2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్‌ First chip from Tata Dholera plant will be out in December 2026 | Sakshi
Sakshi News home page

2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్‌

Published Thu, Mar 14 2024 5:29 AM | Last Updated on Thu, Mar 14 2024 12:37 PM

First chip from Tata Dholera plant will be out in December 2026 - Sakshi

టాటా, సీజీ పవర్‌ సెమీకండక్టర్ల ప్లాంట్ల శంకుస్థాపనలో కేంద్ర మంత్రి వైష్ణవ్‌ వెల్లడి

ధోలేరా (గుజరాత్‌): టాటా ఎల్రక్టానిక్స్‌ తలపెట్టిన ధోలేరా (గుజరాత్‌) ప్లాంటు నుంచి చిప్‌ల తొలి బ్యాచ్‌ 2026 డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్‌ నోడ్‌ల చిప్స్‌ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన రెండు, సీజీ పవర్‌కి చెందిన ఒక చిప్‌ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.

ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్‌ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్‌ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

    ఎయిరిండియా భోజనంలో మెటల్‌ బ్లేడ్‌..!

    Published Mon, Jun 17 2024 3:29 PM | Last Updated on Mon, Jun 17 2024 3:38 PM

    Air India passenger finds metal blade in meal, airline responds

    టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా విమానంలో ఏర్పాటుచేసిన భోజనంలో మెటల్‌ బ్లేడ్‌ గుర్తించినట్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కంపెనీ వర్గాలు స్పందిస్తూ ఘటనను ధ్రువీకరించాయి.

    ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ..‘మా విమానంలో ఒక ప్రయాణికుడి భోజనంలో మెటల్‌ వస్తువు గుర్తించారు. దానిపై వెంటనే దర్యాప్తు జరిపాం. కూరగాయలు కట్‌ చేసేందుకు ఉపయోగించే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఆ మెటల్‌ వస్తువు వచ్చినట్లు తెలిసింది. మా క్యాటరింగ్ భాగస్వామి సదుపాయాలు, పరిసరాలను నిత్యం తనిఖీ చేయడంతో పాటు, ముఖ్యంగా ఏదైనా గట్టి కూరగాయలను తరిగే క్రమంలో జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతామని హామీ ఇస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తాం’ అని చెప్పారు.

    ఇదీ చదవండి: ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్‌.. కారణం..

    ఇటీవల ఎయిరిండియా విమానయాన సంస్థలో సరిగా ఉడకని ఆహారం తనకు ఇచ్చారని, సీటు సరిగాలేదని మరో ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం..న్యూదిల్లీ నుంచి నెవార్క్ వెళ్లేందుకు ఎయిర్ఇండియాలో ప్రయాణించాలని నిర్ణయించుకుని బిజినెస్‌క్లాస్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. విమానం టేకాఫ్‌ అయిన దాదాపు 30 నిమిషాల తర్వాత పడుకోవాలనుకున్నాడు. దాంతో సీటును ఫ్లాట్‌బెడ్‌(పడుకునేందుకు వీలుగా)మోడ్‌కు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దాంతో తీవ్ర నిరాశకుగురైనట్లు ప్రయాణికుడు చెప్పాడు. దాంతోపాటు అదే విమానంలో సరిగా ఉడకని ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నాడు.

    No comments yet. Be the first to comment!
    Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement