Tata group
-
దిరియాపై దేశీ దిగ్గజాల కన్ను
న్యూఢిల్లీ/దావోస్: సౌదీ అరేబియాలో దిరియా పేరుతో తలపెట్టిన అతిభారీ(గిగా) టూరిజం ప్రాజెక్టుపై దేశీ కార్పొరేట్ దిగ్గజ గ్రూప్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 63 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రూపొందనున్న ఈ ప్రాజెక్టులో దేశీ దిగ్గజాలు టాటా గ్రూప్, ఒబెరాయ్ గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు దిరియా సీఈవో జెర్రీ ఇన్జెరిల్లో పేర్కొన్నారు. సిటీ ఆఫ్ ఎర్త్గా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టును సౌదీ అరేబియా రాజధాని రియాద్ చివర్లో నెలకొల్పుతున్నారు. లక్ష మంది ప్రజలకు గృహాలు, మరో లక్ష మందికి కార్యాలయ ప్రాంతాలతో ప్రాజెక్టు రూపొందనుంది. ఈ కొత్త నగరం 40 విలాసవంత హోటళ్లు, 1,000కుపైగా షాపులు, 150 రెస్టారెంట్లు, 20,000 సీట్ల సామర్థ్యంగల మలీ్టపర్పస్ ఈవెంట్లకు వీలయ్యే ఒపేరా హౌస్సహా గోల్ఫ్ కోర్స్, కేఫ్లు, యూనివర్శిటీలు, కల్చరల్ అసెట్స్, మ్యూజియంలు తదితరాలతో ఏర్పాటుకానుంది. -
ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా
ప్రభుత్వ నియంత్రణ నిబంధనలు పాటించనందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా విధించారు. నియమాలకు విరుద్ధంగా విమానాన్ని నడపడానికి పైలట్ను అనుమతించినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పదేపదే రోస్టరింగ్ సమస్యలు, పైలట్లకు తప్పనిసరి రికెన్సీ(విమానాలను నడపడంలో నైపుణ్యం కలిగి ఉండేలా చేయడం) ఉల్లంఘనలకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అయితే అందుకు సరైన విధంగా స్పందించకపోవడం వల్ల ఈ జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.ప్రతి పైలట్ నిత్యం మూడు టేకాఫ్లు, ల్యాండింగ్లు చేయాల్సిన అవసరం లేనప్పటికీ జులై 7, 2024న విమానాన్ని నడపడానికి ఎయిరిండియా ఒక పైలట్ను అనుమతించిందని డీజీసీఏ గుర్తించింది. పైలట్ విమానం నడపడానికి ముందు ఎయిరిండియా రోస్టింగ్ కంట్రోలర్లు సీఏఈ విండోలో ప్రతిబింబించే అనేక హెచ్చరికలను పట్టించుకోలేదని డీజీసీఏ ఎత్తిచూపింది. కంపెనీ చర్యలను హైలైట్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ సంస్థ ఇచ్చిన ప్రతిస్పందనతో డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇదీ చదవండి: చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లుజనవరి 29, 2025న రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు ఇటీవల పేర్కొంది. 30 రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని జమ చేయాలని ఎయిరిండియాను ఆదేశించింది. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నొక్కి చెప్పింది. -
రైల్వేలో ఫుడ్ కేటరింగ్ మెరుగుపడనుందా..?
రైల్వే ప్రయాణీకులకు మరింత మెరుగైన ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులు అందించేందుకు భారతీయ రైల్వే క్యాటరింగ్, టికెటింగ్ అండ్ టూరిజం విభాగం ఐఆర్సీటీసీ కట్టుబడి ఉంది. ఇందుకోసం తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్తో జతకట్టింది. ఈ సహకారం వల్ల రైళ్లలో ఆహార ఆఫర్లను పునరుద్ధరించడం, ప్రయాణీకులకు అధిక నాణ్యమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటికే ఐఆర్సీటీసీ 90 పట్టణాలు, 100 రైల్వే స్టేషన్లలో వేలాది మంది వినియోగదారులకు ఫుడ్ అగ్రిగేటింగ్ ప్లాట్ఫామ్ జొమాటోతో సహకారం కుదుర్చుకుని సేవలందిస్తోంది. తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్తో చేసుకున్న ఒప్పందం రైళ్లలో లభించే ఆహారం నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రోజుకు 16 లక్షల భోజనాలను అందిస్తున్నాం. జోజనం మెనూను మెరుగుపరచడం కోసం కస్టమర్ల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. మెనూను అప్డేట్ చేసి ఫుడ్ ఆఫర్ ట్రయల్స్ త్వరలో నిర్వహిస్తాం. ఇందుకోసం తాజాగా ప్రముఖ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్యాకేజీచిన్న పరిశ్రమలకు మద్దతుకేటరింగ్, టూరిజం విభాగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) చేయూతనిచ్చేందుకు ఐఆర్సీటీసీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. వస్తువులు, సేవల కోసం సుమారు 63% ఎంఎస్ఈలపైనే ఆధారపడుతున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇది ప్రభుత్వం నిర్దేశించిన 25% కంటే చాలా ఎక్కువ. ఎంఎస్ఈలతోపాటు సంస్థ వృద్ధిపై ఐఆర్సీటీసీ దృష్టి సారించినట్లు పేర్కొంది. -
టాటా బోర్డులో ఇద్దరు వారసురాళ్లకు చోటు
సర్ రతన్ టాటా ఇండస్ట్రియల్ ఇనిస్టిట్యూట్ (SRTII) ట్రస్టీల బోర్డులో టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా కుమార్తెలు మాయ, లేహ్ నియమితులయ్యారు. వీరిరువురు అర్నాజ్ కొత్వాల్, ఫ్రెడ్డీ తలతి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.మాయ, లేహ్ టాటాల నియామకం అర్నాజ్ కొత్వాల్తో అంతర్గత విభేదాలకు దారితీసింది. టాటా ట్రస్ట్స్లో ఎగ్జిక్యూటివ్గా ఉన్న 'తారాపోరేవాలా'కు పంపిన ఈమెయిల్లో, నోయెల్ టాటా పట్టుబట్టడంతో.. అతను కోరినట్లుగా ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమస్యకు సంబంధించి సర్ దొరాబ్జీ.. టాటా ట్రస్ట్ అండ్ సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ అయిన మెహ్లీ మిస్త్రీ నుంచి కూడా తనకు కాల్ వచ్చిందని కూడా ఆమె పేర్కొన్నారు. దీనిపై టాటా ట్రస్ట్లు స్పందించ లేదు.SRTII అనేది సర్ రతన్ టాటా ట్రస్ట్ యూనిట్, ఇది మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేస్తోంది. రతన్ టాటా మరణానంతరం అక్టోబర్లో టాటా ట్రస్ట్ల ఛైర్మన్గా నియమితులైన నోయెల్ టాటాకు.. లేహ్ (39), మాయ (36), నెవిల్లే (32) ముగ్గురు పిల్లలు. వీరు టాటా ట్రస్ట్లలో ఇప్పటికే వివిధ బాధ్యతలను నిర్వర్తించారు.లేహ్ టాటాలేహ్ టాటా.. ఇండియన్ హోటల్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. అంతే కాకుండా ఈమె గేట్వే హోటల్స్ బ్రాండ్ను నిర్వహిస్తోంది. టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జేఆర్డీ అండ్ థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా ఉన్నారు.మాయ టాటామాయా టాటా.. టాటా క్యాపిటల్లోని ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆర్డీ టాటా ట్రస్ట్ మరియు జెఆర్డి మరియు థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో పని చేస్తున్నారు.నెవిల్లే టాటానెవిల్లే టాటా గత సంవత్సరం టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారాలను కలిగి ఉన్న ట్రెంట్ హైపర్ మార్కెట్ యూనిట్.. స్టార్ బజార్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అతను టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్ అండ్ ఆర్డీ టాటా ట్రస్ట్ బోర్డులలో ఉన్నారు.నోయల్ టాటాదివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే ఆయన టాటా సన్స్ బోర్డులో కూడా అడుగుపెట్టారు. 2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100టాటా సన్స్లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు. ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇప్పుడు టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. -
నెలకు 5,000 వాహన అమ్మకాలు లక్ష్యం
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా(Mahindra) అండ్ మహీంద్రా బీఈ–6, ఎక్స్ఈవీ 9ఈ టాప్ వేరియంట్ల ధరలను ప్రకటించింది. రెండు మోడళ్లూ మూడు వేరియంట్లలో లభిస్తాయి. ఎక్స్షోరూంలో టాప్ వేరియంట్స్ అయిన బీఈ–6 ప్యాక్–3 ధర రూ.26.90 లక్షలు కాగా ఎక్స్ఈవీ 9ఈ ప్యాక్–3 రూ.30.5 లక్షలు ఉంది. 2024 నవంబర్లో కంపెనీ రెండు మోడళ్లను ఆవిష్కరించి ఎలక్ట్రిక్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవీల ప్రారంభ ధర రూ.18.9 లక్షలు ఉంటుందని వెల్లడించింది. వేరియంట్నుబట్టి బీఈ–6 గరిష్టంగా ఒకసారి చార్జింగ్ చేస్తే 682 కిలోమీటర్లు, ఎక్స్ఈవీ 9ఈ 656 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాగా, నెలకు 5,000 యూనిట్లు విక్రయించాలని మహీంద్రా లక్ష్యంగా చేసుకుంది. చకన్ ప్లాంటు సామర్థ్యాన్ని నెలకు 90,000 స్థాయికి తీర్చిదిద్దుతోంది. దీనిని 1.2 లక్షల యూనిట్లకు పెంచే అవకాశమూ ఉంది. 2021–27 మధ్య ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం రూ.16,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు మహీంద్రా ఇప్పటికే వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లకు ఒకే ప్లాట్ఫామ్ఒకే ప్లాట్ఫామ్ ద్వారా రిటైల్(Retail) ఇన్వెస్టర్లు వివిధ బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలలో ఫిక్స్డ్ డిపాజిట్లు(FD) చేసేందుకు టాటా డిజిటల్ తెరతీసింది. సూపర్యాప్ ‘టాటా న్యూ’ ద్వారా ఇందుకు వీలు కల్పిస్తోంది. కస్టమర్లు పొదుపు ఖాతా లేకుండానే తమ సొమ్మును వివిధ ఫైనాన్షియల్ సంస్థలలో ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించుకోవచ్చునని టాటా డిజిటల్ తెలియజేసింది. గరిష్టంగా 9.1 శాతం వరకూ వడ్డీని ఫైనాన్షియల్ సంస్థలు ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లతో సులభంగా, భద్రంగా సొమ్మును ఎంపిక చేసుకున్న ఫైనాన్షియల్ సంస్థలలో దాచుకునేందుకు తమ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని వివరించింది. రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చని, బ్యాంకులో పెట్టుబడులకు డీఐసీజీసీ(DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకూ డిపాజిట్ బీమా ఉంటుందని తెలియజేసింది. ఎన్బీఎఫ్సీలలో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితరాలున్నట్లు పేర్కొంది. -
ఈ ఏడాది డిమాండ్ ఉండే ఏఐ మోడళ్లు
భవిష్యత్తులో చిన్న, డొమైన్ ఫోకస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడళ్లకు డిమాండ్ ఏర్పడుతుందని టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు తెలిపారు. చిన్న మోడళ్లు తక్కువ వనరులను వినియోగిస్తాయని, దాంతోపాటు సమర్థంగా పనిచేస్తాయని, వేగంగా ఫలితాలు అందిస్తాయని చెప్పారు. ఇంధన వ్యయాలను తగ్గించుకోవాలని, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్ఎంఆర్) వంటి ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన నొక్కి చెప్పారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)-తిరుచ్చి పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2023లో లార్జ్ లాంగ్వేజీ మోడల్స్కు(ఎల్ఎల్ఎం) మంచి అవకాశం వచ్చింది. కానీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దాంతో 2024లో మల్టీమోడల్ ఏఐలకు అపారమైన అవకాశాలు వచ్చాయి. 2025లో ఇందుకు భిన్నంగా స్మాల్ ల్యాంగ్వేజీ మోడళ్లకు భారీగా డిమాండ్ రానుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావాగ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సవాళ్లను ప్రస్తావిస్తూ పారిశ్రామిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల వినియోగం పెరగడం వల్ల ప్రపంచ ఇంధన అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి పెరగాలంటే ఇంధన వ్యయాలు తగ్గించుకోవాలన్నారు. -
విలువలు నేర్పిన అజరామరుడు.. రతన్ టాటా జయంతి నేడు (ఫొటోలు)
-
‘భారత్ మార్కెట్కు కట్టుబడి ఉన్నాం’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఒకటైన భారత్లో కార్యకలాపాల విస్తరణకు కట్టుబడి ఉన్నామని కేఫె చెయిన్ సంస్థ టాటా స్టార్బక్స్ వెల్లడించింది. భారత్ నుంచి స్టార్బక్స్ నిష్క్రమిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 76 నగరాల్లో 470 పైచిలుకు స్టోర్స్ను నిర్వహిస్తున్నట్లు వివరించింది. టాటా గ్రూప్లో ఎఫ్ఎంసీజీ విభాగమైన టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్), అమెరికాకు చెందిన స్టార్బక్స్ కార్పొరేషన్ కలిసి జాయింట్ వెంచర్గా టాటా స్టార్బక్స్ను ఏర్పాటు చేశాయి. నిర్వహణ వ్యయాలు భారీగా ఉండటం, నష్టాలు పెరిగిపోతుండటం, మార్కెట్లో చౌక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా స్టార్బక్స్ భారత్ నుంచి నిష్క్రమించే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.ఇదీ చదవండి: సోలారే సోబెటరూ..రెస్టారెంట్ బ్రాండ్స్ క్విప్నకు సైన్యూఢిల్లీ: రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా లిమిటెడ్(గతంలో బర్గర్ కింగ్ ఇండియా) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల జారీ(క్విప్) చేపట్టనుంది. తద్వారా రూ. 500 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచి్చనట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి ఈక్విటీ షేర్లు లేదా క్విప్నకు వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలియజేసింది. 2024 ఉద్యోగులకు షేర్ల కేటాయింపు(ఇసాప్)నకు సైతం బోర్డు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా అర్హులైన డైరెక్టర్లు, ఉద్యోగులు తదితరులకు స్టాక్ ఆప్షన్లను జారీ చేయనున్నట్లు వివరించింది. ఇసాప్లో భాగంగా దాదాపు 1.05 కోట్ల ఆప్షన్స్ను గరిష్టంగా ఆఫర్ చేసే వీలున్నట్లు తెలియజేసింది. -
పెగాట్రాన్లో వాటాలపై టాటా కన్ను
న్యూఢిల్లీ: యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ పెగాట్రాన్ భారత వ్యాపారంలో వాటాలు కొనుగోలు చేయడంపై టాటా గ్రూప్ దృష్టి సారించింది. పెగాట్రాన్ కార్యకలాపాల్లో సుమారు 60 శాతం వాటాను దక్కించుకోవడంపై టాటా ఎల్రక్టానిక్స్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై గత ఏడాది కాలంగా ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఉత్పత్తుల తయారీలో మార్జిన్లు చాలా తక్కువగా ఉండటం, ప్లాంట్లలో కారి్మకుల డిమాండ్లతో సమస్యలు వస్తున్నా, అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో ఉత్పత్తులను సరఫరా చేయాల్సి రావడం కంపెనీకి సవాలుగా ఉంటోందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాలకు సంబంధించి స్థానిక కంపెనీని భాగస్వామిగా చేసుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. తమిళనాడులో ఉన్న పెగాట్రాన్ ఫ్యాక్టరీలో 10,000 మంది వర్కర్లు ఉండగా, ఏటా యాభై లక్షల ఐఫోన్ల తయారీ సామర్థ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది భారత్లో తయారైన మొత్తం ఐఫోన్లలో 10% ఫోన్లను పెగాట్రాన్ ఉత్పత్తి చేసినట్లు అంచనా. తమిళనాడులోని హోసూర్లో ఏర్పాటు చేసే ప్లాంటు కోసం టాటా, పెగాట్రాన్ జట్టు కట్టనున్నట్లు సమాచారం. టాటా గ్రూప్ ఇప్పటికే మరో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. -
యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలు
భారత్లో యాపిల్ ఉత్పత్తుల తయారీ భాగస్వామిగా ఉన్న పెగాట్రాన్లో 60 శాతం వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఇటీవల ఈమేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. దాంతో భారత్లో యాపిల్ ఉత్పత్తులు తయారీ చేసే కంపెనీల్లో టాటా గ్రూప్ టాప్లో నిలిచింది.యాపిల్ సంస్థ చైనా భయట ఇతర దేశాల్లో తన ఉత్పత్తిని పెంచేలా ఇండియాలో ఉత్పాదకతను పెంచుతోంది. దానికోసం టాటా గ్రూప్, ఫాక్స్కాన్తోపాటు ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. కానీ కొన్ని చిన్న కంపెనీల్లోని మేజర్వాటాను ఇప్పటికే ఈ సంస్థలు కొనుగోలు చేశాయి. టాటా గ్రూప్ యాపిల్ తయారీదారుగా ఉన్న విస్ట్రన్ కంపెనీను ఇప్పటికే కొనుగోలు చేసింది. తాజాగా పెగాట్రాన్ కంపెనీలో 60 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో స్థానికంగా యాపిల్ ఉత్పత్తులను తయారీని పెంచాలని నిర్ణయించింది.తయారీదారుగా ఉండడం తేలికైన విషయం కాదు..పెగాట్రాన్, టాటా గ్రూప్నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గత ఏడాది కాలంగా ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘యాపిల్కు కాంట్రాక్ట్ తయారీదారుగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. తయారీపై మార్జిన్లు కూడా అధికంగానే ఉంటాయి. యాపిల్ ఉత్పత్తుల అధునాతన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కంపెనీలు అత్యున్నత స్థాయితో ఉత్పత్తి చేపట్టాల్సి ఉంటుంది. నిత్యం నాణ్యతను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నందున ఉత్పత్తిలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదు’ అని యాపిల్ ఉత్పత్తుల తయారీ వ్యవస్థలో భాగమైన ఒక ఉన్నత అధికారి తెలిపారు. టాటా గ్రూప్ ఇప్పటికే భారత్లో ఐఫోన్ 16 తయారీని ప్రారంభించింది.ఇదీ చదవండి: ‘సామాన్యుడిపై భారం తగ్గించండి’పెగాట్రాన్ ఉత్పత్తి సామర్థ్యంపెగాట్రాన్ గత సంవత్సరం దేశీయంగా వినియోగిస్తున్న ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 10 శాతం సహకారం అందించింది. ఈ కంపెనీకి తమిళనాడులో తయారీ యూనిట్ ఉంది. ఇందులో దాదాపు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ యూనిట్ ఏటా ఐదు మిలియన్ల ఐఫోన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. -
గుడ్బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటన
ఎయిరిండియాలో విలీనానికి ముందు నడిచిన చివరి విస్తారా ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్లో విమాన సిబ్బంది ‘గుడ్బై విస్తారా’ అంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఇటీవల నడిచిన చివరి విస్తారా ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ కెప్టెన్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.కెప్టెన్ సుధాన్షు రైక్వార్, నేహల్ చేసిన ప్రకటనకు సంబంధించిన షార్ట్ క్లిప్ను ఎక్స్ వేదికలో పంచుకున్నారు. ‘చివరి విస్తారా సర్వీస్ బ్రాండ్గా మీకు అత్యుత్తమ భద్రత, సేవలను అందించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాం. కొన్నేళ్లుగా విస్తారా వివిధ ఖండాల్లో విస్తరించి, విభిన్న సంస్కృతులు కలిగిన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. అంకితభావం, భద్రత, విశ్వసనీయతతో మీకు సేవ చేయడం మా లక్ష్యం. విస్తారా చివరి సర్వీస్ ఈ రోజు మేము అదే ఉన్నత ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం. గుడ్బై విస్తారా. మేము ఎంతో మిస్ అవుతాం’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.Captain Capt Sudhanshu Raikwar and First Officer @Nehal_404 made an emotional yet confident announcement yesterday, marking their final flight as cockpit crew with @airvistara . #Aviation #Avgeek #Pilot #vistaraflight #Vistara https://t.co/G3rvMkTSRE pic.twitter.com/OvmZSmA2JT— Aman Gulati 🇮🇳 (@iam_amangulati) November 12, 2024ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓపదేళ్లుగా కార్యకలాపాలు సాగించిన విమానయాన సంస్థ విస్తారా నవంబర్ 11 నుంచి తన సేవలు నిలిపేసింది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ సంయుక్త యాజమాన్యంలోని విస్తారా నవంబర్ 11 నుంచి ఎయిరిండియా ఎయిర్లైన్స్లో విలీనం అవుతుంది. ఈ విలీనం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా సర్వీసులో ఉన్న పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తారా, ఎయిరిండియాలో పనిచేస్తున్న పైలట్ల రిటైర్మెంట్ వయసే అందుకు కారణమని తెలియజేశారు.నవంబర్ 11 నుంచి విస్తారా ఎయిర్లైన్స్ ఎయిరిండియాలో విలీనం అవుతుంది. ఈమేరకు గతంలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఎయిరిండియా పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పైలట్ల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఇప్పటివరకు విస్తారాలో పని చేసిన పైలట్లు రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగా ఉంది. ఒకే సంస్థలో, ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసులో తేడా ఉండడంపై ఎయిరిండియా పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు తమకు 65 ఏళ్లు వచ్చేవరకు సేవ చేయవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఎయిరిండియా ఎంపిక చేసిన పైలట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదవీ విరమణ తర్వాత 65 ఏళ్ల వరకు సర్వీసు పొడిగించే పాలసీని ప్రకటించింది.ఇదీ చదవండి: పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!రూ.2,058.50 కోట్ల డీల్పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఈరోజు నుంచి కనుమరుగు కానుంది. నవంబర్ 11 నుంచి విస్తారా సేవలు నిలిపేయనుంది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
లాభాల్లో దూసుకెళ్లిన టాటా గ్రూప్ కంపెనీ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్) సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి పటిష్ట పనితీరు చూపించింది. లాభం మూడు రెట్లు పెరిగి రూ.583 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.179 కోట్లుగానే ఉంది.విమానయాన, సంస్థాగత కేటరింగ్ సేవల విభాగం ‘తాజ్శాట్స్’ స్థిరీకరణతో ఏకీకృత ఆర్జన (రూ.307కోట్లు) తోడు కావడం లాభంలో అధిక వృద్ధికి దారితీసింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,433 కోట్ల నుంచి రూ.1,826 కోట్లకు పెరిగింది. వ్యయాలు సైతం రూ.1,249 కోట్ల నుంచి రూ.1,502 కోట్లకు పెరిగాయి.‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ త్రైమాసికంలో డిమాండ్ బలంగా పుంజుకుంది. దీంతో ఆదాయం 28 శాతం పెరిగింది. హోటల్ విభాగంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెందింది. దీంతో క్యూ2లో ఇప్పటి వరకు అత్యుత్తమ ఎబిట్డా మార్జిన్ 29.9 శాతం నమోదైంది’’అని ఐహెచ్సీఎల్ ఎండీ, సీఈవో పునీత్ ఛత్వాల్ తెలిపారు. 2024–25 సంవత్సరానికి రెండంకెల ఆదాయ వృద్ధి అంచనాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలోని ల్యాండ్మార్క్ హోటల్ ‘క్లారిడ్జ్’ను 2025 ఏప్రిల్లో స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిపారు. -
నోయల్ టాటా ఎంట్రీ: ఒకేసారి రెండు బోర్డులలో..
దివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే తాజాగా ఆయన టాటా సన్స్ బోర్డులో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా వెల్లడించింది.2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. టాటా సన్స్లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు.ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇకపైన టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించనున్నారు.ఎవరీ నోయల్ టాటానోయల్ టాటా.. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. టాటా ఇంటర్నేషనల్లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్కి మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. నోయల్ టాటా గ్రూపుతో 40 సంవత్సరాల అనుభవం ఉంది. కంపెనీలోని వివిధ బోర్డుల్లో వివిధ పదవులను నిర్వహించారు. అప్పటికి కేవలం ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్.. నోయల్ సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్సైడ్ రిటైల్ చెయిన్ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుంచి 3 బిలియన్ డాలర్లకు ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్గా, టాటా స్టీల్, టైటాన్లకు వైస్ చైర్మన్గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. -
టాటా సంస్థల త్రైమాసిక ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా టెక్నాలజీస్ నికర లాభం సుమారు రెండు శాతం తగ్గి రూ.157 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో ఇది రూ.162 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం రూ.1,269 కోట్ల నుంచి రూ.1,296 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,086 కోట్ల నుంచి రూ.1,095 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన సర్వీసుల వ్యాపార విభాగం పుంజుకుందని, 2 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేసిందని సంస్థ సీఈవో వారెన్ హ్యారిస్ తెలిపారు. ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉందని, ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత మెరుగ్గా ఉండగలదని ఆయన వివరించారు. టాటా పవర్.. ఫర్వాలేదుటాటాపవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగి రూ.1,093 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,017 కోట్లుగా ఉంది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.16,029 కోట్ల నుంచి రూ.16,211 కోట్లకు చేరింది. ‘ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రెన్యువబుల్ వ్యాపారం స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అన్ని విభాగాలు చెప్పుకోతగ్గ మేర పనితీరు చూపించాయి. దీంతో వరుసగా 20వ త్రైమాసికంలోనూ నికర లాభాన్ని నమోదు చేశాం. భారత్లో తయారీ లక్ష్యానికి అనుగుణంగా తమిళనాడులో మేము చెపట్టిన 4.3 గిగావాట్ సెల్ అండ్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా.. 2 గిగావాట్ సెల్ తయారీ సెప్టెంబర్ క్వార్టర్లో మొదలైంది. వచ్చే నెల చివరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి తయారీ పెరగనుంది’ అని టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!పూర్తి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్ల మూలధన వ్యయాల ప్రణాళిక ప్రకటించగా.. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.9,100 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ తయారీ, హైడ్రో ప్రాజెక్టులపై తాము చేస్తున్న పెట్టుబడులతో దేశ ఇంధన సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు. బీఎస్ఈలో టాటా పవర్ 1 శాతం లాభపడి రూ.445 వద్ద ముగిసింది. -
రతన్ టాటా గౌరవార్థం: లండన్లో..
దేశం కోసం వేలకోట్లు ఉదారంగా దానం చేసిన దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తాయి. ఈ గౌరవంతోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో నిర్మించనున్న భవనానికి 'రతన్ టాటా' పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ భవన నిర్మాణ పనులు 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ భవనాన్ని రాడ్క్లిఫ్ అబ్జర్వేటరీ క్వార్టర్లో.. టాటా గ్రూప్, సోమర్విల్లే కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్మించనున్నాయి. దీని ద్వారా బోధన, విద్యాకార్యకలాపాల నాణ్యతను మెరుగుపరుస్తారు. ఇది అవసరమైన పరిశోధనలకు నిలయంగా ఉంటుంది.సోమర్విల్లే కాలేజ్, రతన్ టాటా మధ్య దశాబ్ద కాలంగా ఉన్న స్నేహం వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. దీనిని లండన్కు చెందిన ఆర్కిటెక్ట్ మోరిస్ కో డిజైన్ చేయనున్నట్లు సమాచారం. రతన్ టాటా పేరుతో భవనాన్ని నిర్మించానికి లండన్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది.రతన్ టాటా పేరుతో భవన నిర్మాణం ప్రకటన తరువాత, సోమర్విల్లే కళాశాల ప్రిన్సిపాల్ బారోనెస్ రాయల్ మాట్లాడుతూ.. ఈ భవనం గత దశాబ్దంలో అనేక సంభాషణలు, ఆశలు, కలల ఫలం. టాటాతో మా సుదీర్ఘ అనుబంధానికి చిహ్నం అని అన్నారు. ఇది ఒక గొప్ప వ్యక్తి, సోమర్విల్లే ప్రియమైన స్నేహితుడి జీవితానికి శాశ్వత వారసత్వంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. సోమర్విల్లే కళాశాలతో ఈ సహకారం రతన్ టాటా విలువలకు నివాళి అని అన్నారు. -
క్విక్ కామర్స్లోకి టాటా గ్రూప్?
టాటా గ్రూప్ క్విక్ కామర్స్ రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఫ్లిప్కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ధీటుగా టాటా గ్రూప్ ‘న్యూఫ్లాష్’ పేరుతో ఈ సేవలు ప్రారంభించనుంది. ఈ సర్వీసును ముందుగా మెట్రో నగరాల్లో అందించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇప్పటికే టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బిగ్బాస్కెట్ ద్వారా వినియోగదారులకు ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది.క్విక్ కామర్స్ బిజినెస్కు వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దాంతో ప్రముఖ కంపెనీలు ఈ రంగంలో సేవలందించేందుకు పూనుకుంటున్నాయి. ఇప్పటికే జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో ఈ క్విక్ కామర్స్ సేవలందిస్తున్నాయి. మొత్తంగా ఈ కంపెనీలు 85% మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ మినిట్స్ పేరుతో ఈ సేవలందిస్తోంది. రిలయన్స్ జియోమార్ట్ ఎక్స్ప్రెస్ పేరుతో ముంబయిలో ఈ సర్వీసు అందుబాటులో ఉంచింది. ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం రిలయన్స్ రిటైల్, డీమార్ట్, స్పెన్సర్స్ వంటి రిటైల్ బిజినెస్ కంటే క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దాంతో ఇప్పటికే కొన్ని రిటైల్ సర్వీసులు అందించే కంపెనీలు ఈ బిజినెస్లోకి ప్రవేశిస్తున్నాయి. టాటా గ్రూప్ కూడా వినియోగదారులను పెంచుకుని ఈ విభాగంలో సేవలందించాలని భావిస్తోంది.ఇదీ చదవండి: పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే..టాటా గ్రూప్ బిగ్బాస్కెట్ ద్వారా ఈ-కామర్స్, క్రోమా ద్వారా ఎలక్ట్రానిక్స్, టాటా క్లిక్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ సేవలు, టాటా 1ఎంజీ ద్వారా ఫార్మసీ సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాపారాల్లో సంస్థకు వినియోగదారులు ఉండడంతో కొత్తగా రాబోయే టాటా న్యూ ఫ్లాష్ బిజినెస్కు కూడా వీరి సహకారం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. -
Ratan Tata: పెంపుడు కుక్క టిటో, పనిమనిషికి కూడా..
ముంబై: పారిశ్రామికవేత్త రతన్ టాటా తన దాతృత్వాన్ని చనిపోయాక కూడా చాటుకున్నారు. తన రూ.10 వేల కోట్ల ఆస్తుల్లో తోబుట్టువులకే కాదు, పెంపుడు శునకం టిటో, పనిమనిషి సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు కూడా వాటాలు పంచుతూ వీలునామా రాశారు. టాటా గ్రూప్ చైర్మన్ మాతృసంస్థ టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ నెల 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. తనకెంతో ప్రీతిపాత్రమైన జర్మన్ షెపర్డ్ శునకం టిటో సంరక్షణ బాధ్యతలను జీవితకాలం పాటు వంట మనిషి రజన్ షా చూసుకోవాలని కోరారు. ఆస్తుల్లో సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, డియానా జీజాభాయ్లకు కొంత కేటాయించారు. టాటా సన్స్లో వాటాను రతన్ టాటా ధార్మిక ఫౌండేషన్కు బదిలీ చేయాలని కోరారు. విల్లుపై బాంబే హైకోర్టు విచారణ జరపనుందని అధికారులు తెలిపారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు చెందిన గుడ్ఫెలోస్లో పెట్టిన పెట్టుబడిని వదిలేయాలని, విదేశాల్లో చదువుకునేందుకు నాయుడుకిచ్చిన రుణం మాఫీ చేయాలని వీలునామాలో తెలిపారు. -
టాటా కంపెనీకి షోకాజ్ నోటీసులు
ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ హెల్త్ అండ్ సేఫ్టీ (డీఐఎస్హెచ్) టాటా ఎలక్ట్రానిక్స్కు షోకాజ్ నోటీసు అందజేసింది. గత నెల 28న తమిళనాడులోని టాటా యూనిట్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి వివరణ ఇవ్వాలని డీఐఎస్హెచ్ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కంపెనీ ప్రతినిధులు వారంలోపు స్పందించాలని తెలిపింది.ఫ్యాక్టరీల చట్టం ప్రకారం..ఫ్యాక్టరీ వ్యవహారాలపై అంతిమ అధికారం కలిగి ఉన్న వ్యక్తి కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టప్రకారం ఆ వ్యక్తిని ‘ఆక్యుపైయర్’గా పరిగణిస్తారు. కంపెనీ డైరెక్టర్లు లేదా సంస్థ ప్రతిపాదించిన వ్యక్తి ఈ హోదాలో ఉండవచ్చు. కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆక్యుపైయర్ తెలియజేయాల్సి ఉంటుంది. ప్రమాదానికిగల కారణాలు చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగిందో వివరించడానికి కంపెనీకి ఒక అవకాశం కల్పించడం కోసం ఇలా ఈ షోకాజు నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..ఇప్పటికే డీఐఎస్ఎహెచ్ ప్రమాదానికిగల కారణాలను అంచనా వేసిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. తమిళనాడు హోసూర్లోని టాటా ఎలక్ట్రానిక్స్కు చెందిన యానోడైజింగ్ ప్లాంట్లో థర్మోస్టాట్ నియంత్రణ వైఫల్యం కారణంగా మంటలు చెలరేగాయని కంపెనీ అధికారులు చెప్పారు. ఈ యూనిట్లో యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది. -
జాబ్ లేదా? ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు!
