు. అక్కడ కూడా సుమారు నాలుగేళ్లపాటు అధికారిగా పనిచేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సివో)గా, 9సంవత్సరాల 9 నెలలకు పైగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సేవలందించారు ప్రసూన్. తాజాగా బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్గా ఎంపియ్యారు. ♦ 2009, నవంబరు నుంచి జూలై 2013 మధ్య ఈడీ అధికారిగా ♦ 2002 జూలై - 2009 నవంబర్ మధ్య ఇంటెలిజెన్స్ అధికారి ♦ 1995 మే- 2002 జూలై మధ్య ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నైతికత గురించి రతన్ టాటా ఏమన్నారంటే కంపెనీలు లాభాలు ఆర్జించడం తప్పు కాదు, ఈ పనిని నైతికంగా చేయడం కూడా అవసరమని టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా నమ్ముతారు. లాభం పొందడానికి మీరు ఏమి చేస్తున్నారో ఈ ప్రశ్న చాలా ముఖ్యమనీ. లాభాలను ఆర్జిస్తున్నప్పుడు, కస్టమర్లు వాటాదారులకు ఎలాంటి ప్రయోజ నాందిస్తున్నామో కంపెనీలు గుర్తుంచు కోవడం కూడా ముఖ్యం. అలాగే ప్రస్తుత పరిస్థితిలో, నిర్వాహకులు తాము తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవా? కాదా? అని తమను తాము ప్రశ్నించు కోవాలి. కంపెనీ ఎక్కువ కాలం మనుగడ సాగించదని, అది ఉద్యోగుల పట్ల సున్నితంగా ఉండదని కూడా ఆయన అన్నారు. వ్యాపారం గురించి తన ఆలోచనను వివరిస్తూ, వ్యాపారం అంటే లాభాలు సంపాదించడం మాత్రమే కాదని అన్నారు. మీతో అనుబంధం ఉన్న వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగుల ప్రయోజనాలు చాలా ముఖ్యమని రతన్ టాటా చెబుతారు. (అమెరికా ఫైనాన్స్లో ఇండో-అమెరికన్ మహిళల సత్తా) -
‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ఆభరణాల శ్రేణి
ముంబై: టాటా గ్రూప్నకు చెందిన తనిష్క్ ‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ప్రత్యేక కలెక్షన్ ఆవిష్కరించింది. భిన్న సమ్మే ళనం, ఖచ్చితత్వం, పరిపూర్ణతతో రూపొందించిన ఈ ఆభరణ శ్రేణిలో ఉంగరాలు, చెవి రింగులు, బ్రాస్లైట్లు ఉన్నాయి. అరుదైన ఈ కలెక్షన్ను లెజెండరీ క్రికెటర్ సచిన్ 50వ సంవత్సరంలో, వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డుకు గుర్తుగా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తనిష్క్ రూపొందించిన ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ కోసం వారితో భాగస్వామ్యం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు. -
బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్తో చేపట్టిన చర్చలకు చెక్ పడినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా వెల్లడించింది. ఇటీవల కొద్ది రోజులుగా బిస్లెరీ బ్రాండును టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు అంచనాలు పెరిగిన నేపథ్యంలో చర్చలు నిలిపివేసినట్లు నియంత్రణ సంస్థలకు టాటా కన్జూమర్ తెలియజేసింది. ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్తో ఎలాంటి తప్పనిసరి ఒప్పందాలు కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్టైం రికార్డు, ఇక కొన్నట్టే..?! ఇందుకు ఎలాంటి కట్టుబాట్లనూ ఏర్పాటు చేసుకోలేదని తెలియజేసింది. అయితే వ్యాపార విస్తరణ, వృద్ధి అవకాశాలకున్న వ్యూహాత్మక అంశాలపై దృష్టి కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇకపైనా బిస్లెరీ ఇంటర్నేషనల్ సహా వివిధ సంస్థలతో చర్చలు నిర్వహించే వీలున్నట్లు వెల్లడించింది. కాగా.. బిస్లెరీ ఇంటర్నేషనల్ విక్రయానికి టీసీపీఎల్తోపాటు పలు కొనుగోలుదారులతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ప్రమోటర్, వెనుకటితరం పారిశ్రామిక వేత్త రమేష్ చౌహాన్ గతేడాది పేర్కొన్నారు. మరోవైపు మరిన్ని మార్కెట్లలో విస్తరించేందుకు అనువుగా టీసీపీఎల్ పలు కంపెనీలను కొనుగోలు చేస్తూ వస్తోంది. టీసీపీఎల్ కు ఇప్పటికే హిమాలయన్ బ్రాండుతో బాటిల్డ్ వాటర్ విభాగంలో కార్యకలాపాలు ఉన్నాయి. -
ఎయిరిండియాకు అపార అవకాశాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు అపార అవకాశాలున్నట్లు కంపెనీ సీఈవో క్యాంప్బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. వెరసి ఎయిరిండియా గ్రూప్ను అంతర్జాతీయ దిగ్గజంగా రూపుదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో విస్తారాను కంపెనీతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు విలేకరుల వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఇదేవిధంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్(ఎయిరేషియా ఇండియా)లను సైతం కంపెనీలో విలీనం చేసే కార్యాచరణకు ఇప్పటికే తెరతీసినట్లు తెలియజేశారు. ఎయిరిండియా గతంలో ఎన్నడూచూడని భారీ వృద్ధిని అందుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ నెల 14న ఎయిరిండియా 70 వైడ్బాడీ మోడల్సహా 470 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరించనున్నట్లు విల్సన్ తెలియజేశారు. వీటిలో ఎయిర్బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలను పొందనుంది. ఎయిరిండియాను గతేడాది జనవరిలో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మరో 370 విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. -
