Tata Sons
-
జెన్ఏఐ ద్వారా కొలువులు పెంపు
భారతదేశ జాబ్మార్కెట్, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ) ఎంతో కీలకమని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన టెక్వీక్లో పాల్గొని మాట్లాడారు. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందనే సాధారణ భయాలకు విరుద్ధంగా, జెన్ఏఐ ద్వారా కొలువులు పెరుగుతాయని నొక్కి చెప్పారు.‘తక్కువ నైపుణ్యం కలిగిన సిబ్బంది అధిక స్థాయి సామర్థ్యంతో పనిచేయడానికి వీలు కల్పించడం ద్వారా జెఎన్ఏఐ ఉత్పాదకతను పెంచుతోంది. సంప్రదాయ వ్యాపార ప్రయోజనాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం కంటే కృత్రిమ మేధ సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై భారత్ దృష్టి సారించాలి. భారతదేశ సాంస్కృతిక, భాషాపరమైన అంశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కచ్చితంగా ప్రాతినిధ్యం వహించేలా, వాటిని నిశితంగా అర్థం చేసుకునేలా సార్వభౌమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను(sovereign AI capabilities) అభివృద్ధి చేయాలి. ఈ సామర్థ్యాలు లేకుండా దేశంలోని సంస్కృతులు, భాషలు, ప్రత్యేక సందర్భాలను పూర్తిగా అర్థం చేసుకోవడం వీలవ్వదు’ అన్నారు.ఇదీ చదవండి: అంచనాల్లో 74.5 శాతానికి ద్రవ్యలోటు‘టాటా గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చురుకుగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో ఏఐను వినియోగిస్తూ భారీ ఉద్యోగ కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశాం. టాటా గ్రూప్ ప్రస్తుతం 100కి పైగా జెన్ఏఐ ప్రాజెక్టులను అమలు చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో తయారీ రంగంలో 5,00,000 ఉద్యోగాలు సృష్టించబడుతాయి. భారత ఐటీ సేవల రంగం స్థాయిని పోలిన శక్తివంతమైన రంగాన్ని సృష్టించేందుకు ఏఐకు సామర్థ్యం ఉంది’ అని చంద్రశేఖరన్ తెలిపారు. -
చిప్ ప్రాజెక్టుల కోసం మాతోనే టాటా గ్రూప్ జట్టు ..
ముంబై: సెమీకండక్టర్ల తయారీ ప్రణాళికల్లో ఉన్న టాటా సన్స్ తమ దేశాన్ని కీలక భాగస్వామిగా ఎంచుకుంటుందని సింగపూర్ ధీమా వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ దేశంగా తమకు పేరుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపింది. శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్తో భేటీ అనంతరం సింగపూర్ హోమ్ అఫైర్స్ శాఖ మంత్రి కె. షణ్ముగం ఈ విషయాలు తెలిపారు. సమావేశంలో సెమీకండక్టర్లపై విస్తృతంగా చర్చించినట్లు వివరించారు. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకు అంతర్జాతీయంగా సెమీకండక్టర్ పరికరాల ఉత్పత్తిలో 20 శాతం వాటా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. చిన్న దేశమే అయినప్పటికీ తమ దేశంలో 25 సెమీకండక్టర్ల ఫౌండ్రీలు ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో, దాదాపు అయిదు దశాబ్దాలుగా సింగపూర్లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్ తమతో జట్టు కట్టగలదని షణ్ముగం చెప్పారు. టాటా గ్రూప్ రూ. 91 వేల కోట్లతో గుజరాత్లో, రూ. 27,000 కోట్లతో అస్సాంలో సెమీకండక్టర్ల ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇందుకోసం తైవాన్కి చెందిన పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్తో (పీఎస్ఎంసీ) చేతులు కలిపింది. -
నోయల్ టాటా ఎంట్రీ: ఒకేసారి రెండు బోర్డులలో..
దివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే తాజాగా ఆయన టాటా సన్స్ బోర్డులో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా వెల్లడించింది.2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. టాటా సన్స్లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు.ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇకపైన టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించనున్నారు.ఎవరీ నోయల్ టాటానోయల్ టాటా.. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. టాటా ఇంటర్నేషనల్లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్కి మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. నోయల్ టాటా గ్రూపుతో 40 సంవత్సరాల అనుభవం ఉంది. కంపెనీలోని వివిధ బోర్డుల్లో వివిధ పదవులను నిర్వహించారు. అప్పటికి కేవలం ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్.. నోయల్ సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్సైడ్ రిటైల్ చెయిన్ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుంచి 3 బిలియన్ డాలర్లకు ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్గా, టాటా స్టీల్, టైటాన్లకు వైస్ చైర్మన్గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. -
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అస్తమయం... అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
-
వ్యాపార దిగ్గజం.. దాతృత్వ శిఖరం 'రతన్ టాటా' అస్తమయం
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని ‘నానో’ తెచ్చిన టాటా గొప్ప వితరణశీలి. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దార్శనికుడు. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. రతన్ టాటా మృతిని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. ఆయన తనకు గొప్ప మిత్రుడు, గురువు, మార్గదర్శకుడు అని చెప్పారు. రతన్ టాటా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. ఆయనొక విజనరీ బిజినెస్ లీడర్, అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు సుస్థిరమైన నాయకత్వాన్ని అందించారని చెప్పారు. మెరుగైన సమాజం కోసం కృషి చేశారని, ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూత అందించారని గుర్తుచేశారు. విద్యా, వైద్యం, పారిశుధ్యం, జంతు సంరక్షణ తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించారని పేర్కొన్నారు. విశిష్టమైన వ్యక్తిత్వంతో ఎంతోమందికి ఆప్తుడైన రతన్ టాటా దూరం కావడం చాలా బాధాకరమని ఉద్ఘాటించారు. రతన్ టాటా కుటుంబానికి ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు. ‘రతన్ టాటా ఒక టైటాన్’ అని ప్రశంసిస్తూ వ్యాపారవేత్త హర్‡్ష గోయెంకా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రతన్ టాటా ఇక లేరు అనే నిజాన్ని తాను అంగీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వివిధ రంగాలలో రతన్ టాటా సంస్థలు సంపదలో 65% విరాళం రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా, సూనూ టాటా. ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. అవివాహితుడైన రతన్ టాటా 1962లో టాటా సన్స్లో చేరారు. 1991 నుంచి 2012 దాకా, తర్వాత 2016 నుంచి 2017 టాటా సంస్థ చైర్మన్గా సేవలందించారు. పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రతన్ టాటా వితరణశీలిగా పేరుగాంచారు. తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అనితరసాధ్యుడు..బాల్యం..విద్యాభ్యాసం.. పారిశ్రామిక దిగ్గజం, వితరణ శీలి రతన్ టాటా చాలా సాధారణ జీవితం గడిపేవారు. ఆయన 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా కుమారుడు రతన్ జీ టాటా, దత్తత తీసుకున్న నవల్ టాటా, సూనూ టాటా ఆయన తల్లి దండ్రులు. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో రతన్జీ టాటా సతీమణి అయిన నవాజ్బాయ్ టాటా సంరక్షణలో పెరిగారు. జిమ్మీ టాటా ఆయనకు సోదరుడు కాగా, నోయెల్ టాటా సవతి సోదరుడు. రతన్ టాటా ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అటుపైన అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. 100 బిలియన్ డాలర్లకు టాటా గ్రూప్..రతన్ టాటా 1962లో టాటా సన్స్లో చేరారు. సాధారణ ఉద్యోగి తరహాలోనే పని చేస్తూ కుటుంబ వ్యాపార మెళకువలు తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎల్రక్టానిక్స్ కంపెనీ (నెల్కో)కి డైరెక్టర్ ఇంచార్జ్గా 1971లో ఆయన నియమితులయ్యారు. కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఆర్థిక మందగమనం, కార్మిక సంఘాలపరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. 1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్ సంస్థ ఎంప్రెస్ మిల్స్కి ఆయన బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలు వేసినప్పటికీ మిగతా అధికారులు కలిసి రాకపోవడంతో సంస్థను అంతిమంగా మూసివేయాల్సి వచ్చింది. మొత్తానికి 1991లో జేఆర్డీ టాటా ఆయన్ను టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. భారీ బాధ్యతలను మోయడంలో ఆయనకున్న సామర్థ్యాలపై సందేహాల కారణంగా మిగతా అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ రతన్ టాటా వాటన్నింటినీ తోసిరాజని తన సత్తా నిరూపించుకున్నారు. గ్రూప్ను అగ్రగామిగా నిలిపారు. తన హయాంలో మేనేజ్మెంట్ తీరుతెన్నులను పూర్తిగా మార్చేసి గ్రూప్ కంపెనీలను పరుగులు తీయించారు. 2012లో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చైర్మన్గా నియమితులైన సైరస్ మిస్త్రీతో విభేదాలు రావడంతో తిరిగి 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు మరోసారి చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత ఎన్.చంద్రశేఖరన్కు పగ్గాలు అప్పగించారు. 21 ఏళ్ల పాటు సాగిన రతన్ టాటా హయాంలో గ్రూప్ ఆదాయాలు 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. టాటా గ్రూప్ను అంతర్జాతీయ స్థాయిలో భారీగా విస్తరించారు రతన్ టాటా. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ బ్రాండ్గా ఎదిగింది. సాఫ్ట్వేర్, టెలికం, ఫైనాన్స్, రిటైల్ తదితర రంగాల్లోకి గ్రూప్ విస్తరించింది. రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు 1991లో రూ. 10,000 కోట్లుగా ఉన్న గ్రూప్ టర్నోవరు 2011–12లో ఆయన తప్పుకునే సమయానికి 100 బిలియన్ డాలర్లకు ఎగిసింది. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని విభాగాల్లోకి విస్తరించింది. పలు విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడంతో గ్రూప్ ఆదాయాల్లో దాదాపు సగ భాగం విదేశాల నుంచే ఉంటోంది. ఆయన సాహసోపేత నిర్ణయాల కారణంగా కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు టాటా గ్రూప్లోకి చేరాయి. నానో, ఇండికా కార్లు ఆయన విజనే. వితరణశీలి.. ఇన్వెస్టరు.. రతన్ టాటా గొప్ప వితరణశీలి. తన సంపదలో దాదాపు 60–65% భాగాన్ని ఆయన వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళమిచ్చారు. 2008లో కార్నెల్ వర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళమిచ్చారు. ప్రధానంగా విద్య, ఔషధాలు, గ్రామీణాభివృద్ధి మొదలైన వి భాగాలపై దృష్టి పెట్టారు. ఆయన పలు అంకుర సంస్థల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టారు. వ్యక్తిగత హోదాలో అలాగే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా 30కి పైగా స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశారు. శ్నాప్డీల్, షావోమీ, ఓలా క్యాబ్స్, మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టారు. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన గుడ్ఫెలోస్ అనే స్టార్టప్కు తోడ్పాటు అందించారు. కరోనా నియంత్రణ కోసం రూ.1,500 కోట్లు అందించారు.పురస్కారాలుపారిశ్రామిక దిగ్గజంగానే కాకుండా వితరణశీలిగా కూడా పేరొందిన రతన్ టాటాను పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో పాటు ఆయన మహారాష్ట్ర భూషణ్, అస్సాం వైభవ్ వంటి అవార్డులను కూడా అందుకున్నారు. సిమీ గ్రేవాల్తో అనుబంధం..రతన్ టాటా వివాహం చేసుకోవాలనుకున్నా సాధ్యపడలేదని ఆయనే పలు సందర్భాల్లో తెలిపారు. నాలుగు సార్లు వివాహానికి దగ్గరగా వచ్చినా పలు కారణాల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. అప్పట్లో బాలీవుడ్ నటి సిమీ గ్రేవాల్తో ఆయన ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆమె ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నారు.మిస్త్రీతో వివాదం..టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా ఏరి కోరి సైరస్ మిస్త్రీని తన వారసుడిగా నియమించారు. కానీ మిస్త్రీ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి 2016లో మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. దీనిపై ఇరువర్గాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. ఆయన మార్గదర్శకత్వం అమూల్యం ఆనంద్ మహీంద్రా రతన్ టాటా లేరన్నది నేను అంగీకరించలేక పోతున్నా. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ముందడుగులో ఉంది. మనం ఈ స్థానంలో ఉండటానికి రతన్ జీవితం, పని తీరుతో చాలా సంబంధం కలిగి ఉంది. ఈ సమయంలో అతని మార్గదర్శకత్వం అమూల్యం. మన ఆర్ధిక సంపద, విజయాలకు ఆయన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. లెజెండ్స్కి మరణం లేదు.దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త ప్రధాని నరేంద్ర మోదీ రతన్ టాటా దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త. దయార్ధ్ర హృదయం కలిగిన అసాధారణ వ్యక్తి. భారత దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఇదే సమయంలో ఇతని సహకారం బోర్డు రూమ్ను మించిపోయింది. ఎంతో మందికి ఆప్తుడయ్యారు.లక్షలాది మంది జీవితాలను తాకిన దాతృత్వంరతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాము. ఎంతో మందికి అమూల్యమైన సహకారం అందించిన నిజమైన అసాధారణ నాయకుడు. టాటా గ్రూప్ మాత్రమే కాదు.. మన దేశం స్వరూపం కూడా. టాటా గ్రూప్కు.. ఆయన చైర్పర్సన్ కంటే ఎక్కువ. వ్యాపార వేత్తలందరికీ ఆయన ఓ దిక్సూచి. టాటా దాతృత్వం లక్షలాది మంది జీవితాలను తాకింది. విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు రాబోయే తరాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. ఆయన్ని ఇష్టపడే వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ -
Ratan Tata: నేను బాగానే ఉన్నా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది. -
సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు
టాటా సన్స్ కంపెనీ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆగస్టు 16న కలిశారు. అదే రోజు – ‘టాస్క్ ఫోర్స్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’ కో– చైర్మన్ చంద్రశేఖర్ అని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ముఖ్య మంత్రి దీనికి చైర్మన్. ‘రాబోయే ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబోతున్నది. ఇందులో అగ్రశ్రేణి ఇండస్ట్రీ ‘లీడర్లు’, నిపుణులు ఉంటారు’ అని పత్రికల్లో వార్తలొచ్చాయి. ఇది విన్నాక,ముందుగా ఈ విషయం చెప్పాలి అనిపించింది. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ కంపెనీ ‘అమెజాన్’ తన రిక్రూట్మెంట్ విభాగంలో ఇకముందు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏ.ఐ.) వాడ వద్దని నిర్ణయం తీసుకుంది. ‘రిక్రూట్మెంట్’ కోసం దరఖా స్తులు ‘స్క్రూటినీ’ చేసేటప్పుడు, ‘జెండర్’ అని ఉండేచోట– ‘ఆడ’ అని ఉంటే, ‘ఏఐ’ వాటిని తిరస్కరిస్తున్నది. అది గమ నించాక, కంపెనీ దాని వాడడం వెంటనే ఆపేసింది. అటువంటి కంపెనీలే అంత బాధ్యతగా ఉంటున్నప్పుడు, ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వాలు యువతరం జీవితా లను ప్రభావితం చేసే ఉపాధి అంశాల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలనేది అవి గ్రహించాలి. టీడీపీ ప్రభుత్వం 2015లో ఇలాగే– ‘స్ట్రాటజిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సా్ఫర్మింగ్ – ఏపీ’ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసినట్లుగా వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత, దానికి కొనసాగింపు కనిపించలేదు. ‘ఫేస్ బుక్’, ‘గూగుల్’ వంటి సామాజిక మాధ్యమాల బహుళ జాతీయ కంపెనీలు కొత్తగా అమరావతికి వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ ‘ఏఐ’ యూనివర్సిటీ వస్తుంది అని ఆ శాఖ మంత్రి అంటున్నారు. గతంలో ‘గేమ్స్ సిటీ’ అన్నారు. అయితే ఈ దిశలో ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన కసరత్తు ఇప్పటికే మొదలైతే, అది మంచిదే. అలాగే, వాటితోపాటు ఎన్నికల ముందు కూటమి వెల్లడించిన– ‘స్కిల్ సెన్సెస్’ వెంటనే పూర్తికావాలి. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు తమ వద్ద లేవనుకున్నప్పుడు ఇదొక పద్ధతి. అలా కాకుండా తాము చేసింది ఏదైనా అది ఆ ప్రాంతానికీ, ప్రజలకూ కూడా శాశ్వత ప్రయోజనం కలగాలి. తామే అందుకు ప్రత్యామ్నాయాలు వెతకాలని ప్రభుత్వం అను కొన్నప్పుడు అది మరోలా ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లో ప్రారంభించిన ‘సెజ్’లో ఇప్పుడు ‘శ్రీసిటీ’గా అందరికీ తెలిసిన–‘సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ’ (టౌన్ షిప్) ఉంది. అదిప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. రాష్ట్రానికి ఏ ప్రపంచ దిగ్గజ కంపెనీ వచ్చినా వాళ్లకు ప్రభుత్వాలు ఇప్పుడు చూపించేది– ‘శ్రీసిటీ’. సీఎమ్గా వైఎస్ మొత్తం 22 ‘సెజ్’లకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చారు. నాన్న కృషికి కొనసాగింపు అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో రాయలసీమ ఖనిజ నిక్షేపాల విలువ పెంచడానికి కడప జిల్లా కొప్పర్తి వద్ద ‘మెగా ఇండస్ట్రియల్ హబ్’ కోసం 2020లో 3,155 ఎకరాలను కేటాయించారు. ఇది కర్నూల్ – రాణిపేట నేషనల్ హైవేకి, రైల్వే లైన్, కడప ఎయిర్ పోర్ట్కు సమీపాన ఉండడమే కాకుండా... రేణిగుంట అంతర్జాతీయ విమానా శ్రయానికి 145 కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తున్న వసతులతో రూ. 25,000 కోట్ల మేర పెట్టు బడులు వస్తాయనీ, 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనీ 2020 డిసెంబర్ నాటి ప్రభుత్వ అంచనా. కనీసం శ్రీసిటీ, కొప్పర్తి వంటి పారిశ్రామిక కూడళ్ళ వద్ద, అలాగే కొత్త జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పడే మార్కెట్ డిమాండ్ దృష్ట్యా సూక్ష్మ స్థాయిలో ‘సర్వీస్ సెక్టార్’లో ‘ఐటీఐ’, ‘పాలి టెక్నిక్’ స్థాయిలో ‘కరిక్యులం’ సమీక్ష అనేది ముందు... ‘స్కిల్ సెన్సెస్’ పూర్తి అయితే అప్పుడు వాటిని సరిచేసుకోవచ్చు. దానివల్ల ‘స్టార్ట్ అప్’లకు ‘ఎంఎస్ఎంఈ’లకు అవసరమైన కొత్త ‘మ్యాన్ పవర్’ దొరుకుతుంది. కానీ ఇవన్నీ ‘పెండింగ్’లో ఉంచి, అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున –‘అంకుర యాత్ర’ పేరుతో భారీ బస్ ర్యాలీ అమరావతి నుంచి శ్రీసిటీ వరకు ప్రభుత్వం ‘ప్లాన్’ చేసింది. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘ఎన్నారై’లు మన ‘స్టార్ట్ అప్’లను ప్రోత్సహించడానికి ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు. అదలా ఉంటే, కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ‘విజన్ డాక్యుమెంట్లు’ తయారుచేస్తారని వార్తలు వస్తున్నాయి. పరిపాలనలో ఇంత అనుభవం ఉన్న పార్టీ ప్రభుత్వానికి మళ్ళీ ఇటువంటి కసరత్తు అవసరమా? మరి ఏ ‘విజన్’ అనకుండానే గత ప్రభుత్వం ఉద్యానవనం, పరిశ్రమలు రెండింటినీ కలుపుతూ కొత్తగా ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ప్రారంభించింది. దాంతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మొదటిసారి ఆ శాఖకు మంత్రిని నియమించింది. ఈ శాఖ ఏర్పాటుతో రైతులకు సంప్రదాయ పంటల సాగు కంటే ఉద్యా నవన ఉత్పత్తులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఇలా గత ప్రభుత్వం చూపించిన బాటలో కూటమి ప్రభుత్వం కొన సాగుతూ మైక్రో ఇరిగేషన్తో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2029 నాటికి రెట్టింపు చేస్తాం అంటున్నారు. కేంద్ర–రాష్ట్రాలు కలిసి ప్రస్తుతం ఇస్తున్న 55% సబ్సిడీని ఇక ముందు 90% శాతానికి పెంచాలని నిర్ణయించారు. వాస్తవానికి అభివృద్ధి ప్రణాళికల అమలు పలు దొంత ర్లుగా ఉంటుంది. అదలా ఉన్నప్పుడే, సూక్ష్మ స్థాయి వరకు ఇంకి కొన్ని తరాలు పాటు ఆ మేలు చివరి ‘మైలు’ వరకు చేరు తుంది. ఇంతకూ ‘విజన్’ అంటే ఏమిటి? ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ తాడేపల్లిగూడెం వద్ద హార్టీకల్చర్ యూనివర్సిటీ పెడితే, విభజిత ఏపీలో జగన్ ‘ఫుడ్ ఇండస్ట్రీ శాఖ పెట్టడం! ఫలితంగా ఈ ప్రభుత్వంలో దానికి కొత్తగా ఒక మంత్రి వచ్చి, పంట విస్తీర్ణం రెట్టింపు లక్ష్యంగా ప్రకటించడం. దానివల్ల ప్రయోజనాల వ్యాప్తి 26 జిల్లాలకు ఉంటుంది. అది మట్టిలో చేసే సాగుబడి నుంచి, ఆ ఉత్ప్పత్తులను ‘ఆన్ లైన్’లో మార్కె టింగ్ చేస్తూ ‘డెస్క్’ వద్దకు చేరింది! ప్రతి దశలోనూ ఇందులో యువత ప్రయోజనాలు పొందుతుంది. నిజానికి ఇది ‘ప్రాంతము– ప్రజలు’ కేంద్రిత అభివృద్ధి నమూనా.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
దేశంలో అత్యధిక వేతనం.. ఈయనదే..