టాటా గ్రూప్ వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ను తెలిపారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ తయారీ విభాగాల్లో ఉద్యోగార్థులకు అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ అనే అంశంపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత్ లక్ష్యానికి తయారీ రంగం కీలకంగా మారుతుంది. ఈ రంగంలో రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉంది. ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు కల్పించలేకపోతే కేంద్ర ప్రభుత్వం తలంచిన వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోలేము. తయారీ రంగం వృద్ధి దిశగా టాటా గ్రూప్ సంస్థలు వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెంచుతోంది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ రంగాల్లో విభిన్న పరికరాలను తయారు చేసేలా టాటా గ్రూప్ చర్యలు చేపడుతోంది. అందుకోసం రాబోయే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ న్యూక్లియర్ పవర్ కొనుగోలుటాటా గ్రూప్ అస్సాంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్లు ఉన్నాయి. తయారీ రంగం వృద్ధి చెందితే దేశ దిగుమతులు తగ్గుతాయి. అందుకు అనుగుణంగా ఎగుమతులు అధికమవుతాయి. ఫలితంగా రూపాయి విలువ పెరుగుతుంది. దాంతోపాటు ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గుతుంది. దేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే లేఆఫ్స్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. దానికి బదులుగా ఉత్పాదకతను పెంచి ఎగుమతులను మెరుగుపరిస్తే ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగార్థులు కంపెనీలు ఆశించే నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. -
రతన్ వారసుడు నోయెల్
ముంబై: అంతా ఊహించినట్లే టాటా ట్రస్ట్స్ పగ్గాలు రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా (67) చేతికే లభించాయి. టాటా ట్రస్ట్స్తో పాటు అందులో భాగమైన మిగతా ట్రస్ట్లన్నింటికి కూడా చైర్మన్గా ట్రస్టీలు శుక్రవారం జరిగిన సమావేశంలో నోయెల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాటా గ్రూప్తో పాటు జాతి నిర్మాణంలోనూ దివంగత రతన్ టాటా కీలక పాత్ర పోషించారని, ఎనలేని సేవలందించారని ట్రస్టీలు నివాళులరి్పంచారు. టాటా ట్రస్ట్స్ ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. నోయెల్ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ‘రతన్ టాటా, అలాగే టాటా గ్రూప్ వ్యవస్థాపకులు అందించిన ఘన వారసత్వాన్ని ఇకపైనా కొనసాగిస్తాము. అభివృద్ధి, దాతృత్వ కార్యకలాపాలను కొనసాగిస్తూ జాతి నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించడానికి పునరంకితమవుతాము‘ అని ఈ సందర్భంగా నోయెల్ తెలిపారు.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వారసుడిని ఎన్నుకునేందుకు టాటా ట్రస్ట్స్ ట్రస్టీలు సమావేశమయ్యారు. 165 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం పరోక్షంగా టాటా ట్రస్ట్స్ నియంత్రణలో ఉంటుంది. టాటా ట్రస్ట్స్ కింద సర్ రతన్ టాటా ట్రస్ట్ .. దాని అనుబంధ ట్రస్టులు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్.. దాని అనుబంధ ట్రస్ట్లు ఉన్నాయి. వీటన్నింటికి టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ సంస్థ, ప్రమోటర్ అయిన టాటా సన్స్లో 66 శాతం వాటాలు ఉన్నాయి. ఇప్పటివరకు రతన్ టాటా నీడలో ఉన్న నోయెల్ టాటా ఇకపై సొంతంగా వీటి బాధ్యతలను చేపట్టనున్నారు. ముగ్గురు సంతానం.. టాటా సన్స్లో 18.4 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన ఆలూ మిస్త్రీని నోయెల్ వివాహం చేసుకున్నారు. ఆమె టాటా సన్స్ మాజీ చైర్మన్, దివంగత సైరస్ మిస్త్రీ సోదరి. నోయెల్, ఆలూకి ఇద్దరు కుమార్తెలు (లియా, మాయా), ఒక కుమారుడు (నెవిల్) ఉన్నారు. పెద్ద కుమార్తె లియా టాటా ప్రస్తుతం ఇండియన్ హోటల్స్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. చిన్న కుమార్తె మాయా తన ప్రొఫెషనల్ కెరియర్ను టాటా ఆపర్చూనిటీస్ ఫండ్తో ప్రారంభించారు. తర్వాత టాటా డిజిటల్కి మారారు. టాటా న్యూ యాప్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. నెవిల్ టాటా తన వ్యాపార నైపుణ్యాలతో జుడియో బ్రాండ్ను విజయవంతం చేశారు. ట్రెంట్, స్టార్ బజార్లను పర్యవేక్షిస్తున్నారు. వ్యాపార దిగ్గజం విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి కిర్లోస్కర్ను వివాహం చేసుకున్నారు.నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్లో...ఐరిష్ పౌరసత్వం ఉన్న నోయెల్ టాటా గత నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్లో ఉన్నారు. ఆయన అంతగా బైటికి కనిపించరు. రతన్ టాటా తండ్రి నావల్ టాటాకు సూనూ, సిమోన్ అని ఇద్దరు భార్యలు. వారిలో సూనూ టాటా కుమారులు రతన్ టాటా, జిమ్మీ టాటా కాగా మరో భార్య సిమోన్ కుమారుడే నోయెల్ టాటా. ఆయన ససెక్స్ యూనివర్సిటీలో (యూకే) గ్రాడ్యుయేషన్ చేశారు. ఇన్సీడ్లో (ఫ్రాన్స్) ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం చేశారు. టాటా ఇంటర్నేషనల్లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్కి మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అప్పటికి ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్ .. ఆయన సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్సైడ్ రిటైల్ చెయిన్ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది. 2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుండి 3 బిలియన్ డాలర్ల స్థాయి కి ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్గా, టాటా స్టీల్, టైటాన్లకు వైస్ చైర్మన్గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. అలాగే 2019 నుంచి టాటా ట్రస్టుల్లో ట్రస్టీగా కూడా ఉన్నారు. స్మిత్స్ పీఎల్సీ, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ కంపెనీల బోర్డుల్లోనూ నోయెల్ ఉన్నారు. -
వారసుడొచ్చాడు.. టాటా ట్రస్ట్ ఛైర్మన్ నియామకం
టాటా ట్రస్ట్ ఛైర్మన్గా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. టాటా సామ్రాజ్యానికి కీలకమైన దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్న టాటా ట్రస్టుకు అధిపతిని నియమించేందుకు శుక్రవారం సభ్యులు సమావేశమయ్యారు. అందులో రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.టాటా స్వచ్ఛంద సంస్థలకు బోర్డు ట్రస్టీగా ఉన్న మెహ్లీ మిస్త్రీ కూడా కీలక పదవిని పొందేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు టాటా ట్రస్ట్కు ఛైర్మన్గా ఉన్న రతన్టాటా(86) ఆరోగ్య సమస్యలతో మరణించడంతో తన స్థానంలో తదుపరి ట్రస్ట్ పగ్గాలు చేపట్టేది ఎవరనే చర్చసాగింది. బోర్డు సభ్యులు నోయెల్ టాటాను ఎకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చర్చలకు తెరపడినట్లయింది.రతన్ టాటా వివాహం చేసుకోలేదు. వారసులు లేకపోవడంతో తన సోదరుడు నోయెల్ టాటా ట్రస్ట్ పగ్గాలు చేపట్టాల్సి వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నవల్ టాటా, సిమోన్ టాటా దంపతులకు 1957లో నోయెల్ టాటా జన్మించారు. అతను ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫ్రాన్స్లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్కు ఎంపికయ్యారు. నోయెల్ టాటా గ్రూప్లో వివిధ నాయకత్వ హోదాల్లో విధులు నిర్వహించారు.ఇదీ చదవండి: టెస్లా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్ ఆవిష్కరణట్రెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్గా కూడా పనిచేశారు. 2010-2021 మధ్య అతని నాయకత్వంలో ఉన్న టాటా ఇంటర్నేషనల్ ఆదాయాన్ని 500 మిలియన్ డాలర్లు(రూ.4200 కోట్లు) నుంచి మూడు బిలియన్ డాలర్లు(రూ.25 వేలకోట్లు)కు చేర్చారు. 1998లో ట్రెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఒకే రిటైల్ స్టోర్ ఉండేది. దాన్ని దేశంవ్యాప్తంగా వ్యాపింపజేసి 700 స్టోర్లకు పెంచారు. -
టాటా జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం
రతన్ టాటా మరణంపట్ల వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలు, భవిష్యత్తు తరాలు తన జీవితం నుంచి గ్రహించాల్సిన అంశాల గురించి చెప్పారు.చెరగని ముద్రరతన్టాటా మరణం బాధాకరం. అత్యుత్తమ నాయకత్వం, దార్శనికత కలిగిన వ్యాపారవేత్త, దాతృత్వవాదిగా ఆయన సేవలు మన సమాజంపై చెరగని ముద్ర వేశాయి. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆయన ప్రభావితం చేసిన వ్యక్తులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రిఆయన సేవలు అజరామరంరతన్టాటాజీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. గొప్ప జాతీయవాది, దార్శనిక వ్యాపారవేత్త, టాటా గ్రూప్ చైర్పర్సన్గా తన అసాధారణ విజయాలతో భారత్కు గొప్ప పేరు తీసుకొచ్చారు. చివరి శ్వాస వరకు సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మక పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి (రోబో కారును ఆవిష్కరించిన టెస్లా)శతాబ్దానికి ఒక్కరు..టాటా ఓ గొప్ప వ్యాపార నాయకుడు. దేశాలు ఇలాంటి నేతలను శతాబ్దానికి ఒక్కరినే పొందుతాయి. టాటా గ్రూపు వృద్ధికి మించి ఆయన అభిరుచి కొనసాగింది. దాతృత్వ కార్యక్రమాల ద్వారా లక్షలాది భారతీయులకు సేవలు అందించారు – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్స్ గౌరవ చైర్మన్ ఆయన సేవలు అసమానం..ప్రపంచం అచ్చమైన దార్శనికుడు, మానవతావాదిని కోల్పోయింది. వ్యాపారం, సమాజానికి ఆయన అందించిన అసమానమైన సేవలు ఆయన వారసత్వంగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. – సంజీవ్ గోయెంకా, ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్ పరిశ్రమలు, ప్రజా జీవితాలపై ముద్రవ్యాపారాలన్నవి ఆర్థికాభివృద్ధికే కాదు, సామాజిక పురోగతికి ఉ్రత్పేరకాలూ అని నిరూపించారు. ఆయన నిర్ణయాలు ఆర్థిక అంశాలకు మించి పరిశ్రమలు, ప్రజా జీవితాలను ప్రభావితం చేశాయి. ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. – కుమారమంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ (ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటా)ఒక వ్యక్తి కాదు సంస్థరతన్ టాటా భారత్కు చెందిన ప్రముఖ, గొప్ప వ్యాపారవేత్తే కాదు, ఆయనొక సంస్థ. టాటాను అంతర్జాతీయంగా విస్తరించడం ద్వారా టాటా వారసత్వంలో ఎన్నో శాశ్వత అధ్యాయాలు లిఖించారు. భారతీయుల్లో ఆయన ఎప్పుడూ జీవించే ఉంటారు. – జీపీ హిందుజా, హిందుజా గ్రూప్ చైర్మన్ఎయిర్ఇండియాతో కలసి నడుస్తాంమిస్టర్ టాటాకు విమానయానం పట్ల ఉన్న ప్రేమ, భారత విమానయాన భవిష్యత్తు పట్ల ఆయన దూరదృష్టికి నివాళిగా, అంతర్జాతీయ విమానయాన రంగంలో భారత్కు సముచిత స్థానం కోసం ఎయిర్ ఇండియాతో కలసి నడుస్తాం. – రాహుల్ భాటియా, ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఇండిగో) ఎండీ ఆయన వారసత్వం శాశ్వతంరతన్ టాటా మరణం పట్ల మేము ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన దార్శనిక నాయకత్వం, భారత పరిశ్రమలకు అందించిన సేవలతో ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. – ఉన్సూకిమ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీప్రపంచ శక్తిగా టాటా గ్రూప్ను నిలబెట్టారురతన్ టాటా అందించిన నాయక త్వం కార్పొరేట్ బాధ్యత, ఆవిష్కరణలను పునర్నిర్వచించింది. నైతిక విలువలే పునాదిగా టాటా గ్రూప్ను ప్రపంచశక్తిగా నిలిపింది. ఆయణ మరణం పట్ల చింతిస్తున ఈ వేళ.. భారత్ నిర్మాణానికి గణనీయంగా దోహదపడిన ఆయన వారసత్వం, విలువలను గౌరవిస్తున్నాం. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ భారత ప్రగతిలో గొప్ప పాత్రభారత ఆర్థిక వ్యవస్థ చరిత్రాత్మకంగా ముందుకు దూసుకుపోతున్న స్థితిలో ఉంది. టాటా జీవితం, పని ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడంలో గొప్ప పాత్ర పోషించాయి. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆధునిక వ్యాపార మార్గదర్శి అసాధారణమైన వ్యాపార, దాతృత్వ వారసత్వాన్ని ఆయన వదిలి వెళ్లారు. భారత్లో ఆధునిక వ్యాపారాలకు మార్గదర్శకత్వం, అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం. – సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవో(చరిత్ర మరువదు.. మీ ఘనత)భారత స్ఫూర్తి ప్రదాత రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడే కాదు. భారత స్ఫూర్తి, సమగ్రత, కరుణ, గొప్ప మేలు కోసం తిరుగులేని నిబద్ధత మూర్తీ భవించిన నేత – గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ అధినేత రోల్ మోడల్ ప్రియమైన స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధిస్తోంది. విలువలతో కూడిన నాయకత్వం విషయంలో రతన్టాటా నాకు రోల్ మోడల్. నైతిక సమస్యల విషయంలో సందిగ్ధత ఎదుర్కొన్నప్పుడు ఆయన నాకు దిక్సూచిగా నిలిచారు. – నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ప్రతీ భారతీయుడికి చిహ్నం రతన్టాటా మరణంతో భారత పరిశ్రమ తన కిరీటంలో ఆభరణాన్ని మాత్రమే కోల్పోలేదు, ఆయన దార్శనికత మరియు అత్యుత్తమ వ్యక్తిగత లక్షణాలు ప్రతి భారతీయుడికి చిహ్నంగా మారాయి. విలువను సృష్టించడం ఒకరి కోసం కాదు, దేశ పురోగతికి, గొప్ప ప్రయోజనం కోసం అన్న ఆయన ఆచరణ నాకు స్ఫూర్తినిచ్చింది. – అనిల్ అగర్వాల్, వేదాంత చైర్మన్ సమాజానికి తిరిగిచ్చారు.. గౌరవనీయ వ్యాపారవేత్త. సమాజానికి తిరిగిస్తానన్న హామీకి అనుణంగా జీవించారు. యువతరానికి ఆయన స్ఫూర్తి. – ప్రియా అగర్వాల్ హెబ్బర్, హిందుస్థాన్ జింక్ చైర్పర్సన్ చిరకాల ముద్ర.. మిస్టర్ టాటా మరణం ఒక శకానికి ముగింపు. టాటా గ్రూప్ ప్రస్థానంపై చిరకాల ముద్ర వేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. టాటా గ్రూప్, రతన్టాటాతో మిస్త్రీ కుటుంబానికి దీర్ఘకాల అనుబంధం ఉంది. – షాపూర్జీ మిస్త్రీ, ఎస్పీ గ్రూప్ చైర్మన్ -
ఐదేళ్లలో ఏయే టాటా షేరు ఎంత పెరిగిందంటే..
టాటా గ్రూప్ విలువను రతన్ టాటా సారథ్య పగ్గాలు చేపట్టిన తర్వాత పరుగు పెట్టించారు. రూ.10 వేలకోట్లుగా ఉన్న సంస్థల విలువను ఏకంగా రూ.30 లక్షల కోట్లకు చేర్చారు. అంతకుమించి ప్రజల్లో తన సేవానిరతితో చేరిగిపోని చోటు సంపాదించారు. గత ఐదేళ్లలో కంపెనీ షేర్లు ఎంత శాతం పెరిగాయో తెలుసుకుందాం.ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాటాటా గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీల పరుగు..కంపెనీ పేరు షేరు ర్యాలీ(%)టాటా టెలీసర్వీసెస్ 3002 ఆటోమోటివ్ స్టాంపింగ్స్ 2211 ట్రెంట్ 1499 టాటా ఎలక్సీ 1109 టాటా ఇన్వెస్ట్మెంట్ 820 టాటా పవర్ 686 టాటా మోటార్స్ 628 టీఆర్ఎఫ్ 489 టాటా కమ్యూనికేషన్స్ 453 ఓరియంటల్ హోటల్స్ 391 ఇండియన్ హోటల్స్ 376 టాటా స్టీల్ 362 టాటా కెమికల్స్ 347 నెల్కో 333 టాటా కన్జూమర్ 304 టైటన్ కంపెనీ 176 వోల్టాస్ 165 టీసీఎస్ 111 ర్యాలీస్ ఇండియా 81 -
ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటా
రతన్ టాటా సమాజానికి చేసిన సేవ ఎనలేనిది. టాటా గ్రూప్ సంపదలో సగానికిపైగా టాటా ట్రస్ట్కు విరాళంగా అందజేస్తున్నారు. దాని ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రాజకీయాలు, అవినీతికి దూరంగా ఉండే రతన్ టాటా జీవితం ఎంతో మందికి అనుసరణీయం. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పెద్ద వయసులో తాను ఎలా సమయం గడిపారో తెలిపారు. ఎవరైనా తనను మంచి సలహా ఇవ్వమని అడిగితే ఏం చెబుతారో వివరించారు.ఇంటర్వ్యూలో టాటా మాట్లాడుతూ..‘చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నా. వారి నుంచి నిత్యం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఎనిమిది పదుల వయసు దాటాక కూడా విద్యార్థిగానే ఉన్నాను. ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎవరూ సంపూర్ణ విజ్ఞానం కలిగి ఉండరు. ఎవరైనా మంచి సలహా ఇవ్వాలని అడిగితే..మంచిసలహా అనేది సమయాన్ని బట్టి మారుతుంటుంది. కానీ మంచి పని చేయాలన్న తపన మాత్రం ఎప్పటికీ మారకుండా ఉంటుంది. అందుకే..సలహాల సంగతి ఆపేసి కష్టమైనా సరే సరైన పని చేయడంపై దృష్టి సారించాలని చెబుతుంటా! ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే..సరైన పని చేయడమే కీలకమైందని అర్థమవుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’వివిధ సందర్భాల్లో రతన్ టాటా చెప్పిన మాటలు కొన్ని..జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదొడుకులు ఉండటం చాలా ముఖ్యం. ఈసీజీలో సరళ రేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం.కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడిలేదని ప్రతివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తారు. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషమూ ఉంది.తన కోసం పని చేస్తున్న వారి మేలు కోరే వాడే ఉత్తమ నాయకుడు.వృత్తిని – జీవితాన్ని సమతులం చేయడంపై నాకు నమ్మకంలేదు. వృత్తిని – జీవితాన్ని మమేకం చేయాలి. మీ వృత్తిని, జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవాలి.ఏ ఇబ్బందినీ స్వీకరించకపోవడమే పెద్ద ప్రమాదం. అతి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాల్నూ స్వీకరించలేకపోతే అపజయం తప్పదు.ఎన్ని కష్టాలనైనా పట్టుదలతో ఎదుర్కోండి. అవే మీ విజయానికి పునాది రాళ్లు.ఎదుటివాళ్ల దయా గుణాన్ని, ప్రేమను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకండి.మీ జీవితం సాఫీగా ఉండకపోవచ్చు. సమాజంలోని సమస్యలను పరిష్కరించ లేకపోవచ్చు. అలాగని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువగా అంచనావేయొద్దు. ధైర్యం, నమ్మకం మనకో దారి చూపిస్తాయి.అవకాశాల కోసం ఎదురు చూడకూడదు. అవకాశాల్ని సృష్టించుకోవాలి.నాయకత్వమంటే బాధ్యత తీసుకోవడం.సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు దృష్టి లేదు. నిర్ణయం తీసుకొని దానిని విజయవంతం చేయడమే నా పని.విజయం అనేది నీవు చేపట్టిన పదవిపై ఆధారపడి ఉండదు. నీవు ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తున్నావన్న దానిపై ఆధారపడి ఉంటుంది. -
చరిత్ర మరువదు.. మీ ఘనత
ముంబై: ‘‘ఈ స్నేహంలో అగాధం ఇప్పుడు నాతో ఉండిపోయింది. నా మిగిలిన జీవిత కాలంలో దీన్ని పూరించేందుకు కృషి చేస్తాను’’అంటూ శంతను నాయుడు తన స్పందనను వ్యక్తం చేశారు. 31ఏళ్ల ఈ యువకుడు రతన్టాటాకు అత్యంత విశ్వసనీయ సహచరుడు. వృద్ధాప్యంలో ఆయన బాగోగులు చూసుకున్న ఆప్త మిత్రుడు. రతన్టాటా అంతిమయాత్ర వాహనం ముందు యెజ్డీ మోటారుసైకిల్ నడుపుతున్న శంతనునాయుడిని చూసే ఉంటారు. ‘‘దుఃఖం అనేది ప్రేమకు చెల్లించాల్సిన మూల్యం. గుడ్బై, నా ప్రియమైన దీపస్తంభం’’అంటూ చిన్న పోస్ట్ పెట్టాడు. టాటా గ్రూప్లో ఐదవ తరం ఉద్యోగి శంతనునాయుడు. 2014లో రతన్టాటా, శంతను కలుసుకున్నారు. వీధి శునకాల పట్ల ప్రేమ వీరిద్దరినీ కలిపిందని చెప్పుకోవాలి. వీధి శునకాలు రాత్రి వేళల్లో వాహన ప్రమాదాలకు గురి కాకుండా, వాటి కోసం మెరిసే కాలర్లను శంతను డిజైన్ చేశాడు. కుక్కల మెడలో ఈ కాలర్ను ఉంచితే, రాత్రివేళ వాహన వెలుగులకు మెరవడంతో డ్రైవర్లు వాటిని గుర్తిస్తారన్నది అతడి యోచన. ఇందుకు నిధుల సాయం కావాలంటూ రతన్టాటాకు లేఖ రాశాడు. ముంబైలోని తన కార్యాలయానికి రావాలని, తనతో కలసి పనిచేయాలంటూ రతన్ టాటా నుంచి శంతనుకు పిలుపు వచి్చంది. రతన్టాటా సహకారంతో మోటోపాస్ అనే కంపెనీని శంతను స్థాపించాడు. వృద్ధులకు తోడుగా యువ సహచరులను కలిపే స్టార్టప్ ‘గుడ్ ఫెలోస్’ను సైతం స్థాపించాడు. ఆ తర్వాత ఎంబీఏ కోసం యూఎస్ వెళుతూ. తిరిగి వచి్చన తర్వాత కలసి పనిచేస్తానని రతన్టాటాకు శంతను హామీఇచ్చాడు. తిరిగొచి్చన తర్వాత రతన్టాటా అసిస్టెంట్గా, టాటా ట్రస్ట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించాడు. రతన్టాటా తుదిశ్వాస విడిచే వరకు ఆయన వెన్నంటి ఉన్నాడు. -
టాటా వారసులెవరు..
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అస్తమించిన నేపథ్యంలో ఇక 365 బిలియన్ డాలర్ల టాటా మహాసామ్రాజ్యానికి వారసులెవరనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా పలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీటిలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటాతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మెహ్లీ మిస్త్రీ పేర్లు కూడా ఉన్నాయి. వాస్తవానికి రతన్ టాటాకు తోడబుట్టిన సోదరుడైన జిమ్మీ టాటా పేరు కూడా పరిశీలించాల్సినప్పటికీ ఆయన వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, రతన్ టాటా తండ్రి నావల్ టాటా, మారుతల్లి సిమోన్ టాటా కుమారుడైన నోయెల్ పేరు ప్రముఖంగా తెరపైకి వచి్చంది. టాటా కుటుంబసభ్యుడు కావడంతో పాటు పలు గ్రూప్ కంపెనీలను నడిపించిన అనుభవం కూడా ఉండటమనేది నోయెల్కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ సంస్థలకు చైర్మన్గా ఉన్నారు. అలాగే రతన్ టాటా ట్రస్టు బోర్డులో కూడా ఉన్నారు. టాటా సన్స్ను పర్యవేక్షించే టాటా ట్రస్ట్స్ చైర్మన్గా అయ్యేందుకు ఇది ఆయనకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రతన్ టాటా వివాహం చేసుకోకపోవడం, ఆయనకు సంతానం లేకపోవడంతో నోయెల్ సంతానానికి భవిష్యత్తులో టాటా గ్రూప్లో మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. నోయెల్కు మాయా, నెవిల్, లియా... ఈ ముగ్గురు సంతానం ఉన్నారు. టాటా మెడికల్ సెంటర్కి మాయా ట్రస్టీగా వ్యవహరిస్తుండగా, హైపర్మార్కెట్ స్టార్ బజార్కి నెవిల్ సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు. జుడియో బ్రాండ్ విస్తరించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. టాటా గ్రూప్లో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీలో లియా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సన్నిహితుడు మెహ్లీ..: మెహర్జీ పల్లోంజీ గ్రూప్ డైరెక్టర్ అయిన మెహ్లీ మిస్త్రీ, రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు టాటా గ్రూప్తో చాలాకాలంగా అనుబంధం ఉంది. 2022లో కారు ప్రమాదంలో మరణించిన టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి మెహ్లీ కజిన్ అవుతారు. వాస్తవానికి టాటా సన్స్లో పల్లోంజీ మిస్త్రీ గ్రూప్నకు 18.4 శాతం వాటా ఉన్నందున ఆ గ్రూప్ అధినేత షాపూర్ మిస్త్రీ పేరు కూడా పరిశీలనకు రావాలి. కానీ టాటాలతో మిస్త్రీలకు విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఆయనకు టాటా సామ్రాజ్యం బాధ్యతలు లభించకపోవచ్చనే అభిప్రాయం నెలకొంది. నోయెల్, మెహ్లీతో పాటు గ్రూప్లో ఉన్నవారే కాకుండా బైటి వ్యక్తుల పేర్లు కూడా అకస్మాత్తుగా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. -
30వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు!
ఉప్పు నుంచి ఉక్కు దాకా... సబ్బుల నుంచి సాఫ్ట్వేర్ అగ్రగామిగా... దేశ ప్రజల తలలో నాలుకగా మారిన టాటా గ్రూప్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. నేడు రూ.30 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువతో దేశ కార్పొరేట్ జగత్తులో అత్యంత విలువైన ‘రతనం’లా వెలిగిపోతోంది. అలుపెరుగని ఈ పయనంలో టాటా బ్రాండ్కు ఖండాంతర ఖ్యాతిని తెచి్చన ఘనత కార్పొరేట్ ‘టైటాన్’ రతన్ టాటా సొంతం! లాభార్జనే ధ్యేయంగా కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకూ తమ వ్యాపార ఫలాలను పంచిన వితరణ శీలిగా కూడా చిరస్థాయిగా నిలిచిపోయారు.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన హయాంలో టాటా గ్రూప్ను మహాసామ్రాజ్యంగా విస్తరించారు. ఇటు ప్రధానమైన వ్యాపార విభాగాలను పటిష్టం చేస్తూనే అటు పేరొందిన విదేశీ దిగ్గజ కంపెనీలను కూడా కొనేసి భారతీయ కార్పొరేట్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. మిగతా దేశీ కార్పొరేట్లకు స్ఫూర్తినిచ్చారు. విమర్శలు, హేళనలు ఎదురైనా వాటిన్నింటినీ అధిగమించి టాటా గ్రూప్ను అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజంగా మల్చారు. రతన్ పగ్గాలు చేపట్టేనాటికి గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.30 వేల కోట్లు మాత్రమే. ఇక ఆదాయం 6 బిలియన్ డాలర్ల (అప్పటి రూపాయి మారకం విలువ ప్రకారం రూ.18,000 కోట్లు) స్థాయిలో నిదానంగా పురోగమిస్తున్న టాటా గ్రూప్ ఆయన సాహసోపేత నిర్ణయాలు, దూకుడు దన్నుతో నేడు ఏకంగా 165 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్లు) ఆదాయాల స్థాయికి విస్తరించింది. టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్, టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి దిగ్గజాలు ఆయా రంగాల్లో అగ్రగాములుగా ఉన్నాయి. గ్రూప్ సంస్థల్లో ఏకంగా 10 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. గ్రూప్లో పది విభాగాల్లో ప్రధానంగా 30 కంపెనీలు ఉండగా వీటిలో 26 లిస్టెడ్ కంపెనీలున్నాయి. వీటికి అనుబంధంగా పలు సంస్థలు కూడా ఉన్నాయి. 2024 మార్చి 31 నాటికి వాటి టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా 365 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.30 లక్షల కోట్లు) అధిగమించడం విశేషం. టాటా సామ్రాజ్యంలోని సంస్థలు ఆరు ఖండాల్లో 100 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 6 బిలియన్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు.. రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా సన్స్ చైర్మన్గా వ్యవహరించారు. వివిధ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న 95 కంపెనీలు గ్రూప్లో ఉండేవి. కెమికల్స్, హోటల్స్, ఉప్పు, ఉక్కు, సబ్బులు, వాచీలు మొదలైన విభాగాల్లో ఇవన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తూ, ఒకదానితో మరొకదానికి పెద్దగా సంబంధం లేని విధంగా ఉండేవి. రతన్ టాటా వచ్చాక వాటన్నింటినీ పునర్వ్యవస్థీకరించడం, కార్యకలాపాలను క్రమబదీ్ధకరించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ అనుబంధ సంస్థలన్నింటికి కూడా ఒకే కార్పొరేట్ గుర్తింపు ఉండాలని నిర్దేశించారు. దేశీ మార్కెట్పైనే ప్రధానంగా దృష్టి పెట్టి, నిదానంగా నడుస్తున్న గ్రూప్ను అంతర్జాతీయ స్థాయి విస్తరించారు. ఐఐఎం బెంగళూరు పరిశోధన పత్రం ప్రకారం ఆయన హయాంలో గ్రూప్ ఆదాయాలు 6 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 18,000 కోట్ల నుంచి రూ. 5.5 లక్షల కోట్లకు) ఎగిశాయి. గ్రూప్ మార్కెట్ విలువ 9.5 బిలియన్ డాలర్ల నుంచి 91.2 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 30,000 కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లకు) పెరిగింది. కీలక కొనుగోళ్లు.. కోరస్: ఆంగ్లో–డచ్ ఉక్కు దిగ్గజం కోరస్ను 2007లో టాటా స్టీల్ ఏకంగా 12 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. ఒక విదేశీ కంపెనీని ఇంత భారీ మొత్తం వెచి్చంచి కొనుగోలు చేయడం అప్పటిదాకా కనీవినీ ఎరుగనిది. ఈ కొనుగోలుతో టాటా స్టీల్ ఒక్కసారిగా ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు దిగ్గజాల జాబితాలోకి చేరిపోయింది. గ్రూప్ మార్కెట్ విలువను గణనీయంగా పెంచింది. అప్పటిదాకా ఎక్కువగా దేశీ మార్కెట్పైనే దృష్టి పెట్టిన టాటా స్టీల్, కోరస్ కొనుగోలుతో యూరప్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. జాగ్వార్ ల్యాండ్రోవర్: రతన్ టాటా 2008లో మరో సాహసోపేతమైన ముందడుగు వేశారు. ఈసారి దిగ్గజ బ్రిటీష్ కార్ల బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్రోవర్పై గురి పెట్టారు. 2.3 బిలియన్ డాలర్లు పెట్టి కొనేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆ తర్వాత అదొక మాస్టర్స్ట్రోక్ అని రతన్ టాటా నిరూపించారు.గ్లోబలైజేషన్ బాటలో గ్రూప్.. ప్రధానంగా భారత్పై దృష్టితో కార్యకలాపాలు సాగిస్తున్న గ్రూప్ను గ్లోబల్ ప్లేయర్గా రతన్ టాటా తీర్చిదిద్దారు. ఇందుకోసం దూకుడుగా విదేశీ కంపెనీలను కొన్నారు. 2008లో బ్రిటీష్ లగ్జరీ కార్ల బ్రాండ్లు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేయడం ద్వారా అంతర్జాతీయ ఆటోమోటివ్ మార్కెట్లో టాటా మోటార్స్ను ప్రముఖ సంస్థగా నిలిపారు. అంతకన్నా ముందుగా 2000లో టెట్లీని కొనుగోలు చేయడం ద్వారా గ్లోబల్ టీ మార్కెట్లో టాటా గ్రూప్ కూడా ప్రధాన ప్లేయర్గా ఎదిగింది.టీసీఎస్.. ఐటీ కోహినూర్!టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ (టీసీఎస్) పాత్ర చాలా కీలకం. 1968లోనే ఏర్పడినప్పటికీ రతన్ టాటా సారథ్యంలో టీసీఎస్కి రెక్కలొచ్చాయి. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకి వచి్చంది. ఏకంగా రూ. 4,713 కోట్లు సమీకరించింది. అప్పటి నుండి అద్భుతమైన పనితీరుతో టీసీఎస్ దూసుకెళ్తోంది. టీసీఎస్తో పాటు టాటా మోటర్స్, టాటా స్టీల్, టాటా పవర్ దన్నుతో గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ. 30 లక్షల కోట్లకు ఎగిసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
అక్షరాలా భారత రత్నమే!
నిదానంగా కదులుతూ... ముక్కుసూటిగా మాట్లాడుతూ... విలువలను ఎత్తిపడుతూ కూడా అన్యులకు అసాధ్యమైన సమున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆరు దశాబ్దాల తన ఆచరణతో దేశానికి చాటిచెప్పిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన అక్షరాలా రత్నం. సార్థక నామధేయుడు. చెదరని వినమ్రత, సడలని దృఢ సంకల్పం, లక్ష్యసాధనకు ఎంత దూరమైనా వెళ్లే లక్షణం... విశాల టాటా సామ్రాజ్యంలో ఆయనను విలక్షణ వ్యక్తిగా నిల బెట్టాయి. కనుకనే మూడు దశాబ్దాల పాటు ఆ సామ్రాజ్యానికి ఆయన అక్షరాలా చక్రవర్తిగానే వ్యవహరించారు. నిజమే... ఆయన 1962లో సాధారణ ఉద్యోగిగా చేరిననాటికే దేశంలో అదొక అత్యున్నత శ్రేణి సంస్థ కావొచ్చుగాక. పైగా సంస్థ సారథులకు ఆయన అతి దగ్గరివాడు, బంధు వర్గంలో ఒకడు కూడా! కానీ ఆయన ఎదుగుదలకు తోడ్పడినవి అవి కాదు. ఆయన అంకితభావం, దీక్షాదక్షతలు, నిరంతర తపన ఆయనను అంచెలంచెలుగా పైపైకి చేర్చాయి. పేరుకు ఒక సంఘటిత సంస్థే అయినా, అప్పటికే లక్షలమంది సిబ్బందికి చల్లని నీడనిచ్చే కల్పవృక్షంగా పేరుతెచ్చుకున్నా... టాటాల సామ్రాజ్యం విభిన్న సంస్థల సమాహారం మాత్రమే! అందులో సమష్టితత్వం, దిశ, దశా నిర్దేశించే ఉమ్మడి తాత్విక భూమిక శూన్యం. జమ్షెడ్జీ టాటా, జేఆర్డీ టాటా వంటివారు నేతృత్వం వహించిన ఆ సంస్థలో నాయకత్వ స్థానం దక్కాలంటే అడుగడుగునా అవరోధాలు తప్పలేదు. నెత్తురు చిందకపోవచ్చు... గాయాల జాడ లేకపోవచ్చు, కానీ రోమన్ సామ్రాజ్యకాలం నాటి కలోసియంలను తలపించే బోర్డు రూంలో తన ఆలోచనలనూ, తన భావనలనూ బలంగా వినిపించి ప్రత్యర్థుల వాదనలను పూర్వపక్షం చేయటం మాటలు కాదు. తన ప్రతి పలుకూ, ప్రతి వివరణా నిశితంగా గమనించే, ప్రశ్నించే ఆ బోర్డు రూంలో గెలవటం సాధారణం కానే కాదు. కానీ రతన్ అవన్నీ అవలీలగా చేయగలిగారు. నిష్క్రమిస్తున్న చైర్మన్జేఆర్డీ టాటా ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నా అప్పటికే భిన్న సంస్థలకు సారథులైనవారు సామాన్యులు కాదు. అప్పటికింకా టిస్కోగానే ఉన్న టాటా స్టీల్కు రూసీ మోదీ సారథి. పారిశ్రామిక రంగంలో ఆయన మోత మోగిస్తున్నాడు. జమ్షెడ్ఫూర్లో కొలువుదీరిన ఆ సంస్థకాయన మకుటంలేని మహారాజు. అజిత్ కేర్కర్ ఇండియన్ హోటల్స్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. దర్బారీ సేల్ టాటా కెమికల్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వీళ్లెవరూ రతన్ టాటాను సీరియస్గా తీసుకోలేదు. అతన్ని అవలీలగా అధిగమించవచ్చనుకున్నారు. రతన్ తన పేరులో చివరున్నరెండక్షరాల పుణ్యమా అని ఇంత దూరం వచ్చాడు తప్ప ‘సరుకు’ లేదనుకున్నారు. ఆయన రాకపై ఆలోచించటం సమయాన్ని వృథా చేసుకోవడమే అనుకున్నారు. కానీ రతన్ పరిశీలనాశక్తి అమోఘ మైనది, అనితర సాధ్యమైనది. ఈ మహాసామ్రాజ్యంలో ఏం జరుగుతున్నదో, లోపాలేమిటో అచిర కాలంలోనే పసిగట్టాడు. తళుకుబెళుకులకు తక్కువేం లేదు. మదుపుపరులకు ఎప్పటికప్పుడు లాభాల పంటా పండుతోంది. కానీ అట్టడుగున అవాంఛనీయమైన పోకడలు కనబడుతున్నాయి. వాటిని చక్కదిద్దితేసంస్థను మరిన్ని రెట్లు పెంచి ఘనతరమైనదిగా తీర్చిదిద్దటం అసాధ్యమేమీ కాదని ఆయన నిర్ణయించుకున్నాడు. 1991 నాటికే దేశంలో అడుగుపెట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పాత పద్ధతిలోనే టిస్కోను కొనసాగిస్తే త్వరలోనే అది గ్రూపు చేజారటం ఖాయమన్న నిర్ణయానికొచ్చాడు.జేఆర్డీ మంచితనమో, గమనించలేని తత్వమో గానీ... టాటా స్టీల్లో అప్పటికి టాటాలకున్న ప్రమోటర్ వాటా కేవలం అయిదు శాతం మాత్రమే. ఇదే కొనసాగితే ఏదోనాటికి అది ఎవరి చేతుల్లోకైనా పోవచ్చని రతన్ గ్రహించారు. అదొక్కటే కాదు... గ్రూపు సంస్థల్లో ఏ ఒక్కటీ చేజారకుండా ప్రమోటర్ వాటాను గణనీయంగా పెంచారు. సొంత సంస్థలను పదిలపరచుకోవటమే కాదు, ఖండాంతర ఆంగ్లో–డచ్ స్టీల్ సంస్థ కోరస్ను వశపరుచుకున్నారు. ఒకప్పుడు తనకు అవరోధంగా నిలిచిన అమెరికన్ దిగ్గజ సంస్థ ఫోర్డ్ నుంచి జాగ్వార్ ల్యాండ్రోవర్ను టాటాల తీరానికి చేర్చారు.వర్తమానంలో పారిశ్రామికవేత్తల ఎదుగుదల ఎలా సాధ్యమవుతున్నదో బాహాటంగానే కనబడుతోంది. కానీ రతన్ టాటా ఇందుకు భిన్నం. టాటా సంస్థలపై మచ్చపడకుండా, వక్రమార్గాల జోలికిపోకుండా నిదానంగా తన ప్రస్థానం సాగించారు. ఆయన పట్టిందల్లా బంగారమేనని చెప్పడానికి లేదు. కోరస్ టేకోవర్ అయినా, నానో కారు ఉత్పత్తి ఉబలాటమైనా, టాటా గ్రూప్ సంస్థల చైర్మన్గా సైరస్ మిస్త్రీ ఆగమన, నిష్క్రమణల్లో అయినా రతన్ వైఫల్యాలు స్పష్టంగా కనబడతాయి. అందుకాయన విమర్శలను ఎదుర్కొనక తప్పలేదు. అలాగే టాటా స్టీల్ను దాదాపు 1,200 కోట్ల డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దినప్పుడూ, దేశీయ విద్యుత్ ఆధారిత వాహన రంగంలో టాటా మోటార్స్ను మార్కెట్ లీడర్గా ముందుకు ఉరికించినప్పుడూ ఆయన గర్వం తలకెక్కించుకోలేదు. ఇవాళ్టి రోజున బహుళజాతి సంస్థల సమాహారంగా ఖండాంతరాల్లో వెలుగు లీనుతున్న టాటా గ్రూప్ నిరుటి రెవెన్యూ 16,500 కోట్ల డాలర్లు. ఆయన వ్యక్తిగత ఆదాయమే కొన్ని వందల కోట్లు. అయినా చివరి వరకూ అతి సాధారణ జీవితం గడిపి, అసహాయులకు అండదండలందించి జీవితాన్ని ధన్యం చేసుకున్న రతన్కు కొందరు కోరుకుంటున్నట్టు ‘భారతరత్న’ ప్రకటిస్తే అది ఆ అత్యున్నత పురస్కారానికి మరింత వన్నె తెస్తుంది. ఆ మహామనీషికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తున్నది. -
క్రీడల్లోనూ రతన్ ముద్ర
న్యూఢిల్లీ/ముంబై: భారత పారిశ్రామిక రంగంలోనే కాదు... క్రీడారంగంలోనూ ‘టాటా’ చెరగని ముద్ర వేసింది. స్వాతం్రత్యానికి పూర్వంలో భారత్ 1920లో అంట్వర్ప్ ఒలింపిక్స్కు టాటా గ్రూపే స్పాన్సర్గా వ్యవహరించింది. అప్పటి నుంచి క్రీడలపై కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తూనే వచ్చింది. రతన్ టాటా వచ్చాక ఇది మరింతగా పెరిగింది. జీవనశైలిలో క్రీడలు భాగమేనని రతన్ అనే వారు. ‘టాటా’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), టాటా స్టీల్ చెస్ ఇలా ఒకటేమిటి ఆర్చరీ, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్ ఫుట్బాల్), అథ్లెటిక్స్లలో రతన్ ఉదారత, దార్శనీయత, నిబద్ధత నిరుపమానమని పలువురు క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు. » 1991లో జేఆర్డీ టాటా స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పిన నాటి నుంచి ఫుట్బాల్, హాకీ, ఆర్చరీ, ఈక్వె్రస్టియన్, బాక్సింగ్, కరాటే, రాకెట్ స్పోర్ట్స్ ఇలా 19 క్రీడాంశాలకు ప్రసిద్ధ శిక్షణ సంస్థగా టాటా స్పోర్ట్స్ అకాడమీ ఎదిగిందని ఇందులో రతన్ పాత్ర చాలా కీలకమని అకాడమీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు అన్నారు. » 1924లో ఏర్పాటైన భారత ఒలింపిక్ సంఘానికి తొలి అధ్యక్షుడు సర్ దోరబ్జి టాటా కావడం విశేషం. నెదర్లాండ్స్లో జరిగే టాటా స్టీల్ చెస్ను కొందరు చెస్ దిగ్గజాలు ‘వింబుల్డన్ ఆఫ్ చెస్’గా అభివర్ణిస్తారు. 2007 నుంచి టాటా స్టీల్ సంస్థ స్పాన్సర్షిప్లోనే ఈ టోర్నీ జరుగుతోంది. స్వాతం్రత్యానంతరం పది మంది గొప్ప వాళ్ల జాబితాను తయారు చేస్తే అందులో రతన్ అగ్రస్థానంలో ఉంటారు. తన కోసం కాకుండా దేశం కోసం ఒక వ్యక్తి ఓ వ్యవస్థను ఎలా మార్చగలడో, ఓ పరిశ్రమను ఎలా సృష్టించగలడో నిరూపించిన దిగ్గజం రతన్ టాటా. గొప్ప మానవతావాది. మూగజీవాల పట్ల కారుణ్యం, సమాజం పట్ల బాధ్యత ఉన్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. నేను ఆయన్ని చాలాసార్లు కలిశాను. ఆయన చాతుర్యం అపారం. ఆయనెప్పుడు మన మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. దేశం కోసం ఆయనేం చేశాడో, భారత పారిశ్రామిక రంగాన్ని దశదిశలా వ్యాప్తిచేసిన ఆయన గురించి ఎంత చెప్పినా... వర్ణించినా తక్కువే –కపిల్దేవ్, భారత క్రికెట్ దిగ్గజం పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వానికి నిలువెత్తు రూపం రతన్ టాటా ఇక లేరనే వార్త అత్యంత విచారకరం. చెస్ టోర్నీ ఆయన ఎంతో చేశారు. టాటా స్టీల్ చెస్లో ఆడటమే గొప్ప గౌరవంగా భావించేలా ఆ టోర్నీని మార్చేశారు. –చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ శ్రీ రతన్ టాటా మరణవార్త నన్ను దుఃఖంలో ముంచేసింది. ఆయన దూరదృష్టి అద్భుతం. ఆయనతో నేను గడిపిన క్షణాలు, సంభాషణ జీవితంలో మరచిపోలేను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్థస్తున్నా. –ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా రతన్ టాటా చూపిన మార్గం, చేసిన దిశానిర్దేశం దేశం ఎప్పటికి మరచిపోదు. మేమంతా మిమ్మల్ని అనుసరిస్తాం. –బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రతన్ ఒక్క పారిశ్రామిక రంగానికే కాదు... భారత సమాజానికి ఎనలేని సేవలందించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. –దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే -
టేకోవర్ స్టోరీ: రతన్.. ఇక టాటా గ్రూప్ పగ్గాలు తీసుకుంటావా?