ఎయిరిండియా, విస్తారా విలీనానికి అనుమతులపై కసరత్తు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీనంపై టాటా గ్రూప్ కసరత్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) నుంచి అనుమతులు తీసుకునే ప్రక్రియ జరుగుతోందని ఎయిరిండియా చీఫ్ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. ఎయిరిండియాకు అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం ఉన్న నేపథ్యంలో విలీనానంతరం ఏర్పడే సంస్థ అదే పేరుతో కొనసాగుతుందని ఆయన వివరించారు. అయితే, ’విస్తార’ వారసత్వంగా కొన్ని అంశాలను యథాతథంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని విల్సన్ చెప్పారు. ‘గ్రూప్లో ఒక ఫుల్–సర్వీస్ ఎయిర్లైన్, ఒక చౌక సర్వీసుల విమానయాన సంస్థ ఉండాలన్నది మా ఉద్దేశం. ఎయిరిండియా, విస్తార విలీనంతో ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్ ఏర్పాటవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియాను టాటా గ్రూప్ గతేడాది టేకోవర్ చేసింది. అందులో విస్తారను, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఏఐఎక్స్ కనెక్ట్ను (గతంలో ఎయిరేషియా ఇండియా) విలీనం చేయాలని భావిస్తోంది. ఎయిరిండియా, విస్తార విలీనం 2024 మార్చి నాటికి పూర్తి కావచ్చని అంచనా. ప్రస్తుతం విస్తారలో టాటా గ్రూప్నకు 51 శాతం, సింగపూర్ ఎయిర్లైన్స్కు 49 శాతం వాటాలు ఉన్నాయి. -
ఎయిరిండియా మెగా డీల్: భారీ ఉద్యోగాలు, సీఈవో కీలక ప్రకటన
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు సొంతమైన ఎయిరిండియా దూసుకుపోతోంది. ముఖ్యంగా విమానాల కొనగోలులో రికార్డ్ సృష్టిస్తోంది. బోయింగ్, ఎయిర్బస్తో మెగా డీల్గా ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ సోమవారం మాట్లాడారు.సంస్థ వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని వారాల తర్వాత, విల్సన్, ఈ డీల్ ప్రాముఖ్యత, భవిష్యత్తు మార్కెట్ వ్యూహంఅభివృద్ధిలో దాని పాత్ర గురించి వివరాలను బిజినెస్ టుడేతో పంచుకున్నారు. ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా దేశం ఆవిష్కారమయ్యే క్రమంలో విమానయాన చరిత్రలో ఇదొక గొప్ప పరిణామమని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 470 విమానాల కొనుగోలు డీల్ విలువ 70 బిలియన్లని సీఈవో తెలిపారు. ఈ సంవత్సరం చివరి నుండి దశాబ్దం చివరి వరకు విమానాల సేవలను ప్రారంభిస్తామని, కొత్త విమానాల ఫ్లీట్, పవర్ ముఖ్యమైన నెట్వర్క్ , సామర్థ్య విస్తరణ రెండింటినీ మార్చడానికి చారిత్రాత్మక మెగా డీల్కు కట్టుబడి ఉన్నామన్నారు. 5వేల పైలట్లు, ప్రతి నెలా 500మంది క్యాబిన్ ఈ నెల ప్రారంభంలో, విమానయాన సంస్థ తన విమానాలకు 470 విమానాలను చేర్చుకోనున్నట్లు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీని ప్రకారం ఈ 470 విమానాల్లో 220 విమానాలను బోయింగ్ నుంచి, 250 విమానాలను ఎయిర్బస్ నుంచి కొనుగోలు చేయనుంది. అలాగే గత వారం, విమానయాన సంస్థ 5వేల పైలట్లు , క్యాబిన్ సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. నెలకు 100మంది పైలట్లు, 500 మంది క్యాబిన్ సిబ్బంది,ఇతర గ్రౌండ్ స్టాఫ్ను చేర్చుకుంటున్నామని ఆయన తెలిపారు. నాన్ఫ్లైయింగ్ పొజిషన్లతో సహా 1,500 మందికి పైగా సంస్థలో చేరారని విల్సన్ చెప్పారు. ఎయిరిండియా- విస్తారా విలీనం ఎయిరిండియా, విస్తారా విలీనం మొదటి దశలో ఉందని కూడా సీఈవో ప్రకటించారు. తదుపరి దశ విలీనానికి డీజీసీఏ, సీసీఐ ఆమోదం తెలిపాల్సి ఉందన నారు. తక్కువ ధరల్లో సంపూర్ణమైన సేవలు అందించాలని టాటా గ్రూప్ లక్క్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూచర్ ప్లాన్స్పై సీఈవో కీలక ప్రకటన ♦ 470 నారో, వైడ్బాడీ ఎయిర్బస్, బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ మెగా-డీల్తో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లో విమాన ప్రయాణసేవల్ని, వస్తువుల రవాణా రూపురేఖలను పూర్తి మారిపోనున్నాయి. ♦ ప్రపంచంలోని ప్రముఖ విమానాల తయారీదారుల నుండి మరో 370 విమానాలను కొనుగోలు చేసి, ఆర్డర్ పరిమాణాన్ని 840 ఎయిర్క్రాఫ్ట్లకు తీసుకువెళ్లే అవకాశాన్ని ఎయిరిండియా పరిశీలిస్తోంది. ♦ 2025 మధ్యకాలం నుండి పదేళ్లలో గణనీయమైన సంఖ్యలో డెలివరీలు షురూ చేయాలని ప్లాన్. ♦ఎయిరిండియా గ్రూప్ క్యారియర్లు ఎయిరిండియాఎక్స్ప్రెస్ ఏకీకరణ తర్వాత అత్యంత సమన్వయంతో కూడిన కార్యకలాపాలు. ♦ విమానయాన సంస్థ అంతర్జాతీయ , దేశీయ రూట్ నెట్వర్క్ రెండింటినీ పెంచడంపై సమానంగా దృష్టి ♦ మూడు ప్రధాన కేంద్రాల ఏర్పాటు వీటిలో దక్షిణ భారతదేశంలో ఒకటి ♦పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్పెషలిస్ట్ల కోసం శిక్షణ సౌకర్యాల ఏర్పాటు, అలాగే భవిష్యత్తుకార్యకలాపాలు,సేవల నిమిత్తం నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర (MRO) సామర్థ్యాల నిర్మాణం -
మెగా డీల్ జోష్: ఎయిరిండియాలో ఉద్యోగాలు, పైలట్కు జీతం ఎంతంటే?
