it minister
-
మనకూ సొంత ఏఐ మోడల్ !
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకి (ఏఐ) సంబంధించి చాట్జీపీటీ, డీప్సీక్ ఆర్1లకు దీటుగా మన సొంత ఫౌండేషన్ మోడల్స్ను ప్రోత్సహించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అంకుర సంస్థలు, పరిశోధకులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను చౌకగా అందుబాటులోకి తెస్తోంది. వీటి దన్నుతో వచ్చే 8–10 నెలల వ్యవధిలో కనీసం ఆరు పెద్ద డెవలపర్లు/స్టార్టప్లు పూర్తి దేశీయ సామర్థ్యంతో, దేశీ అవసరాల కోసం ఫౌండేషన్ మోడల్స్ను తయారు చేయగలవని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. మరింతగా దృష్టి పెడితే 4–6 నెలల వ్యవధిలో కూడా ఇవి సాధ్యపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఏఐ మార్గదర్శ ప్రణాళికలో తదుపరి చర్యలను మంత్రి గురువారం వెల్లడించారు. దీని ప్రకారం ఏఐ ఫౌండేషన్ మోడల్స్పై పని చేసే అంకురాలు, పరిశోధకులకు 18,693 అత్యాధునిక గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ) ఉమ్మడి కంప్యూటింగ్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది. జియో ప్లాట్ఫామ్స్, సీఎంఎస్ కంప్యూటర్స్, టాటా కమ్యూనికేషన్స్ మొదలైన సంస్థలు ఈ జీపీయూలను అందుబాటులో ఉంచుతాయి. అంతర్జాతీయ వ్యయ ప్రమాణాలతో పోలిస్తే ఉమ్మడి కంప్యూటింగ్ సదుపాయం దేశీయంగా ఒక డాలరు కన్నా తక్కు వకే (జీపీయూ అవర్కి) లభిస్తుందని, 40% వ్య యాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వైష్ణవ్ తెలిపారు.ఏఐ సేఫ్టీ...: ఫౌండేషనల్ మోడల్స్ సురక్షితంగా, విశ్వసనీయమైనవిగా ఉండేలా చూసేందుకు ఏఐ సేఫ్టీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. దీని కింద మెషిన్ అన్లెర్నింగ్ (ఐఐటీ జో«ద్పూర్), సింథటిక్ డేటా జనరేషన్ (ఐఐటీ రూరీ్క), ప్రైవసీ ఎన్హాన్సింగ్ స్ట్రాటెజీ (ఐఐటీ ఢిల్లీ, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ, టీఈసీ) తదితర ప్రాజెక్టులు ఎంపికైనట్లు ఆయన వివరించారు.ఇండియా ఏఐ మిషన్.. కృత్రిమ మేథ సహకారంతో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, లాజిస్టిక్స్ తదితర సవాళ్ల పరిష్కారానికి ఉద్దేశించి ఆవిష్కరించిన ఏఐ మిషన్ కింద పలు దరఖాస్తులు వచి్చనట్లు వైష్ణవ్ చెప్పారు. తొలి విడత ఫండింగ్ కోసం 18 అప్లికేషన్లను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇవి వ్యవసాయం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై పని చేస్తున్నట్లు వివరించారు. -
8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ ఈవెంట్: పోస్టర్ ఆవిష్కరించిన ఐటీ మంత్రి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి 'దుద్దిళ్ల శ్రీధర్ బాబు' మాదాపూర్లోని టీ-హబ్లో '8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024' ఈవెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నవంబర్ 20న జరగనుంది. దీనికి డిజైన్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు హాజరుకానున్నారు.8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024 ఈవెంట్ పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిజైన్, టెక్నాలజీని ప్రోత్సహించడంలో తెలంగాణ నిబద్ధతకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. కాన్క్లేవ్ పరిశ్రమ అభివృద్ధికి కొత్త అవకాశాలను పెంపొందిస్తూ సృజనాత్మకతను పెంచుతుంది. అంతే కాకుండా ఇది కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ ఖ్యాతిని బలోపేతం చేస్తుందని అన్నారు.నవంబర్ 9న (శనివారం) జరిగిన ఈ కార్యక్రమానికి డిజైన్ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, సలహాదారులతో సహా మొత్తం 250 మంది హాజరయ్యారు.8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్క్లేవ్ 2024 ప్రతినిధి 'రాజ్ సావంకర్' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన పరిశ్రమ నిపుణుల నేతృత్వంలో ప్యానెల్ చర్చలను హోస్ట్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాము. హాజరైనవారు విభిన్న రంగాలలో సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం సృజనాత్మకత, సాంకేతికతను కలిపే ఏకైక వేదిక, అంతే కాకుండా.. ఇది భవిష్యత్ పురోగతికి కూడా వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు. -
భారత్లో వాట్సాప్ నిలిచిపోతుందా? ఐటీ మంత్రి ఏమన్నారంటే
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ భారతదేశంలో తన కార్యాలపాలను నిలిపి వేస్తుందా? అని కాంగ్రెస్ సభ్యుడు 'వివేక్ తంఖా' అడిగిన ప్రశ్నకు.. సమాచార, ప్రసార శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' సమాధానమిచ్చారు.వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా దేశంలో తమ సేవలను మూసివేసే యోచనల గురించి భారత ప్రభుత్వానికి తెలియజేయలేదని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వినియోగదారుల వివరాలను పంచుకోవాలనే ప్రభుత్వ ఆదేశాల కారణంగా వాట్సాప్ భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేయాలని యోచిస్తోందా అనే ప్రశ్నకు వివరణాత్మక సమాధానం ఇచ్చారు.ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ తన సేవలను భారతదేశంలో నిలిపివేయనున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వం చెప్పినట్లు ఎన్క్రిప్షన్ను ఉల్లంఘిస్తే యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని, ఇది యాప్ మీద ప్రజలకున్న నమ్మకం పోతుందని వాట్సాప్ తరపు న్యాయవాది తేజస్ కరియా కోర్టుకు తెలిపారు.కొత్త నియమాలు గోప్యతకు భంగం కలిగిస్తాయని ఇప్పటికే వాట్సాప్, మెటా సంస్థలు పలుమార్లు ఆరోపించాయి. ఫిబ్రవరి 2021లో ప్రవేశపెట్టిన ఈ నియమాలు మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ను కలిగి ఉంటాయి. హానికరమైన కంటెంట్ను ఎదుర్కోవడానికి ఈ నియమాలు అవసరమైనవని పేర్కొంటూ భారత ప్రభుత్వం ఈ నిబంధనలను సమర్థిస్తుంది.వాట్సాప్ భారతదేశాన్ని విడిచిపెట్టినట్లయితే అది కంపెనీని.. దాని 400 మిలియన్ల మంది వినియోగదారులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో చాలా మంది వ్యక్తులు మరియు వ్యాపారాలు కమ్యూనికేషన్ కోసం వాట్సాప్పై ఆధారపడి ఉన్నాయి. వాట్సాప్ ఇండియాను వీడితే ఇలాంటి కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించవచ్చు.. ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవచ్చని పలువురు భావిస్తున్నారు. -
2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్
ధోలేరా (గుజరాత్): టాటా ఎల్రక్టానిక్స్ తలపెట్టిన ధోలేరా (గుజరాత్) ప్లాంటు నుంచి చిప్ల తొలి బ్యాచ్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్ నోడ్ల చిప్స్ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్నకు చెందిన రెండు, సీజీ పవర్కి చెందిన ఒక చిప్ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. -
సెమీకండక్టర్ ఎకోసిస్టమ్పై మంత్రి వీడియో
భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను వివరిస్తూ సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాలుగు నిమిషాల నిడివిగల వీడియో, దేశంలో పటిష్ఠమైన సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను రూపొందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. ఇటీవల మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల స్థాపనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఈ వీడియో వైరల్ మారుతుండడం విశేషం. అందులో టాటా గ్రూప్ 2 ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా.. జపాన్కు చెందిన రెనెసాస్ భాగస్వామ్యంతో సీజీ పవర్ ఒక ప్లాంటు నిర్మించనుంది. ఇవి రాబోయే 100 రోజుల్లో నిర్మాణాన్ని ప్రారంభించనున్నాయి. వీటి వల్ల మొత్తం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇదీ చదవండి: 3000 ఎకరాల్లో కృత్రిమ అడవిని నిర్మించిన కొత్త పెళ్లికొడుకు మంత్రి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ గురించి వివరిస్తున్న వీడియోలో డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఏటీఎంపీ (అసెంబ్లీ-టెస్టింగ్-మార్కింగ్-ప్యాకేజింగ్) సర్క్యూట్ వంటి ముఖ్యమైన విభాగాల గురించి మాట్లాడటం గమనించవచ్చు. సెమీకండక్టర్ ఎకోసిమ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ప్రభుత్వం దృష్టిసారించినట్లు చెప్పారు. అందుకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్(ఏడీఏ) టూల్స్ చాలా ఖరీదైనవన్నారు. కేవలం ఒక లైసెన్స్ కోసం రూ.10-15 కోట్ల వరకు ఖర్చవుతుందని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఈ ఈడీఏ సాధనాలను దేశంలోని 104 యూనివర్సిటీలకు పంపిణీ చేసిందని తెలిపారు. #WATCH | Delhi | During his media interaction after the cabinet approval of 3 more semiconductor units, Union Minister Ashwini Vaishnaw explains the development of India’s semiconductor ecosystem on the whiteboard in his office. pic.twitter.com/D9RHfhAryE — ANI (@ANI) March 1, 2024 -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని తెలియజేసింది
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై (పీపీబీఎల్) ఆర్బీఐ చర్యలు తీసుకోవడమనేది నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతవైపు ఫిన్టెక్ సంస్థల దృష్టిని మరల్చేలా చేసిందని కేంద్ర ఐటీ శాఖ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నియంత్రణ సంస్థ నిర్దేశించే నిబంధనలను పాటించడమనేది కంపెనీలకు ‘ఐచి్ఛకం‘ కాదని, ప్రతి వ్యాపారవేత్త కచి్చతంగా దానిపై దృష్టి పెట్టి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. సాధారణంగా వ్యాపారవేత్తలు తమ సంస్థలను నిరి్మంచడంలో నిమగ్నమై, కొన్ని సార్లు నిబంధనలపై దృష్టి పెట్టడంలో విఫలం అవుతుంటారని పేర్కొన్నారు. ఎంతో కష్టపడే, దూకుడుగా ఉండే వ్యాపారవేత్త కూడా నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో విఫలం కావడం వల్లే పీపీబీఎల్ ఉదంతం చోటు చేసుకుందన్నారు. నిబంధనలను పాటించని ఏ కంపెనీ అయినా చట్టాల నుంచి తప్పించుకోజాలదని మంత్రి స్పష్టం చేశారు. పీపీబీఎల్పై ఆర్బీఐ చర్యలు ఫిన్టెక్ రంగాన్ని కుదిపివేశాయని భావించరాదని, నిబంధనలను పాటించాల్సిన అవసరం వైపు దృష్టిని మరల్చాయనే భావించవచ్చని మంత్రి వివరించారు. నిబంధనల ఉల్లంఘనకు గాను పీపీబీఎల్ మార్చి 15 నుంచి దాదాపు కార్యకలాపాలన్నీ నిలిపివేసేలా ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్లు.. త్వరలోనే భారత్లో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులతో రెండు పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు రానున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. ఇజ్రాయెల్కి చెందిన టవర్ సెమీకండక్టర్స్ 8 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను, టాటా గ్రూప్ మరో ప్రాజెక్టును ప్రతిపాదించాయన్న వార్తలను ఆయన ధృవీకరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వీటికి క్లియరెన్స్ ఇవ్వలేకపోతే, ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ సారథ్యంలో మూడో సారి ఏర్పాటు కాబోయే ప్రభుత్వం సత్వర ఆమోదం తెలపగలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిప్ల తయారీకి సంబంధించి నాలుగు, చిప్ల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్ల ఏర్పాటుకు 13 ప్రతిపాదనలు వచ్చాయి. అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ మైక్రోన్ .. గుజరాత్లో తలపెట్టిన రూ. 22,516 కోట్ల చిప్ అసెంబ్లీ ప్లాంటుకు ఇవి అదనం. -
BioAsia 2024: ప్రతిష్టాత్మకంగా బయోఏషియా సదస్సు
బయోఏషియా-2024 సదస్సు 21వ ఎడిషన్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. హెల్త్కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సు సన్నాహాలను తెలంగాణ సమాచార సాంకేతిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. బయో ఏషియా సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరుగుతుండటంపై మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా భారతీయ, గ్లోబల్ లైఫ్-సైన్సెస్, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి బయోఏషియా కీలక సాధనంగా ఉద్భవించిందన్నారు. అంతర్జాతీయ వేదికపై ఈవెంట్ ప్రాముఖ్యత పెంచడంతో అనేక మంది గ్లోబల్ సీఈవోలు మొదటిసారిగా బయోఏషియాకు హాజరవుతున్నారని ప్రకటించేందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ‘డేటా & ఏఐ: రీడిఫైనింగ్ పాసిబిలిటీస్’ అనే థీమ్తో జరగనున్న బయో ఏషియా 21వ ఎడిషన్లో ప్రభుత్వ, పారిశ్రామిక ప్రముఖులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, ఇతర ప్రతినిధులు పాల్గొంటున్నారు. గ్లోబల్ సీఈవోలు, ఇండస్ట్రీ లీడర్లతో సహా 70 మందికిపైగా ప్రభావవంతమైన వక్తలు ప్రసంగించనున్నారు. భారీ స్థాయిలో జరిగే ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 3000 మందికిపైగా ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈవెంట్లో ఈసారి 200కిపైగా కంపెనీలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి. -
ప్రభుత్వ అధీనంలోకి టెలికాం, ఓటీటీ సర్వీసులు..? భారీ మార్పులు ఇవే..