టాటా గ్రూప్ గౌరవ్ చైర్మన్ రతన్ టాటా అస్తమించారు. 86 ఏళ్ల వయసులో ఆయన లోకాన్ని వీడారు. జేఆర్డీ టాటా 1991 మార్చిలో టాటా గ్రూప్ పగ్గాలను రతన్ టాటాకు అప్పగించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ మరింత పెద్దదైంది. అయితే టాటా గ్రూప్ బాధ్యతలను రతన్ టాటా తీసుకోవాలని జేఆర్డీ టాటా ఎలా కోరారో తెలుసా?టాటా గ్రూప్నకు అధినేతగా వ్యవహరించిన ఆయన అసలు టాటా గ్రూప్ పగ్గాలను ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో చేపట్టారో ఒకసారి ఓ షోలో రతన్ టాటా వివరించారు. గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన తర్వాత జేఆర్డీ టాటా తనకు కంపెనీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.“మేము ఒక ఫంక్షన్ కోసం జంషెడ్పూర్లో ఉన్నాం. నేను వేరే పని మీద స్టుట్గార్ట్కు వెళ్లవలసి వచ్చింది. నేను తిరిగి వచ్చినప్పుడు ఆయనకు(జేఆర్డీ టాటా) గుండె సమస్య వచ్చిందని, బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఉన్నారని విన్నాను. ఆయన ఒక వారంపాటు అక్కడే ఉన్నారు. నేను రోజూ వెళ్లి చూసొచ్చేవాడిని. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులకు ఆఫీస్కి వెళ్లి కలిశాను” అంటూ రతన్ టాటా చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది..!"ఆయన్ను(జేఆర్డీ టాటా) ఎప్పుడు కలిసినా 'సరే, ఇంకేంటి?' అని అడిగేవారు. జే (జేఆర్డీ టాటా) నేను నిన్ను రోజూ చూస్తున్నాను. కొత్తగా ఏముంటుంది? అని నేను చెప్పావాడిని. 'సరే, నేను నీకు కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. కూర్చో. జంషెడ్పూర్లో నాకు జరిగిన సంఘటన (అనారోగ్యం) తర్వాత నేను తప్పుకోవాలనుకుంటున్నాను. (టాటా గ్రూప్ చైర్మన్గా) నా స్థానం నువ్వే తీసుకోవాలి' అన్నారు. అదే ప్రతిపాదనను బోర్డుకి తీసుకెళ్లారు(కొన్ని రోజుల తర్వాత)” అని టాటా గుర్తుచేసుకున్నారు. -
ఇకపై టాటా గ్రూప్ సారథులు వీరేనా..?
దేశంలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్టాటాకు పెళ్లి కాకపోవడంతో తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించేవారు లేకుండాపోయారు. దాంతో రతన్ టాటా తర్వాత దాదాపు రూ.30 లక్షల కోట్ల టాటా గ్రూప్ సంస్థలను ఎవరు ముందుకు తీసుకెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సామర్థ్యం ఎవరికి ఉందనే చర్చ కొనసాగుతుంది.అయితే తన ఫ్యామిలీకే చెందిన తన సోదరుడు నోయెల్టాటా కుమార్తెలు లేహ్, మాయా, కుమారుడు నెవిల్లీలకు రతన్ టాటా వ్యాపార మెలకువలు నేర్పినట్లు పలు సంస్థలు నివేదించాయి. టాటాగ్రూప్ను ముందుకు నడిపే సత్తా వారికి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కానీ సంస్థతో వారికున్న అనుబంధం, వారి నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు తెలిస్తే టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని తెలుస్తోంది.లేహ్ టాటానోయెల్ టాటా పెద్ద కుమార్తె.మాడ్రిడ్లోని ఐఈ బిజినెస్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తాజ్ హోటల్స్ రిసార్ట్స్ & ప్యాలెస్లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా తన కెరియర్ ప్రారంభించారు. సేల్స్ విభాగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.మాయా టాటాలేహ్ టాటా సోదరి మాయా టాటా.మాయా టాటా రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో తన కెరియర్కు మొదలుపెట్టారు. ఆమె పోర్ట్ఫోలియో మేనేజర్గా, ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజంటేటివ్గా పని చేశారు.యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. టాటా క్యాపిటల్, ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీలో కీలకస్థానంలో పనిచేశారు.టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయా ఉన్నారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడునెవిల్లే టాటానోయెల్ టాటా చిన్న కుమారుడు.నెవిల్లే టాటా కూడా బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ట్రెంట్ హైపర్మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్కు సారథ్యం వహిస్తున్నారు. ఇది టాటా గ్రూప్ బ్రాండ్లైన వెస్ట్సైడ్ , స్టార్ బజార్లకు మాతృసంస్థగా ఉంది. -
వర్షంలో తడిసిన ఆ నలుగురే ‘నానో’కు పునాది
రతన్ టాటాతోపాటు గతంలో సంస్థ పగ్గాలు చేపట్టిన సారథులు ఇండియాను ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా చూడాలనుకున్నారు. అందుకే పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎక్కువగా కృషి చేశారు. అందులో భాగంగానే రతన్ టాటా ‘నానో’ కారును విడుదల చేశారు. అయితే ఈ కారు ఆవిష్కరణకు పునాది ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకసారి రతన్టాటా తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక దంపతులిద్దరు, ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే..వెంటనే ఆయన పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా దాదాపు రూ.ఒక లక్ష ధర ఉండేలా ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు? అని భయపెట్టారు. కొంత మంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజినీర్లను పిలిపించారు. కానీ వారు లక్ష రూపాయల్లో కారుని తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా అంతటితో ఆగిపోలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ‘నానో’ను ఆవిష్కరించారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు విఫలమైంది. నానో కారు తయారుచేయడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల.ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. దాంతో మొత్తం ప్లాంట్ను పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్కు తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. -
‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’
రతన్ టాటా మృతిపట్ల ప్రముఖులు వివిధ మాధ్యమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ రతన్ టాటాతో చివరిసారిగా గడిపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆ వివరాలు పంచుకుంటూ టాటా మృతికి సంతాపం తెలియజేశారు.‘గూగుల్ క్యాంపస్లో రతన్ టాటాను చివరిసారి కలిసినప్పుడు ‘వేమో’(అధునాతన అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ) పురోగతి గురించి మాట్లాడాం. ఈ విభాగంలో ఆయన ఆలోచన విధానాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అసాధారణమైన వ్యాపార, దాతృత్వ వారసత్వం ఆయన సొంతం. భారతదేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో రతన్ టాటా కీలకపాత్ర పోషించారు. భారత్ను ఆర్థికంగా మరింత మెరుగుపరిచేందుకు ఆయన ఎంతో శ్రద్ధ చూపారు. అతని మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సుందర్ తెలిపారు.My last meeting with Ratan Tata at Google, we talked about the progress of Waymo and his vision was inspiring to hear. He leaves an extraordinary business and philanthropic legacy and was instrumental in mentoring and developing the modern business leadership in India. He deeply…— Sundar Pichai (@sundarpichai) October 9, 2024రతన్ టాటాపై ఇలోన్మస్క్టాటా ప్రపంచ ప్రఖ్యాత సంస్థల సారథులకు స్ఫూర్తిగా నిలిచారు. అమెరికన్ జర్నలిస్ట్ చార్లీ రోస్తో 2009లో ఇలోన్మస్క్తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా దూరదృష్టిని మస్క్ ప్రశంసించారు. ఇంటర్వ్యూలో భాగంగా భారతీయ మార్కెట్లో టాటా తక్కువ ధరకే కారు(నానో) అందిస్తున్నారని మస్క్ దృష్టికి తీసుకొచ్చారు. ‘రతన్ టాటా ఇండియాలో విప్లవాత్మక మార్పునకు తెరతీశారు. కేవలం రూ.ఒక లక్షకు కారు అందించడం గొప్ప విషయం. కారు సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే దూరదృష్టి టాటాది’ అని మస్క్ బదులిచ్చారు.He fulfilled his promise to build the world's cheapest car.- Ratan Tata wanted to build a car, which the middle class of India could afford and so he delivered on his promise and launched Tata Nano for just $1,200 (₹1 lakh) in 2008.- @ElonMusk also shared his views on the… pic.twitter.com/QqTY5KuQLK— Nico Garcia (@nicogarcia) August 26, 2024రతన్ టాటాపై బిల్ గేట్స్‘రతన్ టాటా దూరదృష్టి కలిగిన నాయకుడు, సామాన్యుల జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం ఎనలేనిది. అతడి వ్యక్తిత్వం భారతదేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. ప్రజలకు సేవ చేసేందుకు రతన్ టాటాతో కలిసి అనే సందర్భాల్లో వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. అతడి మరణం రాబోయే తరాలకులోటు. కానీ అతడు అనుసరించిన విలువలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’ అని బిల్గేట్స్ తెలిపారు.ఇదీ చదవండి: సినీనటి సంతాపం.. అప్పట్లో ఇద్దరి మధ్య ప్రేమ?మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, ముఖేష్ అంబానీ వంటి వ్యాపార ప్రముఖులు, రాజకీయ, సినీ దిగ్గజాలు ఆయనకు సంతాపం తెలిపారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో టాటా తుది శ్వాస విడిచారు. -
ఎన్సీపీఏకు రతన్ టాటా పార్దివదేహాం తరలింపు (ఫొటోలు)
-
రతన్ టాటాను చంపాలనుకున్నారట!
మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. వంటి లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు?టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్గా రతన్ టాటా ఎన్నో సేవలందించారు. గతంలో తాను సామాజిక మధ్యమంలో పంచుకున్న వివరాల ప్రకారం..కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ బెదిరించాడని, వేరే వాళ్లతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్నకు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు. రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్ స్టర్ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్ స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్స్టర్ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది. తలవంచని నైజంలేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో..దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడుచంపేందుకు పోటీదారులతో ఒప్పందంజైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన పోటీదారులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు రూ.లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. -
‘లేరని ఊహించుకోవడం చాలా కష్టం’
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. టాటా అస్తమయం ఆత్మీయులకు తీరనిలోటు. టాటా కన్నుమూశారనే వార్త విని ఒకప్పటి సినీనటి సిమి గరేవాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా నివాళులు అర్పించారు. గతంలో ఈమెతో రతన్టాటా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కాలంలో ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.సిమీ గరేవాల్ స్పందిస్తూ..‘మీరు వెళ్లిపోయారనే వార్త విన్నాను. మీ లేరని ఊహించుకోవడం చాలా చాలా కష్టం. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ద్వారా సంతాపం తెలిపారు. ఒక సమావేశంలో టాటా మాట్లాడుతూ తాను నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, పెళ్లికి దగ్గరగా వచ్చానని తెలిపారు. కానీ కొన్ని సంఘటనల వల్ల పెళ్లి చేసుకోలేదని చెప్పారు. ‘భార్య, కుటుంబం లేకపోవడంతో చాలాసార్లు ఒంటరిగా గడిపాను. కొన్నిసార్లు అందిరిలాగే భార్య, పిల్లలు, కుటుంబం ఉండాలని ఆశపడ్డాను. మరికొన్నిసార్లు వేరొకరిపై ఆధారపడడంతో వచ్చే ఆందోళనల గురించి చింతించకుండా స్వేచ్ఛగా ఉండాలని అనుకున్నాను’ అని చెప్పారు.They say you have gone ..It's too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024రతన్ టాటా అమెరికాలో ఉన్నపుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆమె భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి తనను కలవలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడుప్రజల సందర్శన కోసం టాటా భౌతికకాయంరతన్ టాటా భౌతికకాయానికి ప్రజలు నివాళులర్పించేందుకు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ)లో ఉంచనున్నారు . -
రతన్ టాటా విశిష్టతలు ఎన్నో... (ఫొటోలు)
-
బనీను ధరించి తలుపు తీసిన టాటా
రతన్టాటా చాలా సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతారు. టాటా నానో కారునే ఎక్కువగా వాడేవారట. ఆయన జీవితాన్ని చూసిన ప్రతిఒక్కరూ నిరాడంబరత నేర్చుకోవాల్సిందేనని పలువురు చెబుతారు. ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ!రతన్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ..‘సరైన నిర్ణయాలు’ తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేనొక నిర్ణయం తీసుకుంటాను. అది సరైనదే అయ్యేలా చేస్తాను. అంతే...’ అని అన్నారు. అందుకే కావొచ్చు, ఆయన హయాంలో టాటా గ్రూపు ఆదాయం 50 రెట్లు మించి పెరిగింది. ఇవాళ టాటా గ్రూపు విలువ దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేరుకుంది.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడురాజకీయాలకు దూరంగా..రాజకీయ రణరంగంలో రతన్ టాటా గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయనపై అస్త్రాలు సంధిస్తూ పార్టీలు పరస్పరం ఎన్నడైనా ఆరోపణలు చేసుకోవటం చూశామా? లేదుకదా. అదీ రతన్ టాటా ప్రత్యేకత. సంస్థ ఎదగడమే కాదు..అనేకమంది జీవితాల్లో వెలుగులు పంచాలన్నది ఆయన సిద్ధాంతం. టాటా గ్రూపు సంస్థలకు సామాజిక సేవంటే చాటింపు వేసుకుని మీడియాకు పోజులిచ్చే సందర్భం కాదు. నెరవేర్చి తీరాల్సిన పవిత్ర కర్తవ్యం. అందుకే ‘టాటా సన్స్’ ఈక్విటీల్లో 66 శాతం టాటా ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. వాటిపై వచ్చే డివిడెండ్లు నేరుగా ట్రస్టులు నిర్వహించే సేవాకార్యక్రమాలకు తోడ్పడతాయి. -
టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో
టాటా గ్రూప్ విస్తరణ ఎలా జరిగింది..? దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్ ఎలాంటి వ్యాపారం చేస్తోంది..? స్టీల్ నుంచి టీ వరకు, ఉక్కు నుంచి సాఫ్ట్వేర్ సేవల వరకు టాటా సంస్థలు ఎలాంటి వ్యాపారాలు సాగిస్తున్నాయో తెలియజేస్తూ ‘దిప్యామిలీకట్’ అనే యూట్యూబ్ ఛానల్ గతంలో ఒక వీడియోను విడుదల చేసింది. 2018లో విడుదల చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 15 లక్షల కంటే ఎక్కువ వ్యూసే వచ్చాయి. కంపెనీ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడు -
మంచితనంలో అపరకుబేరుడు
వ్యాపార దార్శనికుడుమనసున్న మారాజుసహనశీలి.. మూగ జీవాల ప్రేమికుడుఎందరో వ్యాపారులకు గురువుఅవమానాలను సైతం తట్టుకుని నిలబడిన సృష్టికర్తప్రేమ విఫలమైనా కుంగిపోని ఉక్కు మనిషికంపెనీలో 66 శాతం దాతృత్వానికే కేటాయించిన మేరునగంధనవంతుల జాబితాలో పేరు లేకపోయినా మంచితనంలో అపరకుబేరుడుఒక శకం ముగిసింది. వ్యాపారం సామ్రాజ్యంలో అంచెంలంచెలుగా ఎదుగుతూ రూ.10 వేలకోట్ల వ్యాపారాన్ని రూ.లక్షల కోట్లకు చేర్చిన దూరదృష్టి కలిగిన అజరామరుడు రతన్ టాటా ఇకలేరు. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ నావల్ టాటా(86) బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపించిన వ్యక్తి రతన్ టాటా. ఆయన గతకొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో సోమవారం ముంబయిలో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా చాలామంది తన ఆరోగ్యం గురించి పెద్ద సంఖ్యలో ఆరా తీశారు. వెంటనే సామాజిక మాధ్యమాల్లో స్పందించిన రతన్టాటా జనరల్ చెక్-ఆప్ కోసం ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. కాగా, బుధవారం రాత్రి ఆయన కన్నుముశారు.దేశంలోనే అతి పెద్ద కంపెనీలుగా పేరున్న రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ మూడు కలిపినా కూడా టాటా గ్రూప్ విలువతో సరితూగవు. అంత పెద్ద కంపెనీ అయినా ఏనాడూ ఆ సంస్థకు చెందిన ప్రముఖులు అత్యంత ధనవంతుల జాబితాలో లేరు. సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ గురించి, దాన్ని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం.టాటా కంపెనీ మొదట ఒక టెక్స్టైల్ మిల్గా ప్రారంభమైంది. జంషెడ్జీ టాటా ఈ గ్రూప్ను 1868లో ప్రారంభించారు. ఈ కంపెనీ తరతరాలుగా తమ వారసుల చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని ప్రారంభించింది టాటా సంస్థే. రెండో ప్రపంచ యుద్ధం తరువాత దాన్ని ఎయిరిండియా పేరుతో జాతీయం చేశారు. 2022లో ఎయిరిండియా సంస్థను టాటా తిరిగి దక్కించుకుంది. ఇదొక్కటే కాదు ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, దేశంలోనే మొదటగా తాజ్ హోటల్ను స్థాపించింది కూడా టాటా కంపెనీయే. ఇలా మన దేశానికి ఈ సంస్థ ఎన్నో కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది. దేశ నిర్మాణం, అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. టాటా గ్రూప్ సంస్థకు చాలా మంది సారథ్యం వహించినా రతన్ టాటాకు ప్రత్యేక స్థానం ఉంది.ఇదీ చదవండి: వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' అస్తమయంరతన్ టాటా డిసెంబర్ 28, 1937లో అప్పటికే దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీ టాటా రతన్ టాటాను ఇండియాకు వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇచ్చారు. దాంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.1991లో జేఆర్డీ టాటా రతన్ టాటాను టాటా గ్రూప్ ఛైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవంలేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్లందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. రూ.10 వేలకోట్లుగా ఉండే వ్యాపారాన్ని దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేర్చారు.ఇంత పెద్ద కంపెనీకి సారథ్యం వహిస్తున్నప్పటికీ రతన్ టాటా ప్రపంచంలో, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో ఏనాడూ స్థానం సంపాదించలేదు. ఎందుకంటే టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో దాదాపు 66% శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థలకే విరాళం ఇస్తున్నారు. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవ సంస్థలకు కాకుండా రతన్ టాటాకు చెందితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండేవారు.బ్రిటిష్ వారికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి..రతన్టాటా తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు..1998లో రతన్ టాటా, టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదట సంవత్సరం ఆశించినమేర విక్రయాలు జరగలేదు. దాంతో అందరూ టాటా ఇండికా విభాగాన్ని అమ్మేయాలని సలహా ఇచ్చారు. దాంతో ఫోర్డ్ కంపెనీని ఆశ్రయించారు. కార్ల తయారు చేయడం తెలయనప్పుడు ఎందుకు సాహసం చేయడమని అవమానించారు. క్రమంలో ఇండికాను లాభాలబాట పట్టించారు. యూరప్కు చెందిన కోరస్ స్టీల్ కంపెనీను కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్కు చెందిన టెట్లీ టీ కంపెనీను కొని ‘టాటా టీ’లో విలీనం చేశారు. దాంతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టీ కంపెనీగా టాటా ఎదిగింది. ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకుని టాటాను ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు రతన్ టాటా. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్లైతే భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వారికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.పెళ్లికి దూరంగా టాటా..రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన అమెరికాలో ఉన్నప్ప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.యువతంటే నమ్మకం..రతన్ టాటాకు యువత, వారి వినూత్న ఆలోచనలు, శక్తిని అమితంగా నమ్మేవారు. అందుకే స్నాప్డీల్, పేటీఎం, కార్దేఖో, బ్లూస్టోన్, ఓలా, షావోమీ..వంటి దాదాపు 39కి పైగా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడపెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాల్లో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. అందుకే భారతీయుల్లో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది.ప్రాణాలు కోల్పోయిన టాటా ఉద్యోగులు..నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ సొంతం. తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఏ ఉద్యోగి తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ హోటల్లోని సుమారు 1500 మందికి పైగా అతిథులను కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంతో మంది ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు. దీన్ని బట్టి టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో ప్రపంచానికి అర్థమైంది.విద్యార్థులకు స్కాలర్షిప్లు..టాటా ట్రస్ట్..దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది. ఇప్పటికి మన దేశంతో పాటుగా విదేశాల్లో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందిస్తున్నారు. తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన, చనిపోయిన కుటుంబాలకు రతన్టాటా ప్రత్యేకంగా సేవలందించారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకు రూ.300 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఒక భవనానికి గౌరవంగా ‘టాటా హాల్’ అని పేరు పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషంట్ల కోసం ఏకంగా రూ.1000 కోట్లు దానం చేశారు. కుక్కులు వంటి మూగ జీవాలపై అమిత ప్రేమను చూపించేవారు.ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరంచింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను వివిధ డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం గర్వించదగిన విషయం.వీటన్నిటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసులో నిలపడంలో 100 శాతం విజయాన్ని సాధించారు. డబ్బుపరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు. కానీ మంచితనంలో ఆయన అపరకుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరు ఇష్టపడే గౌరవించే బిజినెస్ మాన్గా రతన్ టాటా నిలిచిపోయారు. ఆయనకు ఇదే అశ్రునివాళి. -
Ratan Tata Photos: దివికేగిన వ్యాపార సామ్రాజ్యాధిపతి రతన్ టాటా...(ఫొటోలు)
-
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముక పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(86) ఇక లేరు. అనారోగ్యం కారణంగా ముంబైలోని బ్రీచ్కాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుదవారం రాత్రి ఆయన మరణించారు.1937 డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. గత కొంత కాలంగా రతన్ టాటా అనారోగ్యంతో బాదపడుతున్నారు. రతన్ టాటా మరణించినట్టు టాటా సన్స్ గ్రూప్ ప్రకటించింది. -
రతన్టాటా ప్రేమ విఫలం.. పెళ్లికి దూరం
టాటా సన్స్ ఛైర్మన్ రతన్టాటా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తీవ్ర ఆనారోగ్య పరిస్థితుల వల్ల రతన్టాటా ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో రతన్ టాటా స్పందించారు. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. జనరల్ చెక్-అప్ల కోసం హాస్పటల్కు వచ్చానని చెప్పారు. ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా ఉన్న టాటాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) టాటా గ్రూప్ను 1868లో 'జమ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా' (జంషెడ్జీ) ప్రారంభించారు. ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ.30 లక్షల కోట్ల పైమాటే.రతన్ టాటా 1937 డిసెంబరు 28న జన్మించారు.ఆయనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు.రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్కు వెళ్లారు.ఆయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా.రతన్ టాటా ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా అనే పుస్తకాలు రాశారు.86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. ప్రేమలో విఫలం అయ్యాక ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు.పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకు లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు.తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు.టాటాకు సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు.ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. దాంతో ధనవంతుల జాబితాలో ఉండలేకపోతున్నారు.ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. ఆయన గతకొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో సోమవారం ముంబయిలో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అందుకు సంబంధించిన వార్తలుకాస్తా వైరల్గా మారాయి. -
‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన అవసరం లేదు’
ఢిల్లీ : తాను అస్వస్థతకు గురయ్యానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా ఖండించారు. ఈమేరకు ఆయన ఓ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తాను ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి రతన్ టాటా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ప్రకారం.. రతన్ టాటా రక్తపోటు తగ్గడంతో ఆదివారం అర్థరాత్రి 12:30 నుండి 1:00 గంటల మధ్య టాటాను ఆయన కుటుంబ సభ్యులు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారని జాతీయ మీడియా కథనాలు, ట్వీట్లు వెలుగులోకి వచ్చాయి. Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024 ఆస్పత్రికి వచ్చిన వెంటనే టాటాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స అందిస్తున్నారని,ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని రతన్ టాటా ఖండించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తాను ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. దీంతో టాటా ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లైంది. -
మొరాకోలో టాటా డిఫెన్స్ ఫ్యాక్టరీ.. విదేశాల్లో స్వదేశీ బ్రాండ్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మొదటిసారి విదేశాల్లో డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. మొరాకోలోని కాసాబ్లాంకాలో కంపెనీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే విదేశీ గడ్డపై అడుగుపెట్టిన మొట్టమొదటి స్వదేశీ రక్షణ కర్మాగారంగా టాటా రికార్డ్ క్రియేట్ చేయనుంది.ఫ్యాక్టరీ ప్రారంభమైన తరువాత కంపెనీ మొదట రాయల్ మొరాకో ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్లను (WhAP) ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. ఆ తరువాత ఆఫ్రికన్ మార్కెట్ కోసం ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీ ఏడాది లోపల ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ కర్మాగారంలో ప్రతి ఏటా 100 యుద్ధ వాహనాలను ఉత్పత్తి చేయనుంది.టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో WhAPని అభివృద్ధి చేసింది. సైన్యం కోసం వాహనాలను ఎంపికచేసి ముందు.. ఆఫ్రికా ఎడారుల్లోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించారు. ఆ తరువాత టాటా గ్రూప్ మొరాకోలో సాయుధ వాహనాలను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది.ఇదీ చదవండి: అక్టోబర్లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ప్రస్తుతం టాటా మోటార్స్ భారత సైన్యం కోసం వాహనాలను తయారు చేస్తోంది. వీటిని మన ఆర్మీ ఇప్పుడు వినియోగిస్తుంది కూడా. అయితే ఈ వాహనాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ తయారు చేసే వాహనాలు చాలా దృడంగా ఉంటాయి. -
వామ్మో.. ఐఫోన్ 16 ని 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్న టాటా గ్రూప్
-
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్లో మూడు సంస్థల విలీనం పూర్తి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్లో (టీసీపీఎల్) మూడు అనుబంధ సంస్థల విలీన ప్రక్రియ పూర్తయింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ఇతరత్రా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావడంతో దీన్ని పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. విలీనమైన వాటిల్లో టాటా కన్జూమర్ సోల్ఫుల్, నరిష్ కో బెవరేజెస్, టాటా స్మార్ట్ఫుడ్జ్ ఉన్నాయి. వ్యాపారాన్ని క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు టీసీపీఎల్ తెలిపింది. టీసీపీఎల్కు రూ. 15,206 కోట్ల కన్సాలిడేటెడ్ టర్నోవరు ఉంది. టీ, కాఫీ, ఉప్పు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు, స్నాక్స్, మినీ మీల్స్ లాంటివి కంపెనీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. టాటా టీ, టెట్లీ, టాటా కాఫీ గ్రాండ్ తదితర కీలక బెవరేజ్ బ్రాండ్స్ను విక్రయిస్తోంది. -
టాటా.. గుడ్బై.. విస్తారా ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఇక కనుమరుగు కానుంది. నవంబర్ 12 నుంచి టాటా గ్రూప్లో భాగమైన మరో సంస్థ ఎయిరిండియాలో విలీనం కానుంది. విస్తారా సేవల నిలిపివేతకు నవంబర్ 11 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. నవంబర్ 12 లేదా ఆ తర్వాత చేసే ప్రయాణాలకు సంబంధించి సెపె్టంబర్ 3 నుంచి బుకింగ్స్ నిలిచిపోతాయని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత నుంచి తమ వెబ్సైట్లో బుకింగ్స్ అన్ని ఎయిరిండియా సైటుకు రీడైరెక్ట్ అవుతాయని పేర్కొంది. నవంబర్ 12 తర్వాత ప్రయాణాలకు బుక్ చేసుకున్నవారి ఫ్లయిట్ నంబర్లను సెపె్టంబర్లో దశలవారీగా ఆటోమేటిక్గా ఎయిరిండియాకు మారుస్తారు. కస్టమర్లకు ఆ వివరాలు తెలియజేస్తారు. మరింత విస్తృత నెట్వర్క్, విమానాలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ విలీనం తోడ్పడగలదని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. ఎయిరిండియాలో ఎస్ఐఏకి 25.1 శాతం వాటా.. విలీన డీల్లో భాగంగా ఎయిరిండియాలో రూ. 2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టే ప్రతిపాదనకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రక్రియ పూర్తి కావచ్చని సింగపూర్ ఎయిర్లైన్స్ తెలిపింది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కి 25.1 శాతం వాటా లభిస్తుంది. ఫిట్మెంట్ ప్రక్రియ ప్రారంభం.. ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియపై ప్యాసింజర్లకు స్పష్టతనిచ్చేందుకు ఇప్పటికే ఎఫ్ఏక్యూలను (సందేహాలు, సమాధానాలు) సిద్ధం చేశారు. అలాగే ఫిట్మెంట్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్గా విస్తారా 2015 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. విస్తారాకు 70 విమానాలు ఉండగా, 50 పైచిలుకు గమ్యస్థానాలకు సరీ్వసులు నిర్వహిస్తోంది. ఎయిరిండియాలో కంపెనీ విలీనాన్ని 2022 నవంబర్లో ప్రకటించారు. 2023 సెపె్టంబర్లో ఈ డీల్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. నష్టాల్లోనే కొనసాగుతున్న ఎయిరిండియా, విస్తారాలో 23,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా గ్రూప్ గొడుగు కింద ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
‘పది’ పాసైన మహిళలకు ‘టాటా’ ఉద్యోగం
టాటా గ్రూప్ 4000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకుంటామని ప్రకటించింది. తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ఉత్పత్తుల విడిభాగాల తయారీ, అసెంబ్లీ ప్లాంట్లలో పనిచేయడానికి ఉత్తరాఖండ్కు చెందిన మహిళలకు రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్ఏటీఎస్), నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఏపీఎస్) ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని టాటా గ్రూప్ తెలిపింది. ఈ మేరకు రిక్రూట్మెంట్ ప్రక్రియ గురించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రణాళిక విభాగానికి తెలియజేసింది. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి నేతృత్వంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు టాటా గ్రూప్ పేర్కొంది. ఈ డ్రైవ్లో ఎంపికయ్యే మహిళలు తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ప్లాంట్లలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పింది. తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని కోలార్ ప్లాంట్లపై టాటా ప్రత్యేకంగా దృష్టి సారించింది.ఇదీ చదవండి: డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్డ్రాఎన్ఏపీఎస్లో దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. 10, 12వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత సాధించినవారు ఎన్ఏటీఎస్కు అర్హులని కంపెనీ తెలిపింది. ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన వారిని షాప్ ఫ్లోర్ టెక్నీషియన్లుగా నియమిస్తారు. నిర్ణీత వేతనంతో పాటు అభ్యర్థులకు వసతి, ఆహారం, రవాణా సౌకర్యాలను అందిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. ఇదిలాఉండగా, త్వరలో కంపెనీలో చేరబోయే నాలుగు వేలమంది మహిళలతో టాటా ఉత్పాదకత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో రానున్న రోజుల్లో ఉత్పత్తులు పెరిగి మార్కెట్ డిమాండ్ తీరుతుంది. ఫలితంగా కంపెనీ రెవెన్యూ అధికమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
చేనేత పనితనాన్ని చూసే ఛాన్స్.. లైవ్లూమ్స్
విజయవాడ: చేనేత కళాకారుల పనితనం గురించి వినడమే కానీ... ప్రత్యక్షంగా చూసే అవకాశం అందరికీ కలగదు. ఈ నేపధ్యంలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బ్రాండ్ తనైరా.. చేనేత వస్త్రాల విక్రయ షోరూమ్స్లో లైవ్ లూమ్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిని ఇటీవలే విజయవాడలో ప్రారంభించి త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ సందర్భంగా తనైరా ప్రతినిధులు పంచుకున్న వివరాల ప్రకారం...వైభవానికి ప్రతీక..సంప్రదాయ దుస్తులలో తనదైన ప్రత్యేకత కలిగిన టాటా తనైరా. భారతీయ చేనేత వైభవాన్ని దశదిశలా విస్తరించాలని యోచిస్తోంది. మారుతున్న అభిరుచులు పెరిగిన సాంకేతికతో పోటీ పడలేక అంతరించే దశకు చేరిన ఎన్నో చేనేత కళారూపాలకు పునర్జీవనం పోసేందుకు కృషి చేస్తోంది. అలనాటి చేనేత వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేయటంతో పాటుగా ప్రాంతీయ అరుదైన పనితనంతో అద్భుతాలు అందదించడంలోని శ్రమను, సంక్లిష్టతను తెలియజెప్పేలా.. సంప్రదాయ నేత పద్ధతులతో కస్టమర్లను మళ్లీ అనుసంధానించడానికి తనైరా స్టోర్లలో ఈ లైవ్ లూమ్లని ఏర్పాటు చేసింది. ఇక్కడ, నైపుణ్యం కలిగిన నేత కార్మికులు తమ పనితనం, కళాత్మకతను కస్టమర్స్కి ప్రదర్శిస్తారు. ఉప్పాడ, మంగళగిరి, కలంకారి, ఇకత్లతో సహా గద్వాల్, నారాయణపేట, బనారస్, చందేరి, మహేశ్వర్ తదితర ప్రత్యేకమైన క్రాఫ్ట్ల కళాత్మక వైభవాన్ని మరింత అందంగా ప్రదర్శిస్తుంది.ఎనిమిదేళ్లుగా..తమ కార్యకలాపాలను 2017లో ప్రారంభించిన తనైరా, దేశవ్యాప్తంగా మహిళలను ఆకర్షిస్తూ రూ. 50,000 కోట్ల ఎత్నిక్ వేర్ మార్కెట్లో భారీ వాటాను సొంతం చేసుకుంది. స్థానిక కళాకారుల సహకారంతో సంప్రదాయ నేత పద్ధతులను పునరుద్ధరించడానికి ఈ బ్రాండ్ కట్టుబడి ఉంది, తద్వారా చేనేతల వారసత్వాన్ని కాపాడే పనిలో నిమగ్నమైంది. అరుదైన అంతగా తెలియని బాలుచారి, రంగకత్, వైరౌసి, పటాన్ పటోలా డోలీ బరాత్ వంటి విభిన్న శ్రేణి భారతీయ చేనేతలు సైతం తనైరా ఎంపికలో ఉన్నాయి.విపణిలో నిలిపేలా.. వీవర్శాలసాంప్రదాయ చేనేత పద్ధతులను సంరక్షించడంతో పాటు ఆధునీకరించే లక్ష్యంతో తనైరా గత 2022లో ’వీవర్శాల’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారణాసి, చంపా, కోయంబత్తూర్, బారుయ్పూర్, ఫులియా, మంగళగిరి లాంటి ప్రాంతాల్లో దాదాపు వంద మంది కళాకారులతో 20 వీవర్శాలలల ఏర్పాటు ద్వారా బహుళ తరాలకు చెందిన కళాకారులతో కలిసి పనిచేస్తోంది. -
నిజమవుతున్న రతన్ టాటా కల.. ఇక చైనా అవసరం లేనట్లే!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన తరువాత చాలా దేశాలు సెమీకండక్టర్ చిప్ కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' స్వదేశీ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు నిజం కాబోతోంది.భారతదేశంలో సెమీకండక్టర్ చిప్లను తయారు చేస్తే.. మన దేశం చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. రతన్ టాటా అనుకున్న విధంగానే చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మోరిగావ్ జిల్లాలోని జాగిరోడ్లో ప్లాంట్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమక్షంలో జరిగింది.అస్సాంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ. 27 వేలకోట్లు ఖర్చవుతుందని సమాచారం. నిర్మాణం పూర్తయిన తరువాత సుమారు 27000 కంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. సెమీకండక్టర్ తయారీలో అగ్రగామిగా ఉన్న చైనా మీద.. భారత్ ఆధారపడటం తగ్గుతుంది. దీనికోసం టాటా కంపెనీ కోట్లాది సెమీకండక్టర్లను తయారు చేయడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో భారత్ సెమికండక్టర్ చిప్ ఎగుమతిదారుగా కూడా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: తులం బంగారం కేవలం రూ.63.. మరి ఇప్పుడో..!టాటా సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ 2025 నాటికి సిద్ధమవుతుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన ఐదు నెలల వ్యవధిలోనే ప్లాంట్ నిర్మాణం ప్రారంభించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
బ్రిటిషర్లు కొట్టిన దెబ్బ! ‘టాటా’ సాహసోపేత నిర్ణయం..