దేశంలో అత్యధిక వేతనం పొందే ప్రొఫెషనల్ చీఫ్గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ రూ. 135 కోట్ల వేతన పరిహారాన్ని అందుకున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆయన వేతనం ఈ ఏడాది 20 శాతం పెరిగింది.చంద్రశేఖరన్ ఈ ఏడాది అందుకున్న రూ. 135 కోట్ల ప్యాకేజీలో కంపెనీ లాభాల నుండి ఆర్జించిన కమీషన్లు రూ. 122 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 13 కోట్ల జీతం, పెర్క్విజిట్లు ఉన్నాయి. ఇక టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ రూ. 30 కోట్లు అందుకుని టాటా సమ్మేళనంలో అత్యధిక వేతనం పొందుతున్న రెండో ఎగ్జిక్యూటివ్గా నిలిచారు.చంద్రశేఖరన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆరు లిస్టెడ్ టాటా కంపెనీల నుండి సిట్టింగ్ ఫీజులో అదనంగా రూ.17 లక్షలు అందుకున్నారు. ఈ సంస్థల్లో ఆయన వాటా విలువ రూ.168 కోట్లు. ఇదిలా ఉండగా విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 167 కోట్లు అందుకున్నారు. -
2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్
ధోలేరా (గుజరాత్): టాటా ఎల్రక్టానిక్స్ తలపెట్టిన ధోలేరా (గుజరాత్) ప్లాంటు నుంచి చిప్ల తొలి బ్యాచ్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్ నోడ్ల చిప్స్ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్నకు చెందిన రెండు, సీజీ పవర్కి చెందిన ఒక చిప్ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్లో చికెన్ ముక్కలు’!
టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుందా? ఫలితంగా ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థపై నమ్మకం సన్నగిల్లుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఎయిరిండియా సంస్థలోని వరుస సంఘటనలు. టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసిన ఆరంభం నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇప్పటికే ప్రయాణికులపై మూత్ర విసర్జన,దుబాయ్- ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్పిట్లోకి ప్రియురాలు, మహిళ భోజనంలో రాయి వంటి వరుస వివాదాలతో ఆ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా, మరో మహిళ వెజ్మీల్స్లో చికెన్ ముక్కలు కనిపించడంతో కంగుతినడం ఆమె వంతైంది. వీర్జైన్ అనే మహిళ ప్రయాణికురాలు కాలికట్ టూ ముంబై ఏఐ582 ఎయిరిండియా విమానం ఎక్కింది. సాయంత్రం 6.40 బయలుదేరాల్సిన విమానం 7.40కి ప్రారంభమైంది. కొన్ని సార్లు రాకపోకల కారణంగా ఫ్లైట్ జర్నీ కొంచెం ఆలస్యం అవుతుందిలే అని సర్ది చెప్పుకుంది. వీర్జైన్కు జర్నీ ప్రారంభమైంది. కొద్దిసేపటికి బాగా ఆకలివేసిన వీర్జైన్ వెజ్మీల్స్ ఆర్డర్ చేసింది. సిబ్బంది వెజ్మీల్స్ తెచ్చారు. అసలే ఆకలి..పైగా ప్లేట్లో మీల్స్ వేడివేడిగా ఉండడంతో ఆతృతగా ఆరగించే ప్రయత్నం చేసింది. క్రూ సిబ్బంది సర్వ్ చేసిన ఆహార ప్యాకెట్పై ‘వెజ్ మెయిన్ మీల్’ అని స్పష్టంగా రాసిఉన్నా.. అందులో చికెన్ పీసెస్ రావడం పట్ల ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందని ఎయిరిండియా కేబిన్ సూపర్వైజర్ సోనాని ప్రశ్నించింది. వీర్జైన్తో పాటు తన స్నేహితురాలు సైతం తన వెజ్ ప్లేట్లో చికెన్ ముక్కలు వచ్చాయంటూ ఫిర్యాదు చేసింది. పట్టించుకోని ఎయిరిండియా సిబ్బంది? అయితే జరిగిన తప్పిందంపై ఎయిరిండియా సిబ్బంది సరిగ్గా స్పందించ లేదని.. సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగొచ్చిన ఎయిరిండియా.. ఆపై క్షమాపణలు ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఇలాగే పునరావృతమైతే ఎయిరిండియాపై ప్రయాణికులకు నమ్మకాన్ని పోగొట్టుకుంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎయిరిండియాకు ఏమైందని, ఆ సంస్థ సీఈఓ కాంప్బెల్ విల్సన్, మాతృ సంస్థ టాటా గ్రూప్ చర్యలు తీసుకుంటే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోనాజైన్ ఫోటోలపై ఎయిరిండియా స్పందిస్తూ క్షమాణలు చెప్పింది. చదవండి👉 అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ సింఘానియా! -
రతన్ టాటాకు ప్రాణ హాని
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్ కాల్ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్ హెచ్చరించాడు. సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబర్ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్ టాటా భద్రతను పెంచారు. కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్ రూమ్కు ఇతను ఫోన్ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. -
1నుంచి టీసీఎస్ బైబ్యాక్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్).. సొంత ఈక్విటీ షేర్ల కొను గోలు(బైబ్యాక్)ను డిసెంబర్ 1నుంచి ప్రారంభించనుంది. షేరుకి రూ. 4,150 ధర మించకుండా 1.12 శాతం ఈక్విటీకి సమానమైన 4.09 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 17,000 కోట్లవరకూ వెచి్చంచనుంది. బైబ్యాక్లో భాగంగా రూ. 2 లక్షల పెట్టుబడిలోపుగల చిన్న ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 6 షేర్లకుగాను 1 షేరుని తీసుకోనుంది. ఇందుకు రికార్డ్ డేట్ నవంబర్ 25కాగా.. ఇతర సంస్థాగత ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 209 షేర్లకుగాను 2 షేర్లను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ షేర్ల తాజా బైబ్యాక్ ప్రభావం కంపెనీ లాభదాయకత లేదా ఆర్జనపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది. బైబ్యాక్ కారణంగా పెట్టుబడులకు వినియోగించగల నిధులు మాత్రమే ఆమేర తగ్గనున్నట్లు వివరించింది. వెరసి కంపెనీ వృద్ధి అవకాశాలకు ఎలాంటి విఘాతం కలగబోదని స్పష్టం చేసింది. ప్రమోటర్ల వాటా.. టీసీఎస్లో ప్రమోటర్ టాటా సన్స్ 72.27 శాతానికి సమానమైన 26.45 కోట్ల షేర్లను కలిగి ఉంది. వీటిలో బైబ్యాక్కు 2.96 కోట్ల షేర్లను దాఖలు చేయనుంది. ఇక టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తమవద్ద గల 10,14,,172 షేర్లలో 11,358 షేర్లను టెండర్ చేయనుంది. టీసీఎస్ మొత్తం 4,09,63,855 షేర్లను బైబ్యాక్ చేసే లక్ష్యంతో ఉంది. బైబ్యాక్కు పూర్తిస్థాయిలో షేర్లు దాఖలైతే కంపెనీలో ప్రమోటర్ల వాటా ప్రస్తుత 72.3 శాతం నుంచి 72.41 శాతానికి బలపడనుంది. కాగా.. బైబ్యాక్ పూర్తయిన తదుపరి ఏడాదివరకూ టీసీఎస్ మూలధన సమీకరణ చేపట్టబోదు. గతేడాది సైతం షేరుకి రూ. 4,500 ధరలో ఈక్విటీ బైబ్యాక్కు రూ. 18,000 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. అంతక్రితం 2020, 2018, 2017లలో సైతం బైబ్యాక్లకు సుమారు రూ. 16,000 కోట్లు చొప్పున పెట్టుబడులను వెచి్చంచడం విశేషం! కంపెనీ తొలిసారి 2017లో మార్కెట్ ధరకంటే 18 శాతం అధిక ధరలో షేర్ల కొనుగోలుకి తెరతీసింది. ఆపై 18–10 శాతం మధ్య ప్రీమియంలో బైబ్యాక్లను పూర్తి చేసింది. 2022 బైబ్యాక్కు 17 శాతం అధిక ధరను చెల్లించింది. తాజా బైబ్యాక్ తదుపరి షేరువారీ ఆర్జన(ఈపీఎస్) రూ. 58.52 నుంచి 59.18కి మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం లాభపడి రూ. 3,515 వద్ద ముగిసింది. -
ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!
ప్రపంచం కుబేరుల జాబితాలోనే కాదు, భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల లిస్ట్లో కూడా దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరు ఎందుకు లేదనే సందేహం ఇప్పటికే చాలామంది మనసులో ఒక ప్రశ్నగా మిగిలి ఉంటుంది. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఉప్పు నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన రీతిలో దూసుకెళ్తున్న టాటా సన్స్ కంపెనీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఈయన సంపద వేల కోట్లలో ఉంటుంది. అయినప్పటికీ ధనవంతుల జాబితాలో ఈయన పేరు లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ డబ్బుని దాతృత్వానికి వినియోగించడమే. అపారమైన వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన పేరు ప్రతిష్టతలు కలిగిన రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు. కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ కారణంగానే టాప్ 10 ధనవంతుల జాబితాలో కూడా ఉండలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే! 2021 - 22లో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. టాటా సంస్థల్లో ఏకంగా 9,35,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కాగా రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
నమ్మరు కానీ రతన్ టాటా తమ్ముడితడే.. చిన్న అపార్ట్మెంట్లో..
Ratan Tata Brother Jimmy Naval Tata: భారతీయ ఆటో మొబైల్ రంగానికి ఆజ్యం పోసిన టాటా కుటుంబం గురించి అందరికి తెలుసు. అయితే ఇప్పుడు టాటా గ్రూప్ అనగానే 'రతన్ టాటా' గుర్తుకు వస్తాడు. అయితే రతన్ టాటాకి వివాహం కాలేదు, కానీ తోబుట్టువులతో కూడిన ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో చెప్పుకోదగ్గ వ్యక్తి రతన్ టాటా తమ్ముడు 'జిమ్మీ నావల్ టాటా'. రతన్ టాటా తమ్ముడంటే ఆయన మాదిరిగానే వ్యాపార లావాదేవీలు బాగా చూసుకునే వ్యాపార వేత్త, బిలీనియర్ అని ఊహిస్తారు. కానీ ఆలా ఊహిస్తే మీ ఊహ తప్పే అవుతుంది. ఎందుకంటే జిమ్మీ నావల్ టాటా వారి వ్యాపార సామ్రాజ్యానికి దూరంగా సాధారణ ప్రజలలో ఒకరుగా కలిసి జీవిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ముంబైలో ఒక 2BHK అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. జిమ్మీ నావల్ టాటా మీడియాకి దూరంగా ఉండటమే కాకూండా, వ్యాపారాలన్నింటికీ కూడా దూరంగా ఉంటూ చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. నావల్ టాటా కుమారుడు, రతన్ టాటా తమ్ముడై ఉండి ఇలాంటి జీవితం గడుపుతున్న జిమ్మీ నావల్ టాటాను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. 90వ దశకంలోనే జిమ్మీ నావల్ తన తండ్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన వస్త్ర వ్యాపారంలో వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక టాటా ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలలో పనిచేసి అనతి కాలంలోనే విరమణ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒక చిన్న ఫ్లాట్లో సామాన్యుడిలా జీవిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) ఈ ఏడాది ప్రారంభంలో రతన్ టాటా తన తమ్ముడు జిమ్మీ టాటాతో కలిసి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'అవి సంతోషకరమైన రోజులు, మా మధ్య ఏమి రాలేదు' అని ఇందులో రాసారు. ఆ ఫోటో 1945లో తీసుకున్నట్లు ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?) రతన్ టాటా ఆస్తులు సుమారు రూ. 3500 కోట్లకంటే ఎక్కువ. అయితే ఇప్పటి వరకు చాలా మందికి తెలియని జిమ్మీ నావల్ రతన్ టాటా కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. ఎందుకు ఈయన వ్యాపారాల మీద ఆసక్తి చూపడం లేదు అనేదానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకోవడం వల్ల అన్నింటికీ దూరంగా ఉన్నాడని తెలుస్తుంది. (ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు) Did you know of Ratan Tata's younger brother Jimmy Tata who lives a quiet reticent life in a humble 2 bhk flat in Colaba, Mumbai! Never interested in business, he was a very good squash player and would beat me every time. Low profile like the Tata group! pic.twitter.com/hkp2sHQVKq — Harsh Goenka (@hvgoenka) January 19, 2022 RGP ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయాంక్ గతంలో షేర్ చేసిన ఒక ట్విటర్ పోస్ట్లో జిమ్మీ టాటా ఒక చిన్న ఫ్లాట్లో ఉన్నారని, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పారు. అంతే కాకుండా అతడు మంచి స్క్వాష్ ప్లేయర్ అని తనని (గోయెంకాను) ఎప్పుడూ ఓడించేవాడని చెప్పుకొచ్చాడు. కొన్ని వార్తా పత్రికలు అందించిన సమాచారం ప్రకారం.. జిమ్మీ టాటాకు మొబైల్ ఫోన్ లేదని, కేవలం వార్తాపత్రిక ద్వారా అతని అన్ని అప్డేట్లను పొందుతారని తెలిసింది. -
టాటా ట్రస్ట్స్ తొలి సీవోవోగా అపర్ణ ఉప్పలూరి
సాక్షి,ముంబై: టాటా ట్రస్ట్స్ కొత్త సీఈవో, సీవవో లను ఎంపిక చేసింది. సిద్ధార్థ్ శర్మను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, అపర్ణ ఉప్పలూరిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నియమించింది. ఈ నియామకాలు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లోకి వస్తాయని సంస్థ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపింది. టాటా ట్రస్ట్స్ తొలి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా అపర్ణ ఉప్పలూరి (48) ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం ఫోర్డ్ ఫౌండేషన్లో భారతదేశం, నేపాల్ శ్రీలంకలకు ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నారు ఆమె. 2018, మేలో ప్రోగ్రాం ఆఫీసర్గా ఫౌండేషన్లో చేరిన ఆమె పరోపకారం, మహిళల హక్కులు, ప్రజారోగ్యం, కళలు సాంస్కృతిక రంగాలలో వ్యూహాత్మక ప్రణాళిక కార్యక్రమాల అభివృద్ధిలో పాపులర్ అయ్యారు అపర్ణ. జెండర్ ఈక్వాలిటీ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఫోర్డ్ ఫౌండేషన్లో గ్రాంట్-మేకింగ్ కార్యక్రమాల నిర్వహణలో 20 ఏళ్ల లీడర్షిప్ , మేనేజ్మెంట్ అనుభవం ఆమె సొంతం. ఇక 2022లో టాటా ట్రస్ట్ల సీఈవో పదవికి రాజీనామా చేసిన ఎన్ శ్రీనాథ్ ప్లేస్లో సిద్ధార్థ్ శర్మ శర్మ ఎంపికైనారు. కాగా టాటా ట్రస్ట్స్, భారతదేశంలోని పురాతన స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి, టాటా సన్స్లో 66 శాతం వాటాను టాటా ట్రస్ట్స్ సొంతం. -
‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్ వైరల్!
రతన్ టాటా.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా తన దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తన పోస్ట్లతో పలకరిస్తూ భారీగా ఫోలోవర్స్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సోషల్మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రగతి కోసం తన వంతు కృషి చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన టాటా ఇండికా కారుని ప్రారంభించ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని గుర్తుచేసుకుంటూ తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ చేశారు. అందులో .. ‘25 ఏళ్ల క్రితం టాటా ఇండికా ప్రారంభం కావడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా మనస్సులో ప్రత్యేక స్థానం ఉందంటూ..’ టాటా ఇండికాతో దిగిన ఫోటో షేర్ చేశారు. 1998లో ఇండికా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగాన్ని ప్రారంభించింది. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే సక్సెస్ ట్రాక్లోకి వచ్చింది. ఇందులోని ఫీచర్లు, అందుబాటు ధరల కారణంగా త్వరగా ఈ కారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇరవై సంవత్సరాల తర్వాత, టాటా మోటార్స్ ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొన్న తర్వాత 2018లో కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) చదవండి: ‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’.. అమెజాన్ ఉద్యోగుల అంతులేని వ్యథ -
సంస్కరణలతో భారత్ వృద్ధికి దన్ను
న్యూఢిల్లీ: రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత్కు వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు ఊతంగా నిలవనున్నాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ముందు, తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలకు గట్టి పునాదిగా ఉండగలవని చంద్రశేఖరన్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటి కి భారత్ 25–30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించగలదని ఆయన తెలిపారు. అయితే, అసంఘటిత రంగంలోని వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, మహిళలు సహా ప్రజలందరికీ ఆ ఫలాలు దక్కేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చంద్రశేఖరన్ పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మహమ్మారి సమయం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు మరింతగా పుంజుకున్నాయని ఆయన చెప్పారు. -
బీ20 చెయిర్గా ‘టాటా’ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: జీ–20లో భాగమైన బీ20 ఇండియా చెయిర్గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ వెల్లడించింది. జీ–20 దేశాల వ్యాపార వర్గాలకు బిజినెస్ 20 (బీ–20) చర్చా వేదికగా ఉండనుంది. ప్రస్తుతం జీ–20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ పరిశ్రమ వర్గాల అజెండాను అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలకు తెలియజేయడానికి కూడా బీ20 తోడ్పడనుంది. సమతూక అభివృద్ధి సాధన దిశగా గ్లోబల్ బీ20 అజెండాను ఇది ముందుకు తీసుకెళ్లగలదని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కార మార్గాలను కనుగొనడంలో జీ–20కి సహాయకరంగా ఉండగలదని చంద్రశేఖరన్ చెప్పారు. -
Cyrus Mistry: గౌరవం కోసం పోరాటం..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీనితో, కొన్నాళ్ల క్రితమే టాటా గ్రూప్ నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీ తాజాగా జీవితం నుంచి కూడా అర్ధాంతరంగా నిష్క్రమించినట్లయింది. టాటా సన్స్లో అత్యధికంగా 18 శాతం పైగా వాటాలున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తరఫున 2012లో టాటా గ్రూప్ చైర్మన్గా పగ్గాలు చేపట్టే వరకూ.. కుటుంబ వ్యాపార వర్గాల్లో తప్ప సైరస్ మిస్త్రీ పేరు పెద్దగా బైట వినిపించేది కాదు. 1991లో మిస్త్రీ తమ కుటుంబ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్లో (ఎస్పీ) డైరెక్టరుగా చేరారు. 1994లో ఎండీగా నియమితులయ్యారు. ఎస్పీ గ్రూప్ కార్యకలాపాలు మెరైన్, ఆయిల్, గ్యాస్, రైల్వే తదితర రంగాల్లోకి విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2006లో కీలకమైన టాటా సన్స్ బోర్డులో చేరారు. అప్పటివరకూ ఆయన పలు టాటా కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు. సాధారణంగా నలుగురిలో ఎక్కువగా కలవకపోయినా.. తెలిసినంత వరకూ వ్యాపార దక్షత విషయంలో ఆయనకు మంచి పేరు ఉండేది. ఇదే టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటా తన వారసుడిగా మిస్త్రీని ఎంచుకునేలా చేసింది. వాస్తవానికి టాటా పగ్గాలు చేపట్టడానికి మిస్త్రీకి ఇష్టం లేకపోయినప్పటికీ రతన్ టాటా స్వయంగా నచ్చచెప్పడంతో ఆయన అంగీకరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతాయి. అలా 44 ఏళ్ల వయస్సులో, దేశంలోనే అతి పెద్ద దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న మిస్త్రీ సంస్థను కొత్త బాటలో నడిపించే ప్రయత్నం చేశారు. టాటాల కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరొకరు టాటా గ్రూప్నకు సారథ్యం వహించడం అదే ప్రథమం. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపర్చడంపై ఆయన దృష్టి పెట్టారు. నష్టాల్లో ఉన్న సంస్థలను, ఉత్పత్తులను నిలిపివేసి.. లాభదాయక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటివరకూ ఎక్కువగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ)కి పరిమితంగా ఉంటున్న సంస్థ .. మరింతగా వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలవైపు మళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం తగు సిఫార్సులు చేసేందుకు టాటా గ్రూప్లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలతో ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను (జీఈసీ) ఏర్పాటు చేశారు. టాటాతో విభేదాలు.. ఉద్వాసన .. అయితే, ఈ క్రమంలో వ్యాపార వ్యవహార శైలి విషయంలో మిస్త్రీ, రతన్ టాటాల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి 2016 అక్టోబర్లో ఆయన అర్ధాంతరంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత టాటా సన్స్ డైరెక్టరుగా కూడా ఆయన్ను తప్పించారు. మిస్త్రీ కుటుంబం అతి పెద్ద వాటాదారే అయినప్పటికీ సైరస్ తన పదవిని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్ చంద్రశేఖర్ (టీసీఎస్ చీఫ్) .. గ్రూప్ పగ్గాలు అందుకున్నారు. న్యాయస్థానాల్లో చుక్కెదురు.. అవమానకరంగా తనను పంపించిన తీరుపై మిస్త్రీ న్యాయపోరుకు దిగారు. స్వయంగా టాటాపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘అహంభావంతో ఒక్కరు’’ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో గ్రూప్ వ్యాపారానికి నష్టం జరుగుతోందని, టాటా వాస్తవాలు మాట్లాడటం లేదని ఆరోపించారు. తనను తొలగించడంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించారు. అంతకు కొన్నాళ్ల క్రితమే తన పనితీరు అద్భుతమని ప్రశంసించి, అంతలోనే అలా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో బాంబే డయింగ్ చీఫ్ నుస్లీ వాడియా, ఆయన చిన్ననాటి స్నేహితురాలు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తదితరులు ఆయన పక్షాన నిల్చారు. అయితే, బోర్డు, మెజారిటీ వాటాదారులు ఆయనపై విశ్వాసం కోల్పోయారంటూ ఎన్సీఎల్టీ 2018లో మిస్త్రీ పిటీషన్ను తోసిపుచ్చింది. దీనిపై ఆయన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ దీనిపై టాటాలు సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా 2021 మార్చిలో ఇచ్చిన తుది తీర్పులో.. అత్యున్నత న్యాయస్థానం టాటాల పక్షం వహించింది. అయితే, అంతకు ముందు తీర్పులో ఆయనపై చేసిన కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం ద్వారా కొంత ఊరటనిచ్చింది. -
క్యాంప్బెల్ విల్సన్: ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది!
ఎయిరిండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా క్యాంబెల్ విల్సన్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టాటా సన్స్ ప్రకటించింది. 50ఏళ్ల విల్సన్కు విమానయాన రంగంలో 26ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్లైన్స్(ఎస్ఐఏ) అనుబంధ సంస్థ అయిన స్కూట్కు సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విల్సన్ను ఎయిరిండియాకు సీఈవోగా నియమించడం పట్ల ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడంలో విల్సన్తో కలిసి చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఐకానిక్ ఎయిరిండియా “ఐకానిక్ ఎయిరిండియాకు నాయకత్వం వహించడానికి, అత్యంత గౌరవనీయమైన టాటా గ్రూప్లో భాగస్వామి అవ్వడం గౌరవంగా ఉంది. ఎయిరిండియా ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్లైన్స్లో ఒకటిగా అవతరించే దిశగా ప్రయాణం కొనసాగుతుంది. భారతీయ ఆతిథ్యం ప్రతిబింబించేలా ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందిస్తోంది. ఆ ఆశయాన్ని సాకారం చేసే లక్ష్యం దిశగా ఎయిరిండియా, టాటా సహోద్యోగులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది"అంటూ ఎయిరిండియా కొత్త బాస్ విల్సన్ తెలిపారు. ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది న్యూజిలాండ్లో పుట్టి పెరిగిన కొత్త ఎయిర్ ఇండియా బాస్ క్యాంప్ బెల్ విల్సన్ న్యూజిలాండ్ కాంటర్బరీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా..ఎందుకో మనసు యూరప్, అమెరికాపై మళ్లింది.ఆ రెండు దేశాలు తిరిగి స్వదేశమైన న్యూజిల్యాండ్కు వచ్చిన ఆయనకు జర్నీలపై పిచ్చి పెరిగింది. ఆ జర్నీ పిచ్చే విల్సన్ ఎయిరిండియా సీఈవో అయ్యేందుకు దోహద పడిందనే చెప్పుకోవాలి. ఇక న్యూజిల్యాండ్కు తిరిగి వచ్చిన ఆయనకు విమానయాన రంగంపై మక్కువతో సింగపూర్ ఎయిర్లైన్స్(ఎస్ఐఏ)లో మేనేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్ను ప్రారంభించాడు. ఇప్పుడు దాని అనుబంధ సంస్థ స్కూట్కి సీఈవో స్థాయికి చేరుకున్నారు. అనేక పదవుల్లో చక్రం తిప్పారు ఏప్రిల్ 1996 నుండి ఎస్ఐఏ గ్రూప్లో ఉన్న అతను అనేక పదవులు చేపట్టారు. మే 2011లో అంటే స్కూట్లో చేరడానికి ముందు సింగపూర్ ఎయిర్లైన్స్ జనరల్ మేనేజర్గా,హాంకాంగ్కు ఎస్ఐఏ జనరల్ మేనేజర్తో పాటు, కెనడా ఎస్ఐఏకు వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఐఏ హెడ్ ఆఫీస్ నెట్వర్క్ ప్లానింగ్, నెట్వర్క్ రెవెన్యూ మేనేజ్మెంట్ విభాగాలలో 3ఏళ్లు విధులు నిర్వహించారు. విల్సన్ ఎస్ఐఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్, మార్కెటింగ్)గా పనిచేశారు. దీంతో పాటు ధర, పంపిణీ, ఇ-కామర్స్, మర్చండైజింగ్, బ్రాండ్ అండ్ మార్కెటింగ్, గ్లోబల్ సేల్స్, ఎయిర్లైన్ యొక్క విదేశాల్లో ఉన్న ఎస్ఐఏ కార్యాలయాల్ని పర్యవేక్షించారు. ఏప్రిల్ 2020లో స్కూట్ సీఈవోగా పదోన్నతి సాధించారు. ఇప్పుడు ఎయిరిండియా సీఈవోగా ఆ సంస్థ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. చదవండి👉టాటా గ్రూపుకి షాక్! సీఈవో పోస్టు వద్దన్న ఇల్కర్ ఆయ్సీ -
ఎయిర్ఏషియా ఇండియాపై ఎయిరిండియా కన్ను
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాను కొనుగోలు చేయాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్కు అనుమతులు ఇవ్వాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కు దరఖాస్తు చేసుకుంది. ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 83.67 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా గ్రూప్లో భాగమైన ఎయిర్ఏషియా ఇన్వెస్ట్మెంట్కు మిగతా వాటాలు ఉన్నాయి. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను టాటా సన్స్లో భాగమైన టాలేస్ ఇటీవలే కొనుగోలు చేసింది. వీటితో పాటు సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్ విస్తారాను కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. విమానయాన సేవలను కన్సాలిడేట్ చేసుకునే క్రమంలో ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో గుత్తాధిపత్య సమస్య తలెత్తకుండా నిర్దిష్ట డీల్స్కు సీసీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత కొనుగోలుతో దేశీయంగా పోటీపై, మార్కెట్ వాటాపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని సీసీఐకి చేసుకున్న దరఖాస్తులో ఎయిరిండియా పేర్కొన్నట్లు సమాచారం. -
ఎయిరిండియాకు కొత్త బాస్..
ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో ఎండీని నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు సమావేశంలో ఐకెర్ ఆయ్సీని కొత్త బాస్గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు టర్కీ ఎయిర్వేస్కి చీఫ్గా ఐకెర్ ఆయ్సీ ఉన్నారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ఆయన ఎయిరిండియా చీఫ్గా బాధ్యతలు చేపడతారు. బిల్కెంట్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిష్టేషన్ పట్టాను 1994లో పొందరు ఐకర్ ఆయ్సీ. అనంతరం యూకేలని లీడ్స్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో పట్టా సాధించారు. టర్కీ ఫుడ్ ఫెడరేషన్ బోర్డ్ మెంబర్గా కూడా ఐకెర్ ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా ఇటీవల టాటా సన్స్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి పాలనపరమైన సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా కొత్త సీఈవో, ఎండీలను నియమిస్తున్నట్టు టాటాసన్స్ చీఫ్ చంద్రశేఖరన్ వెల్డించారు. -
ఎయిర్ ఇండియాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొద్ది రోజుల క్రితం తన సొంత గూటి(టాటా)కి చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఎయిర్ ఇండియాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తూ టాటా గ్రూప్ ఒక ఆసక్తికర ట్వీట్ చేసింది. సుమారు 75 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎయిర్ ఇండియాకు ఆ పేరు పెట్టడం వెనుక జరిగిన ఆసక్తికర ప్రక్రియను తన ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఆ పేరు పెట్టడానికి అప్పటి టాటా సంస్థ ఉద్యోగులు యాజమాన్యానికి ఎలా సహకరించారో సంస్థ వివరించింది. 1946లో టాటా సన్స్ విభాగం నుంచి టాటా ఎయిర్ లైన్స్ ఒక సంస్థగా విస్తరించినప్పుడు, సంస్థ దానికి ఒక పేరు పెట్టవలసి వచ్చింది. భారతదేశం మొదటి విమానయాన సంస్థకు సంస్థ 4 పేర్లను(ఇండియన్ ఎయిర్లైన్స్, పాన్-ఇండియన్ ఎయిర్లైన్స్, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్-ఇండియా)లను ఎంపిక చేసింది. ఆ నాలుగు పేర్లలో ఒక పేరును ఎంపిక చేసేందుకు ప్రజాస్వామ్య బద్దంగా బాంబే హౌస్లోని టాటా ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఉద్యోగులు తమ మొదటి, రెండవ ప్రాధాన్యతలను సూచించమని సంస్థ వారిని కోరింది. (2/2): But who made the final decision? Read this excerpt from the Tata Monthly Bulletin of 1946 to know. #AirIndiaOnBoard #WingsOfChange #ThisIsTata pic.twitter.com/E7jkJ1yxQx — Tata Group (@TataCompanies) February 6, 2022 మొదటి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 64 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్'కు - 51 ఓట్లు, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు -28 ఓట్లు, పాన్-ఇండియన్ ఎయిర్ లైన్స్ కు - 19 ఓట్లు వచ్చాయి. ఇందులో అధిక ఓట్లు వచ్చిన మొదటి రెండు పేర్లను ఎంపిక చేసి మరలా ఓటింగు ప్రక్రియను చేపట్టింది. అయితే, రెండవసారి ఓటింగులో ఎయిర్-ఇండియాకు 72 ఓట్లు, ఇండియన్ ఎయిర్ లైన్స్ కు 58 ఓట్లు వచ్చాయి. దీంతో తమ తమ నూతన విమానయాన సంస్థకు 'ఎయిర్-ఇండియా' అని పేరు పెట్టినట్లు ఆ ట్వీట్లో సంస్థ పేర్కొంది. (చదవండి: జియోబుక్ ల్యాప్టాప్ గురించి అదిరిపోయే అప్డేట్..!) -
విస్తారా ఎయిర్లైన్స్ అదిరిపోయే ఆఫర్.. రూ.977కే ఫ్లయిట్ జర్నీ!
విస్తారా ఎయిర్లైన్స్ కంపెనీ విమానయాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. నేటి(జనవరి 6) నుంచి 48 గంటల స్పెషల్ సేల్ను ప్రయాణికుల కోసం ముందుకు తీసుకొచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఐఏల జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్లైన్స్ తన 7వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాలలో విమాన ప్రయాణాలపై స్పెషల్ ధరలను ప్రకటించింది. దేశీయ విమాన టిక్కెట్ ధర ఎకానమీ క్లాస్కి కేవలం రూ.977 నుంచే ప్రారంభిస్తున్నట్టు విస్తారా ఎయిర్లైన్స్ తెలిపింది. జనవరి 6, 2022 నుంచి జనవరి 7, 2022 అర్ధరాత్రితో ముగిసే 48 గంటల స్పెషల్ సేల్లో ప్రయాణికులు పాల్గొని టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఈ సరికొత్త ఆఫర్ ధరలను ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ ఆఫర్ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న టిక్కెట్స్ మీద మాత్రమే వర్తిస్తాయి. 7వ వార్షికోత్సవ ఆఫర్లో భాగంగా అందిస్తోన్న ఈ టిక్కెట్ల ప్రయాణ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. విస్తారా ఎయిర్లైన్స్లో టాటా సన్స్ కి 51 శాతం మెజారిటీ వాటా ఉంది. విస్తారా వెబ్సైట్ ప్రకారం.. దేశీయ ప్రయాణానికి వన్ వే ఆల్ ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్ కోసం ధర రూ. 977, ప్రీమియం ఎకానమీ కోసం ధర రూ. 2677, బిజినెస్ క్లాస్ కోసం ధర రూ. 9777 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. అంతర్జాతీయం ప్రయాణానికి రిటర్న్ ఆల్-ఇన్ ఛార్జీలు కలిపి ఎకానమీ క్లాస్(ఢిల్లీ-ఢాకా) ధర రూ.13880, ప్రీమియం ఎకానమీ(ముంబై-మాల్దీవులు) ధర రూ. 19711, బిజినెస్ క్లాస్ (ముంబై-సింగపూర్) ధర రూ. 47981 వద్ద నుంచి ప్రారంభం అవుతున్నాయి. సంస్థ పేర్కొన్నట్లు రూ.977 టిక్కెట్ ధర జమ్ము-శ్రీనగర్ మార్గంలో ఉంది. విస్తారా వెబ్సైట్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ద్వారా ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే విస్తారా టిక్కెట్ ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రయాణికులకు సూచించింది. (చదవండి: 2022 సీఈఎస్ టెక్ షోలో హైదరాబాద్ కంపెనీ అదిరిపోయే ఆవిష్కరణ!) -
ఎయిరిండియా జాతీయీకరణ ఒక భారీ కుట్ర!