ఇంటర్నెట్తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్తోపాటు ఓటీటీలపై ఇకనుంచి ప్రభుత్వం ఆధిపత్యం కొనసాగనుందని వాదనలు వస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో టెలికమ్యూనికేషన్స్ డ్రాప్ట్ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది. కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది అమల్లోకి వస్తే ఓటీటీ, ఇంటర్నెట్తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్ టెలికమ్యూనికేషన్ శాఖ పరిధిలోకి వస్తాయి. దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే ఎలాంటి నెట్వర్క్ లేదా టెలికమ్యూనికేషన్ సేవలనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదా నిలిపివేయడానికి అనుమతి ఉంటుంది. తాజా డ్రాఫ్ట్ బిల్లుతో టెలికాం రంగాన్ని నియంత్రించేలా 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టాన్ని మార్చాలని కేంద్ర యోచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆగస్టులోనే కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాన్ని కట్టడి చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీల ప్రవేశ రుసుము, లైసెన్స్ ఫీజు, పెనాల్టీ మొదలైనవాటిని మాఫీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనే ప్రపోజల్ కూడా ఈ బిల్లులో ఉందని తెలిసింది. ఒకేవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే వీటిలో భారీ మార్పు ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. -
TS:ఐటీ మంత్రి ఎవరో..?
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం రేవంత్రెడ్డితో పాటు 11 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అయితే వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకే ఒక్క పోర్ట్ఫోలియోపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కేటీఆర్ నిర్వహించిన ఐటీ శాఖ కొత్త ప్రభుత్వంలో ఎవరికి కేటాయిస్తారన్నది హాట్టాపిక్గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖను కేటీఆర్ డైనమిక్గా నిర్వహించి బాగా పాపులర్ అయ్యారు. ఐటీ శాఖలో కేటీఆర్ చేసిన కృషి వల్లే బీఆర్ఎస్ హైదరాబాద్లో క్లీన్స్వీప్ చేసిందన్న వాదనా ఉంది. ఇప్పుడు శాఖ తీసుకునే మంత్రిని యూత్ కేటీఆర్తో పోల్చడం ఖాయం. కొత్తగా ఐటీ శాఖ తీసుకునే మంత్రి కేటీఆర్ రేంజ్లో శాఖ నిర్వహించకపోతే యువత అసంతృప్తికి గురయ్యే చాన్స్ లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొత్త ప్రభుత్వంలో ఈ శాఖ కేటాయింపు విషయం ఆసక్తికరంగా మారింది. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో ఎక్కువ మంది సీనియర్లే. వీరిలో ఎవరికీ గతంలో ఐటీ శాఖ నిర్వహించిన అనుభవం లేదు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టినవారిలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి లేదంటే శ్రీధర్బాబుకు ఐటీ శాఖ ఇచ్చే అవకాశాలున్నయని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే నిజమైతే వీరిద్దరూ కేటీఆర్కు ధీటుగా ఐటీ శాఖను నిర్వహించగలుగుతారా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి తన మంత్రివర్గంలో ఇంకో ఆరుగురు మంత్రులను తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని తెలుస్తోంది. కొత్తగా మంత్రులు కానున్న వారి జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మదన్మోహన్రావుల పేర్లు ఉండవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కినా వారికి ఖాయంగా ఐటీ కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మదన్మోహన్రావుకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అమెరికాలో ఐటీ బిజినెస్ను కూడా ఈయన నడుపుతున్నారు. గతంలో రాహుల్గాంధీ టీంలో పనిచేసిన ఈయన కాంగ్రెస్ పార్టీకి ఐటీ పరంగా సేవలందించారు. సభ్యత్వ నమోదు, ఎన్నికల్లో అనలిటిక్స్ వంటి విషయాల్లో ఈయన పార్టీ కోసం ఎంతో కృషి చేసినట్లు చెబుతారు. దీంతో మదన్మోహన్రావుకు ఐటీ శాఖ వచ్చే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యువకులకు, వ్యాపార రంగంలో పరిచయాలు ఉన్న వారికి ఐటీ శాఖ కేటాయిస్తేనే కేటీఆర్కు ధీటుగా ఆ శాఖలో పనిచేయగలుగుతారని యువత భావిస్తోంది. ఐటీ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్కు కొత్తగా ఎన్నో కంపెనీలు తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఎంఎన్సీ కంపెనీలతో మరిన్ని పెట్టుబడులు పెట్టించి ఎంతో మంది యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇలా కేటీఆర్ స్థాయిలో పనిచేసి ఐటీలో బ్రాండ్ హైదరాబాద్ను నిలబెట్టాలంటే ఐటీ రంగంపైన అవగాహన, అనుభవం ఉన్నవారైతేనే బెటర్ అన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది యువకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదీచదవండి..మాజీ సీఎం కేసీఆర్కు తీవ్ర గాయం.. యశోదకు తరలింపు -
27 సంస్థలకు ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐ స్కీము
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్పీ, ఫ్లెక్స్ట్రానిక్స్, ఫాక్స్కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు. ‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు. -
22 బెట్టింగ్యాప్లు, వెబ్సైట్లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నవంబర్ 5న ‘మహదేవ్ బుక్’తో సహా 22 బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఛత్తీస్గఢ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత వివాదానికి దారితీసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్ల సిండికేట్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాడులు నిర్వహించింది. ఛత్తీస్గఢ్లోని ‘మహదేవ్ బుక్’యాప్తో పాటు ఇతర బెట్టింగ్యాప్లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ ఆరోపణపై మహదేవ్ యాప్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్కు రూ.508 కోట్లు అందినట్లు తమకు సమాచారం ఉందని ఈడీ పేర్కొంది. అయితే బెట్టింగ్ ప్లాట్ఫామ్లను అణిచివేయడంలో బఘేల్ నేతృత్వంలోని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సెక్షన్ 69A ఐటీ చట్టం ప్రకారం వెబ్సైట్/ యాప్ను మూసివేయమని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే గత కొద్దికాలంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నా బఘేల్ ప్రభుత్వం అలా చేయలేదని తప్పుపట్టారు. మరోవైపు యాప్ను నిషేధించాలన్న అభ్యర్థన వచ్చిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. -
ఐఫోన్ హ్యాకింగ్పై కేంద్రం క్లారిటీ, ఎంపీలపై మండిపడిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారన్న ప్రతిపక్ష ఎంపీల ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. 150 దేశాలకు యాపిల్ సంస్థ అడ్వైజరీ జారీ చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం తెలిపారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్ల విషయంలో దర్యాప్తునకు కేంద్రం ఆదేశించినట్టుతెలిపారు. మెసేజ్లు అందుకున్న వారితో పాటు యాపిస్ సంస్థ కూడా ఆ దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందని విపక్ష ఎంపీల ఆరోపణలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రియంక చతుర్వేది, శశిథరూర్, మహువా మొయిత్రా, అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఎంపీలు పని గట్టుకుని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తుంటారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. శశిథరూర్, మహువా మొయిత్రా, ఓవైసీ, ఆప్కి చెందిన రాఘవ్ చద్దాతో సహా పలువురు విపక్ష ఎంపీ తమ ఐఫోన్లకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్లను సోషల్ మీడియాలోనూ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. -
త్వరలో విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ సేవలు
-
సైబర్ సెక్యూరిటీకి సమిష్టి కృషి అవసరం
న్యూఢిల్లీ: సైబర్ దాడుల ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సైబర్సెక్యూరిటీ విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జీ20 సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా.. సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కార సాధనాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. యూపీఐ, ఓఎన్డీసీ, కోవిన్ వంటి భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊతంతో టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యులకు కూడా భారత్ అందజేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘సైబర్సెక్యూరిటీ అనేది అందరికీ ఉమ్మడి సవాలే. అది చాలా సంక్లిష్టమైనది దానికి సరిహద్దులేమీ లేవు. టెక్నాలజీ నిత్యం రూపాంతరం చెందుతోంది. ఇవాళ ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే.. రేపు మరో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ (ఏఐ)తో సంక్లిష్టత మరిన్ని రెట్లు పెరుగుతుంది‘ అని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో అందరి ప్రయోజనాల కోసం కొత్త పరిష్కార సాధనాలను రూపొందించడం, పరస్పరం పంచుకోవడం అవసరమని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన కొన్ని సైబర్సెక్యూరిటీ సాధనాలను, వాటిపై ఆసక్తి గల దేశాలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వైష్ణవ్ తెలిపారు. -