భారతీయ పరిశ్రమ పితామహుడిగా భావించే జమ్షెడ్జీ టాటా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా భారతదేశ వ్యాపార ప్రపంచాన్ని మార్చిన జమ్షెడ్జీ టాటా బ్రిటిష్ పాలకులు కొట్టిన దెబ్బతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్లో తొలి సంస్థ మూతపడింది...1890లలో టాటా షిప్పింగ్ లైన్ను మూసివేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో వివరించారు. క్లిష్ట సమయంలో నష్టాలను తగ్గించుకోవడానికి, మరింత ఆచరణీయమైన వెంచర్లపై దృష్టి పెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో జమ్షెడ్జీ టాటా చతురతను ఈ వ్యూహాత్మక చర్య తెలియజేస్తుంది. టాటా గ్రూప్నకు చెందిన వెటరన్లు ఆర్ గోపాలకృష్ణన్, హరీష్ భట్ రాసిన "జమ్సెడ్జీ టాటా - పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్" అనే పుస్తకంలో అప్పటి పరిస్థితులను వివరించారు.అది 1880, 90ల కాలం. భారతదేశం నుంచి షిప్పింగ్లో ఇంగ్లండ్కు చెందిన P.&O సంస్థదే ఆధిపత్యం. ఆ గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ జమ్షెడ్జీ టాటా 'టాటా లైన్'ను ప్రారంభించారు. టాటా పేరును కలిగి ఉన్న మొదటి వ్యాపారం ఇదే. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం మద్దతుతో P.&O భారతీయ వ్యాపారులకు అధిక సరుకు రవాణా రేట్లు విధించింది. బ్రిటిష్, యూదు సంస్థలకు మాత్రం ఎక్కువ రాయితీలను అందించింది.టాటా లైన్ ప్రస్థానం..తన వస్త్ర వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని అనుభవించిన జమ్షెడ్జీ టాటా జపాన్లోని అతిపెద్ద షిప్పింగ్ లైన్ అయిన నిప్పాన్ యుసెన్ కైషా (NYK)తో కలిసి పనిచేయడానికి జపాన్కు వెళ్లారు. జమ్షెడ్జీ టాటా సమానమైన రిస్క్ తీసుకుని, నౌకలను స్వయంగా నిర్వహించినట్లయితేనే తమతో భాగస్వామ్యానికి ఎన్వైకే అంగీకరించింది. దీంతో టాటా 'అన్నీ బారో' అనే ఆంగ్ల నౌకను నెలకు 1,050 పౌండ్లకు అద్దెకు తీసుకున్నారు. ఇది 'టాటా లైన్'లో తొలి నౌక.తాను ప్రారంభించిన ఈ వ్యాపారం మొత్తం భారతీయ వస్త్ర పరిశ్రమకు షిప్పింగ్ రేట్లను తగ్గిస్తుందని, P.&O. గుత్తాధిపత్యాన్ని ఛేదించి టన్ను సరుకు రవాణాకు రూ. 19 నుంచి రూ. 12 వరకు తగ్గుతుందని జమ్సెడ్జీ విశ్వసించారు. అనతికాలంలోనే రెండవ ఓడ 'లిండిస్ఫార్న్'ను అద్దెకు తీసుకున్నారు. 1894 అక్టోబరులో ది ట్రిబ్యూన్ పత్రిక జమ్సెడ్జీ ప్రయత్నాలను ప్రశంసించింది.టాటా లైన్ వ్యాపారాన్ని దెబ్బకొట్టేందుకు P.&O సంస్థ ఎత్తుగడ వేసింది. టాటా లైన్, ఎన్వైకే షిప్లను ఉపయోగించని వ్యాపారులకు షిప్పింగ్ చార్జీని టన్నుకు 1.8 రూపాయలకు తగ్గిస్తామని ప్రకటించింది. దీంతోపాటు ఇలా అంగీకరించిన కొంతమంది వ్యాపారులకు ఉచితంగా రవాణాను కూడా అందించింది. 'లిండిస్ఫార్న్' నౌక పత్తి రవాణాకు పనికిరాదని పుకార్లు వ్యాప్తి చేసింది.క్రమంగా P.&O ప్రభావానికి భయపడి భారతీయ వ్యాపారులు టాటా లైన్తో వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నారు. టాటా లైన్ను మూసివేస్తే భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని హెచ్చరించినప్పటికీ వారు అర్థం చేసుకోలేదు. ఫలితంగా జమ్షెడ్జీ టాటా నష్టాలను చవిచూశారు. ప్రతి నెలా రూ. వేలల్లో నష్టాలు.. ధరల పోటీ ముగిసే సమయానికి టాటా లైన్లో రూ. లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత టాటా లైన్కు స్థిరమైన మార్గం లేదని నిర్ధారించుకున్న జామ్సెడ్జీ విజయవంతమైన వ్యాపారవేత్తగా తన ప్రతిష్టను పణంగా పెట్టి వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. లీజుకు తీసుకున్న ఓడలను ఇంగ్లండ్కు తిరిగి పంపించి టాటా లైన్ను ముగించేశారు. అయితే ఎంప్రెస్ మిల్స్, స్వదేశీ మిల్స్, అహ్మదాబాద్ అడ్వాన్స్ మిల్స్, టాటా స్టీల్ టాటా పవర్తో సహా జమ్షెడ్జీ టాటా స్థాపించిన అనే వ్యాపారాలు విజయవంతమయ్యాయి. -
టాటా స్టీల్.. 2,800 ఉద్యోగాలు కోత
టాటా స్టీల్ తన ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తామన్న ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. బ్రిటన్ తయారీ యూనిట్లోని ‘కార్బన్ ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్’ మూసివేత ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పింది. ఈమేరకు టాటా స్టీల్ గ్లోబల్ సీఈఓ టీవీ నరేంద్రన్ రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్రిటన్లోని టాటా స్టీల్ తయారీ ప్లాంట్లో ఉద్యోగులు కోత ఉండబోతుందని గతంలోనే ప్రకటించాం. ఆ ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదు. ఇప్పటికే ఒక కార్బన్-ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్ను మూసివేస్తున్నట్లు చెప్పాం. ఆమేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. స్టీల్ ముడిసరుకుగా ఉన్న ఐరన్ఓర్ ధరలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం లేదు. యూకే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపించాం. తయారీ యూనిట్లోని మరో బ్లాస్ట్ ఫర్నేస్ను సెప్టెంబర్లో మూసివేసేలా చర్చలు జరుగుతున్నాయి. రెండు ఫర్నేస్లు మూతపడడంతో సౌత్ వేల్స్లోని పోర్ట్ టాల్బోట్ యూనిట్లో 2,800 వరకు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగులు తొలగింపు అంశం యూనియన్లు, కంపెనీ, ప్రభుత్వం సమష్టి బాధ్యత. కేవలం కంపెనీ నిర్ణయాలే వాటిని ప్రభావితం చేయవు’ అని చెప్పారు.ఇదీ చదవండి: జులైలో పెరిగిన జీఎస్టీ వసూళ్లుబ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ జులైలో మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం టాటా స్టీల్ ప్రతినిధులతో చర్చించి ఉద్యోగులు కోతను నివారించేలా చర్యలు చేపడుతుందన్నారు. ప్లాంట్ నుంచి తక్కువ కార్బన్ విడుదలయ్యేలా అవసరమయ్యే సాంకేతిక సహాయం అందిస్తుందని చెప్పారు. ‘లోకార్బన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్’ను నిర్మించడంలో సహాయం చేయడానికి గత ప్రభుత్వం టాటా స్టీల్తో చేసుకున్న 500 మిలియన్ పౌండ్ (రూ.5,318 కోట్లు) ఒప్పంద ప్యాకేజీపై కొత్త ప్రభుత్వం సంతకం చేయాల్సి ఉంది. -
పారిశ్రామిక దిగ్గజం.. ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి
భారతీయ దిగ్గజ సంస్థ 'టాటా గ్రూప్' నేడు ఈ స్థాయిలో ఉందంటే దాని వెనుక ఎంతోమంది కృషి ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 'జేఆర్డీ టాటా' (జహంగీర్ రతన్జీ దాదాభోయ్ టాటా). 1904 జులై 29న జన్మించిన ఈయన సుమారు 53 సంవత్సరాలు టాటా గ్రూప్ సంస్థకు ఛైర్మన్గా ఉన్నారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే కంపెనీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.జేఆర్డీ టాటా ఛైర్మన్గా ఉన్న కాలంలోనే టీసీఎస్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టైటాన్ వంటి విజయవంతమైన వెంచర్లతో సహా 14 కొత్త కంపెనీలను ప్రారంభించారు. అంతే కాకుండా 1956లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) తరహాలో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (TAS)ని స్థాపించారు.జేఆర్డీ టాటా సంస్థలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం విరివిగా విరాళాలు అందించారు. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని అనే భావన ప్రవేశపెట్టిన ఘనత జేఆర్డీ టాటా సొంతం. అంతే కాకుండా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య సేవలు, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ప్రారంభించారు. ప్రమాదాల సమయంలో కార్మికులకు నష్టపరిహారం అందించే విధానం కూడా ఈయనే మొదలుపెట్టారు.1936లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) స్థాపించారు. ఆ తరువాత 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR), నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా స్థాపించారు. 1968లో టాటా కంప్యూటర్ సెంటర్గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్థాపించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. ఆ తరువాత 1987లో టైటాన్ను స్థాపించారు.15 సంవత్సరాల వయసులోనే ఫైలట్ కావాలని, విమానయాన రంగంలో వృత్తిని కొనసాగించాలని నిశ్చయించుకున్న జేఆర్డీ టాటా 24 ఏళ్ల వయసులో ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. దీంతో ఈయన భారతదేశంలో మొట్టమొదటి ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత టాటా ఎయిర్ సర్వీస్ ప్రారంభించారు. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే చివరికి ఈ సంస్థ మళ్ళీ ఎయిర్ ఇండియాగా టాటా గ్రూపులోకే వచ్చింది.టాటా గ్రూప్ అభివృద్ధికి మాత్రమే కాకుండా.. ఉద్యోగుల జీవితాల్లో కూడా మార్పులు తీసుకువచ్చిన జేఆర్డీ టాటా 1993 నవంబర్ 29న జెనీవాలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. పారిశ్రామిక రంగంలో ఈయన చేసిన కృషికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రధానం చేసింది. దీంతో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన ఏకైక పారిశ్రామికవేత్తగా జేఆర్డీ టాటా చరిత్ర సృష్టించారు. -
ఈపీఎఫ్ఓ-టాటా మోటార్స్ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో విచారణ
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఉద్యోగుల భవిష్య నిధిని ఈపీఎఫ్ఓకు బదిలీ చేసే అంశంపై చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. గతంలో కంపెనీ చెల్లించిన ఈపీఎఫ్ఓ పెన్షన్ ఫండ్ను తిరిగి సంస్థ అకౌంట్లో జమ చేయాలని కోరుతుంది. అయితే సంస్థలోని ఉద్యోగులు, కంపెనీ ఆర్థికస్థితికి సంబంధించి వివరణాత్మక డాక్యుమెంటేషన్ సమర్పించాలని ఈపీఎఫ్ఓ తెలిపింది. దీనిపై ఇరు సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టులో ఆగస్టు 8న విచారణ జరగనుంది.టాటా మోటార్స్ 2019-20, 2020-21, 2021-22 వరుసగా మూడు సంవత్సరాలు నష్టాలను చవిచూసింది. దాంతో యాక్చురియల్ వాల్యుయేషన్(ఆస్తులు, ఖర్చులను పోల్చి చూసే విశ్లేషణ పత్రం) ద్వారా పెన్షన్ ఫండ్ చెల్లింపులను రద్దు చేయాలని కోరింది. 2019లో కంపెనీ మినహాయింపు పొందిన పెన్షన్ ఫండ్ను సరెండర్ చేయడానికి ఈపీఎఫ్ఓకు దరఖాస్తు చేసింది.ఇదీ చదవండి: నిఫ్టీ 25,000 పాయింట్లకు..?భవిష్య నిధికి సంబంధించిన కార్పస్ బదిలీకి ఈపీఎఫ్ఓ అంగీకరించింది. కానీ, అధికారులు పెన్షన్ స్కీమ్ వివరాలను కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల పెన్షన్ కార్పస్కు సంబంధించిన పత్రాలు, రికార్డులు, ఇతర సమాచారాన్ని అందించాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది. గతంలో కంపెనీ సమర్పించిన నగదు బదిలీని అనుమతించడానికి అవసరమయ్యే నిర్దిష్ట ఖాతాల సమాచారం అస్పష్టంగా ఉందని పేర్కొంది. ఈ అంశం ఆగస్టు 8న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. -
ఎయిరిండియాలో కొత్తగా నారోబాడీ ఎయిర్క్రాఫ్ట్
ప్రీమియం ఎకానమీ సీట్లు కలిగిన ‘ఏ320 నియో’ నారోబాడీ(వెడల్పు తక్కువగా ఉండే) విమానం ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్ల్లోకి చేరింది. ఫ్రాన్స్లోని ఎయిర్బస్ సంస్థ దీన్ని రూపొందించినట్లు ఎయిరిండియా తెలిపింది. ఇటీవలే ఇది దిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి.ఎయిరిండియా తెలిపిన వివరాల ప్రకారం..ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్కు భిన్నంగా, సరికొత్త లివరీ(ఇంటెరియర్ డిజైన్)తో ఈ విమానాన్ని తయారుచేశారు.ఇదీ చదవండి: ‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ఎయిరిండియా సంస్థ తిరిగి టాటా గ్రూప్ అధీనంలోకి వచ్చాక కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. విమానాల ఆధునికీకరణ ప్రారంభమైంది. కొత్త విమానాలను కొనుగోలు చేస్తామని, ఉన్నవాటిలో సదుపాయాలను మెరుగుపరుస్తామని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దేశీయంగా టైర్ 2, టైర్ 3 నగరాలకు విమాన సర్వీసులు అందించాలని ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. దాంతో విమానయాన కంపెనీలు అందుకు అవసరమయ్యే ఎయిర్క్రాఫ్ట్లను సమకూర్చుకుంటున్నాయి. దేశీయ మార్గాల్లో ఎయిరిండియా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఏ320 నియో’ నారోబాడీ విమానాన్ని వచ్చే నెల నుంచి నడపనుంది. -
భారత్లోనే విలువైన బ్రాండ్
భారత్లో అత్యంత విలువైన బ్రాండ్ల్లో టాటా గ్రూప్ టాప్లో నిలిచింది. ఈ మేరకు బ్రాండ్ ఫైనాన్స్ తాజాగా విడుదల చేసిన విలువైన బ్రాండ్ ర్యాంకింగ్స్ టైటిల్ను టాటా గ్రూప్ దక్కించుకుంది. డిజిటలైజేషన్, ఈ-కామర్స్, ఈవీ, ఎలక్ట్రానిక్స్..వంటి రంగాలపై దృష్టి సారించిన ఈ సంస్థ బ్రాండ్ విలువ గతంలో కంటే 9 శాతం పెరిగి 28.6 బిలియన్ డాలర్ల(రూ.2.3 లక్షల కోట్లు)కు చేరుకుంది. గతేడాది ఈ టైటిల్కు దక్కించుకున్న టాటా గ్రూప్ ఈసారీ తన స్థానాన్ని నిలుపుకుంది.బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం..దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూప్ టాప్లో నిలిచింది. 14.2 బిలియన్ డాలర్ల(రూ.1.18 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ మూడో స్థానం (రూ.86 వేలకోట్లు) సాధించింది. గతేడాదిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం అవ్వడంతో ఈ స్థానం దక్కింది. ఎల్ఐసీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ గ్రూప్, ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, లార్సెన్ & టూబ్రో, మహీంద్రా బ్రాండ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ సావియో డిసౌజా మాట్లాడుతూ..‘టాటా గ్రూప్ దాని అనుబంధ సంస్థల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తోంది. వ్యూహాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్షిప్లు, ఎయిరిండియా వంటి కంపెనీ వాటాను సొంతం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ డొమైన్లో ప్రత్యేకత చాటుకుంటోంది. దాంతో కంపెనీ వినియోగదారులకు మరింత చేరువైంది. భారత్లోనే అత్యంత విలువైన బ్రాండ్గా స్థానం సంపాదించింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అత్యంత ధనవంతులపై ‘సంపద పన్ను’..?రంగాల వారీగా చూస్తే టెలికాం రంగం తన బ్రాండ్ విలువలో గతంలో కంటే 61 శాతం వృద్ధి సాధించింది. బ్యాంకింగ్ 26 శాతం, మైనింగ్, ఇనుము, ఉక్కు రంగాలు 16 శాతం చొప్పున వృద్ధి నమోదు చేశాయి. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో వెస్ట్సైడ్ బ్రాండ్(టాటా గ్రూప్- 122 శాతం వృద్ధి) అగ్రస్థానంలో ఉంది. -
ఎయిరిండియా భోజనంలో మెటల్ బ్లేడ్..!
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా విమానంలో ఏర్పాటుచేసిన భోజనంలో మెటల్ బ్లేడ్ గుర్తించినట్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కంపెనీ వర్గాలు స్పందిస్తూ ఘటనను ధ్రువీకరించాయి.ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ..‘మా విమానంలో ఒక ప్రయాణికుడి భోజనంలో మెటల్ వస్తువు గుర్తించారు. దానిపై వెంటనే దర్యాప్తు జరిపాం. కూరగాయలు కట్ చేసేందుకు ఉపయోగించే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఆ మెటల్ వస్తువు వచ్చినట్లు తెలిసింది. మా క్యాటరింగ్ భాగస్వామి సదుపాయాలు, పరిసరాలను నిత్యం తనిఖీ చేయడంతో పాటు, ముఖ్యంగా ఏదైనా గట్టి కూరగాయలను తరిగే క్రమంలో జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతామని హామీ ఇస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్.. కారణం..ఇటీవల ఎయిరిండియా విమానయాన సంస్థలో సరిగా ఉడకని ఆహారం తనకు ఇచ్చారని, సీటు సరిగాలేదని మరో ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం..న్యూదిల్లీ నుంచి నెవార్క్ వెళ్లేందుకు ఎయిర్ఇండియాలో ప్రయాణించాలని నిర్ణయించుకుని బిజినెస్క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. విమానం టేకాఫ్ అయిన దాదాపు 30 నిమిషాల తర్వాత పడుకోవాలనుకున్నాడు. దాంతో సీటును ఫ్లాట్బెడ్(పడుకునేందుకు వీలుగా)మోడ్కు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దాంతో తీవ్ర నిరాశకుగురైనట్లు ప్రయాణికుడు చెప్పాడు. దాంతోపాటు అదే విమానంలో సరిగా ఉడకని ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నాడు. -
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్పూర్లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్పూర్లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
టైమ్ జాబితాలో రిలయన్స్, టాటా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. 2024కి గాను ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీలతో టైమ్ దీన్ని రూపొందించింది. ఈ లిస్టులో రిలయన్స్ చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. 2021లో కూడా ఈ జాబితాలో రిలయన్స్ ఉంది. కంపెనీలను అయిదు విభాగాలుగా వర్గీకరించగా టైటాన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటాలను టైమ్ చేర్చింది. పయొనీర్స్ కేటగిరీలో సీరమ్ ఉంది. 58 ఏళ్ల క్రితం టెక్స్టైల్, పాలీయెస్టర్ కంపెనీగా ఏర్పాటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిందని టైమ్ పేర్కొంది. 1868లో ప్రారంభమైన టాటా గ్రూప్.. సాల్ట్ (ఉప్పు) నుంచి సాఫ్ట్వేర్ వరకు వివిధ రంగాల్లో విస్తరించిందని తెలిపింది. 2023లో ఐఫోన్లను అసెంబుల్ చేసే తొలి భారతీయ కంపెనీగా నిలి్చందని వివరించింది. అటు సీరమ్ ఏటా 3.5 బిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వేక్సిన్ల తయారీ సంస్థగా ఉందని టైమ్ పేర్కొంది. -
టాటా గ్రూప్లో ఆశా కిరణం లియా టాటా!
పెదనాన్న రతన్ టాటా బాటలో టాటా గ్రూప్ లో తనదైన ముద్ర వేస్తున్నారు లియా టాటా. రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా పెద్ద కుమార్తె ఈ లియా టాటా. మంచి విద్యా నేపథ్యం, బిజినెస్ కెరియర్తో దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.విద్యా నేపథ్యంటాటా గ్రూప్లో తనదైన అద్భుత కెరీర్ను ఏర్పరుచుకుంటున్న లియా టాటాకు బలమైన విద్యా నేపథ్యం ఉంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని ప్రతిష్ఠాత్మక ఐఈ బిజినెస్ స్కూల్ లో మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె కార్పొరేట్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను సమకూర్చుకున్నారు.తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా 2006లో తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించారు లియా టాటా. కొన్నేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తాజ్ హోటల్స్ లో డెవలప్ మెంట్ అండ్ ఎక్స్ టెన్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హోటల్ కంపెనీలో భాగమైన లగ్జరీ హోటల్ చైన్ వృద్ధి, వ్యూహాత్మక కార్యక్రమాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు.టాటా గ్రూప్లో కీలక పాత్రఇండియన్ హోటల్ కంపెనీలో అంతర్భాగమై, దాని కార్యకలాపాలు, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు లియా టాటా. ఈ ఇండియన్ హోటల్ కంపెనీ ప్రఖ్యాత తాజ్ హోటల్స్తో సహా టాటా గ్రూప్ హోటళ్ళ విస్తృతమైన నెట్వర్క్ను నిర్వహిస్తుంది. బ్రాండ్ శ్రేష్ఠత, ఆతిథ్యం వారసత్వాన్ని కొనసాగించడంలో లియా టాటా కృషి గణనీయంగా ఉంది.తాజ్ హోటల్స్ లో బాధ్యతలతో పాటు, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధనకు అంకితమైన టాటా గ్రూప్ విభాగమైన టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో కూడా లియా టాటా కొనసాగుతున్నారు. 2022 నవంబర్లో జరిగిన ఈ నియామకం ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన దశ. సంస్థలో క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకుంటున్న లియా టాటాకు ఆమె వృత్తిపరమైన ప్రయాణానికి రతన్ టాటా మార్గనిర్దేశం చేస్తున్నారు. -
నిమిషానికి 90 టీ-షర్ట్స్ సేల్.. దూసుకెళ్లిన అమ్మకాలు
టాటా గ్రూప్ ఫ్యాషన్ చైన్ జూడియో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నిమిషానికి 90 టీ-షర్టులు, 17 లిప్స్టిక్లను విక్రయించినట్లు మాతృ సంస్థ ట్రెంట్ తన వార్షిక నివేదికలో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.జూడియో ప్రతి నిమిషానికి 20 డెనిమ్లు విక్రయిస్తూ.. యువ కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రెంట్ ఆదాయం 36.1 మిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. అంతే కాకుండా సంస్థ కొత్తగా మరో 46 నగరాల్లో స్టోర్స్ ప్రారంభించింది.2016లో ప్రారంభించిన జుడియోకి 2024 మార్చి నాటికి 161 నగరాల్లో 545 స్టోర్స్ ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 86 జూడియో ఔట్లెట్లు, గుజరాత్లో 82 ఉన్నాయి. కర్ణాటకలో 58, ఢిల్లీలో 14 ఔట్లెట్లు జూడియోకు ఉన్నాయని మే 18న విడుదల చేసిన నివేదిక పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కింలలో ఒక్కో స్టోర్ ఉన్నాయి. కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసి.. కస్టమర్లకు చేరువ్వడం వల్ల అమ్మకాలు పెరుగుతున్నాయని సంస్థ తెలిపింది. -
ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
ఎయిరిండియా విమానంలో సౌకర్యాలపై ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. అకల్ ధింగ్రా న్యూయార్క్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియాలో విమానంలో ప్రయాణించారు. ప్రయాణంలో తాను ఆహారం, చైర్లు ఇతర సదుపాయాలపై అసౌకర్యానికి గురయ్యాడు. మరో నెలలో ఢిల్లీ నుంచి న్యూయార్క్కు వెళుతున్నానని, పొరపాటున కూడా ఎయిరిండియా విమానం ఎక్కబోనంటూ ఆ వీడియోలో తెలిపాడు.అకల్ ధింగ్రా వీడియోలో స్లైడింగ్ టేబుల్ సరిగా పనిచేయకపోవడం, దెబ్బతిన్న హెడ్ఫోన్ జాక్ వంటి అనేక సమస్యల్ని ఎత్తి చూపాడు. విమానంలో అందించిన ఆహారం కూడా నాణ్యతగా లేదని కూడా చెప్పాడు. చివరగా.. ‘న్యూయార్క్ నుండి ఢిల్లీకి నా ఎయిర్ ఇండియా విమానం విపత్తు!’ అని వీడియో క్యాప్షన్లో జతచేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఎయిరిండియా విమాన ప్రయాణంలో తమకు చేదు అనుభవాలున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akul Dhingra (@akuldhingra) -
పదేళ్లలో ఫస్ట్టైమ్! టీసీఎస్ను మించిన మరో టాటా కంపెనీ..