సాక్షి,ముంబై: టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఎయిర్బస్, బోయింగ్ 470 విమానాలు కోనుగోలు తరువాత 2 లక్షలకు పైగ ఉద్యోగావకాశాలు లభించ నున్నాయంటూ ఇప్పటికే పలువురు నిపుణులు అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియాలో నియామకాల జోష్ కని పిస్తోంది. కంపెనీ వెబ్సైట్లోని ఓపెనింగ్స్ ప్రకటన మేరకు పైలట్లకు ఏడాదికి రూ.2 కోట్ల వరకు చెల్లించనుంది. బోయింగ్, ఎయిర్బస్ విమానలు డెలివరీకి సిద్ధంగాఉన్న నేపథ్యంలో నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఎయిరిండియాలో ఎయిర్లైన్ 'B777 కెప్టెన్ల' కోసం వెతుకుతోందని, వీరికి సంవత్సరానికి రూ. 2 కోట్లకు పైగా చెల్లించనుందని బిజినెస్ టుడే నివేదించింది. "B737 NG/MAX రకం రేటింగ్ ఉన్న పైలట్ల నుండి B777 ఫ్లీట్ కోసం ఫస్ట్ ఆఫీసర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎయిరిండియా వెబ్సైట్లో పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులకు నెలవారీగా 21 వేల డాలర్లు వేతనం. అంటే వార్షిక ప్రాతిపదికన, రూ.2,08,69,416 పైమాటే. దీంతోపాటు క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సహా అనేక ఓపెనింగ్లను ప్రకటించింది. నిపుణులైన పైలట్లు లేకపోవడం వల్ల ఈ పాత్ర చాలా ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తోంది. ఎయిర్లైన్ కన్సల్టింగ్ సంస్థ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ వాదించారు. ప్రపంచవ్యాప్తంగా పైలట్ కొరత ఉందనీ, నిర్దిష్ట విమానంలో కనీసం 5000 నుండి 7000 గంటల పాటు క్వాలిఫైడ్ పైలట్లకు చాలా డిమాండ్ ఉందన్నారు. ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ అభిప్రాయం ప్రకారం ప్రతి విమానానికి కనీసం 10 మంది పైలట్లు అవసరం, వారి షిఫ్ట్ మారుతూ ఉంటుంది కాబట్టి. అలాగే ప్రతి విమానానికి 50 కంటే తక్కువ క్యాబిన్ సిబ్బంది అవసరం. వీరితోపాటు చెక్అవుట్ కౌంటర్లో, బ్యాగేజీ హ్యాండ్లర్లు, మెయింటెనెన్స్ ఇంజనీర్లు మొదలైన సిబ్బంది కూడా అవసరమే. -
ఎయిరిండియా బాటలో ఇతర ఎయిర్లైన్స్: ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు!
సాక్షి,ముంబై: టాటా గ్రూపు సొంతమైన విమానయాన సంస్థ ఎయిరిండియా చారిత్రాత్మక 840 ఎయిర్బస్, బోయింగ్ విమానాల డీల్ తరువాత మరో కీలక విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేశంలోని ఇతర విమానయాన సంస్థలు రానున్న 24 నెలల్లో మరో 1,200 విమానాలను ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది. (ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు) సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా (సీఏపీఏ ఇండియా) ప్రకారం, ఇండిగో మరో బిగ్డీల్ మొదలు అదనంగా 1,000-1,200 విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. దేశంలోని దాదాపు ప్రతి క్యారియర్, ఫ్లీట్ రీప్లేస్మెంట్, గ్రోత్ కోసం రాబోయే రెండేళ్లలో మరిన్ని ఎయిర్క్రాఫ్ట్లను ఆర్డర్ చేయనున్నాయని సీఏపీఏ అంచనా వేసింది. దీంతో ఎయిరిండియా మెగాడీల్తో దాదాపు 2 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించనున్నాయనే పరిశ్రమ నిపుణుల అంచనాల మధ్య సీఏపీఏ నివేదిక నిజమైతే ఇక విమానయాన రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనే ఇండిగో సుమారు 300 విమానాల గణనీయమైన ఆర్డర్ను సిద్ధం చేసుకుంది. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇపుడు ఈ ప్రణాళికను అమలు చేయవచ్చని, నిజానికి గతంలో ఊహించిన దానికంటే దాదాపు 500 విమానాల వరకు కొనుగోలు చేయనుందని అభిప్రాయపడింది. ఇటీవలి నెలల్లో, ఎయిర్ఫ్రేమ్ సిద్ధంగా ఉన్న చోట ఎయిర్క్రాఫ్ట్ డెలివరీలు ఆలస్యం అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి, సరఫరా గొలుసు సమస్యల కారణంగా ఇంజిన్లు అందుబాటులో లేవు. 2023-2024 చివరి నాటికి ఇటువంటి కేసులు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే, సరఫరా సవాళ్లు పరిష్కారం తర్వాత కూడా, ఎయిర్క్రాఫ్ట్,ఇంజన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు (OEMలు) చాలా ముఖ్యమైన ఆర్డర్ల బ్యాక్లాగ్లు ఉంటాయని వీటిని పరిష్కరించడానికి సంవత్సరాలు పట్టవచ్చని నివేదిక పేర్కొంది. డిసెంబర్ 31, 2022 నాటికి ఎయిర్బస్ , బోయింగ్ సహా 12,669 ఆర్డర్లను డెలివరీ చేయలేకపోయాయనీ ఈ డెలివరీ స్లాట్లు కనీసం రాబోయే రెండేళ్ళ వరకు రావడం చాలా కష్టంమని పేర్కొంది. 2029 వరకు పరిస్థితి కఠినంగా ఉంటుందని సీఏపీఏ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కాగా యూరోపియన్ దిగ్గజం ఎయిర్బస్ ,యుఎస్ బోయింగ్ నుండి 840 కొనుగోలు హక్కులు ఉన్నాయని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ (CCTO) నిపున్ అగర్వాల్ లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించారు. -
ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు
సాక్షి,ముంబై: ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా భావిస్తున్న టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా మెగా డీల్ భారీ ఉద్యోగాల కల్పనకు దారి తీయనుంది. ఇటీవల బోయింగ్, ఎయిర్బస్ మధ్య తాజా మెగా ఒప్పందం భారతదేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 140 విమానాల సముదాయాన్ని కలిగి ఉన్న ఎయిరిండియా, బోయింగ్ ఎయిర్బస్ నుంచి భారగా విమానాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాలు నడిపేందుకు, క్రూ, ఇతర ప్రత్యక్ష పరోక్ష సిబ్బంది అవసరం కాబట్టి భవిష్యత్తులో భారీగా ఉద్యోగాల కల్పిను అవకాశం లభిస్తుందని అంచనా.