కొత్త డిజిటల్ ఇండియా చట్టంలో తగిన రక్షణలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకురాబోయే డిజిటల్ ఇండియా చట్టంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తరహా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీల నుంచి తగిన రక్షణలతో ప్రత్యేక చాప్టర్ ఉంటుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. భారత్ సరైన విధానాన్నే అనుసరిస్తుందంటూ.. ఇంటర్నెట్ను భద్రంగా, యూజర్లకు విశ్వసనీయమైనదిగా ఉండేలా చూస్తామన్నారు. డిజిటల్ ఇండియా చట్టం రూపకల్పన విషయంలో భాగస్వాములతో రాజీవ్ చంద్రశేఖర్ విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడం గమనార్హం. రెండు దశాబ్దాల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్తది తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తున్న తరుణంతో తగిన రక్షణలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణకు అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థ అవసరమని పేర్కొనడం గమనార్హం. శామ్ ఆల్ట్మన్ వ్యాఖ్యలను మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయనో స్మార్ట్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఏఐని ఎలా నియంత్రించాలో ఆయనకంటూ స్వీయ అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. కానీ, భారత్లోనూ స్మార్ట్ బుర్రలకు కొదవ లేదంటూ, ఏఐ నుంచి ఎలా రక్షణలు ఏర్పాటు చేయాలనే విషయమై తమకు అభిప్రాయాలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలిపారు. డేటా బిల్లుతో దుర్వినియోగానికి అడ్డుకట్ట ప్రతిపాదిత డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుతో డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడగలదని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సుదీర్ఘకాలంగా దోపిడీ చేసిన ప్లాట్ఫాంల ధోరణుల్లో మార్పులు రాగలవని ఆయన చెప్పారు. ఫ్యాక్ట్–చెక్ విభాగం ఏర్పాటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. వాస్తవాలతో పోలిస్తే తప్పుడు సమాచారం 10–15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని, 20–50 రెట్లు ఎక్కువ మందికి చేరే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. అది తప్పు అని స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండాలని మంత్రి చెప్పారు. అందుకోసమే ఫ్యాక్ట్ చెక్ విభాగం పని చేస్తుందే తప్ప దాని వెనుక సెన్సార్షిప్ ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. -
తొమ్మిదేళ్లలో 90 వేల స్టార్టప్లు: అశ్వినీ వైష్ణవ్
జైపూర్: గడిచిన తొమ్మిదేళ్లుగా దేశీయంగా స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిమదని, 90,000కు చేరుకుందని ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంకుర సంస్థల సంస్కృతిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన వివరించారు. జైపూర్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సెంటర్ ఏర్పాటు సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇదీ చదవండి : బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ? అభివృద్ధిలో హైదరాబాద్ జోరు.. గత నెల రిజిస్రేషన్లు అన్ని కోట్లా? -
ప్రభుత్వ సత్వర చర్యలతో స్టార్టప్లపై ప్రభావం పడలేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వం సత్వరం పూనుకుని చర్యలు తీసుకోవడం వల్ల సిలికాన్ వేలీ బ్యాంకు (ఎస్వీబీ) సంక్షోభ ప్రభావాలు దేశీ స్టార్టప్లపై పడలేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని విశ్వసనీయ భాగస్వామిగా పరిగణించాలని అంకుర సంస్థలకు ఆయన సూచించారు. ఇండియా గ్లోబల్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎస్వీబీ కుప్పకూలినప్పుడు.. అందులో నిధులు ఉన్న భారతీయ స్టార్టప్లకు సహాయం అందించేందుకు కేంద్రం వెంటనే రంగంలోకి దిగిందని ఆయన చెప్పారు. అది చిన్నపాటి సంక్షోభమైనప్పటికీ, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క అంకుర సంస్థపైనా ప్రతికూల ప్రభావం పడకుండా .. మొత్తం ప్రక్రియ సజావుగా సాగేలా కృషి చేసిందని వైష్ణవ్ చెప్పారు. ఒకప్పుడు టెక్నాలజీ వినియోగదారుగా మాత్రమే ఉన్న భారత్.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్లో ముందుకు పురోగమిస్తోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు చాలా మటుకు అంతర్జాతీయ డెవలపర్లు భారత స్టార్టప్లు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలను తమ భాగస్వాములుగా చేసుకోవాలనుకుంటున్నారని మంత్రి వివరించారు. భారత్ కూడా చాట్జీపీటీ లాంటివి తయారు చేయగలదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మరికొద్ది వారాలు ఆగండి. ఒక భారీ ప్రకటన ఉండబోతోంది‘ అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ఎకానమీకి భారత్ వంటి విశ్వసనీయ భాగస్వామి చాలా అవసరమని వైష్ణవ్ పేర్కొన్నారు. క్వాంటమ్ ఆధారిత టెలికం నెట్వర్క్ .. దేశీయంగా తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత సురక్షితమైన టెలికం నెట్వర్క్ లింక్ ప్రస్తుతం న్యూఢిల్లీ సీజీవో కాంప్లెక్స్లోని సంచార్ భవన్, ఎన్ఐసీ మధ్య అందుబాటులోకి వచ్చిందని వైష్ణవ్ చెప్పారు. ఈ వ్యవస్థ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయగలిగే ఎథికల్ హ్యాకర్లకు రూ. 10 లక్షల బహుమతి ఉంటుందని ఆయన తెలిపారు. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ సీ–డాట్ రూపొందించినట్లు మంత్రి వివరించారు. -
హైటెక్స్లో ఈ-మోటార్ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
భారత టెక్నాలజీతో కోట్ల కొద్దీ ఆదా
న్యూఢిల్లీ: ఇతర దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు, కో–విన్, విశిష్ట గుర్తింపు సాంకేతికత వంటి భారతీయ టెక్నాలజీలు సహాయపడగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే ఆయా దేశాలు డిజిటైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో భారత్ .. తన వంతు బాధ్యతగా పలు దేశాలకు మన టెక్నాలజీ స్టాక్ను (ఉత్పత్తులు, సాధనాలు మొదలైనవి) ఆఫర్ చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వివరించారు. రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్ల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ హార్డ్వేర్, విడిభాగాల తయారీదార్లు, హియరబుల్–వేరబుల్స్ ఉత్పత్తులకు కూడా కొత్తగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్ సెగ్మెంట్ అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా ఉండటంతో దానిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 2023–24లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. -
భారత్లో ఉండాలని లేదా? ‘వాట్సాప్’కి కేంద్రం హెచ్చరిక!
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన ట్విట్టర్ ఖాతాలో భారత్ మ్యాప్ను తప్పుగా చూపించే గ్రాఫిక్ చిత్రాన్ని పోస్టు చేయడంపై వివాదం రాజుకుంది. ప్రపంచపటంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా తమదేనని చెబుతున్న ప్రాంతాలు లేని భారత చిత్రపటాన్ని పంచుకుంది వాట్సాప్. దీనిపై కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరికలు చేశారు. జరిగిన తప్పును వెంటనే సరిదిద్దాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ‘డియర్ వాట్సాప్.. భారత మ్యాప్లో తలెత్తిన తప్పును వెంటనే సరిదిద్దాలని కోరుతున్నాం. భారత్లో వ్యాపారం చేస్తున్న అన్ని సంస్థలు, వ్యాపారం కొనసాగించాలనుకుంటున్న సంస్థలు తప్పనిసరిగా సరైన మ్యాప్ను వినియోగించాలి. ’అని ట్విట్టర్లో వాట్సాప్ పోస్టును రీట్వీట్ చేశారు కేంద్ర మంత్రి. అలాగే వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ను ట్యాగ్ చేశారు. కొత్త ఏడాది ని పురస్కరించుకుని ఈ గ్రాఫిక్ చిత్రాన్ని వాట్సాప్ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే జరిగిన తప్పును గుర్తించిన మంత్రి వెంటనే మెటాకు ఫిర్యాదు చేశారు. తప్పును సరిదిద్దకుంటే ఎదురయ్యే పరిణామాలపై సూత్రప్రాయంగా హెచ్చరించారు. Dear @WhatsApp - Rqst that u pls fix the India map error asap. All platforms that do business in India and/or want to continue to do business in India , must use correct maps. @GoI_MeitY @metaindia https://t.co/aGnblNDctK — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) December 31, 2022 భారత భూభాగాలను తప్పుగా చూపించే చిత్రాలను పోస్ట్ చేయడం పోలీసు కేసుకు దారితీస్తుంది. అలాంటి తప్పులు చేసే వారికి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కశ్మీర్ లేకుండా మ్యాప్లను చూపించండంపై గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర సంస్థల తీరుపట్ల అసహనం వ్యక్తం చేసింది భారత్. వాట్సాప్ క్షమాపణలు.. మంత్రి హెచ్చరికలతో తప్పుగా ఉన్న ట్వీట్ను తొలగించింది వాట్సాప్. జరిగిన తప్పుకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపింది. ‘అనుకోకుండా జరిగిన తప్పును గుర్తించినట్లు మంత్రిగారికి కృతజ్ఞతవలు. దానిని వెంటనే తొలగిస్తున్నాం. అలాగే క్షమాపణలు చెబుతున్నాం. ఈ విషయాన్ని భవిష్యత్తులోనూ మా దృష్టిలో ఉంచుకుంటాం.’ అని రాసుకొచ్చింది వాట్సాప్ ఇదీ చదవండి: స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై ‘బీఎస్ఎఫ్’ అనుమానాలు.. దర్యాప్తునకు ఆదేశం -
కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగానికి చెక్.. ఇకపై అలాంటివి కుదరదు!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డేటా రక్షణ బిల్లుతో కస్టమర్ డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధమైన యూజర్ల లొకేషన్ ట్రాకింగ్ వివాదానికి సంబంధించిన కేసును టెక్ దిగ్గజం గూగుల్ సెటిల్ చేసుకున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లొకేషన్ ట్రాకింగ్ సిస్టం నుండి వైదొలిగినప్పటికీ యూజర్లను తప్పు దోవ పట్టించి, వారి లొకేషన్ను ట్రాక్ చేయడాన్ని కొనసాగించిందంటూ గూగుల్పై కేసు నమోదైంది. దీన్ని 392 మిలియన్ డాలర్లకు గూగుల్ సెటిల్ చేసుకుంది. ఇలా కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగం కాకుండా డేటా రక్షణ బిల్లు పటిష్టంగా ఉంటుందని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో లోక్సభలో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం మరింత బలమైన నిబంధనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
మూన్లైటింగ్కు పాల్పడుతున్న ఉద్యోగులకు భారీ షాక్!