టాటా గ్రూప్లోని కంపెనీలన్నింటిలో అత్యంత లాభదాయక కంపెనీగా ఉన్న దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను మరో టాటా కంపెనీ అధిగమించింది. ఇలా జరగడం గత పదేళ్లలో ఇదే తొలిసారి.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.17,407 కోట్ల నికర లాభంతో టాటా మోటార్స్ టీసీఎస్ నికర లాభం రూ.12,434 కోట్లను అధిగమించింది. టాటా మోటార్స్ లాభం ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.5,407.79 కోట్లు ఉండగా ఈ ఏడాది ఏకంగా 221.89 శాతం పెరిగింది. మరోవైపు టీసీఎస్ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.11,392 కోట్ల నుంచి 9.1 శాతం వృద్ధిని సాధించింది.టాటా మోటర్స్ చివరిసారిగా 2014 జూన్ త్రైమాసికంలో టాటా గ్రూప్లో అత్యంత లాభదాయకమైన కంపెనీ స్థానాన్ని ఆక్రమించింది. అయితే గ్రూప్లోని మరో పెద్ద కంపెనీ టాటా 2024 క్యూ4 ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. టాటా మోటార్స్ టీసీఎస్ త్రైమాసిక లాభాలను అధిగమించినప్పటికీ , వార్షిక ప్రాతిపదికన టాటా గ్రూప్లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా టీసీఎస్ కొనసాగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ మొత్తం లాభం రూ.45,908 కోట్లు కాగా టాటా మోటార్స్ మొత్తం లాభం రూ.31,399 కోట్లు. -
ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్ర క్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఇ రు సంస్థలకు చెందిన 7 వేల మంది ఉద్యోగుల ఫిట్ మెంట్ (ప్రస్తుత ఉద్యోగులను విలీన సంస్థలో వారికి అప్పగించే బాధ్యతలు) ప్రక్రియ జూన్ కల్లా పూర్తి కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రెండు సంస్థల ఉద్యోగులతో దాదాపు గంటన్నర పా టు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయాలు వి వరించినట్లు పేర్కొన్నాయి. ఇరు కంపెనీల్లో ప్రస్తుతం 23,500 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో తమకు జాయింట్ వెంచరుగా ఉన్న విస్తారను, ఎయిరిండియాను విలీనం చేయనున్నట్లు 2022 నవంబర్లో ప్రకటించింది. ఈ డీల్ పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ కు 25.1% వాటా ఉంటుంది. అలాగే ఎయిరిండియా అతి పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది. -
సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముకుమ్మడిగా సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగులను తొలగించింది. సెలవు అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఉద్యోగులు విధులకు రాకపోవడంతో బుధవారం సంస్థ దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.‘సిక్లీవ్ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్ లేటర్లో కంపెనీ తెలిపింది.బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..ఇదిలాఉండగా, ఎయిరిండియా వైఖరిపట్ల సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను ఎయిర్ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు లేఖ రాసింది. -
ఎయిరిండియాలో ఆకస్మిక సమ్మె
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్ క్రూలోని 200 మందికి పైగా సిబ్బంది మంగళవారం రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామంతో ఎయిరిండియా 100 వరకు దేశీయ, అంతర్జాతీయ సరీ్వసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా, కోచి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సరీ్వసుల రద్దు విషయం కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో తెలిపారు. దీంతో, వారు ఎయిరిండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. వేసవి రద్దీ దృష్ట్యా మార్చి చివరి వారం నుంచి రోజూ 360 సరీ్వసులను నడుపుతోంది. టాటా గ్రూప్నకే చెందిన విస్తారాను ఎయిరిండియాతో, అదేవిధంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను ఏఐఎక్స్ కనెక్ట్తో విలీనం చేయాలన్న నిర్ణయం క్యాబిన్ క్రూలోని సీనియర్ల అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు. నిర్వహణ లోపం సీనియర్ ఉద్యోగుల నైతికతను దెబ్బతీసిందని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. విమాన సర్వీసుల రద్దుపై బుధవారం కేంద్ర పౌరవిమాన యాన శాఖ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ నుంచి వివరణ కోరింది. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. రద్దయిన సరీ్వసులకు టిక్కెట్ చార్జీలను వాపసు చేస్తామని, కోరిన పక్షంలో మరో తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తామని వివరించారు. -
భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ భారత్లో కార్యకలాపాలపై ఆసక్తిగా ఉందని తెలుస్తుంది. తాజాగా ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ సరఫరా చేసేందుకు భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ తయారీకి టాటా గ్రూప్నకు చెందిన టైటాన్ కంపెనీతో, మురుగప్ప గ్రూప్తో యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే కుపెర్టినో కంపెనీ తన కార్యకలాపాలను చైనాతోపాటు భారత్లో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కుపెర్టినో కంపెనీ చైనాలో ఐఫోన్ కెమెరాలను తయారుచేస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి మరో 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. టైటాన్ గడియారాలు, ఇతర ఆభరణాల తయారీలో ప్రత్యేకత చాటుకుంటోంది. చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న మురుగప్ప గ్రూప్నకు ఇంజినీరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్స్ రంగంలో 100 ఏళ్ల అనుభవం ఉంది. ఈనేపథ్యంలో ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని నోయిడాకు చెందిన కెమెరా మాడ్యూల్ తయారీ సంస్థ మోషిన్ ఎలక్ట్రానిక్స్లో మురుగప్ప గ్రూప్ 76% వాటాను కొనుగోలు చేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న టైటాన్ కంపెనీ ఇంజినీరింగ్, ఆటోమేషన్లో సేవలందిస్తోంది. హై ప్రెసిషన్ కాంపోనెంట్ తయారీ, ఇంజినీరింగ్ డిజైన్ సర్వీస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లోను సేవలందిస్తోంది. యాపిల్ జనవరి నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్లో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ఐఫోన్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో స్థానికంగా ఆ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఇండియాలో తయారవుతున్న దాదాపు 70 శాతం ఐఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచంలోని రద్దీ ఎయిర్పోర్ట్ల్లో భారత విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా యాపిల్ భారత్లో తయారీకి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. -
ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం
టెస్లా తన కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈమేరకు కొన్ని వార్తామీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. కొన్నినెలల కొందట టాటా గ్రూప్ సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్ తయారీ నేపథ్యంలో టాటాగ్రూప్ గ్లోబల్ క్లయింట్లను సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగా టెస్లాతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టెస్లా భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఈవీపాలసీ నిబంధనలతో దాదాపు ఆ సంస్థ భారత్ ప్రవేశానికి లైన్ క్లియరైంది. ఈ తరుణంలో ఇండియాలో తమ తయారీ ప్లాంట్ పెట్టేందుకు టెస్లా సిద్ధపడుతోందని తెలిసింది. ఈనెల 21న ఎలొన్మస్క్ ఇండియా రానున్నారు. ఈమేరకు దానిపై కీలక నిర్ణయం వెలువడనుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ తప్పు చేస్తాం..’ 10వేల డాలర్లు ఆఫర్.. ఈ పరిణామాల నేపథ్యంలో టాటాగ్రూప్ టెస్లాతో సెమీకండక్టర్ల విషయంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరు కంపెనీల మధ్య ఎంత విలువ చేసే డీల్ కుదిరిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మస్క్ భారత్ పర్యటనలో భాగంగా దాదాపు 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అమెరికన్ ఈవీ దిగ్గజ సంస్థ దేశంలో తమ ఉత్పత్తుల తయారీకోసం రిలయన్స్తో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. -
Tata Group: ఇన్వెస్టర్లకు పండగే.. టాటా గ్రూప్ నుంచి వరుస ఐపీఓలు
-
ఫుడ్ డెలివరీలోకి టాటా న్యూ
ముంబై: టాటా గ్రూప్ రూపొందించిన మలీ్టపర్పస్ సూపర్ యాప్ టాటా న్యూ వచ్చే ఏడాది రెండో వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో డిజైన్ను సరికొత్తగా మార్చే యోచనలో ఉంది. అంతేకాకుండా ఆన్లైన్ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)ను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాల ప్రకారం సాంకేతిక అంశాల కారణంగా యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ)ను బ్లాక్ నుంచి వైట్ బ్యాక్గ్రౌండ్లోకి మార్చనుంది. 2022 ఏప్రిల్ 7న టాటా గ్రూప్ సూపర్ యాప్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత క్లోజ్డ్ యూజర్ గ్రూప్తో టాటా న్యూ యాప్ ప్రారంభంకాగా.. రెండు నగరాల(బెంగళూరు, ఢిల్లీ)కే పరిమితమైంది. ప్రస్తుతం ఓఎన్డీసీతోపాటు మ్యాజిక్పిన్ సహకారం ద్వారా ఫుడ్ డెలివరీ సరీ్వసులను ప్రవేశపెట్టనుంది. గతేడాది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా మ్యాజిక్పిన్ ఫుడ్ ఆర్డర్లు రెట్టింపయ్యాయి. కాగా.. గత నెలలో కొత్త సీఈవోగా సీఈవో నవీన్ తహిల్యానికి బాధ్యతలు అప్పగించడంతోపాటు పలు మార్పులకు టాటా న్యూ తెరతీసింది. వివిధ బిజినెస్ చీఫ్లతో నవీన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పరిస్థితులపై ఉద్యోగులతో సర్వే చేపట్టారు. -
Ratan Tata Photos: ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా టాటా.. మరెన్నో ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
ఐకానిక్ భవనాన్ని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎందుకంటే..
ఎయిరిండియాకు చెందిన ముంబయిలోని ప్రతిష్ఠాత్మక ఐకానిక్ భవనం యాజమాన్య హక్కులను మహారాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఈ భవనాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,601 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో దక్షిణ ముంబయిలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న ఎయిరిండియా భవనం యాజమాన్య హక్కులను కేంద్రం.. మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆస్తుల బదిలీకి తాజాగా ఆమోదం తెలిపింది. 1970ల్లో కేవలం ఈ భవనంలోని ఎలివేటర్ను ఎక్కడం కోసమే ప్రజలు క్యూ కట్టేవారట. జేఆర్డీ టాటా ఆలోచనలకు తగ్గట్లుగా న్యూయార్క్ ఆర్కిటెక్ట్ జాన్ బర్గీ డిజైన్ చేసిన ఈ 23 అంతస్తుల భవనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకుంది. దీన్ని సచివాలయంలోని కొన్ని విభాగాల కోసం ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. కంపెనీ బకాయిపడిన రూ.298.42 కోట్లను మాఫీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఇదీ చదవండి: ‘రాజకీయంగా దాడి చేశారు.. వారు దెబ్బతినడం బాధించింది’ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎయిరిండియాను టాటాలకు విక్రయించినప్పుడు ఎయిర్లైన్స్కు చెందిన నాన్-కోర్ ఆస్తుల్ని అందులో చేర్చలేదు. దీంతో సంస్థకు చెందిన భూమి, భవనాలు వంటి రూ.14,718 కోట్ల విలువైన వాటిని ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ కంపెనీ(ఏఐఏహెచ్ఎల్)కు బదిలీ చేసింది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాను టాటా గ్రూపు 2021 అక్టోబరులో రూ.18,000 కోట్లకు బిడ్డింగ్లో దక్కించుకుంది. -
2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్
ధోలేరా (గుజరాత్): టాటా ఎల్రక్టానిక్స్ తలపెట్టిన ధోలేరా (గుజరాత్) ప్లాంటు నుంచి చిప్ల తొలి బ్యాచ్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్ నోడ్ల చిప్స్ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్నకు చెందిన రెండు, సీజీ పవర్కి చెందిన ఒక చిప్ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
రెండు కంపెనీలుగా టాటా మోటార్స్
టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. వాణిజ్య వాహనాలు ఒక సంస్థగా, ప్రయాణికుల వాహనాలు మరో కంపెనీగా ఏర్పాటుకానుంది. తద్వారా వృద్ధి అవకాశాలను మరింత బలంగా అందిపుచ్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంటోంది. న్యూఢిల్లీ: ఆటో రంగ లిస్టెడ్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు కంపెనీలుగా విడిపోయేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు టాటా మోటా ర్స్ వెల్లడించింది. వీటి ప్రకారం సంబంధిత పెట్టుబడులతో కలిపి వాణిజ్య వాహన విభాగం ఒక సంస్థగా ఏర్పాటుకానుంది. విలాసవంత కార్ల యూనిట్ జాగ్వార్ ల్యాండ్రోవర్సహా ప్యాసింజర్ వాహనాల(పీవీ) బిజినెస్ మరో కంపెనీగా ఆవిర్భవించనుంది. దీనిలో సంబంధిత పెట్టుబడులతోపాటు ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) విభాగంసైతం కలసి ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు టాటా మోటార్స్ తెలియజేసింది. ఎన్సీఎల్టీ నిబంధనలకు అనుగుణంగా విడదీతను చేపట్టనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ వాటాదారులు 2 లిస్టెడ్ సంస్థలలోనూ యథాతథంగా వాటాలను పొందుతారని స్పష్టం చేసింది. టర్న్ అరౌండ్ గత కొన్నేళ్లలో కంపెనీ బలమైన టర్న్అరౌండ్ను సాధించింది. మూడు ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్లూ స్వతంత్ర నిర్వహణలో కొనసాగుతూ నిలకడైన పనితీరును చూపుతున్నాయి. తాజా విడదీతతో మార్కెట్ కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోనున్నాయ్. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా మోటార్స్ 12–15 నెలలు కంపెనీ విడదీతతో కస్టమర్లకు సేవలు విస్తృతమవుతాయని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని, వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. విడదీత ప్రణాళికకు రానున్న నెలల్లో బోర్డుసహా.. వాటాదారులు, రుణదాతలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందనున్నట్లు తెలియజేశారు. విడదీత పూర్తికి 12–15 నెలలు పట్టవచ్చని అంచనా వేశారు. కంపెనీ విడదీత ఉద్యోగులు, కస్టమర్లు, వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్నీ చూపబోదని స్పష్టం చేశారు. కాగా.. వాణిజ్య, ప్రయాణికుల వాహన విభాగాల మధ్య పరిమితమైన ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు 88 అనుబంధ సంస్థలు, మూడు సంయుక్త కంపెనీలు, రెండు సంయుక్త కార్యకలాపాలు తదితరాలతో విస్తరించాయి. తాజా వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు రూ. 996 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టం. చివరికి నామమాత్ర నష్టంతో రూ. 987 వద్ద ముగిసింది. -
సెమీకండక్టర్ ఎకోసిస్టమ్పై మంత్రి వీడియో
భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను వివరిస్తూ సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాలుగు నిమిషాల నిడివిగల వీడియో, దేశంలో పటిష్ఠమైన సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను రూపొందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. ఇటీవల మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల స్థాపనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఈ వీడియో వైరల్ మారుతుండడం విశేషం. అందులో టాటా గ్రూప్ 2 ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా.. జపాన్కు చెందిన రెనెసాస్ భాగస్వామ్యంతో సీజీ పవర్ ఒక ప్లాంటు నిర్మించనుంది. ఇవి రాబోయే 100 రోజుల్లో నిర్మాణాన్ని ప్రారంభించనున్నాయి. వీటి వల్ల మొత్తం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇదీ చదవండి: 3000 ఎకరాల్లో కృత్రిమ అడవిని నిర్మించిన కొత్త పెళ్లికొడుకు మంత్రి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ గురించి వివరిస్తున్న వీడియోలో డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఏటీఎంపీ (అసెంబ్లీ-టెస్టింగ్-మార్కింగ్-ప్యాకేజింగ్) సర్క్యూట్ వంటి ముఖ్యమైన విభాగాల గురించి మాట్లాడటం గమనించవచ్చు. సెమీకండక్టర్ ఎకోసిమ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ప్రభుత్వం దృష్టిసారించినట్లు చెప్పారు. అందుకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్(ఏడీఏ) టూల్స్ చాలా ఖరీదైనవన్నారు. కేవలం ఒక లైసెన్స్ కోసం రూ.10-15 కోట్ల వరకు ఖర్చవుతుందని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఈ ఈడీఏ సాధనాలను దేశంలోని 104 యూనివర్సిటీలకు పంపిణీ చేసిందని తెలిపారు. #WATCH | Delhi | During his media interaction after the cabinet approval of 3 more semiconductor units, Union Minister Ashwini Vaishnaw explains the development of India’s semiconductor ecosystem on the whiteboard in his office. pic.twitter.com/D9RHfhAryE — ANI (@ANI) March 1, 2024 -
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ బంపరాఫర్!
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శుభవార్త చెప్పింది. చెక్ ఇన్ బ్యాగేజీ లేకుండా ప్రయాణించడానికి ఇష్టపడే ప్రయాణీకులకు తగ్గింపు ధరలలో టికెట్ల ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎక్స్ప్రెస్ లైట్ ద్వారా ప్రయాణికులు సాధారణ ఛార్జీల కంటే తక్కువ ధరలో విమాన టికెట్లను పొందవచ్చు. ఎక్స్ ప్రెస్ చెక్ ఇన్ ఫ్లయర్ కౌంటర్లు, బ్యాగేజీ బెల్ట్ వద్ద క్యూలను నివారించేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా బుక్ చేసుకుంటే 15 కిలోలు, 20 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీలపై డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. ఎక్స్ప్రెస్ లైట్ ఛార్జీలపై ప్రయాణించే ప్రయాణికులు కాంప్లిమెంటరీ కింద అదనంగా 3 కిలోల బ్యాగేజీని ఫ్రీగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎయిర్ పోర్ట్ ఎయిర్ లైన్ కౌంటర్లలోని ప్రయాణికులు చెక్ ఇన్ బ్యాగేజీ సేవలను వినియోగించుకోవచ్చని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.