మన దేశంలో టాటా గ్రూప్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేశంలో ఏ ప్రైవేట్ సంస్థకు లేని ఆదరణ టాటా గ్రూప్ సొంతం. ఇంత పెద్ద టాటా గ్రూప్, ఎయిరిండియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, టాటా సన్స్ ఎయిరిండియాను రూ.18,000 కోట్లకు దక్కించుకున్నప్పుడు రతన్ టాటా ఒక బావోద్వేగా ట్వీట్ చేశారు. జెఆర్డీ టాటా ప్రస్తుతం జీవించి ఉంటే చాలా సంతోషించి ఉండేవారిని ఆ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. చాలా వరకు మన దేశంలోని ప్రజలు, మేధావి వర్గాలు ప్రైవేట్ కరణను వ్యతిరేకిస్తారు. కానీ, టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు. అయితే, ఈ ఎయిరిండియా కొనుగోలు వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. రతన్ టాటా అలా ట్వీట్ చేయడం వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు మనం ఆ స్టోరీ గురుంచి తెలుసుకుందాం.. ఎయిరిండియాను వ్యాపారం కోసం రతన్ టాటా దక్కించు కోలేదు. ఎయిర్ ఇండియా అనేది జెఆర్డీ టాటా కలల ప్రాజెక్టు. టాటా ఎయిర్ లైన్స్ ఏప్రిల్ 1932లో జెహంగీర్ రతన్ జీ దాదాభోయ్(ప్రేమగా జెఆర్డి అని పిలుస్తారు) టాటా నాయకత్వంలో ప్రారంభించారు. ఈ ఎయిర్ లైన్స్ ముఖ్య ఉద్దేశ్యం సామాన్య ప్రజానీకానికి సాధ్యమైనంత తక్కువ ధరలో వరల్డ్ క్లాస్ సదుపాయాలతో విమానయాన సౌకర్యాన్ని కల్పించడం. భారతరత్న అందుకున్న భారతదేశపు మొదటి పౌర విమానయాన పైలట్ టాటా గ్రూప్ ఛైర్మన్, ఏకైక పారిశ్రామికవేత్త జెఆర్డి. భారతీయ వాణిజ్య పౌర విమానయానం కథ అక్టోబర్ 15, 1932న ప్రారంభమైంది. Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV — Ratan N. Tata (@RNTata2000) October 8, 2021 ఎయిరిండియా ఇంటర్నేషనల్ జెఆర్డి కరాచీ డ్రిగ్ రోడ్ ఏరోడ్రోమ్ నుంచి తన మొదటి అధికారిక టాటా ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరి అప్పటి బొంబాయి జుహు ఎయిర్ స్ట్రిప్ వద్ద ల్యాండ్ అయ్యారు. తర్వాత 5 సంవత్సరాలలో టాటా ఎయిర్లైన్స్ లాభాలు గణనీయంగా పెరిగాయి. బాహ్య ప్రపంచంతో, 99.4% సమయపాలనతో సేవలు అందించే ఈ విమానయాన సేవలను భారత రాకుమారులు చాలా ఇష్టపడ్డారు. ఇక స్వాతంత్ర్య అనంతరం టాటా ఎయిర్ లైన్స్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి శరణార్థులను తరలించింది. 1947 అక్టోబరులో టాటా సన్స్ అంతర్జాతీయ వైమానిక సేవను ఎయిరిండియా ఇంటర్నేషనల్ పేరుతో స్థాపించాలని అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కోరితే వారు కూడా మూడు వారాల్లో ఆమోదించారు. బాంబే నుంచి లండన్ కు మొదటి ఎయిరిండియా ఇంటర్నేషనల్ విమానం జూన్ 1948లో సకాలంలో(కైరో, జెనీవా వద్ద ఆగిపోయిన కూడా) దిగింది. స్వాతంత్ర్యం తర్వాత పాన్ అమెరికన్, ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, కెఎల్ఎమ్, ఎయిర్ ఫ్రాన్స్ వంటి ఎయిర్ లైన్స్ దేశంలో విమానయాన సేవలు అందిస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ సోదరి దౌత్యవేత్త విజయలక్ష్మీ పండిట్ స్వతంత్ర భారత తొలి రాయబారిగా మాస్కోకు ఎయిరిండియా విమానంలో వెళ్ళింది. ఆమె విమానయాన సంస్థ సేవలు, ప్రమాణాల గురించి పొగుడుతూ జెఆర్డీ టాటాకు లేఖ రాసింది. ఇక క్రమ క్రమంగా ఎయిరిండియాకు ప్రజాదరణ వస్తుంది. ఈ సమయంలోనే అసలు సమస్య ఉత్పన్నం అయ్యింది. ఒడిదుడుకులు ప్రారంభం అప్పటి దేశ కమ్యూనికేషన్ మంత్రి భారతదేశం నాలుగు మూలలను కలిపే తపాలా సేవలను ప్రారంభించడానికి ఎయిరిండియా సేవలను కోరారు. ఆ ఆలోచన చాలా మంచిదే కానీ, ఎయిర్ ఇండియా ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి ముందు రాత్రి ల్యాండింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జెఆర్డి టాటా అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల రాత్రి వేల తపాలా సేవలను అందించాలని భావించారు. కానీ, ప్రభుత్వం అంగీకరించలేదు. రాను రాను ప్రభుత్వానికి, జెఆర్డీ టాటాకు మధ్య దూరం పెరిగింది. దీంతో అప్పటి కమ్యూనికేషన్ మంత్రి మరిన్ని ప్రైవేట్ సంస్థలకు లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో అనేక దేశాల కంపెనీలు మన దేశంలో అడుగ పెట్టాయి. అయితే, రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ అనేక డకోటా విమానాలను మన దేశంలో విమానయాన సేవల కోసం మార్కెట్లోకి పంపింది. ఏటువంటి వ్యాపార అనుభవం లేకుండా మార్కెట్లోకి అడుగు పెట్టడంతో కొన్ని సంస్థలు నష్ట పోయాయి. పోస్టల్ సర్వీస్ ఆలోచనను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి ఎయిరిండియా, ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా, ఎయిర్ వేస్(ఇండియా), ఇండియన్ నేషనల్ ఎయిర్ వేస్లతో ఒక సమావేశాన్ని జెఆర్డి టాటా ఏర్పాటు చేశారు. ఈ సమావేశ విషయం దేశ కమ్యూనికేషన్ మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ కి తెలవడంతో చాలా కలత చెందాడు. హిమాలయన్ ఏవియేషన్ అతను 1948లో హిమాలయన్ ఏవియేషన్ అనే కొత్త విమానయాన సేవలను ప్రారంభించాడు. జెఆర్డి టాటా, కమ్యూనికేషన్ మంత్రికి బహిరంగ లేఖ రాశారు. లాభాల గురించి మేము విమానయాన సేవలను నడిపించడం లేదు అని అతనికి రాశాడు. ఈ బహిరంగ లేఖతో కోపంతో ఉన్న కిద్వాయ్ జెఆర్డి టాటాకు ఒక గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం కాస్త అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూకు తెలిసింది. టాటాలు మంచి పని చేస్తున్నారని, ఎయిరిండియా సమర్థవంతమైన, స్నేహపూర్వక సేవలను అందిస్తుందని బహిరంగంగా ప్రకటించారు. మంత్రికి, జెఆర్డి టాటాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి జెఆర్డి టాటా ప్రతిపాదనను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సూచించారు. అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.ఎస్.రాజధ్యక్ష ఆధ్వర్యంలో నిర్ఘాంతకమిటీ ఆర్థిక సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా లైసెన్స్ లు జారీ చేసినందుకు ప్రభుత్వాన్ని మందలించింది. “నాలుగు కంపెనీలు మనుగడ సాగించలేని చోట విచక్షణారహితంగా డజనుకు పైగా లైసెన్స్ లను జారీ చేయడం ఏకపక్షంగా ఉంది” అని కమిటీ తెలిపింది. దీంతో కమ్యూనికేషన్ మంత్రి కుట్ర వైఖరి నిరూపితమైంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా జాతీయీకరణ త్వరలోనే ఎయిరిండియా జాతీయీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఆర్డి టాటా ఈ రంగాన్ని జాతీయం చేయడం దేశానికి మంచిది కాదని, ఇది రాజకీయం చేయడానికి దారితీస్తుందని, ఇది వినాశకరమైనదని అన్నారు. జాతీయసంస్థల కోసం పనిచేసే బ్యూరోక్రాట్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదించారు. ఈ రంగంలో పోటీ తట్టుకోవాలంటే స్వతంత్ర నిర్ణయాలు వెంట వెంటనే తీసుకోలేరు అని అన్నారు. ప్రధానమంత్రికి ఆయన ఇంటర్వ్యూ కాపీని నెహ్రూకు పంపారు. నెహ్రూ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. త్వరలోనే జెఆర్డి టాటా భయపడినట్లుగా అంబికా ఎయిర్ లైన్స్, జూపిటర్ ఎయిర్ వేస్ అనే రెండు కంపెనీలు దివాలా ప్రకటించాయి. చివరగా 1953లో అన్ని విమానయాన సంస్థలను ఒకటిగా విలీనం చేసి ప్రభుత్వం కిందకు తీసుకొని వచ్చింది. చివరి ప్రయత్నంగా, జెఆర్డి టాటా రెండు కంపెనీలగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకటి దేశీయ రంగానికి, మరొకటి అంతర్జాతీయ కార్యకలాపాల కోసం తెలిపారు. కాని నెహ్రూ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. విలీనం అవుతున్న కంపెనీలకు పరిహారం చెల్లించడానికి స్వతంత్ర కమిటీని నియమించాలని జెఆర్డి టాటా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిని కూడా తిరస్కరించారు. దీంతో జెఆర్డి టాటా తీవ్రంగా కలత చెందారు. ఆయన ఇంకా పట్టు విడవలేదు. ఆ తర్వాత వచ్చిన అప్పటి కమ్యూనికేషన్స్ మంత్రి జగ్జీవన్ రామ్ తో జరిగిన సమావేశంలో జెఆర్డి టాటా ఇలా అడిగారు.. “మీరు ఇతర విభాగాలను నడుపుతున్న విధంగా విమానయాన సంస్థను నడపడం సులభమని మీరు భావిస్తున్నారా? మీరే చూస్తారు” అని అన్నారు. దానికి జగ్జీవమ్ రామ్ ఇలా జవాబిచ్చాడు” ఇది ప్రభుత్వ శాఖ కావచ్చు, కానీ మీ సహాయంతో దానిని నడపాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు. ఆ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. టాటాలకు కేంద్ర ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించలేదు. ఆ తర్వాత జెఆర్డి టాటా ఆ విమానయాన బోర్డులో ఒక సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. 1957 అక్టోబరు 15న భారత పౌర విమానయానం రజతోత్సవాన్ని దేశం జరుపుకోవడంతో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ భారతదేశాన్ని ప్రపంచ విమానయాన పటంలో నిలిపినందుకు జెఆర్డి టాటాని ప్రశంసించారు. ఆయనకు పద్మవిభూషణ్ తో సత్కరించారు. 1978 ఫిబ్రవరిలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియా అధ్యక్షపదవి నుంచి, ఇండియన్ ఎయిర్ లైన్స్ డైరెక్టర్ పదవి నుంచి జె.ఆర్.డీ.ని తప్పించింది. పైసా పారితోషికం తీసుకోలేదు ఈ నిర్ణయంతో ఒక్క పైసా పారితోషికం తీసుకోకుండా 45 సంవత్సరాలు సంస్థకు సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. కానీ, అతని కలల ప్రాజెక్టు విషయంలో భాగ కలత చెందాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఆమె చైర్మన్ గా కాకపోయినా రెండు విమానయాన సంస్థల బోర్డులో జె.ఆర్.డీ.ని తిరిగి నియమించింది. ఎయిర్ ఇండియా చైర్మన్ గా రతన్ టాటా నియమితులైన సంవత్సరం 1986 వరకు జె.ఆర్.డీ.ని బోర్డులలో సేవలను కొనసాగించారు. 1990లో ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం టాటాలను కొత్త దేశీయ విమానయాన సంస్థను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తుందా అని ప్రశ్నించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మరొక అవకాశం వచ్చింది, టాటాలు ఈ ప్రతిపాదనను ఒకే చేసే లోపే ప్రభుత్వం పడిపోయింది. 1994లో ప్రధానమంత్రి నరసింహారావు ఓపెన్ స్కైస్ పాలసీ ప్రకారం ఎయిర్ కార్పొరేషన్ చట్టం-1953 చట్టం ప్రకారం వైమానిక రవాణా సేవలు జాతీయం చేసిన వాటిని రద్దు చేయాలని చూశారు. సంకీర్ణ ప్రభుత్వాలు రావడం బలమైన నిర్ణయాలు తీసుకోలేకుండా పోయింది. ఆ తర్వాత 1995 నుంచి 1997 మధ్య ఎయిర్ ఇండియా వల్ల ₹671 కోట్ల నష్టం వచ్చింది. ఇలా నష్టాలతో కొనసాగుతున్న సంస్థను 2001లో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 40% వాటాను అమ్మకానికి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియాలో ఒక్కొక్కటి 20% వాటాను కొనడానికి ఎస్ఐఎ(సింగపూర్ ఎయిర్ లైన్స్), టాటా సన్స్ ముందుకు వచ్చాయి. కొందరు పెట్టుబదుదారుల కుట్రలు, రాజకీయ నాయకుల అవినీతి వల్ల పరిస్థితులు క్షీణించాయి. ఈ పరిణామాలతో ఎస్ఐఎ తన భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంది. విమానయాన రంగంలో టాటాల ప్రవేశం నిలిచిపోయింది. అలా అప్పటి నుంచి ఆ కొనుగోలు ఒప్పందం అగుతూ వచ్చింది. చివరికి ఈ ఏడాదిలో ఎయిర్ ఇండియాను కొనుగోలు టాటా సన్స్ దక్కించుకుంది. -
ఎయిరిండియా విక్రయ ఒప్పందం ఖరారు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి టాటా సన్స్, కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. సంతకాలు చేశాయి. ఎయిరిండియా డైరెక్టర్ (ఫైనాన్స్) వినోద్ హెజ్మాదీ, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర మిశ్రా, టాటా గ్రూప్నకు చెందిన సుప్రకాష్ ముఖోపాధ్యాయ్.. షేర్ల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ... మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ విషయం ట్వీట్ చేశారు. టాటా గ్రూప్లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ఎయిరిండియాలో 100 శాతం వాటాలను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ సుమారు రూ. 18,000 కోట్లు. ఇందులో రూ. 2,700 కోట్ల మొత్తాన్ని టాలేస్ నగదు రూపంలో చెల్లించనుండగా, మిగతా రూ. 15,300 కోట్ల రుణభారం కంపెనీకి బదిలీ కానుంది. ఎయిరిండియా విక్రయాన్ని నిర్ధారిస్తూ అక్టోబర్ 11న టాటా గ్రూప్నకు కేంద్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) జారీ చేసింది. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణ భారం రూ. 61,562 కోట్లుగా ఉంది. ఇందులో 75 శాతం భారాన్ని (రూ. 46,262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ ఏఐఏహెచ్ఎల్కు ప్రభుత్వం బదలాయిస్తోంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్తో పాటు ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలను రూ. 12,906 కోట్ల రిజర్వ్ ధరతో వేలం వేయగా, అత్యధికంగా కోట్ చేసి టాటా గ్రూప్ విజేతగా నిల్చింది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ రూ. 15,100 కోట్లకు బిడ్ వేశారు. -
ఎయిరిండియాలో మరో వివాదం.. చిక్కుల్లో టాటా గ్రూపు
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్న సంతోషం ఆస్వాదించకముందే టాటా గ్రూపుకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరోసారి మహారాజా స్టేటస్ని తెచ్చి పెట్టాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితిలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి. ఆస్తులపై పేచీ ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణలో భాగంగా వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల టాటా సన్స్ రూ. 18,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించి ఎయిరిండియాను దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా స్థిర, చర ఆస్తులన్నీ టాటా సన్స్ స్వంతం అవుతాయి. ఇందులో బోయింగ్ విమానాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్, కార్గో స్టేషన్లు ఇతర విలువైన భూములు కూడా ఉన్నాయి. క్వార్టర్లు ఖాళీ చేయండి నిబంధనల ప్రకారం ప్రైవేటీకర ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆరు నెలలలోపు ప్రస్తుతం ఎయిరిండియా క్వార్టర్లలో ఉంటున్న సిబ్బంది వాటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఎయిరిండియా కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎయిరిండియా ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉన్న పళంగా మమ్మల్ని క్వార్టర్లు ఖాళీ చేయమనడం దారుణమంటూ మండి పడుతున్నారు. సమ్మెకు రెడీ ఎయిరిండియాలో ప్రస్తుతం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో పర్మినెంట్ ఉద్యోగులు 8084, కాంట్రాక్టు ఉద్యోగులు 4001 మంది ఉన్నారు. ఇందులో చాలా మందికి ముంబై, ఢిల్లీ, కోల్కతా తదితర ఏరియాల్లో క్వార్టర్లు కేటాయించారు. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తే తమ కుటుంబాలు రోడ్డు మీద పడతాయంటూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ జారీ చేసిన నోటీసులు వెనక్కి తీసుకోకుంటే నవంబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు. కనీసం మాట్లాడరా ? ఎయిరిండియాను ప్రైవేటీకరించిన తర్వాత సెటిల్మెంట్, తమ భవిష్యత్తుకు భరోసా అందించేందుకు కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని, కానీ ఇప్పటికిప్పుడు ఇళ్లు వదిలేసి వెళ్లాలంటూ ఆదేశాలు ఇవ్వడం అమానవీయమని ఉద్యోగులు అంటున్నారు. కనీసం తమతో చర్చలు జరిపేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిక్కుముళ్లు ఏవియేషన్ రంగంలో తమదైన ముద్ర వేయాలని టాటాగ్రూపు ఎప్పటి నుంచో ఆశిస్తోంది. విస్తారాలో పెట్టుబడులు పెట్టినా పూర్తి స్థాయిలో టాటాల ఆశయం నెరవేరలేదు. ఈ సమయంలో ఎయిర్ ఇండియా ద్వారా ఏవియేషన్ రంగంలో దూసుకుపోవాలని టాటా యోచిస్తోంది. అయితే అంతకు ముందు ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్లు తదితర చిక్కుముళ్లు వీడాల్సి ఉంది. చదవండి : ఎయిర్ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే ! -
‘దేశంలో రాజాలు ఎందరున్నా.. మహారాజా ఒక్కడే’
ఎయిర్ ఇండియా సంస్థను టాటా గ్రూపు తిరిగి దక్కించుకోవడం పట్ల పారిశ్రామిక వర్గాల్లో సానుకూల స్పందన లభిస్తోంది. ప్రైవేటీకరణ అంటే సాధారణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ టాటా గ్రూపు విషయానికి వస్తే... ఈ వ్యతిరేకత కొంత తక్కువే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని అద్దం పట్టే సోషల్ మీడియాలో ఈ డీల్ పట్ల సానుకూల స్పందనే వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ హార్ష్ గోయెంకా ఎయిరిండియా ప్రైవేటీకరణపై స్పందించారు. మస్కట్ మహారాజాతో పోలిక పెడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. వారిలో చాలా మందిని రాజా అని పిలస్తూ ఉండవచ్చు. కానీ దేశంలో మహారాజు అని పిలిచే గ్రూపు ఒక్కటే ఉంది. అది టాటా అని ఆయన పేర్కొన్నారు. There are very very rich people who may be the ‘Rajas’ of India. But there is only one group who can be called the ‘Maharaja’ of our Country. pic.twitter.com/M4b2eX53M2 — Harsh Goenka (@hvgoenka) October 9, 2021 మరోవైపు ఆనంద్ మహీంద్రా సైతం ఈ డీల్ను ఉద్దేషిస్తూ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే ‘ఈ టేకోవర్ ప్రాముఖ్యతపై నేను చేసే వ్యాఖ్యలు కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల భారత వ్యాపార వాతావరణానికి ప్రభుత్వం పునర్వైభవం తీసుకొస్తోందని నేను భావిస్తున్నాను. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదులుకుంటోంది. అంతేకాదు, దశాబ్దాల తర్వాత ప్రైవేటురంగ సామర్థ్యంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోంది’ అని పేర్కొన్నారు. I may be accused of overstating the importance of this event but I think this divestment amounts to a ‘reset’ of the Indian business environment. Yes, the Govt. is dispensing of a cash drain; But it’s also renewing faith-after decades-in the potential efficiency of the Pvt.sector https://t.co/iZKgt2L7cD — anand mahindra (@anandmahindra) October 8, 2021 చదవండి : వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా - రతన్ టాటా -
మళ్ళీ టాటాల చేతుల్లోకే ఎయిర్ ఇండియా
-
టాటా చేతికే ఎయిరిండియా!