మూన్లైటింగ్ అంశంపై ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు మూటగట్టుకుంటున్న టెక్ కంపెనీలకు ఐటీ శాఖ మంత్రి మద్దతు పలికారు. మూన్లైటింగ్ విషయంలో ఉద్యోగుల తీరు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు రెండేసి ఉద్యోగాలు చేయాలనుకుంటే తమ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని అన్నారు. ఒకటి మించి ఎక్కువ ఉద్యోగాలు (మూన్లైటింగ్) చేస్తున్న ఉద్యోగుల తీరుపై ప్రముఖ టెక్ దిగ్గజాలు విమర్శిస్తున్నాయి. మూన్లైటింగ్కు పాల్పడటం అనైతికమని, ఉద్యోగులు సంస్థ నిబంధనలకు లోబడి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించాయి. ఈ తరుణంలో టెక్ సంస్థలకు కర్ణాకట ఐటీ శాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ అండగా నిలిచారు. ఆఫీస్లో ఉద్యోగంతో పాటు ఫ్రీల్సాన్ వర్క్ చేయడం మోసం. ప్రొఫెషనల్స్ అలా చేయాలనుకుంటే వేరే రాష్ట్రానికి వెళ్లండి’ అని సూచించారు. “ఒక విధాన పరంగా, నైతికంగా మూన్లైటింగ్ను ఎలా అనుమతించవచ్చు? మూన్లైటింగ్కు పాల్పడడం న్యాయం కాదు. ఇది అక్షరాలా మోసం” అంటూ ఉద్యోగానికి మించి ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారి గురించి ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. "మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు? మీరు సూపర్మెన్నా ఏమిటీ? మీకు కుటుంబాలు లేవా? అని అన్నారు. కాగా దేశంలో అగ్రశ్రేణి ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రోల ప్రధాన కార్యాలయాలు బెంగళూరు కేంద్రంగా కార్యకాలాపాలు నిర్వహిస్తుండగా.. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వేరే చోటికెళ్లి పనిచేసుకోండి బెంగళూరు టెక్ సమ్మిట్ను ప్రమోట్ చేయడానికి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. టెక్ పరిశ్రమ మూన్లైటింగ్ వంటి పద్ధతుల్ని అనుమతించకూడదని, ఆఫీసు వేళలకు మించి చేసే వర్క్లకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వదని అన్నారు. “ఇక్కడ (మూన్లైటింగ్ కోసం) ఖాళీ లేదు. మీకు అంత డిమాండ్ ఉంటే, వేరే చోట పని చేయండి’ అని పేర్కొన్నారు. చదవండి👉 ‘చేస్తే చేయండి..లేదంటే పోండి’ -
చంద్రబాబును విశ్వసించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు : గుడివాడ అమర్నాథ్
-
రూ.9,75,600 కోట్ల ఎగుమతులు
చెన్నై: దేశం నుంచి 2025–26 నాటికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.9,75,600 కోట్లకు చేరతాయని కేంద్రం ఆశిస్తోంది. భారత్లో ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ రూ.6,09,750 కోట్లుగా అంచనా. 2026 మార్చినాటికి తయారీ విలువ రూ.24,39,000 కోట్లకు చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. చెన్నై సమీపంలో రూ.1,100 కోట్లతో పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా నెలకొల్పిన ప్లాంటును శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014 నాటికి భారత్ 90 శాతం మొబైల్ ఫోన్స్ను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్లో అమ్ముడవుతున్న మొబైల్స్లో 97 శాతం దేశీయంగా తయారైనవే. ఏటా రూ.50,000 కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేస్తున్నాం. వీటిలో ఐఫోన్స్, శామ్సంగ్, ఇతర బ్రాండ్స్ ఉన్నాయి. ఎనమిదేళ్లలో సున్నా నుంచి ఈ స్థాయికి వచ్చాం. భారత్ సాధించింది అతి స్వల్పమే. 2025–26 నాటికి రూ.1,62,600 కోట్ల విలువైన మొబైల్స్ భారత్ నుంచి విదేశాలకు సరఫరా అవుతాయని భావిస్తున్నాం. పెగాట్రాన్ సదుపాయాన్ని ప్రారంభించడం, నోయిడా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో అనేక ఇతర తయారీ యూనిట్ల విజయం.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించుకున్నాయని ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని రాజీవ్ తెలిపారు. -
రెడీగా ఉండండి.. ‘త్వరలో హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు’
భువనేశ్వర్: రాష్ట్రానికి హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూరీ పర్యటన పురస్కరించుకుని ఆయన ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ శిక్షణా శిబిరం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి విచ్చేశారు. కేంద్రప్రభుత్వం సంకల్పించిన 5జీ సేవలు తొలి దశలోనే రాష్ట్రానికి కల్పిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. దేశంలో పలు ప్రాంతాలకు ఈ సేవలు లభిస్తాయని, ఈ వ్యవస్థలో మానవాళికి ఎటువంటి ముప్పు ఉండబోదని హామీ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) జారీ చేసిన రేడియేషన్ పరిమితి కంటే సుమారు 10 రెట్లు తక్కువగా దేశంలో ప్రవేశ పెట్టనున్న హైస్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉంటుందని స్పష్టంచేశారు. వినియోగదారులకు విస్తృత 5జీ సేవలు కల్పించేందుకు అనుబంధ టెలికాం సంస్థలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అతి త్వరలో హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తొలి దశలో అవకాశం కల్పించే యోచన కనబరచడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: పవర్ ఆఫ్ సారీ:రూ.6 లక్షలతో.. 50కోట్లు వచ్చాయ్! -
ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’
గచ్చిబౌలి: ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ షటిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం లాల్గాడి మలక్పేట్లోని జినోమ్ వ్యాలీ, ఫార్మా లైఫ్ సైన్సెస్ నుంచి అల్వాల్ వరకు ఎస్సీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చిన 3వ షీ షటిల్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే భద్రత వ్యవస్థలో మహిళా ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం అల్వాల్ నుంచి లాల్గడీ మలక్పేట్, తుర్కపల్లి నుంచి జనోమ్ వ్యాలీ వరకు నడుస్తుందన్నారు. ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఏదుల మాట్లాడుతూ... ఐటీ, ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఇప్పటి వరకు 12 షీ షటిల్స్ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
మంత్రిగా గుడివాడ అమర్నాథ్ బాధ్యతలు.. తొలి సంతకం దానిపైనే..
సాక్షి, విజయవాడ: పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను గెలిపించి ఈ స్ధానంలో కూర్చోబెట్టే అవకాశం ఇచ్చిన అనకాపల్లి ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. గురుతరమైన బాద్యత నాపై సీఎం ఉంచారు. రాష్ట్రానికి మంచి చేస్తా.. బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తాను. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ విషయంలో ఏపీకి మంచి జరిగే విధంగా కృషి చేస్తా. ఏపీలో పారిశ్రామిక అభివృద్ది చేస్తా. ఐటీకి చిరునామాగా ఉన్న విశాఖ నుంచి వచ్చిన వ్యక్తిగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేస్తా. విశాఖకి ఐటీ ఆద్యుడైన దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తా. చెన్నై, బెంగుళూరు, ముంబయి లాంటి నగరాలతో పోటీ పడగల అవకాశం ఉన్న నగరం విశాఖపట్నం. పారిశ్రామిక అభివృధ్దికి, పెట్టుబడులకి అనుకూలమైన రాష్ట్రం ఏపీ. 900 కి.మీలకు పైన తీరప్రాంతం, జాతీయ రహదారులు, నాలుగు పోర్టులు ఉన్న రాష్ట్రం మనది. దేశంలోనే గొప్ప పరిపాలనాదక్షుడైన సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టం. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సేవలను కూడా ఈ సందర్బంగా గుర్తించుకోవాలి.. ఆయన ఆశయాలని కొనసాగిస్తాను అని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టుకి అవసరమైన భూసేకరణలో భాగంగా రైతులకి ఇచ్చే రూ.8కోట్ల పరిహారంపై తొలి సంతకం చేశారు. చదవండి: (YSRCP: 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త టీమ్ రెడీ) -
నాన్న మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా.. ఇప్పుడు మంత్రినై వచ్చా..
సాక్షి, సింహాచలం(పెందుర్తి): 30 ఏళ్ల క్రితం నాన్న రాష్ట్ర మంత్రిగా తొలిసారి శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన చిటికిన వేలు పట్టుకొని సింహగిరిపై నడిచాను.. ఇప్పుడు తాను మంత్రిగా స్వామి దర్శనానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం సాయంత్రం ఆయన దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు, దేవస్థానం ఈవో సూర్యకళ పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆయన పేరిట అర్చకులు స్వామికి అష్టోత్తరంపూజ నిర్వహించారు. దేవస్థానం తరపున శేషవస్త్రాలు, జ్ఞాపికను, ప్రసాదాన్ని ఈవో అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంతో తమ కుటుంబానికి ఎంతో దగ్గర అనుబంధం ఉందన్నారు. ఆ స్వామిని ఆరాధ్యదైవంగా పూజిస్తామన్నారు. ఆ సింహాద్రినాథుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దయ వల్లే నాకు మంత్రిగా అవకాశం లభించిందన్నారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారానికి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి కూడా చేస్తానని తెలిపారు. రాజగోపురం వద్ద దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు సువ్వాడ శ్రీదేవి, దొడ్డి రమణ, పెనుమత్స శ్రీదేవి వర్మ, ప్రత్యేక ఆహ్వానితుడు దొడ్డి రమణ తదితరులు స్వాగతం పలికారు. -
గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకు మేకపాటి కుటుంబం సిద్ధం
-
సైబర్ నేరం జరిగితే వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీలు ఏదైనా సైబర్ దాడికి గురైతే దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలన్న చట్టాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. బెంగళూరులో ఐబీఎం ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 10 కోట్ల సైబర్ దాడుల ఘటనలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఇండియా సీఈఆర్టీ) గుర్తించినట్టు చెప్పారు. సైబర్ దాడుల పరంగా భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి సైబర్ దాడులు జరిగితే బయటకు వెల్లడించకుండా దాచడం కుదరదు. వీటిని వెల్లడించాల్సిన బాధ్యతను సంస్థలపై పెట్టనున్నాం. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల్లో నూతన చట్టం గురించి ప్రకటన వింటారు’’అని మంత్రి ప్రకటించారు. ముప్పు విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తి స్పష్టత ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సైబర్ విభాగం సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గుర్తు చేశారు. ‘‘మనం పెద్ద ఎత్తున సామర్థ్యాల విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నాం. ఇంటర్నెట్ అన్నది సురక్షితంగా ఉండాలి. స్వేచ్ఛాయుతంగా, విశ్వసనీయమైనదిగా ఉండాలి. ఇంటర్నెట్కు సంబంధించిన మధ్యవర్తులు వినియోగదారులకు జవాబుదారీగా వ్యవహరించాలి’’ అని మంత్రి చెప్పారు. ఆసియా పసిఫిక్లో మొదటిది బెంగళూరులో ఏర్పాటు చేసిన కేంద్రం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొదటిదిగా ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. సైబర్ భద్రత విషయంలో టెక్నిక్లపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రంలోనే కొత్త సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సెక్యూరిటీ రెస్పాన్స్ సేవలను అందించనున్నట్టు తెలిపారు. -
అన్నింటా తానై.. ప్రజా సేవలో మమేకమై(ఫోటోలు)
-
ఏపీకి పెట్టుబడుల సిరులు: మేకపాటి గౌతంరెడ్డి
-
ఏపీ పెవిలియన్ను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి గౌతమ్రెడ్డి
-
ఇక సోషల్ మీడియా నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయా?