నారో బాడీ ఎయిర్క్రాఫ్ట్ కోసం మొత్తం ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు దాదాపు 400. వైడ్ బాడీ ప్లేన్ కోసం, 600-700మంది అవసరమంని తెలుస్తోంది. "డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో నేరుగా విమానయాన సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్న వారు ఉంటారు, ఉదాహరణకు, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్నికల్, నాన్-టెక్నికల్ సిబ్బంది. ఇది నారో బాడీ విమానానికి దాదాపు 175. ఇంకా విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ట్రావెల్ సేల్స్ ఏజెన్సీ, సర్వీస్ ప్రొవైడర్లు ఇవన్నీ కలిసి విమానానికి 400 ఉద్యోగులు అవసమరని ఏవియేషన్ రంగ మార్టిన్ కన్సల్టింగ్ సీఈవో మార్క్ మార్టిన్ బిజినెస్ టుడేతో చెప్పారు. ఈ విధంగా మొత్తంగా లెక్కిస్తే దాదాపు 2 లక్షల నుంచి 2 లక్షల 9వేల వరకు ఉంటాయని ఉద్యోగాలొస్తాయని ఆయన చెప్పారు. దీనికి తోడు ఎయిరిండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేందర్ భార్గవ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా ఉద్యోగాలొస్తాయని అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఈ బిల్పై స్పందించారు. ఇది చారిత్రాత్మక ఒప్పందమనీ, అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని కొనియాడారు. అంతేకాదు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించారు, ఎందుకంటే ఇది వారికి కీలకమైనది. -
ఎయిరిండియాకు 6,500 మంది పైలట్లు కావాలి
ముంబై: టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా సంస్థ ఎయిర్బస్, బోయింగ్ నుంచి 470 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విమానాలు నడిపించడానికి 6,500 మందికిపైగా పైలట్లు అవసరమని విమానయాన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 113 విమానాలు ఉన్నాయి. దాదాపు 1,600 మంది పైలట్లు పనిచేస్తున్నారు. పైలట్ల కొరత వల్ల ఇటీవల పలు సందర్భాల్లో అల్ట్రా–లాంగ్ హాల్ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియాలో 54 ఫ్లైట్లు ఉండగా, దాదాదాపు 850 మంది పైలట్లు సేవలందిస్తున్నారు. విస్తారా ఎయిర్లైన్స్లో 53 విమానాలు, 600 మందికిపైగా విమాన చోదకులు ఉన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియా, విస్తారా సంస్థల్లో కలిపి 220 విమానాలు ఉన్నాయి. 3,000 మందికిపైగా పైలట్లు పనిచేస్తున్నారు. -
‘ఎయిరిండియా’కు 470 కొత్త విమానాలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా సంస్థ దేశ విదేశాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరింపజేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ నుంచి, అమెరికాలోని బోయింగ్ నుంచి మొత్తం 470 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్త విమానాల కోసం ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇవ్వడం గత 17 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఇచ్చిన తొలి ఆర్డర్ కూడా ఇదే. ‘‘40 ఎయిర్బస్ ఏ350 విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777–9 విమానాలు, 210 ఎయిర్బస్ ఏ320/321 నియో విమానాలు, 190 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కొంటున్నాం’’ అని ఎయిర్ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మొదటి విమానం ఈ ఏడాది ఆఖర్లో సర్వీసులో చేరుతుందని పేర్కొంది. 2025 జూలై నుంచి విమానాలు తమకు అందుతాయని తెలియజేసింది. లీజుకు తీసుకున్న 11 బీ777, 25 ఏ320 విమానాల డెలివరీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేసింది. రెండు ఒప్పందాల విలువ ఏకంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.4 లక్షల కోట్లు) అని అంచనా! సుదీర్ఘ ప్రయాణాలకు వైడ్–బాడీ విమానాలు ఎయిర్బస్ నుంచి 250 విమానాలను కొనడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశామని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మంగళవారం చెప్పారు. ఎయిర్బస్ నుంచి 210 నారో–బాడీ విమానాలు, 40 వైడ్–బాడీ విమానాలు కొంటున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తదితరులు వర్చువల్గా పాల్గొన్న కార్యక్రమంలో చంద్రశేఖరన్ మాట్లాడారు. ఎక్కువ సమయం(అల్ట్రా–లాంగ్ హాల్) సాగే ప్రయాణాల కోసం వైడ్–బాడీ విమానాలు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. 16 గంటలకు పైగా ప్రయాణించే విమానాన్ని అల్ట్రా–లాంగ్ హాల్ ఫ్లైట్ అంటారు. భారత ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న ఎయిరిండియాను 2022లో టాటా గ్రూప్ దక్కించుకోవడం తెలిసిందే. ఎయిర్ ఇండియా చివరిసారిగా 2005లో విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అప్పట్లో బోయింగ్ సంస్థ నుంచి 68, ఎయిర్బస్ నుంచి 43 విమానాలను కొనుగోలు చేసింది. 2005లో ఈ డీల్ విలువ 10.8 బిలియన్ డాలర్లు. ఒప్పందాల పట్ల ప్రధాని మోదీ హర్షం ఎయిర్బస్, బోయింగ్తో ఎయిరిండియా ఒప్పందాలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇవి మైలురాయి లాంటి ఒప్పందాలన్నారు. భారత్లో విమానయాన రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. 15 ఏళ్లలో 2,000కు పైగా విమానాలు అవసరమని చెప్పారు. మన పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో అంతర్భాగమని వ్యాఖ్యానించారు. దేశంలో గత ఎనిమిదేళ్లలో ఎయిర్పోర్టుల సంఖ్య 74 నుంచి 147కు చేరిందని గుర్తుచేశారు. ‘ఉడాన్’ పథకం కింద మారూమూల ప్రాంతాలను సైతం విమానాల ద్వారా అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్గా అవతరించబోతోందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఉక్రెయిన్–రష్యా సమస్యను పరిష్కరించే సత్తా మోదీ నాయకత్వంలోని భారత్కుందని ప్రశంసించారు. భారత జి–20 సారథ్యం విజయవంతం కావడానికి సహకరిస్తున్నామని చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మోదీ మంగళవారం ఫోన్లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఎయిరిండియా–బోయింగ్ ఒప్పందంతోపాటు పలు అంశాలపై నేతలు చర్చించుకున్నారని వెల్లడించింది. చరిత్రాత్మక ఒప్పందం: జో బైడెన్ 34 బిలియన్ డాలర్లతో బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందాన్ని చరిత్రాత్మకంగా బైడెన్ అభివర్ణించారు. ‘‘అవసరాన్ని బట్టి మరో 70 విమానాలు కొనేలా ఒప్పందం కుదిరింది. అలా మొత్తం ఒప్పందం విలువ 45.9 బిలియన్ డాలర్లు. ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నాం’’ అన్నారు. వైట్హౌస్ ప్రకటన మేరకు బోయింగ్తో ఒప్పందంలో 50 బోయింగ్ 737మ్యాక్స్, 20 బోయింగ్ 787 ఫ్లైట్లు ఉన్నాయి. ఎయిరిండియా ఇచ్చిన ఆర్డర్ బోయింగ్ చరిత్రలో డాలర్ విలువలో మూడో అతిపెద్ద సేల్, విమానాల సంఖ్యలో రెండో అతి పెద్దది! కీలక ఘట్టం: రిషి లండన్: ఎయిరిండియాకు 250 కొత్త విమానాలు విక్రయించడానికి ‘ఎయిర్బస్–రోల్స్ రాయిస్’ ఒప్పందానికి రావడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హర్షం బెలిబుచ్చారు. బ్రిటన్ ఏరోస్పేస్ రంగంలో ఇదో కీలక ఘట్టమన్నారు. ‘‘భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. బ్రిటన్లో విమానయాన రంగ అభివృద్ధికి ఆకాశమే హద్దు అనేందుకు ఈ ఒప్పందమే తార్కాణం’’ అన్నారు. ఈ ఒప్పదంతో బ్రిటన్లోని వేల్స్, డెర్బీషైర్లో కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఎగుమతులకు, ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. ఎయిరిండియా కొనుగోలు చేసే 250 విమానాల తయారీ ప్రక్రియ చాలావరకు యూకేలోనే పూర్తి కానున్నట్లు తెలియజేసింది. -
ఎయిరిండియా విస్తరణ ప్లాన్స్, చర్చనీయాంశంగా టాటా భారీ డీల్
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలతో పాటు విమానాలను కూడా విస్తరిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన విమానాల తయారీదారు సంస్థ ఎయిర్బస్తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. వచ్చేవారం ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. దాదాపు 250 విమానాల కోసం ఎయిర్బస్తో ఒప్పందం ఖరారైందని త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. అలాగే ఇప్పటికే సుమారు 200 విమానాల కోసం బోయింగ్తో ఎయిర్లైన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. వచ్చేవారమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. కొత్త విమానాల కోసం ఎయిర్లైన్ చారిత్రాత్మక ఆర్డర్ను ఖరారు చేయనున్నట్టు ఎయిరిండియా చీఫ్ క్యాప్ బెల్ విల్సన్ ఇటీవల (జనవరి 27న) వ్యాఖ్యానించారు. దీంతో కొనుగోలు వార్తలకు బలం చేకూరుతోంది. అయితే ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాన కాని నేపథ్యంలోఎయిరిండియా అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. కాగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియా 16 సంవత్సరాల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2005 వరకు ఒక్క విమానం కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8బిలియన్ డాలర్ల భారీ డీల్ ను కదుర్చుకుంది ఎయిరిండియా. -
టాటా స్టీల్ రూ. 2,502 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకంగా రూ. 2,502 కోట్ల నష్టాన్ని (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. వ్యయాలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 9,598 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇక తాజాగా ఆదాయం రూ. 60,843 కోట్ల నుంచి రూ. 57,354 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 48,666 కోట్ల నుంచి రూ. 57,172 కోట్లకు పెరిగాయి. కంపెనీ రుణ భారం ప్రస్తుతం రూ. 71,706 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో రూ. 3,632 కోట్ల మొత్తాన్ని కంపెనీ పెట్టుబడి వ్యయాలపై వెచ్చించింది. ఉక్కుఉత్పత్తి 7.76 మిలియన్ టన్నుల (ఎంటీ) నుంచి 7.56 ఎంటీకి తగ్గింది. ఒడిదుడుకుల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా అమ్మకాల్లో స్థిర వృద్ధి సాధించగలిగామని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తెలిపారు. వ్యయాల నియంత్రణ, నిర్వహణను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టుకోనున్నట్లు పేర్కొన్నారు. -
సూర్యం శరణం గచ్ఛామి!
కేస్ స్టడీ.. చిన్న బకెట్తో నీళ్లు తెస్తుంటే.. ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మస్తానమ్మకు సుమారు 60 ఏళ్లు ఉంటాయి. యాక్టివ్గా ఉండేది. అయితే కొంతకాలం క్రితం చిన్న బకెట్తో నీరు తీసుకువెళ్తుండగా కాలు స్లిప్ అయి మెల్లగా కిందకు ఒరిగిపోయి పైకి లేవలేకపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఎక్స్రే తీయగా తొడభాగంలో పొడవైన ఎముక ముక్కలుగా విరిగిపోయి ఉంది. దీంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. ఇలా ఎందుకు జరిగిందని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా ఆమెకు విటమిన్–డి, కాల్షియం లోపం ఉన్నాయని, అందుకే ఎముకలు పెళుసుబారి కాలు విరిగిందని డాక్టర్లు తెలిపారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నిత్యం ఇలాంటి కేసులు జిల్లాలోని పలు ఆస్పత్రులకు వస్తున్నాయి. సాక్షి, నెల్లూరు డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం. సృష్టిలో ప్రతి జీవి ఆరోగ్యంగా ఉండేలా ప్రకృతి అన్ని వనరులు ప్రసాదించింది. కానీ మనిషి జీవనశైలి గాడి తప్పడంతో అనారోగ్యాలకు గురవుతున్నాడు. మన దేశ జనాభాలో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్–డి లోపంతో బాధపడుతున్నట్లు తాజాగా గురుగావ్కు చెందిన టాటా గ్రూప్ కంపెనీ 1ఎంజీ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. విటమిన్–డి ఎలా అందుతుంది? మన శరీరానికి రెండు మార్గాల