ఇంత కాలం ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిరిండియా ఇకపై ప్రైవేటు పరం కానుంది. ఇకపై ఎయిరిడియా టాటా గ్రూపు చేతిలోకి వెళ్లనుందని సమాచారం. రూ. 20,000 వేల కోట్లు ? పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిరిండియాలో వంద శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు బిడ్లను ఆహ్వానించగా టాటా గ్రూపు సంస్థ ఇందులో విజేతగా నిలిచినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా విమనాలతో పాటు సంస్థ స్థిర, చర ఆస్తులు టాటా గ్రూపునకు దక్కనున్నాయి. ఈ పెట్టుబడుల ఉపసంహారణ ద్వారా కేంద్రం రూ.20,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. టాటాకే దక్కింది ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఇటీవల కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. టాటా గ్రూపుకి సంబంధించిన టాటా సన్స్తో పాటు స్పైస్ జెట్ సంస్థ బిడ్లను దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన కేంద్ర మంత్రి అమిత్షా నేతృత్వంలో మంత్రుల బృందం చివరకు టాటా గ్రూపునకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ బిడ్డింగ్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 1932లో ప్రారంభం స్వాతంత్రానికి పూర్వమే జంషెడ్జీ టాటా 1932లో టాటా ఎయిర్లైన్స్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో ఎయిర్ ఇండియా పేరు మార్చారు. అయిత ఆ తర్వాత 1953 సెప్టెంబరు 29న టాటా ఎయిర్లైన్స్ని కేంద్రం జాతీయం చేసింది. దీంతో ప్రైవేటు ఎయిర్లైన్స్ కాస్తా ప్రభుత్వ ఎయిరిండియాగా మారింది. నష్టాల ఊబిలో విదేశాలకు నడిపే విమానాలు ఎయిరిండియా, దేశీయంగా నడిపే విమాన సర్వీసులను ఇండియన్ ఎయిర్లైన్స్గా వ్యవహరించారు. అయితే ఈ రంగంలో రాజకీయ జోక్యం పెరిగి పోవడం, నిర్వాహాణపరమైన లోపాల కారణంగా గత ఇరవై ఏళ్లుగా నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు. దీంతో ఈ సంస్థను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. 67 ఏళ్ల తర్వాత ఉప్పు నుంచి హెలికాప్టర్ల వరకు అనేక రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోన్న టాటా గ్రూపు ఎప్పటి నుంచో విమానయాన రంగంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. వివిధ కారణాల వల్ల ఈ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా 67 ఏళ్ల తర్వాత తాము స్థాపించిన సంస్థను తిరిగి టాటా గ్రూపు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని ప్రచారాలే మరోవైపు తాజా మీడియా నివేదికలను ప్రభుత్వం ఖండించింది. ఇంతవరకు ఎయిరిండియా ఇన్వెస్ట్మెంట్ బిడ్కు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఆమోదం ఇవ్వలేదని తెలిపింది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పుడు మీడియాకు తెలియచేస్తామంటూ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ట్వీట్ చేసింది. మీడియా నివేదికలు తప్పు అని పేర్కొంది. Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken. pic.twitter.com/PVMgJdDixS — Secretary, DIPAM (@SecyDIPAM) October 1, 2021 చదవండి : ఎయిరిండియా రేసులో టాటా -
ఎయిరిండియా రేసులో టాటా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎయిరిండియా కొనుగోలుకి దేశీ పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఫైనాన్షియల్ బిడ్ను దాఖలు చేసింది. ఇదే విధంగా అందుబాటు ధరల ఎయిర్లైన్స్ స్పైస్జెట్.. చీఫ్ అజయ్సింగ్ సైతం బిడ్ చేయడం ద్వారా పోటీ పడుతున్నారు. చివరి రోజు బుధవారానికల్లా ఎయిరిండియా కొనుగోలుకి ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా వెల్లడించారు. అయితే ఎన్ని సంస్థలు రేసులో నిలిచిందీ వెల్లడించలేదు. టాటా సన్స్ బిడ్ను దాఖలు చేసినట్లు గ్రూప్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. మరోపక్క స్పైస్జెట్ ఎండీ, చైర్పర్శన్ అజయ్ సింగ్ వ్యక్తిగత హోదాలో పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ బాటలో పలు కంపెనీలు బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయ లావాదేవీల నిర్వాహక సంస్థకు పలు ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు పాండే తెలియజేశారు. దీంతో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశ(కన్క్లూడింగ్ స్టేజ్)కు చేరినట్లు ట్వీట్ చేశారు. 100 శాతం వాటా: డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాలోగల 100 శాతం వాటాతోపాటు.. ఏఐ ఎక్స్ప్రెస్ లిమిటెడ్లో ఎయిరిండియాకుగల 100 శాతం వాటాను సైతం విక్రయించనుంది. అంతేకాకుండా ఎయిరిండియా సాట్స్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్ ప్రయివేట్లోగల కంపెనీకిగల 50 శాతం వాటాను సైతం బదిలీ చేయనుంది. 2020 జనవరిలో ప్రారంభమైన విక్రయ సన్నాహాలు కోవిడ్–19 కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్లో ఎయిరిండియా కొనుగోలుకి అవకాశమున్న సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్ను ప్రభుత్వం ఆహా్వనించింది. వీటికి గడువు ఈ బుధవారం(15)తో ముగియనుంది. బయటకు వెల్లడికాని రిజర్వ్ ధరకు ఎగువన దాఖలైన బిడ్స్ను సలహాదారు సంస్థ పరిగణించనుంది. అధిక ధరను కోట్ చేసిన బిడ్స్ను ఎంపిక చేయనుంది. తద్వారా వీటిని క్యాబినెట్ అనుమతి కోసం పంపనుంది. -
టాటా గ్రూప్ కిట్లో 1ఎంజీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ హెల్త్కేర్ మార్కెట్ప్లేస్.. 1ఎంజీ టెక్నాలజీస్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు టాటా సన్స్ సొంత అనుబంధ సంస్థ టాటా డిజిటల్ తాజాగా పేర్కొవాటా విలువను వెల్లడించలేదు. కంపెనీ ఇటీవలే ఫిట్నెస్ సంబంధ సేవలందించే క్యూర్ఫిట్ హెల్త్కేర్లో 7.5 కోట్ల డాలర్లు(రూ. 550 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా క్యూర్ఫిట్లో వాటాను సొంతం చేసుకోనుంది. కాగా.. విభిన్న విభాగాలలో వినియోగదారుడి అవసరాలను ఒకే గొడుగు కింద అందించేందుకు వీలుగా డిజిటల్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నట్లు టాటా డిజిటల్ వివరించింది. ఈ ప్రణాళికల్లో భాగంగానే 1ఎంజీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్ వ్యవస్థలో ఈఫార్మసీ, ఈడయాగ్నోస్టిక్స్, టెలి కన్సల్టేషన్ కీలక విభాగాలుగా నిలవనున్నట్లు వెల్లడించింది. ఇవి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా హెల్త్కేర్ విభాగం మరింత జోరు చూపుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ విభాగంలో 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 7,300 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు తెలియజేసింది. వార్షికంగా 50 శాతం చొప్పున వృద్ధి సాధిస్తున్నట్లు వివరించింది. 1ఎంజీ బ్యాక్గ్రౌండ్ 2015లో ప్రారంభమైన 1ఎంజీ ఈహెల్త్ విభాగంలో మెడిసిన్స్, వెల్నెస్ ప్రొడక్టులు, డయాగ్నోస్టిక్ సర్వీసులు, టెలి కన్సల్టేషన్ తదితర పలు సేవలు అందిస్తోంది. ఆధునిక డయాగ్నోస్టిక్ ల్యాబ్లతోపాటు.. మెడిసిన్స్, ఇతర ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తుల పంపిణీ నిర్వహిస్తోంది. కాగా.. ఈ వారం మొదట్లో రూ. 550 కోట్లతో క్యూర్ఫిట్లో వాటా కొనుగోలు చేస్తున్నట్లు టాటా సన్స్ వెల్లడించిన విషయం విదితమే. దీనిలో భాగంగా క్యూర్ఫిట్ వ్యవస్థాపకుడు, సీఈవో ముకేశ్ బన్సల్కు టాటా డిజిటల్లో ప్రెసిడెంట్గా ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలియజేసింది. -
దేశవ్యాప్త లాక్డౌన్లు పరిష్కారం కాదు: టాటా
న్యూఢిల్లీ: భారత్కు సాధ్యమైనని కరోనా టీకాల అవసరం ఉందని.. వాటికి లైసెన్స్లు ఇవ్వడంతోపాటు.. రెండో విడత ఇన్ఫెక్షన్ కేసులు తీవ్రతరం అయిన నేపథ్యంలో టీకాల ఉత్పత్తిని యుద్ధప్రాతిపదికన పెంచాలని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఏఐఎంఏ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. కరోనా రెండో విడత ఆందోళన కలిగిస్తోందన్నారు. కేసులను గుర్తించడం, టీకాలు ఇవ్వడం, వ్యాక్సిన్ల సరఫరాను పర్యవేక్షించడం చేయాలన్నారు. దేశవ్యాప్త లాక్డౌన్లు పరిష్కారం కావంటూ ఆర్థిక వ్యవస్థపైనా ప్రజల జీవితాలపై ఇది ప్రభావం చూపిస్తుందన్నారు. ‘ప్రస్తుత పరిస్థితి నిర్వహణ బాధ్యతలను మీకు అప్పగిస్తే ఎలా వ్యవహరిస్తారంటూ’? ఎదురైన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘నిజంగా దీన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహించాలి. అవసరమైన పెట్టుబడులను స్వల్ప వ్యవధిలోనే చేయాలి. దాంతో ఉత్పత్తిని పెంచొచ్చు. పెద్ద ఎత్తున ఎలా ఉత్పత్తి చేయగలమో స్పష్టతకు రావాలి. అప్పుడే అవసరాలను చేరుకోగలం’’ అని బదులిచ్చారు. ఒకవైపు ప్రజల ప్రాణాలను పోకుండా చూడడంతోపాటు మరోవైపు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ.. దీన్ని చాలా సున్నితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. చదవండి: (కరోనాపై ఏం చేద్దాం చెప్పండి..) -
మిస్త్రీకి టాటా రైటే..!
దేశీ కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టాటా–మిస్త్రీ వివాదానికి దాదాపు తెరపడింది. చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగించిన కేసులో టాటా గ్రూప్నకు సుప్రీం కోర్టులో విజయం లభించింది. మిస్త్రీని పునర్నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. టాటా గ్రూప్లో మిస్త్రీకి చెందిన ఎస్పీ గ్రూప్ వాటాల వేల్యుయేషన్ను ఇరు పక్షాలు తేల్చుకోవాలంటూ సూచించింది. సుప్రీం ఉత్తర్వులపై టాటా గ్రూప్ హర్షం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్తో నాలుగేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటంలో మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. టాటా సన్స్ చైర్మన్గా ఆయన్ను పునర్నియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో టాటా సన్స్ అప్పీళ్లను అనుమతిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ‘2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నాం. టాటా గ్రూప్ అప్పీళ్లను అనుమతిస్తున్నాం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (మిస్త్రీ కుటుంబానికి చెందిన గ్రూప్) అప్పీళ్లను తోసిపుచ్చుతున్నాం‘ అని ఆదేశాలు ఇచ్చింది. దీనితో మిస్త్రీ తొలగింపుపై దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది. టాటా సన్స్ యాజమాన్య అధికారాలను విభజించాలన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఎస్పీ గ్రూప్లో భాగమైన రెండు సంస్థలు వేసిన పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే టాటా సన్స్ బోర్డులో సముచితంగా ప్రాతినిధ్యం కల్పించాలంటూ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ చేసిన అప్పీళ్లను కూడా తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై టాటా సన్స్తో పాటు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల తరబడి టాటా గ్రూప్ పాటిస్తున్న అత్యుత్తమ గవర్నెన్స్ ప్రమాణాలకు ఇది గుర్తింపు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రతన్ టాటా వారసుడిగా 2012లో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ హోదాలో పగ్గాలు చేపట్టడం, 2016లో ఆయన్ను అర్ధాంతరంగా తప్పించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ మిస్త్రీ, ఉద్వాసనను సమర్ధించుకుంటూ టాటా గ్రూప్ అప్పట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్నాయి. మిస్త్రీకి అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ టాటా గ్రూప్, కంపెనీలో గవర్నెన్స్ లోపాలపై తాము లేవనెత్తిన అంశాలను ఎన్సీఎల్ఏటీ పరిష్కరించలేదంటూ మిస్త్రీ గ్రూప్.. సుప్రీంను ఆశ్రయించాయి. వేల్యుయేషన్పై... టాటా గ్రూప్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటాల విలువ ఎంత ఉంటుందనేది తేల్చుకోవడాన్ని ఇరుపక్షాలకు వదిలేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకోసం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లోని ఆర్టికల్ 75 లేదా ఇతరత్రా న్యాయపరమైన మార్గాలను పరిశీలించవచ్చని సూచించింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) ఎస్పీ గ్రూప్నకు 18.37 శాతం వాటాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ లెక్కగట్టింది. తదనుగుణంగానే గ్రూప్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతోంది. అయితే, ఈ వాటాల వేల్యుయేషన్ రూ. 70,000–80,000 కోట్లే ఉంటుందని టీఎస్పీఎల్ వాదిస్తోంది. కేసు సాగిందిలా.. ► 2016 అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా నియామకం. ► 2016 డిసెంబర్ 20: మిస్త్రీ తొలగింపును సవాలు చేయడంతో పాటు టాటా సన్స్ మైనారిటీ షేర్హోల్డర్ల గొంతు నొక్కేస్తోందని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన 2 సంస్థలు ఎన్సీఎల్టీ (ముంబై)ని ఆశ్రయించాయి. ► 2017 జనవరి 12: టాటా సన్స్ కొత్త చైర్మన్గా అప్పటి టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ నియామకం. అదే ఏడాది ఫిబ్రవరి 6న మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ డైరెక్టర్గా తొలగించారు. మార్చి, ఏప్రిల్లో మిస్త్రీ కంపెనీల పిటీషన్లను ఎన్సీఎల్టీ (ముంబై) తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మిస్త్రీ కంపెనీలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. దాని ఆదేశాల మేరకు మరోసారి ఎన్సీఎల్టీకి వెళ్లాయి. ► 2018 జూలై 9: మిస్త్రీ తొలగింపును సవాల్ చేయడంతో పాటు ఇతరత్రా అంశాలపై దాఖలైన పిటిషన్లను ఎన్సీఎల్టీ ముంబై మరోసారి తోసిపుచ్చింది. దీనిపై మిస్త్రీ కంపెనీలు మళ్లీ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ► 2019 డిసెంబర్ 18: మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్గా పునర్నియామకానికి అనుకూలంగా ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీల్కు వెళ్లేందుకు టాటా గ్రూప్నకు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ► 2020 జనవరి 2: ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీంను ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. డిసెంబర్ 17న తుది ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ► 2020 మార్చి 26: మిస్త్రీ పునర్నియామకంపై ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను తోసిపుచ్చుతూ సుప్రీం తుది ఉత్తర్వులు ఇచ్చింది. మా విలువలకు నిదర్శనం.. గెలుపోటములకు సంబంధించిన అంశం కాదిది. నా నిబద్ధతపైనా, గ్రూప్ నైతిక విలువలపైనా నిరంతరంగా ఆరోపణల రూపంలో దాడులు జరిగాయి. అంతిమంగా టాటా సన్స్ అప్పీళ్లకు అనుకూలంగా తీర్పు రావడం మా విలువలు, నైతికతకు నిదర్శనం. చిరకాలంగా ఇవే మార్గదర్శక సూత్రాలుగా గ్రూప్ ప్రస్థానం సాగుతోంది. – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా గ్రూప్ టాటా షేర్లు రయ్.. సుప్రీం కోర్టులో అనుకూల ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం జోరుగా పెరిగాయి. బీఎస్ఈలో టాటా స్టీల్ 6%, టాటా పవర్ 5 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 4 శాతం, టాటా మోటార్స్ సుమారు 4 శాతం ఎగిశాయి. టాటా మెటాలిక్స్ 3 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ .. టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ చెరి 2.6 శాతం, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ .. వోల్టాస్ .. టాటా కెమికల్స్ దాదాపు 2 శాతం మేర పెరిగాయి. -
కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించిన టాటా సన్స్
న్యూఢిల్లీ, సాక్షి: గత కేలండర్ ఏడాది(2020)లో దేశీయంగా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రీత్యా అతిపెద్ద ప్రమోటర్గా టాటా సన్స్ ఆవిర్భవించింది. తద్వారా పలు పీఎస్యూలలో మెజారిటీ వాటాలు కలిగిన కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించింది. 2020 డిసెంబర్ చివరికల్లా టాటా సన్స్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 9.28 లక్షల కోట్లను తాకింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పీఎస్యూల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 9.24 లక్షల కోట్లకు పరిమితమైంది. ఏడాది కాలంలో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 34 శాతానికిపైగా బలపడటం విశేషంకాగా. పీఎస్యూల విలువ దాదాపు 20 శాతం క్షీణించడం గమనార్హం! వెరసి రెండు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం నిలుపుకుంటూ వస్తున్న టాప్ ర్యాంకును టాటా సన్స్ చేజిక్కించుకున్నట్లు ఆంగ్ల పత్రిక బిజినెస్ స్టాండర్ట్ నివేదిక పేర్కొంది. (జేవీకి.. ఫోర్డ్, మహీంద్రాల ‘టాటా’) ఏడాది కాలంలో.. నిజానికి 2019 డిసెంబర్కల్లా ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ రూ. 18.6 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో టాటా సన్స్ గ్రూప్ లిస్టెండ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 11.6 లక్షల కోట్లుగా మాత్రమే నమోదైంది. ఈ సమయంలో టాటా సన్స్ గ్రూప్ కంపెనీల విలువతో పోలిస్తే ప్రమోటర్గా కేంద్ర ప్రభుత్వ కంపెనీల విలువ 67 శాతం అధికంకావడం గమనార్హం! కాగా.. 2020 డిసెంబర్కల్లా మొత్తం టాటా సన్స్ గ్రూప్ కంపెనీల విలువ రూ. 15.6 లక్షల కోట్లకు చేరగా.. పీఎస్యూలలో కేంద్ర వాటాల విలువ రూ. 15.3 లక్షల కోట్లుగా నమోదైనట్లు నివేదిక పేర్కొంది. -
టాటా ట్రస్టులకు తొలగిన పన్ను చిక్కులు!
న్యూఢిల్లీ: మూడు టాటా ట్రస్టులకు పన్ను మినహాయింపు హోదా సమంజసమేనని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) రూలింగ్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 2019లో ఇచ్చిన ‘పన్ను మినహాయింపు హోదా రద్దు’ ఉత్తర్వులను తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఐటీఏటీ ముంబై బెంచ్ ప్రెసిడెంట్ జస్టిస్ పీపీ భట్, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ సోమవారంనాడు మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. . దీనితో రతన్ టాటా ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్కు అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించినట్లయ్యింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్లో ఈ మూడు ట్రస్టులకూ 66 శాతం వాటా ఉంది. 2019లో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన రూలింగ్లో ఎటువంటి మెరిట్స్ లేవని ఈ ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే... మూడు ట్రస్ట్లకూ టాటా సన్స్లో వాటాలు ఉన్నాయన్న కారణంగా పన్ను మినహాయింపు రద్దును కోరుతూ ఆదాయపు పన్ను కమిషనర్– మినహాయింపులు (సీఐటీ–ఈ) గత ఏడాది మార్చిలో ఒక రివిజన్ (అభిప్రాయ వ్యక్తీకరణ) ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీకి సంబంధించి టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ సమర్పించిన పత్రాలను పరిశీలనలోకి తీసుకున్నారు. టాటాసన్స్లో వాటాలు కలిగిఉంటూ, పన్ను మినహాయింపులు పొందడం ఆదాయపు పన్ను చట్టాలకు విఘా తమని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ట్రస్టు లో ట్రస్టీలు ఎవరికీ టాటా సన్స్లో ఎటువంటి స్వప్రయోజనాలూ లేవు. టాటాసన్స్లో పెట్టుబడు లు పెట్టి, స్వలాభాలు పొందాలన్న అభిప్రా యం ఇక్కడ కనిపించడంలేదు. టాటా గ్రూప్ కంపెనీల విజయం ద్వారా వచ్చిన ఫలాలను విస్తృత ప్రాతిపదికన ప్రజా ప్రయోజనాలకు పంచాలన్నదే ట్రస్టు ల లక్ష్యం’’ అని ఉత్తర్వులో అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. అలాగే టాటాసన్స్ ట్రస్టీలకు చేస్తున్న చెల్లింపులు వారి సేవలకు ఇస్తున్న ప్రతిఫలంగానే చూడాలి తప్ప, మరో విధంగా కాదని పేర్కొంది. సైరస్ మిస్త్రీ ప్రవర్తన అనైతికం... కాగా, బాధ్యతల్లో నుంచి తప్పించిన ఎనిమిది వారాల తర్వాత సైరస్ మిస్త్రీ సంబంధిత డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించడాన్నీ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. కార్పొరేట్ ప్రపంచంలో కనీవినీ ఎరుగని అనైతిక ప్రవర్తనకు మిస్త్రీ పాల్పడ్డారని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కంపెనీ అనుమతి కూడా లేకుండా ఈ పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు ఎలా సమర్పిస్తారని ప్రశ్నించింది. మిస్త్రీ డాక్యుమెంట్ల సమర్పణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, ఇందుకు సంబంధించి ఆయన ఉద్దేశాలు ‘‘తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది. టాటా సన్స్లో 2006 నుంచీ ఆయన డైరెక్టర్గా ఉన్నారనీ, 2013 నుంచీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారనీ పేర్కొన్న ట్రిబ్యునల్, అప్పుడు అంతా మంచిగా కనిపించిన ఆయనకు, బాధ్యతల నుంచి తొలగించిన వెంటనే తప్పులు ఎలా కనబడతాయని ప్రశ్నించింది. 2013లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసిన సంగతి తెలిసిందే. టాటా ట్రస్టుల కేసుకు బలం! కాగా తాజాగా ఐటీఏటీ ఇచ్చిన రూలింగ్, టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్ రద్దు కేసుకు బలం చేకూర్చినట్లయ్యింది. ఆదాయపు పన్ను శాఖ 2019 అక్టోబర్లో ఆరు టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ కేసు ఐటీఏటీ ప్రత్యేక బెంచ్ వద్ద విచారణలో ఉంది. ఎయిర్–ఏషియా ఇండియాలో టాటా సన్స్కు మరింత వాటా అదనంగా 32 శాతం వాటా కొనుగోలు ఎయిర్–ఏషియా ఇండియా(ఏఏఐఎల్)లో టాటా సన్స్ సంస్థ తన వాటాను మరింతగా పెంచుకోనున్నది. ప్రస్తుతం ఏఏఐఎల్ఎల్లో టాటా సన్స్కు 51 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్ఏషియాకు 49 శాతం చొప్పున వాటాలున్నాయి. తాజాగా టాటా సన్స్ సంస్థ అదనంగా 32 శాతం వాటాను ఎయిర్ఏషియా నుంచి 3.76 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా ఏఏఐఎల్లో టాటా సన్స్ వాటా 83.67 శాతానికి పెరుగుతుంది. ఎయిర్ఏషియా వాటా 13 శాతానికి పరిమితమవుతుంది. ఎయిర్–ఏషియా ఇండియా కంపెనీ 2014 జూన్లో దేశీయ రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్ ఇండియా కోసమే...!: ఎయిర్ ఇండియా టేకోవర్కు ఎయిర్ఏషియా ఇండియాను ఇన్వెస్ట్మెంట్ వెహికల్గా వినియోగించుకోవడానికి ఎయిర్ఏషియా ఇండియాలో తన వాటాను టాటా సన్స్ మరింతగా పెంచుకున్నారని సమాచారం. దేశీయ పౌర విమానయాన మార్కెట్లో ఎయిర్ఏషియా వాటా 7.1 శాతంగా ఉంది. సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరుతో మరో విమానయాన కంపెనీని కూడా నిర్వహిస్తోంది. -
టాటా–మిస్త్రీ వివాదం సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీ తొలగింపునకు సంబంధించి దాఖలైన క్రాస్ అప్పీల్స్పై తీర్పును సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసుకుంది. రెండు గ్రూపులూ తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలనీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టాటా గ్రూప్ చీఫ్గా మిస్త్రీ తొలగింపు, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) పునఃనియామకం ఉత్తర్వులు, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన క్రాస్ అప్పీల్స్ గురువారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఎస్. బోపన్న, వి.రామసుబ్రమణ్యన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కేసు పూర్వాపరాలు ఇవీ... 2012లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసింది. తనను తొలగించడంపై ఎన్సీఎల్ఏటీని సైరస్ మిస్త్రీ ఆశ్రయించారు. ఈ కేసులో సైరస్ను తిరిగి నియమిస్తూ, 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే 100 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ.7,50,000 కోట్లు) గ్రూప్ పాలనా అంశాలకు సంబంధించి తగిన ఆదేశాలు రాలేదని, ట్రిబ్యునల్ ఆదేశాల్లో వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంటూ మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సైరస్ మిస్త్రీ పునఃనియామకాన్ని సవాలుచేస్తూ, టాటా సన్స్ కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లింది. తద్వారా రెండు గ్రూప్లూ వివాదంపై క్రాస్ అప్పీల్స్ దాఖలు చేసినట్లయ్యింది. డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ జారీ చేసిన పునఃనియామక ఉత్తర్వులపై జనవరి 10వ తేదీన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్)లో తమకున్న షేర్లను తనఖా పెట్టడంకానీ లేదా బదలాయించడంగానీ చేయరాదని కూడా ఎస్పీ గ్రూప్, సైరస్ మిస్త్రీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. చైర్మన్గా మిస్త్రీని తొలగింపు విషయంలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, అలాగే కంపెనీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ ఆరోపిస్తోంది. అయితే టాటా గ్రూప్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. వాటా విలువలపైనా వివాదం టాటా సన్స్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా 18.37 శాతం విలువ ప్రస్తుతం రెండు గ్రూప్ల మధ్య తాజా న్యాయపోరాటానికి వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా సన్స్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా విలువ రూ.70,000 కోట్లు–రూ.80,000 కోట్ల మధ్య ఉంటుందని డిసెంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టుకు టాటా గ్రూప్ తెలిపింది. టాటా గ్రూప్తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టుకు షాపూర్జీ పలోంజీ (ఎస్పీ) గ్రూప్ అప్పటికే సమర్పించింది. టాటా గ్రూప్లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు అక్టోబర్ 29న సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మిస్త్రీకి మరోసారి షాకిచ్చిన టాటా సన్స్
సాక్షి, న్యూఢిల్లీ: వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో తుది వాదనలు కొనసాగుతున్నాయి. హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్లో తమకున్న 18.37 శాతం వాటాలకు బదులుగా టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లను కేటాయించాలంటూ ఎస్పీ గ్రూప్ ప్రతిపాదించింది. అయితే, ఇది అర్థరహితమైన ప్రతిపాదనంటూ టాటా సన్స్ తోసిపుచ్చింది. అలా చేస్తే టాటా గ్రూప్లో భాగమైన ఇతర లిస్టెడ్ కంపెనీల్లో ఎస్పీ గ్రూప్ మళ్లీ మైనారిటీ వాటాలు తీసుకున్నట్లవుతుందే తప్ప పెద్ద తేడా ఉండబోదని పేర్కొంది. టాటా సన్స్ తరఫున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, ఎస్పీ గ్రూప్నకు సంబంధించిన సైరస్ ఇన్వెస్ట్మెంట్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీఏ సుందరం వాదనలు వినిపించారు. దీనిపై విచారణ సోమవారం కూడాకొనసాగనుంది. టాటా సన్స్తో విభేదాల నేపథ్యంలో అందులో వాటాలు విక్రయించి వైదొలగాలని ఎస్పీ గ్రూప్ భావిస్తోంది. అయితే, వేల్యుయేషన్ విషయంలో సమస్య వచ్చి పడింది. టాటా సన్స్లో తమకున్న 18.37 శాతం వాటాల విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ వాదిస్తుండగా, ఇది కేవలం రూ. 70,000-80,000 కోట్ల మధ్య ఉంటుందని టాటా సన్స్ చెబుతోంది. -
టీసీఎస్ షేర్ల బైబ్యాక్ !