ఒకప్పుడు ఏదైనా వార్త దూర ప్రాంతంలో ఉండేవారికి చేరాలంటే కొన్ని రోజల సమయం పట్టేది… నేటి సోషల్ మీడియా వలన క్షణాలలో వార్త ప్రపంచం మొత్తం చేరుకుంటుంది. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి కుదించేసింది.. అరచేతిలోనే ప్రపంచంలో ఏమూలా ఏం జరిగినా తెలుసుకోవచ్చును. అయితే, ఇలాంటి సోషల్ మీడియాలో వాస్తవ సమాచారం కంటే నకిలీ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నకిలీ వార్తలను అరికట్టడంలో ఆయా కంపెనీలు విఫలం కావడంతో అనేక దేశాల ప్రభుత్వాలు సోషల్ మీడియా కంపెనీల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు, మన దేశం కూడా భారతదేశంలో పనిచేస్తున్న అన్ని మైక్రో బ్లాగింగ్ కంపెనీలలో మరింత జవాబుదారీ తనం తీసుకొని రావడానికి సోషల్ మీడియా నిబంధనలను కఠినతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ..మరింత జవాబుదారీ తనంగా సోషల్ మీడియా కంపెనీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మహిళల గౌరవాన్ని కాపాడటంలో రాజీ పడబోమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో "బుల్లి బాయి", "** డీల్స్" యాప్స్ మీద కేంద్ర ప్రభుత్వం "తక్షణ చర్య" తీసుకున్నట్లు మంత్రి వైష్నావ్ పేర్కొన్నారు. మతం/ప్రాంతంతో సంబంధం లేకుండా మహిళల గౌరవాన్ని రక్షించడం ప్రభుత్వానికి "ప్రాథమిక భాద్యత" అని ఆయన పేర్కొన్నారు. "మేము సోషల్ మీడియాను నియంత్రించడానికి చర్యలు తీసుకున్నప్పుడల్లా, ప్రతిపక్షాలు వాక్ స్వాతంత్ర్యంపై దాడి చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి, ఇది నిజం కాదు.. మేము సమతుల్యతను సాధించాలి అని చూస్తున్నట్లు" వైష్నావ్ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీపీఐ-ఎం నాయకుడు ఝార్నా దాస్ బైద్యకు మంత్రి సమాధానమిస్తూ.. "సభ ఏకాభిప్రాయానికి వస్తే, మేము మరింత కఠినమైన సోషల్ మీడియా నిబంధనలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము" అని అన్నారు. "ఈ సమయంలో, మేము రాజ్యాంగ బద్దంగా పనిచేస్తున్నాము. కానీ అవును, ముందుకు వెళ్తే మేము సోషల్ మీడియాను మరింత జవాబుదారీగా చేయాలి" సోషల్ మీడియా వేదికల కోసం ప్రభుత్వం ఏవైనా నిబంధనలు లేదా మార్గదర్శకాలను రూపొందించిందా అనే బైద్య ప్రశ్నకు ప్రతిస్పందించాలని వైష్నావ్ పేర్కొన్నారు. (చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు షాక్..!) -
ఇంటర్నెట్పై బడా కార్పొరేట్ల ఆధిపత్యం! కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ను మంచికి వినియోగించడాన్ని ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇంటర్నెట్ ఎప్పటికీ స్వేచ్ఛాయుతంగానే ఉంటుందని, దీనిపై బడా కార్పొరేట్ల ఆధిపత్యం ఉండబోదని భరోసా ఇచ్చారు. ‘ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021’ పేరుతో మెటా (ఫేస్బుక్) నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. పరస్పర గౌరవం, ప్లాట్ఫామ్–యూజర్ల మధ్య జవాబుదారీతనం అనే సంస్కృతి అభివృద్ధి చెందేలా ఇంటర్మీడియరీలు, మెటా వంటి పెద్ద సంస్థలు చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వందకోట్లకు పైగా భారతీయులు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నందున దీన్ని భద్రమైన, విశ్వసనీయమైన సాధనంగా ఉండేలా చూడనున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నెట్ణు మంచికోసం వినియోగించేలా చూసేందుకు ప్రైవేటు కంపెనీలు, దేశ, విదేశీ సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కలసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. చదవండి:గూగుల్లో హ్యాక్ బగ్.. గుర్తించిన భారతీయుడికి నజరానా -
పూర్తి సహకారమందిస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగించనున్న నిపుణుల కమిటీకి తమ పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టంచేసింది. ప్రతిపక్ష నేతలు, సామాజిక ఉద్యమ కారులు, పాత్రికేయులు తదితరులపై కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ సాయంతో నిఘా పెట్టిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. దీంతో ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు స్వతంత్య్ర సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఇటీవల ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి కావాల్సిన మౌలిక, మానవ వనరుల, ల్యాబొరేటరీ వసతులు, సమాచారం ఇలా అన్ని రకాల సహాయసహకారాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘టైమ్స్ నౌ సమ్మిట్ 2021’లో మంత్రి ప్రసంగించారు. ‘ చట్టాన్ని మీరి మోదీ సర్కార్ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో మాకు ఎలాంటి చింతా లేదు. నిపుణుల కమిటీ తుది నివేదిక ఎలా ఉన్నా మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు’ అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ‘ ఇంతవరకూ దేశాన్ని పాలించిన ఏ ప్రభుత్వమూ పెగాసస్ స్పైవేర్ను కొనలేదంటారా?’ అన్న సూటి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ‘ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా గతంలోనే స్పష్టంచేశాం. చట్టాల చట్రంలోనే మా పాలన కొనసాగుతోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఆయా చట్టాలను గతంలో రూపొందించారు. ఆ చట్టాల నాలుగు గోడల మధ్యే మేమున్నాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాలపై నియంత్రణపై ఆయన మాట్లాడారు. మన సంస్కృతి దెబ్బతినకుండా, భవిష్యత్ పరిణామాలకు తగ్గట్లుగా ఐటీ మార్గదర్శకాలు రూపొందాయన్నారు. -
టెక్నాలజీ దిగ్గజంగా భారత్
న్యూఢిల్లీ: భారత్ను మరింత బలమైన టెక్నాలజీ దిగ్గజంగా రూపొందించేందుకు ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రధాని కొన్ని కీలకమైన ఆశయాలను నిర్దేశించుకున్నారని.. వీటి సాకారానికి గాను పోటీతత్వం, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలైన క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామి కానున్నట్టు తెలిపారు. సీఐఐ నిర్వహించిన టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవలను డిజిటైజ్ చేసే దిశగా గడిచిన ఆరేళ్లలో కీలక అడుగులు పడ్డాయని చెప్పారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సమయంలో బలంగా నిలదొక్కొం దని అభిప్రాయపడ్డారు. -
ఇక్కడి చట్టాలను పాటించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో నివసించే, పనిచేసే వారందరూ భారతప్రభుత్వ చట్టాలు, నియమాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఐటీ శాఖ నూతన మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ నూతన మంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే, నూతన ఐటీ నిబంధనల విషయంలో ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టంచేశారు. ట్విట్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ దేశంలోని చట్టాలు అందరికీ సమానమని, అందరూ దీనిని తప్పనిసరిగా పాటించాలని అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు అశ్విని వైష్ణవ్ బుధవారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు రైల్వేశాఖ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ను కలిసిన తరువాత వైష్ణవ్ విలేకరులతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్, ఐటి, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలో బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ స్థానంలో వైష్ణవ్ నియమితులయ్యారు. దేశంలో నూతన నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, ప్రభుత్వం పదేపదే గుర్తుచేసినప్పటికీ ట్విట్టర్ ఇంకా సోషల్ మీడియా మార్గదర్శకాలకు కట్టుబడలేదు. ట్విట్టర్కు రక్షణ కల్పించలేం: ఢిల్లీ హైకోర్టు కొత్త ఐటీ నిబంధనల నుంచి అమెరికాకు చెందిన ప్రముఖ మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విటర్కు ఎలాంటి మినహాయింపు, రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ నిబంధనల ఉల్లంఘన జరిగితే, చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేసింది. తాజా ఐటీ నిబంధనలను అమలు చేస్తామని పేర్కొంటూ అమెరికాలో నోటరీ అయిన అఫిడవిట్ను రెండు వారాల్లోగా సమర్పించాలని జస్టిస్ రేఖ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ట్విటర్ను ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్ నియమించిన అధికారులు కూడా కోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని పేర్కొంది. కోర్టు నుంచి తాము కూడా ఎలాంటి రక్షణ కోరడం లేదని ట్విటర్ తరఫు న్యాయవాది సాజన్ పూవయ్య తెలిపారు. కొత్తగా నియమించిన చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ తదితర అధికారుల వివరాలను జులై 8లోగా కోర్టు ముందుంచాలని గతంలో కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ట్విటర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తాత్కాలిక ప్రాతిపదికను అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. తాత్కాలిక చీఫ్ కంప్లయన్స్ అధికారిని ఇప్పటికే నియమించామని, భారత్లో నివసించే గ్రీవెన్స్ అధికారిని, నోడల్ ఆఫీసర్ను తాత్కాలిక ప్రాతిపదికన ఈ నెల 11న నియమిస్తామని తెలిపారు. వారు తాత్కాలిక అధికారులే అయినా.. పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడ్తారన్నారు. ఫిర్యాదులు, ఇతర వివాదాల విషయంలో పూర్తి స్థాయి బాధ్యత ట్విటర్ తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోరారు. పారదర్శకత ఉండాల్సిందే ఫేస్బుక్కు సుప్రీం స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు పవర్ సెంటర్లుగా మారుతున్నాయని, ప్రజల అభిప్రాయాలను సైతం ప్రభావితం చేయగలుగుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫేస్బుక్కు ఇండియాలో 27 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని గుర్తుచేసింది. ఇలాంటి సామాజిక వేదికలు పారదర్శకత పాటించాల్సిందేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్య కమిటీ తమకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఫేస్బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్ మోహన్తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈశాన్య ఢిల్లీలో గత ఏడాది చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి సాక్షిగా తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ ఢిల్లీ శాసనసభకు చెందిన శాంతి, సామరస్య కమిటీ ఫేస్బుక్తోపాటు ఇతరులకు గతంలో సమన్లు జారీ చేసింది. సాక్షిగా ప్రశ్నించేందుకు పిలిచే విశేష అధికారాలు ఢిల్లీ హైకోర్టుకు, దాని కమిటీకి ఉన్నాయని పేర్కొంది. -
ట్విట్టర్ కు కొత్త ఐటీమంత్రి అశ్విని వైష్ణవ్ వార్నింగ్
-
కీలక రంగాల్లో పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఐటీ సంస్థ ఎంఫపిస్ నూతన కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక నైపుణ్యాన్ని వినియోగించుకుని ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఐటీ ఎగుమతుల్లో ఐదేళ్లుగా బెంగుళూరును అధిగమించడంతో పాటు దేశ సగటు కంటే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ వెల్లడించారు. ఐటీ ఉత్పత్తుల్లో నాణ్యత ఉండాలని వినియోగదారులు కోరుకుంటున్న నేపథ్యంలో.. ఆయా సంస్థలు ఆ దిశగా దృష్టి కేంద్రీకరించాలని, నాణ్యత పెంచేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామన్నారు. ‘టాస్్క’ద్వారా స్థానిక ఇంజనీరింగ్ విద్యార్థులను ఐటీ సంస్థల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. లోకల్ ట్యాలెంట్ను ప్రోత్సహించేందుకు అందరూ ముందుకురావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు కొదవలేదన్నారు. ఐటీ రంగంలోనే అనేక నూతన సాంకేతిక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో స్థానికంగా జరిగే నూతన సాంకేతిక ఆవిష్కరణల్లో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం వహించాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కలి్పంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు మూడేళ్ల క్రితం రాష్ట్రంలో అడుగిడిన ఎంఫసిస్ ఐటీ సంస్థ మూడేళ్లలో మూడింతల వృద్ధి సాధించడం హర్షణీయమని, వేయి మందికి ఉద్యోగావకాశాలు కలి్పంచిన సంస్థ ఎక్కువ మందికి ఉపాధి కలి్పంచేలా ఎదగాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో ఎంఫసిస్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ నితిన్రాకేశ్, ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. అనంతరం మాదాపూర్ వెస్ట్రన్ హోటల్లో థండర్ సాఫ్ట్ ఐటీ కంపెనీ వార్షికోత్సవంలోనూ కేటీఆర్ పాల్గొన్నారు. మరో 850 మందికి ఉద్యోగాలు ఇస్తామని థండర్ సాఫ్ట్ కంపెనీ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. చైనా ఐటీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తునట్లు చెప్పారు. నగరపాలికల్లో విపత్తు నిర్వహణ విభాగాలు రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలకు విపత్తు నిర్వహణ, నిఘా బృందాల (డిజాస్టర్ మేనేజ్ మెంట్–విజిలెన్స్ ఫోర్స్)ను ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ బుద్ధ భవన్లోని జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉల్లంఘనల నిర్వహణను ఆన్లైన్ చేసేందుకు ఉద్దేశించిన నగర సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ను ప్రారంభించి, మొబైల్ యాప్ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అక్రమంగా భవన నిర్మాణ వ్యర్ధాల పారవేత, చెత్త వేయడం, ఫుట్పాత్ల ఆక్రమణ మొదలైన ఉల్లంఘనలు, జరిమానాలను ఈ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. నగరాల్లో జరిగే ప్రమాదాలు, ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు విపత్తు నిర్వహణ విభాగాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీలో భాగంగా తొలిదశలో వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. -
బీపీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తాం : మంత్రి గౌతమ్రెడ్డి
సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ-యువకులకు ఉద్యోగాలు కల్పించేలా బీపీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తామని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య, ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలి సంతకం ఏపీ ఐఐసీ పేమెంట్ క్లియరెన్స్పై చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు వాస్తవమైనవా కాదా అని పరిశీలిస్తామన్నారు. జన్యూన్ ఇండ్రస్టీస్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 పరిశ్రమల ఏర్పాటుకు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, అది వస్తే పరిశ్రమలకు రాయితీ వస్తుందన్నారు. తమ పార్టీ మొదటి నుంచి హోదాపై పోరాటం చేస్తుందని గుర్తుచేశారు. హోదా వచ్చే వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఐటీ శాఖపై ప్రత్యేక దృష్టి సాధించామని, బీజీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తామన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ విధానమని గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. -
నగరంపై కేటీఆర్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని హఫీజ్ పేట్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘1900 కోట్ల రూపాయలతో గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్ల్లో ఇంటింటికి మంచినీరు అందిస్తాం. ఎండాకాలంలో కరెంటు, నీటి సమస్య లేకుండా చేస్తాం. హైదరాబాద్ కోటి జనాభాతో 9 వేల కిలో మీటర్ల మహా నగరం. రోడ్ల పునరుద్దరణ వేగంగా జరుగుతున్నాయి. నగర నీటి అవసరాల కోసం శివారులో 56 రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం. నగరంలో 3100 కోట్లతో త్వరలో అండర గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి కార్పోరేషన్ ద్వారా రోడ్లను బాగు చేస్తున్నాం. ఒఆర్ఆర్ చుట్టూ మంచినీరు అందించేందుకు రింగ్ మాన్ను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ మంచి నీరు అవసరాల కోసం కేశవాపురం రిజర్వాయర్ను సిద్ధం చేస్తున్నాం. కేసీఆర్ ను ఎవ్వరూ ఏమి చేయలేరు. పార్కులను అభివృద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్లోని 150 చెరువుల్లో 550 కోట్లతో 40 చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. అపార్ట్మెంట్స్ వాళ్లు సీవరెజ్ ట్రేట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. నాలాల్లో అందరూ చెత్త వేస్తున్నారు. నగర వాసులు పరిశుభ్రతపై భాద్యతతో మెలగాలి’ అని పేర్కొన్నారు. -
కేటీఆర్కు ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
-
కేటీఆర్కు ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ప్రకటించిన స్కోచ్ సంస్థ ► ఈ నెల 9న ఢిల్లీలో పురస్కార ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ మంత్రి కె.తారక రామారావుకు స్కోచ్ సంస్థ ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9న ఢిల్లీలో జరిగే 49వ స్కోచ్ సమ్మిట్లో అవార్డును అందజేయనున్నట్టు పేర్కొంది. సరికొత్త భారత్ కోసం కేటీఆర్ తెలంగాణను నిర్మిస్తున్నారని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ కొనియాడారు. స్కోచ్ సంస్థ 2003 నుంచి వివిధ రాష్ట్రాల పరిపాలనను అంచనా వేస్తూ వార్షిక స్మార్ట్ గవర్నెన్స్ మ్యాప్ను ప్రకటిస్తోంది. గత ఏడాది తెలంగాణను అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ప్రకటించింది. -
మంత్రిగా లోకేశ్ బాధ్యతలు
-
మంత్రిగా లోకేశ్ బాధ్యతలు
అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేశ్ శుక్రవారం బాధ్యతులు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆయన ఛాంబర్లోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. -
ఓ లుక్కేద్దాం
– టీడీపీ నేత షకిల్షఫీ కుటుంబసభ్యుల నుంచి 204.03 ఎకరాల కొనుగోలు – ప్రతిఫలంగా నగదుతో పాటు షకిల్షఫీ తండ్రికి వక్ఫ్బోర్డు చైర్మన్గిరి కట్టబెట్టే వ్యూహం – ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి మద్దతూ కూడగట్టిన వైనం – ‘పల్లె’ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – టీడీపీలో చిచ్చురేపుతోన్న వక్ఫ్బోర్డు చైర్మన్ ఎంపిక వ్యవహారం (సాక్షి ప్రతినిధి, అనంతపురం) వక్ఫ్బోర్డు చైర్మన్ పదవి విషయమై టీడీపీలో చిచ్చురేగుతోంది. తన అస్మదీయుణ్ని చైర్మన్ చేయాలని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రతిపాదిస్తున్నారు. దీన్ని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మినహా తక్కిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం జిల్లా టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీలోని కీలక వర్గాలు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ పరిధిలోని ఆలమూరు సమీపంలో (నగరానికి అతి దగ్గరగా..) 204.03 ఎకరాల భూమిని మంత్రి పల్లె రఘునాథరెడ్డి కొనుగోలు చేశారు. ఇందులో 117.04 ఎకరాలను గత ఏడాది జూలై 25న, మరో 86.99 ఎకరాలను అక్టోబరు 26న కొన్నారు. మొత్తం భూములను బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున, దాని ప్రస్తుత అధ్యక్షుడు పల్లె రఘునాథరెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూములను అనంతపురానికి చెందిన టీడీపీ నేతలు కేఎం షఫీవుల్లా, కేఎం షకిల్షఫీ, వారి కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నారు. ఇక్కడ ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.15–20 లక్షల వరకు ధర పలుకుతోంది. మంత్రి మాత్రం రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరానికి రూ.1.50 లక్షలు చెల్లించారు. తక్కిన మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే రిజిస్ట్రేషన్లో రూ.3.6 కోట్లు అధికారికంగా చూపించి, అనధికారికంగా రూ.27–30 కోట్లు చెల్లించినట్లు సమాచారం. పదవి కోసం ఒప్పందం! భూ లావాదేవీల సమయంలో షఫీవుల్లాకు, మంత్రి పల్లెకు మధ్య ఓ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. భూములు ఇస్తున్నందున ప్రతిఫలంగా తనకు వక్ఫ్బోర్డు చైర్మన్ పదవి దక్కేలా చూడాలని షఫీవుల్లా కోరినట్లు సమాచారం. అయితే.. తాను మైనార్టీశాఖ మంత్రి అయినప్పటికీ వక్ఫ్బోర్డు చైర్మన్ ఎంపిక ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుందని, దీనిపై తాను హామీ ఇవ్వలేనని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రికి మరో బాధ్యతను అప్పగించారు. వక్ఫ్బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియలో మొదటగా 11మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఒక డైరెక్టర్ను చైర్మన్ చేస్తారు. ముతవల్లిల కోటాలో ఒకరిని డైరెక్టర్గా నామినేట్ చేసే అవకాశముంది. తనను నామినేట్ చేసే బాధ్యతను పల్లెకు అప్పగించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అయిన తర్వాత చైర్మన్ కోసం మరో ప్రయత్నం చేయొచ్చనేది షఫీవుల్లా ఆలోచనగా ఉంది. టీడీపీలో మైనార్టీలెవరూ ఎమ్మెల్యేలుగా విజయం సాధించలేదు. అరువొచ్చిన జలీల్ఖాన్, చాంద్బాషా కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తనకున్న లాబీతో వక్ఫ్బోర్డు చైర్మన్గిరి దక్కించుకోవాలని షఫీవుల్లా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు చేజారితే మరెప్పుడూ దక్కదనే ఆలోచనతో తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. షఫీవుల్లా తెలంగాణ ఏసీబీ డీజీ ఏకేఖాన్కు స్వయాన మామ. ఆయన కుమారైను ఏకేఖాన్ వివాహం చేసుకున్నారు. టీడీపీలో ధిక్కార స్వరం ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు ముఖ్య నేతల వద్ద పల్లె ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిపాదనను అనంతపురం ఎమ్మెల్యే మినహా జిల్లా టీడీపీలోని దాదాపు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించినట్లు సమాచారం. షఫీవుల్లా కుటుంబం టీడీపీని అడ్డుపెట్టుకుని లబ్ధిపొందడం మినహా పార్టీకి వారు చేసేందేమీ లేదని, అయినప్పటికీ షఫీవుల్లా కుమారుడు షకిల్షఫీని శాప్ డైరెక్టర్ చేశామని, తిరిగి అదే కుటుంబానికి వక్ఫ్బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టాలని ప్రతిపాదన తేవడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పల్లె ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కేబినెట్ విస్తరణతో పాటు వక్ఫ్బోర్డు చైర్మన్ ఎంపిక కూడా చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ విస్తరణలో పల్లె పోస్టు ఉంటుందా, ఊడుతుందా అనే అంశంపై స్పష్టత లేదని, ఈ క్రమంలో తన పోస్టును కాపాడుకుంటే చాలని, వక్ఫ్బోర్డు చైర్మన్ ఎంపికలో తలదూర్చడం ఏంటని ఇద్దరు ఎమ్మెల్యేలు పల్లెపై విమర్శలు గుప్పిస్తున్నారు. -
చదువుకున్న అజ్ఞాని మంత్రి పల్లె..
అమడగూరు : ఉన్నత చదువులు చదువుకున్నా మంత్రి పల్లె రఘునాథరెడ్డి అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నాడని పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన జేకేపల్లిలో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ దున్నపోతు ఈనిందంటే గాటికి కట్టేయమన్నట్లు, బుక్కపట్నం చెరువు వివరాలు తెలియజేయాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టరును ఆదేశించిన వెంటనే ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పల్లె రఘునాథరెడ్డి తమ్ముళ్లకు పోటీలు పెట్టించి మరీ చెరువులో పని చేయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేయాలంటే ముందుగా అధికారులు ఎస్టిమేషన్ తయారు చేసి, టెండర్లు పిలిచి సంబంధింత కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సి ఉందన్నారు. అయితే మండలాధికారులకే తెలియకుండా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చెరువులో పడి పనులు చేసుకోవడం ఏమాత్రం సమంజసం అని దుయ్యబట్టారు. మంత్రి పల్లె అండదండలతోనే తెలుగు తమ్ముళ్లంతా ఇలా తెగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో పిచ్చిమొక్కల తొలగింపు (జంగిల్ క్లీనింగ్) పేరుతో రూ.3 కోట్లకు ఎసరు పెట్టారని మండిపడ్డారు. అంతేకాక చెరువులో అంత లోతుగా గుంతలు తీయడం ద్వారా నీటి నిల్వ ఎక్కువై చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ముందన్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవచూపి అనుమతులు లేకుండా ప్రభుత్వ చెరువులో పనులు చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, కన్వీనర్ శేషూరెడ్డి, బుక్కపట్నం కన్వీనర్ సుధాకర్రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, నాగరాజు, బొట్టుస్వామి, నక్కలచిన్నప్ప, జయప్ప, సురేంద్రరెడ్డి, లోకేష్రెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇదేంది పల్లె సారూ!