ద్వారా విటమిన్–డి అందుతుంది. అందులో మొదటిది సూర్యరశ్మి నుంచి, రెండోది ఆహారంగా తీసుకోవడం ద్వారా వస్తుంది. ప్రతిరోజూ ఎండలో కొంత సమయం ఉంటే చాలు మనిషి శరీరానికి అవసరమైన డి–విటమిన్ సహజంగానే అందుతుంది. అలాగే చేపలు, గుడ్డులోని పచ్చసొన, పాలు, తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రాముఖ్యత ఏమిటంటే.. మన దేహంలో బలమైన ఎముకలు, కండరాలు, దంతాలు ఏర్పడాలంటే విటమిన్–డి ఎంతో అవసరం. తగినంతగా ఈ షోషకం లేకపోతే చిన్నపిల్లల్లో ఎముకలు పటుత్వం కోల్పోయి వంకర్లు పోతాయి. పెద్దవాళ్లలో అయితే ఎముకలు గుల్లబారి ధృడత్వం పోతుంది. తర్వాత కీళ్ల నొప్పులతో మొదలై పలు ఇబ్బందులు ఏర్పడతాయి. ఫలితంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా ఎముకలు విరిగి పోతుంటాయి. అందుకే ముందుగా మేల్కొని డాక్టర్ను సంప్రదించి సమస్య రాకుండా జాగ్రత్తపడాలి. డి–విటమిన్ లోపిస్తే.. మన శరీరానికి విటమిన్–డి లోపిస్తే ఉదరంలోని పేగులు కాల్షియం, ఫాస్ఫరస్ను తగినంతగా సంగ్రహించలేవు. ఇది హైపోకాల్సిమియాకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అంటే రక్తంలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం. ఫలితంగా కండరాలు బలహీనపడి.. పిక్కలు పట్టేయడం, మలబద్ధకం, నీరసం వంటి సమస్యలు వస్తాయి. తీవ్రత ఎక్కువైతే ఒక్కోసారి డిప్రెషన్కు గురికావచ్చు. సమస్యకు కారణాలు విటమిన్–డి లోపం నేటి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఉంది. గతంలో సుమారు మూడు దశాబ్దాల క్రితం వరకు స్కూళ్లలో విద్యార్థులు ఉదయం కొంతసేపు ఎండలో నిలబడి ప్రతిజ్ఞ చేసేవారు. అంతేకాకుండా సాయంత్రం డ్రిల్ పిరియడ్ ఉండేది. ఆ సమయంలో పిల్లలందరూ గ్రౌండ్లో ఆటలాడేవారు. ఆ విధంగా వారికి అవసరమైన మేరకు డి విటమిన్ సూర్యరశ్మి ద్వారా అందేది. పెద్దలు కూడా ఎక్కువమంది ఎండలోనే కాయకష్టం చేసేవారు కాబట్టి వారికి ఈ సమస్య ఎదురుకాలేదు. కాలక్రమంలో ప్రైవేట్ స్కూళ్లు ఎక్కువ కావడం, వాటిలో చేరే విద్యార్థులను నాలుగు గోడల మధ్య కుక్కి చదివించడమే కానీ గౌండ్లో ఆటలాడించడం లేకుండా పోయింది. ధనికుల పిల్లలు ఇళ్లలో, స్కూళ్లలో కూడా ఏసీ గదుల్లోనే గడిపేస్తుండటంతో వారికి విటమిన్–డి లోపిస్తోంది. అవగాహన లోపం ఎండలో తిరిగితే నల్లబడిపోతామని, చర్మ ఛాయ తగ్గుతుందని భావిస్తూ చాలామంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఒకవేళబయటకు రావాల్సి వచ్చినా పూర్తిగా దుస్తులతో శరీరాన్ని కప్పేస్తున్నారు. ఇలా చేయడంతో వారికి సూర్యరశ్మి తగలకు విటమిన్–డి అందడం లేదు. శరీరానికి ఉదయం, సాయంత్రం వేళల్లో అయినా కొంత సమయం సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి. గ్రామీణులే మెరుగు సాధారణంగా పట్టణాల్లో నీడపట్టున పనిచేయడం, ఏసీ రూంలలో ఉండటం, రాత్రిళ్లు మేలుకొని విధులు నిర్వర్తించే వారు, ఇలా ఎండతగలని వారికి విటమిన్–డి లోపం ఉంటోంది. ఎండలో కనీసం 4 గంటలు పని చేసేవారికి విటమిన్–డి ఎక్కువగా వస్తుంది. తద్వారా ఎముకలు బలంగా, ధృడంగా ఉంటాయి. అందువల్లనే గ్రామీణ ప్రాంతాల్లో ఎండలో పని చేసేవారికి డి విటమిన్ అంది వారు ధృడంగా ఉంటారని వైద్యులు చెపుతున్నారు. ఇష్టానుసారంగా విటమిన్లు తీసుకోరాదు ప్రస్తుతం మార్కెట్లో అనేక మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా విటమిన్–డి, కాల్షియం, ఇ విటమిన్ లాంటి మాత్రలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఇది సరైనది కాదు. శరీరానికి తక్కువ మోతాదులో విటమిన్లు అవసరమవుతాయి. ప్రతిరోజూ డి–విటమిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే ఆ కాంపోనెంట్ ఎక్కువై మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరానికి ఉపయోగపడదు. ఒక్కో దఫా అతిగా వినియోగించినందు వల్ల అర్థిమియా వచ్చి (గుండె చాలా వేగంగా కొట్టుకోవడం) గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల డాక్టర్ల సలహా లేకుండా ఏ మాత్రలు వినియోగించకూడదు. పిల్లల్లోనూ సమస్య ఉంది డి–విటమిన్ లోపం పెద్ద వారిలోనే కాకుండా పిల్లల్లోనూ ఉంది. 30 శాతం మంది పిల్లల్లో డి–విటమిన్¯ తక్కువ ఉన్నందువల్ల వారి శారీరక, మానసిక పెరుగుదల సరిగా ఉండటం లేదు. ఈ ప్రభావం చదువుపై పడుతోంది. అంతేకాకుండా చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధికి గురవుతున్నారు. పెద్దల్లో 40 నుంచి 45 శాతం మందికి విటమిన్–డి లోపం ఉంటోంది. డి–విటమిన్ శరీరానికి అందాలంటే ఎండవేడిమికి అలవాటు పడాలి. విటమిన్లు తగ్గితే శరీర జీవన ప్రక్రియలు సకాలంలో జరగాల్సిన తీరులో జరగవు. విటమిన్స్ లభించే పదార్ధాలు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. –డాక్టర్ మస్తాన్బాష, అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్ స్పెషలిస్టు, జీజీహెచ్ అతిగా ఉపయోగిస్తే అనర్ధాలు జీవన క్రియలు సక్రమంగా జరగాలంటే స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు విటమిన్లు శరీరానికి అవసరం. ఇందులో డి విటమిన్ శరీరంలో తక్కువగా ఉందంటే అనుబంధంగా కాల్షియం కూడా తగ్గిపోతుంది. ఇసుక–సిమెంట్ కలిస్తేనే గోడ బలంగా ఉన్నట్టు, డి విటమిన్, కాల్షియం సరిపడా ఉండాలి. ఇవి లోపిస్తే ఎముకలు గుల్లబారుతాయి. పెద్ద కారణం లేకుండానే ఎముకలు విరిగిపోతాయి. 40 ఏళ్లు వచ్చిన మహిళల్లో ముందస్తు మెనోపాజ్ దశ వల్ల కూడా విటమిన్స్ లోపం ఏర్పడి హార్మోన్స్ బ్యాలెన్స్ తగ్గి కాల్షియం తగ్గిపోతుంది. అప్పుడు డి విటమిన్ కూడా తగ్గుతుంది. మునగ ఆకు, మునగ కాయలు, రాగులు, పాలు, గుడ్డు, చేప, గుమ్మడి లాంటి ఆహార పదార్థాలు తీసుకునే వారిలో విటమిన్ డి తగ్గదు. –డాక్టర్ రోజారమణి, అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ సర్జన్, జీజీహెచ్ -
‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్ వైరల్!