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్ షేర్లను బైబ్యాక్ చేసే అవకాశాలున్నాయి. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై రేపు(బుధవారం) జరిగే బోర్డ్ సమా వేశంలో చర్చించనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లకు నివేదించింది. అదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కంపెనీ వెల్లడించనున్నది. రెండో మధ్యంతర డివిడెండ్ను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. టీసీఎస్ 2018లో రూ.16,000 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఒక్కో షేర్ను రూ.2,100 ధరకు మొత్తం 7.61 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ కంపెనీ బైబ్యాక్ చేసింది. 2017లో కూడా ఇదే రేంజ్లో షేర్లను బైబ్యాక్ చేసింది. ప్రస్తుత బైబ్యాక్కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడి కానప్పటికీ, రూ.20,000 కోట్ల రేంజ్లో షేర్ల బైబ్యాక్ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాటా సన్స్ కోసమే షేర్ల బైబ్యాక్ ? ఈ షేర్ల బైబ్యాక్ వల్ల టీసీఎస్ ప్రమోటర్ టాటా సన్స్కే ఎక్కువ ప్రయోజనం కలుగనున్నది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్న టాటా మోటార్స్, ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడానికి టాటా సన్స్కు నిధుల అవసరం ఉందని, దాని కోసమే టీసీఎస్ షేర్ల బైబ్యాక్ చేయనున్నదని విశ్లేషకులంటున్నారు. ఇతర ఐటీ కంపెనీలూ ఇదే బాటలో....! డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) కారణంగా పలు కంపెనీలు డివిడెండ్ల చెల్లింపుల కంటే షేర్ల బైబ్యాక్కే ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులంటున్నారు. కాగా నిధులు పుష్కలంగా ఉన్న ఇతర ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తదితర కంపెనీలు కూడా షేర్ల బైబ్యాక్ బాట పట్టే అవకాశాలే అధికంగా ఉన్నాయని వారంటున్నారు. -
ప్రత్యర్థులకు షాక్ : త్వరలో టాటా సూపర్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ విభాగంలోకి దేశీయ అతిపెద్ద వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు మరింత వేగంగా దూసుకు వస్తోంది. ఇందుకు ఒక సూపర్ యాప్ను రూపొందిస్తోంది. దీని ద్వారా ప్రతిదీ ఆర్డర్ చేసేలా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో “సూపర్ యాప్” ను ఆవిష్కరించనుంది. తద్వారా బిలియనీర్ ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ లాంటి ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టాటా సాల్ట్ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వరకు విస్తరించి టాటా గ్రూపు గత ఏడాది టాటా డిజిటల్ పేరుతో డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో ప్రాచుర్యం పొందిన టెన్సెంట్, అలీబాబా తరహాలో ఇక్కడ కూడా సూపర్ యాప్ను తీసుకు రానుంది. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని లాంచ్ చేయనుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నట్లు పలు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. అయితే సూపర్ యాప్నకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ఫ్యాషన్ షాపింగ్ యాప్ టాటా క్లిక్, కిరాణా ఇ-స్టోర్ స్టార్క్విక్ ఆన్లైన్, ఎలక్ట్రానిక్స్ ప్లాట్ఫాం క్రోమా ద్వారా ఇప్పటికే సేవలను అందిస్తున్న టాటా గ్రూప్, వీటన్నింటి సమ్మితంగా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఒక కొత్త సూపర్ యాప్ ను రూపొందించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్ యాప్ ద్వారా ఫుడ్, కిరాణా, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ లాంటి వాటితో పాటు ఇతర పేమెంట్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. ఇదొక సూపర్ యాప్. ఇందులో పలు యాప్స్ ఉంటాయి. డిజిటల్ సేవల్లో తమకు అపారమైన అవకాశాలున్నాయని చంద్రశేఖరన్ వెల్లడించారు. భారతదేశంలోఅనేక కోట్లాదిమంది వినియోగదారులను అనుసంధానిస్తూ వారికి సరళమైన ఆన్లైన్ అనుభవాన్ని అందించనున్నామని పేర్కొన్నారు. కాగా గోల్డ్మన్ సాచ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతాన్ని డిజిటల్ వ్యాపారం ఆక్రమించనుంది. సుమారు15 రెట్లు పుంజుకుని 300 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు తాజా వ్యూహాలకు ప్రాధాన్యత ఏర్పడింది. -
గ్రూప్ కంపెనీలకు టాటాసన్స్ చేయూత
కోవిడ్-19 ధాటికి కుదేలైన గ్రూప్ వ్యాపారాలు కోలుకునేందుకు నిధుల సాయం చేయాలని టాటాగ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్ భావిస్తోంది. కరోనా ప్రేరేపిత లాక్డౌన్తో టాటాల ఎయిర్లైన్స్, హోటల్, హౌసింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 1బిలియన్ డాలర్ నిధులను మూలధన కేటాయింపు రూపంలో ఆయా వ్యాపార కంపెనీల్లోకి జొప్పించాలని టాటాబోర్డు నిర్ణయం తీసుకుంది. టాటాగ్రూప్ సాధారణ బోర్డు సమావేశం శుక్రవారం వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా నిర్వహించారు. కరోనా ఎఫెక్ట్తో పాటు సుప్రీంకోర్టు ఏజీఆర్తో తీర్పుతో దివాళా దిశగా సాగుతున్న టెలికాం సర్వీసెస్కు అధిక నిధులను కేటాయించాలని బోర్డు భావిస్తోంది. అలాగే టాటా పవర్లో రుణ తగ్గింపుపై కూడా చర్చించింది. టాటా గ్రూప్లో ఒక్క టీసీఎస్ తప్ప మిగిలిన ప్రతీ వ్యాపారంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కోంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా యూరప్లో టాటా స్టీల్, జాగ్వర్ లాండ్ లోవర్ ప్లాంట్ను కొంతకాలం పాటు నిలిపివేశాయి. తర్వాత పరిమిత సంఖ్య స్థాయి కార్మికులతో ఉత్పత్తిని ప్రారంభించాయి. జేఎల్ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ పదవీ కాలం ఈ సెప్టెంబర్లో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో తర్వలో కొత్త సీఈఓను ప్రకటించనుంది. లాక్డౌన్తో పూర్తిగా దెబ్బతిన్న ఎయిర్లైన్్స, హోటల్ వ్యాపారాలపై కూడా చర్చించింది. గతనెలలో తన ఎయిర్లైన్ కంపెనీలో అదనపు పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా రానున్న రోజుల్లో ఎయిర్లైన్ వ్యాపారం మరింత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని బోర్డు అంచనావేసింది. టాటాగ్రూప్ యాజమాన్యం ఆర్థిక సంవత్సరం 2020లో రూ.20వేల కోట్లను డివిడెండ్ల రూపంలో పొందింది. -
200 కోట్లు కొట్టేద్దామని ప్లాన్ చేశారు!
పల్ఘర్: టాటా సన్స్ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి రూ. 200 కోట్లు కాజేద్దామనుకున్న ఏడుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారు తమ వ్యూహాన్ని అమలు చేసే ముందే అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికోసం వారు ఇండస్ఇండ్ బ్యాంకులో పని చేస్తున్న ఓ ఉద్యోగి ద్వారా ఖాతా వివరాలను తెలుసుకున్నారు. అయితే ఆ ఖాతాపై ఎలాంటి హ్యాక్ ప్రయత్నాలు జరగలేదని, తమ భద్రతా విభాగాలకు ఎలాంటి సమాచారం లేదని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకు పాలసీని దాటి వ్యవహరించే సిబ్బందిని తొలగిస్తామని చెప్పింది. అరెస్టైన వారిని నసీమ్ సిద్దిఖి (35), గునజివ్ బారాయియా (56), సరోజ్ ఛౌధరి (25), సతీశ్ గుప్తా (32), అనంత్ ఘోష్ (34), ఆనంద్నలవాడె (38)లుగా గుర్తించారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. (చదవండి: అప్పటిదాకా రూ. 50వేల విత్డ్రాయల్కే అనుమతి) -
సైరస్ మిస్త్రీకి సుప్రీం షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని పునరుద్ధరిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్క్లాట్) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. టాటా గ్రూప్ చీఫ్గా సైరస్ మిస్ర్తీ పునరుద్ధరణకు గత ఏడాది డిసెంబర్లో ఎన్క్లాట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారం రోజుల్లోనే స్టే ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. సదరు వాణిజ్య సంస్ధ చీఫ్గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలనే ట్రిబ్యునల్ నిర్ణయం మొత్తం తీర్పును ప్రభావితం చేసే తీర్పు లోపంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే అభివర్ణించారు. కాగా ఎన్క్లాట్ ఉత్తర్వులను సవాల్ చేసిన టాటా గ్రూప్ మిస్త్రీ పునర్నియామకం కంపెనీలో వేళ్లూనుకున్న కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలతో పాటు మొత్తం సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతుందని పిటిషన్లో పేర్కొంది. మిస్ర్తీని టాటా సన్స్ చీఫ్గా పునరుద్ధరిస్తూ ఎన్క్లాట్ తీసుకున నిర్ణయం చట్టవిరుద్ధమని ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. చదవండి : టాటా గ్రూప్ చైర్మన్ హోదా అక్కర్లేదు: సైరస్ మిస్త్రీ -
టాటాకు మరోసారి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: టాటాకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. టాటాసన్స్ నుంచి ఉద్వాసన పలికిన సైరస్ మిస్త్రీ వివాదంలో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తన తీర్పును సమీక్షించేందుకు నిరాకరించింది. గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీ నియామక తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అభ్యర్తనను ఎన్సీఎల్ఏటీ తిరస్కరించింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ ఆర్వోసీ (రిజిష్టర్ ఆఫ్ కంపెనీస్)పిటిషన్ను సోమవారం కొట్టివేసింది. గతంలో వెల్లడించిన తీర్పును సమీక్షించేది లేదని ఎన్సీఎల్ఏటీ తేల్చి చెప్పింది. ఎన్సీఎల్ఏటీ వెల్లడించిన తీర్పును సమీక్షించాలని ఆర్వోసీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. టాటా చైర్మన్గా చంద్రశేఖరన్ నియామకం చెల్లదని ఎన్సీఎల్ఏటీ డిసెంబర్ 18, 2019న ఆదేశించింది. మరోవైపు సైరస్ మిస్త్రీని తిరిగి చైర్మన్గా నియమించాలన్న ఎన్సీఎల్ఏటీ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదానికి సంబంధించిన వాదనలు త్వరలోనే సుప్రీం కోర్టులో జరగనున్నాయి. చదవండి: టాటా గ్రూప్ చైర్మన్ హోదా అక్కర్లేదు: సైరస్ మిస్త్రీ -
సైరస్ మిస్ర్తీ సంచలన వ్యాఖ్యలు..
ముంబై : టాటా సన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా తన నియామకాన్ని పునరుద్ధరిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్క్లాట్) తీసుకున్న నిర్ణయం తనను చట్టవిరుద్ధంగా తొలగించిన విధానంతో పాటు, తనను రతన్ టాటా ఇతర ట్రస్టీలు అణిచివేతకు గురిచేసిన తీరును గుర్తించిందని సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు. ఎన్క్లాట్ ఉత్తర్వులు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సహా, టీసీఎస్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్ర్టీస్లో డైరెక్టర్ పదవుల కోసం పాకులాడటం లేదని స్పష్టం చేశారు. మరోవైపు సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చీఫ్గా పునరుద్ధరిస్తూ ఎన్క్లాట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్క్లాట్ ఉత్తర్వులు టాటా గ్రూపు కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్తో పాటు సంస్థలో దశాబ్ధాల తరబడి నెలకొన్న విధానాలను దెబ్బతీసేలా ఉన్నాయని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సంస్థ పేర్కొంది. -
సైరస్ మిస్త్రీ కేసులో... ‘సుప్రీం’కు టాటా సన్స్
న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఆదేశాలను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, టాటా సన్స్ను ప్రైవేట్ సంస్థగా మార్చడంలో తమ పాత్రను తప్పుపడుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాల్సిందిగా కోరుతూ ఎన్సీఎల్ఏటీలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) గురువారం పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కంపెనీల చట్టం ప్రకారం ప్రైవేట్, పబ్లిక్ కంపెనీల నిర్వచనాలు, పెయిడప్ క్యాపిటల్ అవసరాలు మొదలైన వివరాలను సమర్పించాల్సిందిగా సూచించింది. 2016లో అర్ధంతరంగా టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని పునర్నియమించాలంటూ 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమన్న ఎన్సీఎల్ఏటీ.. టాటా సన్స్ను పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడంలో ఆర్వోసీ పాత్రపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీటిపైనే ఇటు టాటా సన్స్.. సుప్రీం కోర్టును, అటు ఆర్వోసీ.. ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
మిస్త్రీ రీఎంట్రీపై సుప్రీంలో టాటా సన్స్ వాదన..
సాక్షి, న్యూఢిల్లీ : టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా సైరస్ మిస్ర్తీ పునర్నియమకంపై కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్క్లాట్ గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా సన్స్ గురువారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని టాటా సన్స్ పిటిషన్లో కోరింది. ఒక్క కలం పోటుతో ఎన్క్లాట్ ఇచ్చిన ఉత్తర్వులు టాటా సన్స్ వ్యవస్ధాపకులు గత శతాబ్ధ కాలంగా వ్యయప్రయాసలతో తీర్చిదిద్దిన సంస్థ పాలనను, అంతర్గత కార్పొరేట్ వ్యవస్థను కుదిపివేసిందని పిటిషన్లో పేర్కొంది. సైరస్ మిస్ర్తీ నియామకాన్ని పునరుద్ధరిస్తూ ఎన్క్లాట్ జారీ చేసిన ఉత్తర్వులు గ్రూపు సంస్ధల్లోని కొన్ని లిస్టెడ్ కంపెనీల పనితీరులో గందరగోశానికి దారితీసిందని తెలిపింది. టాటా సన్స్ చైర్మన్, డైరెక్టర్గా సైరస్ మిస్త్రీ పదవీకాలం 2017 మార్చిలో ముగిసిందని, ఆయన తనను తిరిగి నియమించాలని కోరకపోయినా ఎన్క్లాట్ అత్యుత్సాహంతో ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు నివేదించింది. -
మిస్త్రీ వివాదం : సుప్రీంకోర్టుకు టాటా సన్స్
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలన్న నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తీర్పుపై టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని టాటా సన్స్ కోరుతోంది. మరికొన్ని రోజుల్లో టీసీఎస్ బోర్డు సమావేశంజరగనున్న నేపథ్యంలోదీనిపై తక్షణమే స్టే తెచ్చుకోవాలని సంస్థ భావిస్తోంది. అయితే ఇటీవలి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి జనవరి 6న వాదనలు విననుందని అంచనా. మరోవైపు జనవరి 9న బోర్డు సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా టీసీఎస్ కూ3 ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. టాటా సన్స్ అప్పీల్ను సైరస్ మిస్త్రీ, అతని కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని..ఎన్సీఎల్ఏటీ నిర్ణయాన్ని అమలు చేయాలని సైరస్ కుటుంబం డిమాండ్ చేయవచ్చని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతి క్వార్టర్ ఫలితాలు విడుదల చేయడానికి కంపెనీలకు 45 రోజుల సమయముంటుందని, టాటా సన్స్కు ఫిబ్రవరి వరకు సుప్రీం నిర్ణయం కొరకు వేచి చూసే అవకాశం ఉందని ఎస్అండ్ఆర్ అసోసియేట్స్ ప్రతినిథి మహాపత్ర పేర్కొన్నారు. టాటా సన్స్ 2016 లో మిస్త్రీని ఛైర్మన్గా తొలగించి, కొన్ని నెలల తరువాత ఎన్ చంద్రశేఖరన్ను నియమించింది. ప్రస్తుతం టాటా గ్రూప్ చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఇది విలువలు సాధించిన విజయం.. -
ఇది విలువలు సాధించిన విజయం..
సాక్షి, న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చీఫ్గా సైరస్ మిస్త్రీ తిరిగి బాధ్యతలు చేపట్టాలన్న నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్ (ఎన్క్లాట్) ఉత్తర్వులపై మిస్త్రీ స్పందించారు. ట్రిబ్యునల్ తీర్పును సుపరిపాలన సూత్రాల విజయంగా ఆయన అభివర్ణించారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సైరస్ మిస్త్రీ నియామకాన్ని ఎన్క్లాట్ పునరుద్ధరించిన అనంతరం ట్రిబ్యునల్ తీర్పును స్వాగతిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈరోజు వెలువడిన తీర్పు తనకు వ్యక్తిగత విజయం ఎంతమాత్రం కాదని, సుపరిపాలన సూత్రాలు, టాటా సన్స్ మైనారిటీ వాటాదారు హక్కుల విజయమేనని వ్యాఖ్యానించారు. మిస్ర్తీ కుటుంబం గత యాభై సంవత్సరాలుగా టాటా సన్స్లో ప్రాముఖ్యత కలిగిన మైనారిటీ వాటాదారుగా దేశం గర్వించదగిన సంస్థకు బాధ్యతాయుతమైన సంరక్షకుడిగా వ్యవహరిస్తోందని గుర్తుచేశారు. మూడేళ్ల కిందట టాటా సన్స్ చీఫ్గా బోర్డు తనను తొలగించిన అనంతరం తాను చేపట్టిన పోరాటానికి ఫలితంగానే ఈ తీర్పు వెలువడిందని అన్నారు. కాగా, టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమని, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సైరస్ మిస్త్రీ తిరిగి పగ్గాలు చేపట్టాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. చదవండి : సైరస్ మిస్త్రీకే టాటా సన్స్ పగ్గాలు -
ఔను.. జెట్ రేసులో ఉన్నాం!
ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి వస్తున్న వార్తలపై పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఎట్టకేలకు స్పందించింది. దీనిపై చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తామింకా నిర్మాణాత్మకంగా ఎలాంటి ప్రతిపాదన కూడా చేయలేదని స్పష్టంచేసింది. జెట్ టేకోవర్పై చర్చించేందుకు శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఈ విషయం వెల్లడించింది. తద్వారా జెట్ కొనుగోలుపై కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను అధికారికంగా ధృవీకరించినట్లయింది. ‘జెట్ ఎయిర్వేస్ టేకోవర్పై టాటా సన్స్ ఆసక్తిగా ఉందంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే, ఈ అంశంపై చర్చలు ప్రాథమిక స్థాయిలోనే జరిగాయని స్పష్టం చేయదల్చుకున్నాం. నిర్దిష్ట ప్రతిపాదనేదీ మేం ఆఫర్ చేయలేదు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసే విషయంపై శుక్రవారం బోర్డు సమావేశంలో టాటాలు సానుకూల నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాల నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించే విషయంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగిందని, కంపెనీని కొనుగోలు చేసేలా టాటా సన్స్కు సూచనలు చేసిందన్న వార్తలు కూడా వచ్చినప్పటికీ కేంద్రం వాటిని తోసిపుచ్చింది. గురువారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన వివరణలో కూడా టేకోవర్ వార్తలన్నీ ఊహాగానాలేనంటూ జెట్ ఎయిర్వేస్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. జెట్ ఎయిర్వేస్లో ప్రమోటరు, చైర్మన్ నరేష్ గోయల్, ఆయన కుటుంబానికి 51%, ఎతిహాద్ ఎయిర్వేస్కు మరో 24% వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి జీ తాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోతోంది. వరుసగా గత మూడు త్రైమాసికాల్లో భారీ నష్టాలు ప్రకటించింది. తాజా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 1,261 కోట్ల నష్టం నమోదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నరేష్ గోయల్ పూర్తిగా తప్పుకుని, నిర్ణయాధికారం పూర్తి గా తమదిగా ఉండే పక్షంలో మాత్రమే డీల్ కుదుర్చుకోవాలని టాటా సన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జెట్పై వ్యూహం.. జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసిన పక్షంలో సింగపూర్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యంలో దేశీయంగా ఏర్పాటు చేసిన విస్తార విమానయాన సంస్థలో భాగం చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విస్తారకు దేశీయంగా 22 విమానాలు, 3.8 శాతం మాత్రమే మార్కెట్ వాటా ఉంది. మరోవైపు, అనుబంధ సంస్థ జెట్లైట్తో కలిపి జెట్కు 124 విమానాలు, 15.8 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశ, విదేశాల్లో 66 ప్రాంతాలకు విమాన సేవలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ రూట్లలో విస్తార కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నా అందుకు సంబంధించిన అనుమ తులు మంజూరు కావడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జెట్ను కొనుగోలు చేసి విస్తారలో విలీనం చేస్తే.. నేరుగా విదేశీ రూట్లలో సర్వీసులు ప్రారంభించేందుకు వెసులుబాటు లభించే అవకాశం ఉంది. 2008లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా విదేశీ రూట్లలో సర్వీసులు మొదలుపెట్టేందుకు ఇదే తరహాలో ఎయిర్ డెక్కన్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అయిదేళ్ల కార్యకలాపాలు పూర్తయితే గానీ దేశీ ఎయిర్లైన్స్కు విదేశీ రూట్లలో సేవలకు అర్హత లభించేది కాదు. ఎయిర్ఏషియాకి ’టాటా’ .. జెట్ ఎయిర్వేస్పై కన్నేసిన టాటా గ్రూప్.. ఏవియేషన్ వ్యాపారంలో మరో వెంచర్ నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్ ప్రస్తుతం సింగపూర్ ఎయిర్లైన్స్ (ఎస్ఐఏ)తో కలిసి విసార పేరుతో పూర్తి స్థాయి విమానయాన సంస్థను, మలేషియాకి చెందిన ఎయిర్ఏషియా బెర్హాద్తో కలిసి చౌక చార్జీల ఎయిర్ ఏషియా ఇండియాను నిర్వహిస్తోంది. ఎయిర్ఏషియా ఇండియా నుంచి వైదొలగాలని టాటా సన్స్ యోచిస్తున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. ఒకవేళ జెట్ ఎయిర్వేస్ డీల్ సాకారమైతే దాన్ని విస్తారలో విలీనం చేసి మొత్తం మీద ఒక్క విమానయాన వెంచర్కే పరిమితం కావాలని భావిస్తున్నట్లు వివరించాయి. ప్రస్తుతం ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్కు 49 శాతం, ఎయిర్ఏషియా బెర్హాద్కు మిగతా వాటాలు ఉన్నాయి. కంపెనీకి 19 విమానాలు ఉన్నాయి. ఒకవైపున జెట్ ఎయిర్వేస్ టేకోవర్కు టాటా సన్స్ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎయిర్ఏషియా ఇండియా నుంచి తప్పుకోవడంపై కూడా చర్చలు ప్రాథమికంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే, ఎయిర్ఏషియా ఇండియా పరిమాణం తక్కువగా ఉండటం, మందగతిన కార్యకలాపాల విస్తరణ, నష్టాలు, ఎయిర్ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్.. ఇతర అధికారుల అనుమానాస్పద లావాదేవీలపై సీబీఐ విచారణ తదితర అంశాల కారణంగా కొనుగోలుదారును పట్టుకోవడం టాటాలకు కాస్త కష్టతరంగానే ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయంగా ఫెర్నాండెజ్ స్వయంగా తన వాటాలను అమ్మేసి వైదొలిగే అంశాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. ‘తనమీద కేసులు దాఖలు కావడంతో భారత్లో వ్యాపారం చేయడం టోనీ ఫెర్నాండెజ్కు మరింత కష్టతరంగా మారుతోంది. దీంతో కంపెనీలో తన వాటాలను అమ్మేసే అవకాశాలను ఆయన పరిశీలించవచ్చు. అయితే, ఒకవేళ తాను వైదొలగాలని అనుకుంటే.. విమానయాన సంస్థలో తన వాటాలకు మంచి గిట్టుబాటు రేటు వస్తే తప్ప ఆయన తప్పుకోరు‘ అని కంపెనీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు, ఫెర్నాండెజ్ వాటాలను కొనుగోలు చేసి ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్నా టాటాలకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఇన్ఫ్రా, అకౌంటింగ్, రిజర్వేషన్ వ్యవస్థ మొదలైనవన్నీ ఎయిర్ఏషియా బెర్హాద్ లేదా దాని అనుబంధ సంస్థలు మలేషియా నుంచి నిర్వహిస్తుంటాయని, టాటాలకు కేవలం లైసెన్సు, స్లాట్స్ మాత్రమే దక్కుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జెట్ షేరు జూమ్.. టాటా సన్స్ టేకోవర్ చేయొచ్చంటూ వస్తున్న వార్తలు జెట్ ఎయిర్వేస్ షేరుకు గణనీయంగా లాభించాయి. గడిచిన అయిదు ట్రేడింగ్ సెషన్స్లో సంస్థ షేరు ఏకంగా 40 శాతం దూసుకెళ్లింది. టాటా సన్స్ బోర్డు సమావేశంలో టేకోవర్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలతో శుక్రవారం జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 14 శాతం గ్యాప్ అప్తో ప్రారంభమైంది. చివరికి 8 శాతం లాభంతో రూ. 346.85 వద్ద క్లోజయ్యింది. అటు ఎన్ఎస్ఈలో 8 శాతం పెరిగి రూ. 341 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.366.95 స్థాయిని కూడా తాకింది. -
టాటా సన్స్ బూస్ట్ : జెట్ ఎయిర్వేస్ జూమ్
సాక్షి, ముంబై: రుణ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న జెట్ ఎయిర్వేస్కు అనూహ్య బాసట దొరకనుంది. టాటా గ్రూప్లోని వాటా సన్స్ జెట్ ఎయిర్ వేస్లో వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందన్న అంచనాల నేపథ్యంలో ఈ కౌంటర్ గురువారం నాటి తారాజువ్వలా ఎగిసి పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 26 శాతం లాభాలతో ముగిసింది. తొలి నుంచీ జోరందుకున్న జెట్ ఎయిర్వేస్ కౌంటర్ మిడ్సెషన్ నుంచీ మరింత జోరందుకుంది. విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తదుపరి దశలో ప్రమోటర్ నరేష్ గోయల్ కుటుంబీకుల వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ప్రకటించిన జెట్ ఎయిర్వేస్ వరుసగా మూడవ క్వార్టర్లో కూడా నష్టపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఫలితాల్లో రూ.1,297 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అధిక ఇంధన ధరలు, డాలర్తో రూపాయి విలువ క్షీణిస్తుండడంతో భారీ నష్టాలను నమోదయినట్లు సంస్థ పేర్కొంది. -
జెట్లో వాటాలపై టాటాల ఆసక్తి..
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్వేస్లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేయడంపై టాటా సన్స్ మరింతగా దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చురుగ్గా చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇంకా ఖాతాల మదింపు, ఇతరత్రా కీలక గణాంకాల పరిశీలన స్థాయి దాకా రాలేదని వివరించాయి. వ్యయాలు, వ్యూహాలపరంగా జెట్ కొనుగోలు లాభసాటిగానే ఉంటుందా, తమ ఏవియేషన్ వ్యాపారానికి అనుగుణంగా దీన్ని మల్చుకోవడానికి వీలుంటుందా అన్న కోణంలో టాటా సన్స్ ప్రధానంగా దృష్టి పెడుతోందని వివరించాయి. ఈ నేపథ్యంలో కంపెనీని పూర్తిగా కొనడం కాకుండా.. జెట్కి చెందిన విమానాలు, పైలట్లు, స్లాట్లు మొదలైనవి మాత్రమే తీసుకునే విధంగా టాటా సన్స్ ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీంతో పాటు పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వివరించాయి. ఏదేమైనా జెట్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ తప్పుకునేట్లు ఉంటేనే ఏదైనా డీల్ కుదిరే అవకాశం ఉండొచ్చని పేర్కొన్నాయి. కంపెనీని మళ్లీ గాడిన పెట్టేందుకు నిర్ణయాలు తీసుకోవడానికి పూర్తి అధికారాలు తనకు లభించేట్లు ఉంటేనే టాటా సన్స్ ముందుకెళ్లొచ్చని వివరించాయి. టాటా గ్రూప్ ప్రస్తుతం సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి విస్తార పేరుతో పూర్తి స్థాయి విమానయాన సంస్థను, మలేíసియాకి చెందిన ఎయిర్ఏషియా గ్రూప్తో కలిసి చౌకచార్జీల సంస్థ ఎయిర్ఏషియా ఇండియాను నిర్వహిస్తోంది. జెట్లో నరేష్ గోయల్కు 51 శాతం, ఎతిహాద్ ఎయిర్వేస్కు 24 శాతం వాటాలు ఉన్నాయి. నష్టాల జెట్.. ముడిచమురు ధరల పెరుగుదల, బలహీన రూపాయి, చౌక చార్జీలు, తీవ్రమైన పోటీ తదితర అంశాలతో నరేష్ గోయల్ సారథ్యంలోని జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఎయిర్క్రాఫ్ట్లను లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు చెల్లింపులు జరపడంలోనూ విఫలమవుతోంది. ఇటీవల రెండో త్రైమాసిక ఫలితాల్లో ఏకంగా రూ. 1,261 కోట్ల నష్టాలు ప్రకటించింది. దీంతో కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు.. లాభసాటిగా లేని రూట్లలో ఫ్లయిట్స్ను, వ్యయాలను తగ్గించుకోవడం, ఆదాయాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు జెట్ వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర ఈ ఏడాది ఇప్పటిదాకా 70 శాతం పడిపోయింది. -
టాటా సన్స్ చేతికి జెట్ ఎయిర్వేస్..?
సాక్షి, ముంబై : ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు టాటా సన్స్ కసరత్తును వేగవంతం చేసింది. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టాటా సన్స్ సీఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్లు సంప్రదింపులు జరుపుతున్నట్టు మింట్ వార్తాపత్రిక వెల్లడించింది. టాటా సన్స్ అంతర్గత బృందం జెట్ ఎయిర్వేస్లో మెజారిటీ వాటా కొనుగోలును మదింపు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరికొన్ని వారాలు సాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపినట్టు పేర్కొంది. మరోవైపు వరుసగా మూడో క్వార్టర్లోనూ నష్టాలు ప్రకటించిన జెట్ ఎయిర్వేస్ లాభదాయకం కాని రూట్లలో విమానాలను తగ్గిస్తామని, లాభదాయ రూట్లలో సామర్థ్య పెంపు చేపడతామని పేర్కొంది. ఖర్చులు తగ్గించుకుని, ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు జెట్ ఎయిర్వేస్ యోచిస్తోంది. వరుస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థ పెరుగుతున్న చమురు ధరలు, ఇంధన పన్నులు, క్షీణిస్తున్న రూపాయి విలువతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. -
వాటాలు విక్రయించాలని మిస్త్రీని బలవంతపెట్టొద్దు
న్యూఢిల్లీ: టాటా గ్రూపు కంపెనీల మాతృ సంస్థ ‘టాటాసన్స్’లో మిస్త్రీ కుటుంబానికి ఉన్న వాటాలను విక్రయించాలంటూ బలవంతం చేయవద్దని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) టాటాలను ఆదేశించింది. అలాగే, టాటాసన్స్ను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చుతూ తీసుకున్న నిర్ణయానికి అనుమతిని హోల్డ్లో ఉంచింది. ఈ విషయమై మిస్త్రీ పిటిషన్ను అనుమతించిన అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది. సైరస్ మిస్త్రీని టాటాసన్స్ చైర్మన్గా తప్పించిన తర్వాత, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని కాస్తా ప్రైవేటు కంపెనీగా మార్చేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి వాటాదారులు కూడా ఆమోదం తెలిపారు. అయితే, మిస్త్రీ పిటిషన్ నేపథ్యంలో టాటాసన్స్ను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చడంపై అనుమతిని నిలిపివేస్తూ ట్రిబ్యునల్ శుక్రవారం మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. టాటాసన్స్లో 18.4% వాటాతో మిస్త్రీ కుటుంబం మైనారిటీ వాటాదారుగా ఉంది. టాటాసన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తప్పించే అధికారం కంపెనీ బోర్డుకు ఉందంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) ముంబై బెంచ్ ఇటీవలే ఆదేశాలు వెలవరించగా, దీన్ని మిస్త్రీ కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సవాల్ చేశాయి. అలాగే, టాటాసన్స్ను ప్రైవేటు కంపెనీగా మార్చుతూ, వాటాదారులు తమ స్వేచ్ఛ ప్రకారం తమ వాటాలను విక్రయించుకోకుండా నిరోధించడం, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లోని ఆర్టికల్ 75 కింద వాటాదారులు తమ వాటాలను విక్రయించేలా బలవంత పెట్టే అధికారం బోర్డుకు కల్పించడాన్ని కూడా సవాల్ చేశాయి. ‘‘వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న మీదట అప్పీల్ పెండింగ్లో ఉంచడం జరిగింది. అప్పీలుదారు (మిస్త్రీ) తన వాటాలను విక్రయించేందుకు బలవంతం చేస్తే అప్పీల్ మెరిట్స్పై ప్రభావం చూపిస్తుంది. వారు కంపెనీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ అప్పీల్ పెండింగ్లో ఉన్న కాలంలో ఆర్టికల్ 75 కింద మైనారిటీ వాటాదారుల షేర్లను బదిలీ చేసే విషయంలో ఎలాంటి నిర్ణయంవద్దని ప్రతివాదుల(టాటాలు)ను ఆదేశిస్తున్నాం’’ అని చైర్పర్సన్ జస్టిస్ ఎస్జే ముకోపాధ్యాయ అధ్యక్షతన గల ఇద్దరు సభ్యుల అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. స్పందన తెలియజేసేందుకు టాటాలకు పది రోజుల గడువు ఇచ్చింది. ప్రైవేటు కంపెనీగానే ఉంది... టాటాసన్స్.. నిజానికి ప్రైవేటు సంస్థ మాదిరిగానే ఉందని, కాకపోతే కంపెనీ పరిమాణం, పాత న్యాయ నిబంధన మేరకు పబ్లిక్ లిమిటెడ్గా పరిగణించడం జరిగిందని టాటాసన్స్ ఈ సందర్భంగా వాదించింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హోదా అన్నది వాటాదారులు తమ వాటాలను బదిలీ చేసే విషయంలో ఎంతో సౌకర్యాన్ని కల్పిస్తోందని, ఈ చట్టబద్ధమైన హోదా మార్పిడికి గాను టాటా సన్స్ వాటాదారులను అనుమతిస్తూ మార్పులు చేసినట్టు తెలిపింది. టాటాలు ఆదరాబాదరగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ముంబై కార్యాలయాన్ని సంప్రదించగా, టాటాసన్స్ ప్రైవేటు లిమిటెడ్గా మారుస్తూ సర్టిఫికెట్ను వెంటనే జారీ చేసినట్టు వాదనల సందర్భంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్కు నివేదించాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో వాటాదారులు తమ షేర్లను ఎవరికైనా విక్రయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లో వాటాదారులు ఎవరైనా తమ వాటాలను బయటి వ్యక్తులకు విక్రయించేందుకు అనుమతి ఉండదు. -
రతన్ టాటాకు ఊరట
ముంబై : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో రతన్ టాటాకు ఊరట లభించింది. తనను చైర్మన్ పదవి నుంచి అర్ధంతరంగా తొలగించారంటూ మిస్త్రీ టాటా గ్రూప్పై న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించారు. తన కుటుంబానికి టాటా గ్రూప్లో 18.4 శాతం వాటాలున్నట్టు ఆయన పేర్కొన్నారు. రతన్ టాటా, టాటా సన్స్ బోర్డ్ మైనార్టీ షేర్ హోల్డర్స్ హక్కులను కాలరాస్తున్నారంటూ ఆయన మరో అంశాన్ని కూడా తన పిటిషన్లో పొందుపర్చాడు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ మిస్త్రీ అభ్యర్థనను తొసిపుచ్చుతు సోమవారం తీర్పు వెలువరించింది. అలాగే రతన్ టాటాకు ఈ వ్యవహారంలో క్లీన్ చీట్నిచ్చింది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ను తొలగించడానికి బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్కు తగిన అధికారాలు ఉన్నాయని ట్రిబ్యూనల్ తెలిపింది. బోర్డ్ మెంబర్స్ మిస్త్రీపై నమ్మకం కొల్పోవడం వల్లే పదవి నుంచి తొలగించారని ట్రిబ్యూనల్ తన తీర్పులో పేర్కొంది. మిస్త్రీ లెవనెత్తిన వాదనలో చెప్పుకోదగ్గ అంశాలు లేవని వెల్లడించిది. ప్రస్తుత కాలంలో యాజమాన్యాలు, వాటా దారులకు జవాబుదారీ తనంగా ఉండాలని ట్రిబ్యూనల్ అభిప్రాయపడింది. 2016 అక్టోబర్లో టాటా సన్స్ బోర్డ్ మెంబర్స్ మిస్త్రీని చైర్మన్ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన 2016 డిసెంబర్లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. -
టాటా కమ్యూనికేషన్స్లో టాటా పవర్ వాటా విక్రయం
ముంబై: టాటా గ్రూపు పరిధిలో ఒక కంపెనీ మరో కంపెనీలో వాటాలను తగ్గించుకోవాలన్న కార్యక్రమంలో భాగంగా మరో అడుగు ముందుకు పడింది. టాటా కమ్యూనికేషన్స్లో తనకున్న వాటాలను, అనుబంధ సంస్థ ప్యానటోన్ ఫిన్వెస్ట్ను మాతృ సంస్థ టాటాసన్స్కు రూ.2,150 కోట్లకు విక్రయించాలని టాటా పవర్ నిర్ణయించింది. దీనికి టాటా పవర్ బోర్డు ఆమోదం తెలిపింది. టాటా కమ్యూనికేషన్స్లో ప్యానటోన్ ఫిన్వెస్ట్కు 30.1 శాతం వాటా ఉంది. ప్రాధాన్యేతర ఆస్తులను నగదుగా మార్చుకోవడం, మలి దశ వృద్ధికి గాను బ్యాలన్స్ షీటును బలోపేతం చేసుకునేందుకే ఈ విక్రయమని కంపెనీ తెలిపింది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ.2,150 కోట్లు సమకూరనున్నట్టు అంచనా వేస్తున్నామని పేర్కొంది. గతేడాది ఫిబ్రవరిలో టాటా గ్రూపు చైర్మన్గా ఎన్.చంద్రశేఖరన్ వచ్చాక గ్రూపు కంపెనీల మధ్య స్థిరీకరణపై దృష్టి పెట్టారు. టాటా గ్రూపునకు 30 లిస్టెడ్ కంపెనీలుండగా, చాలా కంపెనీలు మరో కంపెనీలో వాటాలు కలిగి ఉన్నాయి. అదే సమయంలో మాతృ సంస్థ టాటా సన్స్కు మాత్రం గ్రూపు కంపెనీల ఈక్విటీలో మూడో వంతే వాటాలుండటం ఆయన నిర్ణయానికి కారణం. ఇందులో భాగంగా టాటా స్టీల్, టాటా మోటా ర్స్ పరస్పర వాటాలను తగ్గించుకున్నాయి. -
టాటా సన్స్ ప్రైవేటీకరణకు ఇన్వెస్టర్ల ఆమోదం
సాక్షి, ముంబై: టాటా గ్రూపు సంస్థల ప్రమోటర్ టాటాసన్స్..పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనుంచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అవతరించేందుకు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఏజీఎంలో ఇన్వెస్టర్లు ఆమోదం తెలిపారు. టాటా సన్స్ వాటాదారుల సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) లో ఈ మేరకు ఆమోదం లభించిందని తెలిపింది. అన్ని తీర్మానాలకు మెజారీటీ వాటాదారులు ఆమోదం తెలిపారని టాటా సన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభిస్తే టాటా సన్స్ ప్రైవేటీకరణ ప్రక్రియ ముగిసినట్టే. మరోవైపు టాటా సన్స్ ప్రయివేటీకరణకు వ్యతిరేకిస్తూ టాటాసన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ పెట్టుకున్న పిటీషన్ను ఎన్సీఎల్ఏటీ తిరస్కరించింది. అయితే మిస్త్రీ సంస్థలకు కనీస వాటాదారుల ప్రమాణాల నుంచి మినహాయింపు ఇచ్చింది. ముంబై ఉన్సీఎల్ఏటీలో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. దీన్ని మిస్త్రీ స్వాగతించారు. కార్పొరేట్ గవర్నెన్స్ గరిష్ట ప్రమాణాలను కొనసాగించాలని, టాటా గ్రూపులో పారదర్శకత కాపాడాలని డిమాండ్ చేశారు. కాగా గత ఏడాది అక్టోబరు 24న అనూహ్యంగా టాటా సన్స్ చైర్మన్గా మిస్త్రీని పదవిని తొలగించింది. అలాగే ఫిబ్రవరి 6, 2017 న హోల్డింగ్ కంపెనీ బోర్డు డైరెక్టర్గా కూడా తొలగించిన సంగతి తెలిసిందే. -
టాటా సన్స్ ప్రతిపాదనపై మిస్త్రీ ఫైర్
సాక్షి, ముంబై: టాటా గ్రూపులోని టాటా సన్స్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ లిమిటెడ్గా అవతరించనుంది. టాటా సన్స్ సంస్థను ప్రైవేట్ లిమిటెడ్గా మార్చే ప్రతిపాదనను మైనారిటీ షేర్హోల్డర్ల అనుమతి కోరేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్లలో మార్పులు చేయాల్సి ఉండగా.. దీనికి వాటాదారుల అనుమతి కంపెనీ కోరనుంది. అయితే మిస్త్రీ కుటుంబానికి చెందిన పెట్టుబడి సంస్థ సైరస్ ఇన్వెస్ట్మెంట్ ప్రెవేట్ లిమిటెడ్ ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ హక్కుల అణచివేసేందుకు తీసుకున్న చర్య అంటూ బోర్డు కు ఒక లేఖ రాసింది. ఈ ప్రతిపాదన మైనారిటీ వాటాదారులను మరింత అణిచివేసే "మరొక ఆయుధం" గా పేర్కొంది. మరోవైపు టాటా సన్స్ ఒక ప్రైవేటు కంపెనీగా మారితే, మైనారిటీ వాటాదారుల హక్కులను మరింత నిరుత్సాహపరుస్తుందని ప్రాక్సీ సలహా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఇది ఒక తిరోగమన దశ అని పేర్కొన్నారు. ఒకవేళ టాటాసన్స్ ప్రతిపాదనను షేర్హోల్డర్లు ఆమోదిస్తే, టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్గా కంపెనీ పేరు మారుతుంది. సెప్టెంబర్ 21న వార్షిక సర్వ సభ్య సమావేశం జరగనుండగా.. దీనికి ముందుగా ఈ ప్రతిపాదన రావడం విశేషం. అయితే.. దీనికి నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ ఆమోదం రావాల్సి ఉంటుంది. దీంతో పాటు 75 శాతం మైనారిటీ వాటాదారులు కూడా అనుమతించాలి. సైరస్ మిస్త్రీ ని టాటా సన్స్ బోర్డు ఛైర్మన్గా తొలగించిన తరువాత దాదాపు ఒక సంవత్సరం తరువాత సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. -
టాటా సన్స్.. ‘ప్రైవేట్’!