– ఎమ్మెల్సీ ఓటు నమోదుపై జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు – ముఖ్య అతిథిగా హాజరై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పల్లె – తాము సూచించే అభ్యర్థికి సహకరించాలని హుకుం! ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి. అభ్యర్థులకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు మాత్రమే ఇస్తాయి. ఇందులో పార్టీ గుర్తులేమీ ఉండవు. ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి ఎవరికి ఓటు వేయాలని చెప్పకూడదు. ఈ విషయాలన్నీ మన మంత్రి పల్లె రఘునాథరెడ్డికి తెలియనివి కావు. కానీ అధికారంలో ఉన్నాం.. ఏమైనా చేస్తాం అన్న ధోరణిలో ఆయన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఆదివారం అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై నిర్వహించిన అవగాహన సదస్సు ఇందుకు వేదికైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదుపై ఉపాధ్యాయులకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ‘నవంబర్ 5 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అందరూ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ప్రభుత్వం కూడా మంచి అభ్యర్థిని పెడుతుంది. సహకరించండి’ అని చెప్పడంతో బిత్తెరపోవడం ఉపాధ్యాయుల వంతైంది. ఈయన ప్రభుత్వంలోని మంత్రి హోదాలో వచ్చారా.. లేక పార్టీలో నాయకుడిగా వచ్చారా అని గుసగుసలాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం కూడా అభ్యర్థిని బరిలోకి దించవచ్చా? అని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. మంత్రి అంతటితో ఆగకుండా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని, వాటన్నింటినీ దష్టిలో పెట్టుకుని తాము సూచించిన వారికి.. ప్రభుత్వానికి సహకరించాలని హుకుం జారీ చేశారు. ఎంఈఓలు కీలకంగా వ్యవహరించి ఓటరు నమోదుకు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పనితీరుపై విసుగు తెప్పించే ప్రసంగం చేశారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓటు నమోదుపై అవగాహన కోసం వస్తే ‘ఇదేంది పల్లె సారూ’ అంటూ చర్చించుకున్నారు. అంతకుముందు∙ప్రభుత్వ జూనియర్ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు మంత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజ్ కోసం రెండేళ్ల క్రితం సబ్ కమిటీ వేసినా ఇంత వరకు అతీగతీ లేదంటూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యర్రప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, జోనల్ అధ్యక్షుడు అల్తాఫ్ తదితరులు మంత్రిని నిలదీశారు. తక్షణం పీఆర్సీ అమలు చేయాలని, ఐదు నెలల జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ప్రసంగానికి ముందు డీఈఓ అంజయ్య, ఎస్ఎస్ఏ పీఓ దశరథనామయ్య, ఆర్ఐఓ వెంకటేశ్వర్లు, డీవీఈఓ వెంకటరమణ తదితరులు ఓటు నమోదు ప్రక్రియ ఎలా చేపట్టాలో వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు లక్ష్మీనారాయణ, సుబ్బారావు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పల్లె... నిజాయితీ నిరూపించుకో
నల్లమాడ : గ్యాంగ్స్టర్ మధుతో మంత్రి పల్లె రఘునాథరెడ్డి దోస్తీ వాస్తవమేనని, మంత్రి మాటలే ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అన్నారు. నల్లసింగయ్యగారిపల్లిలోని ఇంట్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి విలేకరులతో మాట్లాడారు. బుక్కపట్నం మండలం యర్లంపల్లికి చెందిన గ్యాంగ్స్టర్ మధుతో పరిచయాలు ఉన్నాయని, 2014 ఎన్నికల్లో తన విజయానికి మధు సహకరించాడని, తాను బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఫోన్ చేస్తుంటాడని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించడం వారిరువురిసంబంధాలను తేటతెల్లం చేస్తున్నాయన్నారు. బెంగళూరు స్థావరంగా గ్యాంగ్స్టర్ మధు కొన్నేళ్లుగా సాగిస్తున్న దందాలు, సెటిల్మెంట్లలో పల్లె ర ఘునాథరెడ్డి సూత్రధారి అనే విషయం స్పష్టంగా అవగతమవుతోందన్నారు. మధును అడ్డం పెట్టుకొనే పల్లె జిల్లాలో రూ.వేల కోట్లు విలువ చేసే భూములను కారుచౌకగా కొట్టేసినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేయాలంటూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వయంగా కోరి, నిజాయితీ నిరూపించుకోవాలని శ్రీధర్రెడ్డి సూచించారు. లేనిపక్షంలో గ్యాంగ్స్టర్ మధుతో మంత్రి పల్లె సంబంధాలపై విచారణ చేయించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో రిట్ దాఖలు చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్రెడ్డి, జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్రెడ్డి, పార్టీ నేతలు సుధాకర్రెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, వెంకటప్పనాయుడు, ఎంపీపీ ఉంట్ల బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసులయాదవ్, విజయమ్మ, సుకన్యా శ్రీనివాసరెడ్డి, కోఆప్షన్ సభ్యులు మాబూఖాన్, కుళ్లాయిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజాసేవలోనే సంతప్తి
అనంతపురం అర్బన్ : జీవించినంత కాలం ప్రజాసేవ చేస్తానని, అందులోనే సంతప్తి ఉందని సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథ్రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి జన్మదినాన్ని నగరంలోని ఆయన స్వగహంలో అభిమానులు వేడుక నిర్వహించారు. మంత్రికి పూలమాలలు వేసి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంలో ఉన్న సంతప్తి ఎందులోనూ లభించదన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయి తగ్గట్టుగా ప్రజాసేవ చేయాలన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
మంత్రి కేటీఆర్కు ఎంసెట్ సెగ
జిల్లాకేంద్రంలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు ఎంసెట్-2 పేపర్ లీకేజీ సెగ తగిలింది. పేపర్ లీకేజీని నిరసిస్తూ సంబంధిత మంత్రులను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు. ప్రతిమ మలిటప్లెక్స్ వద్ద మంత్రి కారు ముందు బైఠాయించారు. ఎంసెట్-2 రద్దు చేయవద్దని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను బలవంతంగా తొలగించి అరెస్ట్ చేశారు. అటు బీజేవైఎం కార్యకర్తలు సైతం మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. -
కేటీఆర్ జన్మదినం... విమానాలతో పూల వర్షం
-
కేటీఆర్ జన్మదినం... విమానాలతో పూల వర్షం
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఆదివారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మూడు విమానాలతో పూల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ భవన్, ట్యాంక్ బండ్లోని బుద్ధునిపైన, కేటీఆర్ చిత్ర పటం ఉన్న ప్రదేశాల్లో పూల వర్షం కురిపించారు. అలాగే నగర శివారులోని పలు ప్రాంతాలతోపాటు అడవుల్లో విమానాల ద్వారా పది లక్షల మొక్కల విత్తనాలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూడా హెలికాప్టర్ ద్వారా విత్తనాలు జల్లుతున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ శిష్యుడు అయిన కె ఎం ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. -
ఐటీ మంత్రికి షాక్!
సాక్షి, చెన్నై: ఐటీ మంత్రి మణిగండన్కు అమ్మ జయలలిత షాక్ ఇచ్చారు. ఆయన చేతిలో ఉన్న రామనాథపురం జిల్లా కార్యదర్శి పదవిని వెనక్కు లాగేసుకున్నారు. కొత్త కార్యదర్శిగా ఎంకే మునుస్వామిని నియమించారు. జిల్లా పదవి ఊడడంతో త్వరలో మంత్రి పదవి కూడా మణిగండన్ చేతి నుంచి జారినట్టే అన్న ప్రచారం బయలు దేరింది. అన్నాడీఎంకేలో, అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఎవరి పదవులకు గ్యారంటీ లేదు. ఎవరి మీద ఎప్పుడు అమ్మ కన్నెర్ర చేస్తారో, పదవులు ఊడుతాయో చెప్పలేం. రాత్రి మంత్రిగా గుడ్ నైట్ చెప్పిన వాళ్లు గుడ్ మార్నింగ్ చెప్పేలోపే మాజీలు అయ్యే పరిస్థితి. మంత్రి వర్గంలో తరచూ మార్పులు జరగడం, పార్టీ పదవుల నుంచి నేతల్ని సాగనంపడం అమ్మకు పరిపాటే. కొత్త ప్రభుత్వంలో పలువురి చేతిలో ఉన్న అదనపు బాధ్యతల్ని మరి కొందరికి అమ్మ పంచి పెట్టారేగానీ, ఇంత వరకు ఏ మంత్రికీ ఉద్వాసన పలకలేదు. ఇందుకు సమయం ఆసన్నమైనట్టుంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో జిల్లా కార్యదర్శి పదవి ఓ మంత్రి చేతి నుంచి ఊడింది. ఈ పదవి ఊడిన పక్షంలో మంత్రి పదవి కూడా త్వరలో దూరం అయినట్టే. ఇందుకు గత అనుభవాలే నిదర్శనం. మంత్రికి షాక్: రామనాథపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే వైద్య విభాగం నేత మణిగండన్ శాసన సభలో అడుగు పెట్టారు. ఎంఎంకే నేత జవహిరుల్లాను ఓడించిన మణిగండన్కు ఐటీ శాఖను అప్పగిస్తూ అమ్మ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. మణిగండన్ పార్టీ కోసం శ్రమిస్తున్నారని చెప్పడం కన్నా, ఆయన తండ్రి రామనాథపురం పార్టీ ప్రిసీడియం చైర్మన్ మురుగేషన్ సేవలకు గుర్తింపుగా పదవులు దక్కాయని చెప్పవచ్చు. మంత్రిగా అవతరించిన మణిగండన్ తన నివాసాన్ని మదురైకు పరిమితం చేశారు. రామనాథపురం జిల్లా కార్యదర్శిగా కూడా పార్టీ పదవిలో ఉన్న ఆయన తనకు వ్యతిరేకంగాఎన్నికల్లో వ్యవహరించిన అధికారుల భరతం పట్టే విధంగా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది. పలువురు అధికారులు అమ్మ దృష్టికి తీసుకురావడం, అదే సమయంలో జిల్లా వైపుగా మంత్రి తొంగిచూడడం లేదన్న ఫిర్యాదులతో ఆయనకు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని గురువారం అమ్మ జయలలిత తీసుకున్నారు. జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఆయన్ను తొలగించడమే కాకుండా, ఆయన వెన్నంటి ఉన్న యూనియన్, జిల్లా యూనియన్ పదవుల్లో ఉన్న మీనాక్షి సుందరం, కె హేమ, సత్యమూర్తిలతో పాటు పలువురికి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి చేతిలో ఉన్న జిల్లా పదవి ఊడినా, వైద్య విభాగం కార్యదర్శి పదవి మాత్రం అలాగే ఉంచారు. అయితే, జిల్లా పదవి ఊడిన దృష్ట్యా, త్వరలో ఆయన మంత్రి పదవిని సైతం కోల్పోయే అవకాశాలు ఎక్కువే. ఇక, రామనాథపురం జిల్లాకు కొత్త కార్యదర్శి గతంలో కార్యదర్శిగా పనిచేసిన మునుస్వామిని నియమించారు. అలాగే, మునుస్వామి సతీమణి కృతిక ముదగళత్తూరు నుంచి ఓటమి చవి చూశారు. ఓడినా ఆమెకు గుర్తింపు ఇస్తూ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడం గమనార్హం. తనకు జిల్లా కార్యదర్శి పదవి మళ్లీ కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చెన్నై చేరుకున్న మునుస్వామి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. -
ఉద్యోగం పేరుతో మంత్రి మోసం