రతన్ టాటా.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా తన దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తన పోస్ట్లతో పలకరిస్తూ భారీగా ఫోలోవర్స్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సోషల్మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రగతి కోసం తన వంతు కృషి చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన టాటా ఇండికా కారుని ప్రారంభించ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని గుర్తుచేసుకుంటూ తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ చేశారు. అందులో .. ‘25 ఏళ్ల క్రితం టాటా ఇండికా ప్రారంభం కావడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా మనస్సులో ప్రత్యేక స్థానం ఉందంటూ..’ టాటా ఇండికాతో దిగిన ఫోటో షేర్ చేశారు. 1998లో ఇండికా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగాన్ని ప్రారంభించింది. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే సక్సెస్ ట్రాక్లోకి వచ్చింది. ఇందులోని ఫీచర్లు, అందుబాటు ధరల కారణంగా త్వరగా ఈ కారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇరవై సంవత్సరాల తర్వాత, టాటా మోటార్స్ ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొన్న తర్వాత 2018లో కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) చదవండి: ‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’.. అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ -
టాటా గ్రూప్ కృష్ణకుమార్ కన్నుమూత
ముంబై: రతన్ టాటాకి అత్యంత సన్నిహితుడు, టాటా గ్రూప్లో పలు అత్యున్నత బాధ్యతలు నిర్వర్తించిన ఆర్ కృష్ణకుమార్(84) ఇక లేరు. ఆదివారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ సాయంత్రం కన్నుమూశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ఆర్ కృష్ణకుమార్.. కేరళ తలస్సెరీలో పుట్టిపెరిగారు. చెన్నైలో ఉన్నత చదువులు పూర్తి చేసి.. 1963లో టాటా గ్రూప్లో అడుగుపెట్టారు. టాటా సన్స్కు డైరెక్టర్గానే కాదు, గ్రూప్లో పలు కంపెనీల టాప్ పొజిషన్లో ఆయన పని చేశారు. ట్రస్ట్ల బాధ్యతలను కూడా ఆయన చూసుకున్నారు. టాటాలోని వివిధ సంస్థలతో పాటు దాని అనుబంధ సంస్థ ఇండియన్ హోటల్స్కు హెడ్గానూ ఆయన పని చేశారు. దూకుడు నిర్ణయాలకు కేరాఫ్గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. టాటా సంస్థలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఆయన పలు కీలక నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. వ్యాపార కార్యనిర్వాహకుడిగానే కాకుండా.. దాదాపు ఒకే వయసు వాళ్లు కావడంతో రతన్ టాటాతో కృష్ణకుమార్కు మంచి అనుబంధం కొనసాగింది. సైరస్ మిస్ట్రీ తొలగింపు ఎపిసోడ్లో.. రతన్ టాటాకు కీలక సూచనలు చేసిన బృందంలో ఈయన కూడా ఉన్నారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది. ఇక కృష్ణకుమార్ మృతి టాటా గ్రూప్ స్పందించింది. టాటా సన్స్ ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేరిట సంతాప ప్రకటన విడుదల చేసింది. టాటా గ్రూప్నకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అందులో చంద్రశేఖరన్ కొనియాడారు. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం కృష్ణకుమార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముంబైలోని చందన్వాడీ శ్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఎయిర్ఏషియా చీఫ్గా అలోక్ సింగ్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో కాస్ట్ ఎయిర్లైన్ (ఎల్సీసీ) సీఈవోగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈవో అలోక్ సింగ్ జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎయిర్ ఇండియా ఎల్సీసీలో ఎయిర్ఏషియా ఇండియాతోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉన్నాయి. ఏయిర్ఏషియా ఇండియా ప్రస్తుత సీఈవో సునీల్ భాస్కరన్ ఇక నుంచి ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీకి నాయకత్వం వహిస్తారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఏయిర్ఏషియా ఇండియా, విస్తారా కంపెనీలు టాటా గ్రూప్లో భాగం. -
ఎయిర్ ఇండియా మరో భారీ కొనుగోళ్లు..200 బోయింగ్ విమానాలకు ఆర్డర్?
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ ఇండియా..అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి 200 విమానాలు కొనుగోలు చేసేలా ఆర్డర్ పెట్టినట్లు సమాచారం. వాటిలో బోయింగ్ 737 మాక్స్ జెట్ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య కొనుగోలు చర్చలు జరుగుతుండగా..త్వరలో వాటికి ముగింపు పలకునున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎయిర్ ఇండియాతో విమానాల కొనుగోలు ఒప్పందంపై బోయింగ్ అధికార ప్రతినిధి నిరాకరించారు. టాటా సన్స్ ఎయిరిండియా ప్రతినిధులు స్పందించలేదు. కాగా, అంతర్జాతీయ రూట్లలో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ జెట్ విమానాలు, ఎయిర్ బస్ ఎస్ఈ ఏ350 విమానాల కొనుగోలుపై ఎయిర్ ఇండియా దృష్టి సారించింది. బోయింగ్ 777 విమానాలను లీజ్కు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
90 గంటల పని..ఎయిరిండియా పైలట్ల సంచలన ఆరోపణలు, ప్రయాణీకుల ప్రాణాలు!?