కేకే.నగర్: ఉద్యోగం పేరుతో 23 మంది వద్ద రూ.13 లక్షలు తీసుకుని మోసం చేసిన అన్నాడీఎంకే మంత్రిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అన్నాడీఎంకేకు చెందిన ఐటీ శాఖ మంత్రి, తిరువణ్ణామలై నార్త్ జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి ఎన్.సుబ్రమణియన్, పార్ట్ టైం ఉపాధ్యాయుల పోస్టులకు, గ్రామ సహాయకులు, గ్రంథాలయ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి రూ.13 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఆ డబ్బులను తమకు ఇప్పించాలని పోరూర్ యూనియన్ కమిటీ అధ్యక్షుడు ఎ.రాజన్ను కోరారు. ఆయన లెటర్ప్యాడ్లో ముఖ్యమంత్రి జయలలితకు ఈ విషయాన్ని వివరిస్తూ లేఖ పంపారు. ఫేస్బుక్, వాట్సాప్లలో ఈ సమాచారం దావానంలా వ్యాపించింది. అందులో తాను వేలూరు యూనియన్ కమిటీ అధ్యక్షుడు అన్నాడీఎంకే కార్యదర్శిగా ఉన్నానని తిరువణ్ణామలై నార్త్ జిల్లా కార్యదర్శి ఎన్.సుబ్రమణియన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని 23 మంది వద్ద రూ.13 లక్షలు తీసుకుని ఇప్పటికీ మూడేళ్లు అయ్యిందని, ఇంతవరకు ఉద్యోగాలు ఇప్పించలేదని బాధితులకు సరైన సమాధానం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని దీనిపై వెంటనే పరిష్కారం సూచించాలని అందులో పేర్కొన్నారు. దీనిద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శి లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో మంత్రి చేసిన మోసం వెలుగు చూడటం అన్నాడీఎంకే కార్యకర్తల మధ్య సంచలనం కలిగించింది. -
నేడు ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్
హైదరాబాద్ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశం బుధవారం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు. అందుకోసం బుధవారం ఉదయం 9.00 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో చేపట్టిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్పై మంత్రి కేటీఆర్ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ఈ నెల 8వ తేదీన కేటీఆర్ ముంబై వెళ్లనున్నారు. టాటాగ్రూప్ సంస్థల సీఈవో సైరస్మిస్త్రీతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు, పెట్టుబడులపై మిస్త్రీతో కేటీఆర్ చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత 9వ తేదీన సూరజ్ఖండ్లో జరుగుతున్న హస్తకళల ప్రదర్శనలో కేటీఆర్ పాల్గొనున్నారు. -
'కేసీఆర్ అలా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది'
హైదరాబాద్ : మున్సిపల్ శాఖను తనకిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో సాక్షితో కేటీఆర్ మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 100కు పైగా డివిజన్లలో పర్యటించినట్లు చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఒక్క అవకాశం ఇస్తే.. హైదరాబాద్ రూపు రేఖలు మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కచ్చితంగా కైవసం చేసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు మున్సిపల్ శాఖను ఐటీ మంత్రి కేటీఆర్కి అప్పగిస్తానని శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలపాలని కేటీఆర్ను సాక్షి మీడియా కోరింది. దీంతో కేటీఆర్పై విధంగా స్పందించారు. మున్సిపల్ శాఖను ప్రస్తుతం కేసీఆరే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
సినీకార్మికులపై వరాల జల్లు
-చిత్రపురి కాలనీలో మంత్రుల పర్యటన హైదరాబాద్ సినీ కార్మికులపై రాష్ట్ర మంత్రులు వరాల జల్లు కురిపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వారడిన కోరికలన్నింటినీ అక్కడికక్కడే ఓకే చెప్పేశారు. రాజేంద్రనగర్ మండలం మణికొండ పంచాయతీ చిత్రపురికాలనీలో ఐటీ మంత్రి కె.తారకరామారావు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, రవాణా శాఖమంత్రి పి.మహేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు వారి దృష్టికి తెచ్చిన కాలనీ ప్రధానరోడ్డు నిర్మాణానికి జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ శాఖనుంచి రూ. కోటిన్నర నిధులను ఖర్చుచేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. కాలనీకి రేపటి నుంచి బస్లను నడుపుతామని హామీ ఇచ్చారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు తీసుకోవచ్చని కళాకారుల పింఛన్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. తాము15వేల మంది ఉండగా కేవలం 4 వేలమందికే గృహాలు ఇచ్చారనీ.. మిగతా వారికి పక్కనే ఉన్న మరో 9ఎకరాల భూమిని కేటాయించాలని కోరటంతో ముఖ్యమంత్రితో చర్చించి కేటాయిస్తామని హామి ఇచ్చారు. కాలనీకి ఉచిత వైఫై సేవలను అందించాలని కళాకారులు కోరారు.. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. త్వరలోనే వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు సినిమారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భగా ఆయన ప్రకటించారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయన్నారు. -
రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్
-
ఉచిత వైఫై సేవలు ప్రారంభం
-
'ఎవరినీ ఇబ్బంది పెట్టి భూములు సేకరించలేదు'
హైదరాబాద్ : ఏపీ రాజధాని గ్రామాల్లో గురువారం సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన పర్యటనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి స్పందించారు. పవన్ ఏమన్నారో తమ దృష్టికి రాలేదని, తమ ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ తో పాటు అన్ని వర్గాల సహకారం ఉందని మంత్రి రఘునాధ్ రెడ్డి అన్నారు. అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని , ఎవరైనా ఏ అంశంపైనైనా మాట్లాడవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాజధాని కోసం తమ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టి భూములు సేకరించలేదన్నారు. 50-100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే రాజధాని నిర్మించాలనుకుంటున్నామని మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం 22 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసిందని మంత్రి చెప్పారు. -
సిమెంట్ కంపెనీలకు మంత్రి హెచ్చరిక
-
'సిమెంట్ ధరలు తగ్గించకుంటే రాయితీలు వెనక్కే'
హైదరాబాద్: పెంచిన సిమెంట్ ధరలు వెంటనే తగ్గించండి ... లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వెనక్కి తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి సిమెంట్ కంపెనీ పారిశ్రామికవేత్తలను హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లో సిమెంట్ కంపెనీ పారిశ్రామికవేత్తలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్బంగా పల్లె రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ... పాత రేట్ల ప్రకారమే సిమెంట్ బస్తాలను విక్రయించాలన్నారు. ముడి సరకులు ధరలు తగ్గుతున్నప్పటికీ సిమెంట్ బస్తాల రేట్లు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 4, 5 రోజుల్లో పెంచిన ధరలు తగ్గించాలి.. లేకుంటే చర్యలు తప్పవని పారిశ్రామికవేత్తలకు పల్లె రఘునాథ్రెడ్డి సూచించారు. -
హస్తినలో కేటీఆర్ బిజీబిజీ
-
'కోటి 30 లక్షల మందికి చంద్రన్న కానుక'
తిరుమల: రాష్ట్రంలో కోటి 30 లక్షల మందికి చంద్రన్న కానుకలు అందజేశామని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. బుధవారం తిరుమలలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... చంద్రన్న కానుకపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే... లబ్దిదారులను అవమాన పరిచనట్లే అని పల్లె వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆయన తిరుమలలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ దుకాణం ద్వారా ఆరు రకాల సరుకులను 'చంద్రన్న కానుక' పేరిట టీడీపీ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. -
ఏంటి.. కొత్తగా దీక్షల డ్రామాలు
సిరిసిల్ల : ‘ఏంటీ కొత్తగా దీక్షల డ్రామాలు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నాం. మీ ముందే అధికారులతో మాట్లాడాం. మీరు అన్ని తెలిసి దీక్షలు చేస్తామంటే ఏమనుకోవాలి. దీక్షలు చేసి మీరు హీరోలైతే.. మేం అవులగాళ్లమా..’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మిడ్మానేరు ముంపు గ్రామాల సర్పంచులతో ఘాటుగా మాట్లాడారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో శనివారం ‘ఆసరా’ కార్యక్రమంలో పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆ సమావేశానికి వచ్చి న మధ్యమానేరు ముంపు గ్రామాల సర్పంచులను పక్కకు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్లో ఇరిగేషన్ అధికారులతో స మావేశం ఏర్పాటు చేశాం. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పాం. మిమ్మల్ని ఆ సమావేశానికి పిలిచాం. వాస్తవానికి మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు చెబుతారని మిమ్మల్ని రమ్మన్నాం కానీ ఇప్పుడు దీక్షలంటూ మీరే కొత్త డ్రామా లు ఆడుతున్నారు...’ అంటూ మంత్రి మండిపడ్డారు. మంత్రి మాటలతో కంగుతిన్న సర్పం చులు.. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గ్రామాల్లో ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని స మాధానమిచ్చారు. ‘స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ మీరు చెబితే వింటారా.. మేం చెబితే వింటారా..’ అంటూ కేటీఆర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘మామీద నమ్మకం లేకుంటే మీ ఇష్టం.. దీక్షలు చేసుకుంటే చేసుకోండి.. నేనింకా అన్నం తిన్లేదు. ఆకలవుతోంది. కోపం వస్తోందంటూ’ మంత్రి పక్క కు వెళ్లిపోయారు. మంత్రిని కలిసిన వారిలో నీలోజిపల్లి సర్పంచ్ కూసరవీందర్, కొడుముంజ సర్పంచ్ నవీన్, మాన్వాడ సర్పంచ్ రామిడి శ్రీనివాస్, రేణుక కనకయ్య, మంజుల ఉన్నారు. మంత్రి మాటలతో ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులు బిత్తరపోయారు. -
'రెండు రాష్ట్రాల్లో డిజిటల్ ఇండియా పథకం'
ఢిల్లీ: రాబోవు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిజిటల్ ఇండియా పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర ఐటీ శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ పథకంతో సుమారు రెండు కోట్ల మందికి ఉపాధి కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు తనను కలిసిన సంగతి మీడియాకు తెలిపారు. 2.50 లక్షల గ్రామాలను ఆప్టికల్ పైబర్ నెట్ వర్క్ తో అనుసంధానం చేస్తామని రవిశంకర్ తెలిపారు. ఇదిలా ఉండగా, జమ్మూలో పాక్షికంగా దెబ్బతిన్న టెలీఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించినట్లు స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థను తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చాలా కష్టపడిందన్నారు. -
రాష్ట్రంలో ఐటీ రంగం దినదినాభివృద్ధి చెందుతుంది
రాష్ట్రంలో ఐటీ రంగం దినదినాభివృద్ధి చెందుతుందని ఆ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శనివారం హైదరాబాద్లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ తదానంతరం నెలకొన్న పరిస్థితులు ఐటీ రంగంపై పడలేదని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటుకు నూతన కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఐటీ ఉత్పత్తులు పెరిగాయన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఐటీ ఇంకుబేషన్ సెంటర్ల పని తీరు బాగుందని మంత్రి పొన్నాల పేర్కొన్నారు.