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ సొంతమైన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పైలట్లు సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ పనిగంటలతో పాటు,హెల్త్ లీవ్లను నిరాకరిస్తోందని ఎయిరిండియా పైలట్ బాడీ, ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఆరోపించింది. తాజా పరిణామంతో ప్రయాణీకుల భద్రత ప్రశ్నలను లేవనెత్తుతోంది. సీఎన్బీసీ నివేదిక ప్రకారం పైలట్లు నెలకు 70 గంటలకు బదులుగా అన్ని విమానాలలో నెలకు 90 గంటలకు పైగా ప్రయాణించారని(ఫైయింగ్ అవర్స్) ఐపీజీ-ఐసీపీఏ వాదించింది. అలాగే ఎయిరిండియా యాజమాన్యం పైలట్లకు లీవ్లను నిరాకరిస్తోందని ఒక్కోసారి రద్దు చేస్తోందని తద్వారా చాలామంది పైలట్లు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించింది. అంతేకాదు సెలవులు పొందిన లేదా శిక్షణ పొందిన నెలల్లో వేతన కోతలతో వేధిస్తున్నారని పైలట్లు ఆరోపించారు. ఇకపై దీన్ని సహించలేమని, తమ జీవన నాణ్యత, పని-జీవిత సమతుల్యత, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని త్యాగం చేయలేమని పేర్కొన్నారు. (రిలయన్స్ మరో సంచలనం: గుజరాత్లో షురూ) కోవిడ్ తరువాత వేతనాల్లో కోత పెట్టిన సంస్థ ఇపుడు పూర్వ వేతనాలను చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్లైన్ 777 ఫ్లీట్ల కోసం ఎక్స్-ప్యాట్ పైలట్లను ప్రస్తుత దీర్ఘకాలిక పైలట్ల కంటే 80 శాతం ఎక్కువ వేతనంతో రిక్రూట్ చేస్తోందనీ భారతీయ పైలట్లపై చూపిస్తున్న ఈ వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఐపీజీ-ఐసీపీఏ తెలిపింది. కాగా సిబ్బంది కొరత నివేదికలను ఎయిరిండియా ఖండించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుసుకుంది. మరి తాజా ఆరోపణలపై ఎయిరిండియా సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి. (బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా) -
యాపిల్ ఉత్పత్తులపై ఇక బెంగ అక్కర్లేదు.. టాటాతో కీలక డీల్!
సాక్షి,ముంబై: స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్ తమ ఉత్పత్తుల విక్రయంకోసం టాటా గ్రూపుతో డీల్ కుదుర్చుకుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. సాల్ట్-టు-సాఫ్ట్వేర్ సమ్మేళనం, భారత దిగ్గజ కంపెనీల్లో ఒకటైన టాటా గ్రూప్ త్వరలో ఎక్స్క్లూజివ్ యాపిల్ స్టోర్లను ఏర్పాటు చేయనుందని ఎకనామిక్ టైమ్స్ తాజాగా నివేదించింది. 100 ఎక్స్క్లూజివ్ యాపిల్ స్టోర్ల ఏర్పాటుకు టాటా గ్రూపునకు చెందిన ఇన్ఫినిటీ రిటైల్తో యాపిల్ ఒప్పందం చేసుకుంది. ‘క్రోమా’ రీటైల్ పేరుతో స్టోర్లను నిర్వహిస్తున్న టాటా తాజా ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాదాపు 100 వరకు చిన్న చిన్న స్టోర్లను ఏర్పాటు చేయనుంది. వీటిల్లోప్రత్యేకంగా యాపిల్ ఉత్పతులను మాత్రమే విక్రయించనుంది. సుమారు 500-600 చదరపు అడుగుల విస్తీర్ణం మేర ఉండేలా యాపిల్ స్టోర్లు లేదా అవుట్లెట్స్ను తెరిచేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఈ వార్తలపై అటు ఇన్ఫినిటీ రిటైల్ కానీ, యాపిల్ కంపెనీ గానీ స్పందించలేదు. గత నెలలో ఇండియాలో యాపిల్ టాప్ వెండర్, విస్ట్రోన్ ఏకైక తయారీ కేంద్రాన్ని రూ. 5వేల కోట్లకు కొనుగోలుకు టాటా గ్రూప్ చర్చలు జరుపుతోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించిన రెండు వారాల లోపే తాజా అంచనాలు వెలుగులోకి వచ్చాయి. -
‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు
హైదరాబాద్: టాటా గ్రూపు ఎలక్ట్రానిక్స్ రిటైల్ కంపెనీ ‘క్రోమా’ వింటర్ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బ్లూటూత్ స్పీకర్లు, ఏసీలు, పవర్ బ్యాంక్లు, ఎయిర్ ప్యూరిఫయర్లపై ఆకర్షణీయమైన డీల్స్ను అందిస్తున్నట్టు తెలిపింది. అన్ని క్రోమా స్టోర్లు, క్రోమా ఆన్లైన్ పోర్టల్లో కొనుగోళ్లపై ఈ ఆఫర్లను పొందొచ్చని పేర్కొంది. బ్యాక్ ప్యాక్లపై 70 శాతం వరకు, ఇయర్ ఫోన్లపై 80 శాతం వరకు రాయితీ, నెక్ పిల్లో, ఐమాస్కస్, ట్రావెల్ బ్యాగ్ వంటి ట్రావెల్ యాక్సెసరీలపై 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. (గుడ్న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) రూం హీటర్లు కేవలం 699తో ప్రారంభం. ఇన్స్టంట్ గీజర్లు ధరలు 799 నుండి ప్రారంభం. ఫిలిప్స్ ఎయిర్ఫ్రైయర్స్, కెటిల్స్ , కన్వెక్షన్ మైక్రోవేవ్ తదితర వింటర్ సీజన్కు సంబంధించిన ఉత్పత్తులపై ఆఫర్లను అందిస్తోంది.