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్పునకు సన్నాహాలు ► షేర్ హోల్డర్ల అనుమతి కోరిన కంపెనీ ► వ్యతిరేకిస్తూ మిస్త్రీ సంస్థ లేఖ ► మైనారిటీ వాటాదారుల్ని అణిచేయటానికేనని ఆరోపణలు న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, టాటాలకు మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా సంస్థ కార్పొరేట్ స్వరూపాన్ని మార్చేసేందుకు టాటా సన్స్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హోదా నుంచి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చే దిశగా మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్కు తగు మార్పులు చేర్పులు చేసే ప్రతిపాదనకు షేర్హోల్డర్ల అనుమతి కోరింది. ఈ మేరకు ఈ నెల 21న వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు షేర్హోల్డర్లకు సంస్థ సమాచారం ఇచ్చింది. పేరును కూడా టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు మార్చే ప్రతిపాదన ఇందులో ఉంది.కంపెనీ ప్రయోజనాల కోసమే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్లు టాటా సన్స్ వర్గాలు తెలిపాయి. తమకున్న ‘డీమ్డ్ పబ్లిక్ కంపెనీ’ హోదాకు .. కంపెనీల చట్టం 2013 కింద గుర్తింపు లేకపోవడం వల్లే ఈ మేరకు మార్పులు తలపెట్టినట్లు పేర్కొన్నాయి. ఒకవేళ ఈ తీర్మానం గానీ ఆమోదం పొందిన పక్షంలో.. వాటాదారులు స్వేచ్ఛగా షేర్లను విక్రయించుకోవడంపై నిర్ధిష్ట నియంత్రణలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం సంస్థలో గణనీయమైన వాటాలున్న మిస్త్రీ కుటుంబం.. ఆ షేర్లను బయటి ఇన్వెస్టర్లకు అమ్ముకోకుండా చెక్ చెప్పేందుకే టాటా సన్స్ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్వరూపం మార్చాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మిస్త్రీ కుటుంబం భావిస్తోంది. కార్పొరేట్ స్వరూపం మార్పునకు ప్రత్యేక తీర్మానం కావాలి. దీనికి మద్దతుగా కనీసం 75 శాతం మేర షేర్హోల్డర్ల ఓట్లు అవసరమవుతాయి. వీటితో పాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర కూడా అవసరమవుతుంది. మిస్త్రీ సంస్థల అభ్యంతరం.. టాటా సన్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నందున .. అందులో గణనీయమైన వాటాలు ఉన్న మిస్త్రీల కుటుంబం తమ షేర్లను చట్టబద్ధంగా టాటాల పోటీ సంస్థలకు కూడా విక్రయించుకోవచ్చు. ఇది కంపెనీల చట్టం చెబుతున్న నిబంధన. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే దాని షేర్హోల్డరుకు ఈ వెసులుబాటు ఉండదు. ఈ నేపథ్యంలో.. టాటా సన్స్ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చే ప్రతిపాదనపై మిస్త్రీ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మెజారిటీ షేర్ హోల్డర్లు మైనారిటీ వాటాదారులను అణచివేసేందుకు చేస్తున్న మరో ప్రయత్నమిది. దీనివల్ల టాటా సన్స్కి ఎటువంటి ప్రయోజనం ఉండదు. దురుద్దేశాలు, దుర్బుద్ధితోనే ఈ ఏజీఎం ఏర్పాటు చేస్తున్నారు‘ అని వ్యాఖ్యానించింది. సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ ఈ మేరకు టాటా సన్స్ బోర్డుకు లేఖ రాసింది. టాటా సన్స్ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం వల్ల షేర్లను స్వేచ్ఛగా బదలాయించుకునేందుకు వీలు లేకుండా నియంత్రణలు అమల్లోకి వస్తాయని, ఇది ఓ రకంగా మైనారిటీ వాటాదారులను మెజారిటీ షేర్హోల్డర్లు అణిచివేసేందుకు చేస్తున్న ప్రయత్నమని పేర్కొంది. సైరస్ మిస్త్రీని గతేడాది చైర్మన్గా తొలగించిన నేపథ్యంలో టాటా సన్స్తో మిస్త్రీ కుటుంబం న్యాయ పోరాటం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి 18.4 శాతం వాటాలు, టాటా ట్రస్ట్స్కి 66 శాతం వాటాలు ఉన్నాయి. -
టాటా గ్రూపులోకి రూపా పురుషోత్తమ్
ముంబై: టాటా గ్రూపు కీలకనియామకాన్ని చేపట్టింది. టాటా సన్స్ చీఫ్ ఎకానమిస్ట్గా రూపా పురుషోత్తంను నియమించింది. ఈ నియామకం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా సన్స్ తన ప్రధాన ఆర్ధికవేత్తగా, పాలసీ అడ్వకసీగా రూప్ పురుషోథామాన్ నియామకాన్ని గురువారం ప్రకటించింది. టాటూ గ్రూపు వ్యాపారాలకు సంబంధించి రూపా పురుషోత్తం మాక్రో ఎకానమికస్రీసెర్చ్, అలాగే అన్ని విధాన, న్యాయవాద కార్యక్రమాలు నిర్వహిస్తారని టాటా సన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమెకు సుదీర్ఘమైన అనుభవం ఉందనీ, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలపై పరిశోధనలతో అనేక రీసెర్చ్ పేపర్లను ప్రచురించినట్టు తెలిపింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మాట్లాడుతూ, "ఆర్ధిక విషయాలపై, పోకడలు, ప్రజా విధానం, న్యాయవాదలపై రూపా యొక్క లోతైన జ్ఞానం ఎంతో విలువైనది. సామాజిక రంగంలో తన అభిరుచి ,చొరవ తమకుఎంతో ఉపయోగపడుతుందన్నారు. తన నియామకంపై రూప పురుషోత్తం స్పందిస్తూ భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన , బహుముఖ పాత్రను పోషిస్తున్న వాటిల్లో టాటా గ్రూప్ ఒకటని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో టాటా గ్రూప్లో చేరడం నిజంగా ఒక ప్రత్యేక అవకాశమని వ్యాఖ్యానించారు. కాగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, యాలే యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైన రూప గతంలో గోల్డ్మన్ సాచ్స్ ఇంటర్నేషనల్ లో వైస్ ప్రెసిడెంట్ , ప్రపంచ ఆర్థికవేత్తగా పనిచేశారు. -
టాటాలపై మిస్త్రీ అప్పీలు
► పిటిషన్కు వీలు కల్పించాలని అభ్యర్థన ► దిగువ ట్రిబ్యునల్ ఉత్తర్వుల సవాలు న్యూఢిల్లీ: టాటా సన్స్లో అవకతవకలపై పిటిషన్కు వీలు కల్పించాలని, ఇందుకు సంబంధించి అర్హత నిబంధనలను సడలించాలని కోరుతూ టాటా సన్స్ బహిష్కృత చైర్మన్ మిస్త్రీ శుక్రవారం నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో అప్పీలు చేశారు. దీనికి సంబంధించి ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, ఆయన ఎన్సీఎల్ఏటీలో ఈ అప్పీల్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే... టాటా సన్స్లో అవకతవకలు, మైనారిటీ షేర్హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారన్న ఆరోపణలపై పిటీషన్ వేయడానికి వీలుగా.. అర్హత నిబంధనలు సడలించాలంటూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలు చేసిన విజ్ఞప్తిని ఎన్సీఎల్టీ బెంచ్ నాలుగురోజుల క్రితం తోసిపుచ్చింది. కంపెనీల చట్టం నిబంధనల నుంచి మినహాయింపునిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. టాటా సన్స్ నుంచి మిస్త్రీ ఉద్వాసనను సవాల్ చేస్తూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థలు రెండు .. ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. టాటా సన్స్లో నిర్వహణ లోపాలున్నాయని, మైనారిటీ షేర్హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించాయి. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసేందుకు సంబంధించి పిటిషనర్కు ఇష్యూడ్ షేర్ క్యాపిటల్లో కనీసం పదో వంతు లేదా మైనారిటీ షేర్హోల్డర్లలో కనీసం పదో వంతు వాటాలు ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ కోరాయి. కానీ, ప్రిఫరెన్స్ క్యాపిటల్ కూడా కలిపితే.. మొత్తం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్లో పిటిషనర్ సంస్థలకు కేవలం 2.17 శాతం వాటా మాత్రమే ఉంటుందని టాటా సన్స్ వాదించింది. ఈ నేపథ్యంలో అర్హత ప్రమాణాల కోణంలో పిటి షన్ సాధ్యపడదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. చైర్మన్ జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని అప్పీలేట్ ట్రిబ్యునల్ వచ్చేవారం మిస్త్రీ అప్పిలేట్ పిటిషన్ను విచారించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
టాటా సన్స్కి వెళ్లారు, కోట్లు పోయాయ్!
ముంబై : దేశంలోనే అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసు సీఈవో పదవి నుంచి ఏకంగా టాటా గ్రూప్లోనే అత్యంత కీలకమైన చైర్మన్ పదవి ఎన్ చంద్రశేఖరన్ ను వరించింది. ఉప్పు నుంచి సాప్ట్ వేర్ వరకు ఉన్న 103 బిలియన్ డాలర్ల గ్రూప్ కు రథసారిథిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన వేతనం మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయింది. కనీసం సీఈవోగా ఉన్నప్పుడు ఇచ్చే వేతనాన్ని కూడా టాటా బోర్డు ఆఫర్ చేయడం లేదు. టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కు రూ.14.4 కోట్ల వార్షిక వేతనం మాత్రమే ఇవ్వనున్నట్టు బోర్డు సభ్యులు నిర్ణయించారు. బేసిక్ వేతనం కింద రూ.4.8 కోట్లను అదనంగా 200 శాతం లేదా రూ.9.6 కోట్ల వేరియబుల్ కంపోనెంట్లను అందించనున్నట్టు బోర్డు ప్రకటించింది. అది కూడా కంపెనీ, ఆయన పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. వాటికి తోడు అదనంగా కంపెనీ నుంచి వచ్చే కమిషన్ కు ఆయన అర్హులని తెలిపింది. కానీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవోగా ఉన్నప్పుడు చంద్రశేఖరన్ దానికంటే ఎక్కువ వేతనాన్నే ఆర్జించేవారు. 2016 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.25.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. అదనంగా రూ.10 కోట్లను కంపెనీ బోనస్ ల కింద ఆయనకి ఇచ్చింది. టీసీఎస్ సీఈవో నుంచి టాటా సన్స్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టాకా ఆయనకు వేతనం పెరగాల్సింది పోయి తగ్గినట్టు తెలిసింది. టాటా సన్స్ కు అంతకముందు చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీకి కూడా 2015లో కేవలం రూ.16 కోట్లు మాత్రమే ఇచ్చినట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఆ సమయంలో టీసీఎస్ సీఈవోగా ఉన్న చంద్రశేఖరన్ రూ.21.28 కోట్లు ఆర్జించారట. గతేడాది అక్టోబర్ లో అర్థాంతరంగా మిస్త్రీకి ఉద్వాసన పలికి, ఆ స్థానంలో టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ ను కూర్చోపెట్టిన సంగతి తెలిసిందే. -
మిస్త్రీకి మళ్లీ చుక్కెదురు!
-
మిస్త్రీకి మళ్లీ చుక్కెదురు!
పిటిషన్లు చెల్లుబాటు కావన్న కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై: టాటా సన్స్పై న్యాయపోరాటంలో సైరస్ మిస్త్రీకి చుక్కెదురైంది. టాటా సన్స్కు వ్యతిరేకంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్లు దాఖలు చేయగా... అవి విచారించడానికి అర్హమైనవి కాదని ట్రిబ్యునల్ సోమవారం పేర్కొంది. ట్రిబ్యునల్ను ఆశ్రయించే విషయంలో అర్హత ప్రమాణాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. మిస్త్రీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్... టాటాసన్స్ చైర్మన్గా మిస్త్రీ తొలగింపును ట్రిబ్యునల్లో సవాల్ చేయడం తెలిసిందే. మైనారిటీ వాటాదారుల హక్కులను సైతం కాలరాస్తున్నారని ఆరోపించాయి. అయితే, విచారణ సందర్భంగా ఈ పిటిషన్లను టాటా సన్స్ వ్యతిరేకించింది. కంపెనీల చట్టం ప్రకారం మైనారిటీ వాటా కలిగిన పిటిషనర్లు ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసే అవకాశం లేదని టాటా సన్స్ వాదించింది. కనీసం 10% వాటా కలిగి ఉండాలన్న అర్హతా ప్రమాణాల విషయంలో విఫలమైనందున ఈ పిటిషన్లు కొనసాగించగలిగినవి కావని ట్రిబ్యునల్ పేర్కొంది. దీనికి మిస్త్రీ కుటుంబ కంపెనీలు స్పందిస్తూ... జారీ మూలధనంలో పిటిషనర్ పదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నా లేదా మైనారిటీ వాటాదారుల్లో పదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నా చట్ట ప్రకారం ఈ నిబంధనను ట్రిబ్యునల్ రద్దు చేయవచ్చని పేర్కొన్నాయి. అయితే, సైరస్ కుటుంబ కంపెనీలు రెండిం టికీ కలిపి మొత్తం జారీ మూలధనంలో 2.17% వాటాయే ఉందని, పిటిషన్లను దాఖలు చేసే సమయంలో అర్హత నిబంధనను రద్దు చేయాలని కోరకుండా, ఈ దశలో అడగలేరని టాటా సన్స్ వాదించింది. ట్రిబ్యునల్ ముందు న్యాయపోరాటానికి కనీసం 10% వాటా నిబంధనను రద్దు చేయాలన్న సైరస్ కంపెనీల అభ్యర్థనపై వాదనలను మంగళవారం వింటామని ట్రిబ్యునల్ బెంచ్ పేర్కొంది. -
డొకోమోతో వివాదానికి ‘టాటా’!
⇒ 1.18 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకారం... ⇒ సెటిల్మెంట్ కుదిరిందని టాటా సన్స్ ప్రకటన ⇒ భారత్ నుంచి వైదొలిగేందుకు డొకోమోకు లైన్క్లియర్ న్యూఢిల్లీ: జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమోతో వివాదానికి టాటా గ్రూప్ ముగింపు పలకనుంది. తమ టెలికం జాయింట్ వెంచర్ సంస్థ నుంచి డొకోమో వైదొలిగే విషయంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న న్యాయ వివాదంపై కోర్టు వెలుపల సెటిల్మెంట్కు అంగీకరించినట్లు టాటా సన్స్ మంగళవారం ప్రకటించింది. ఈ కేసులో డొకోమోకు 1.18 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 7,900 కోట్లు) పరిహారాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. ‘జూన్ 22, 2016న లండన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు(ఎల్సీఐఏ) డొకోమోకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు మేం అంగీకరిస్తున్నాం. దేశంలో సానుకూల పెట్టుబడి పరిస్థితులు కొనసాగేవిధంగా జాతీయ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని దీనికి ఓకే చెప్పాం. కాంట్రాక్టు నిబంధనలను పక్కాగా పాటించే విషయంలో అంతర్జాతీయంగా టాటా గ్రూప్ పేరొందింది. దీనికి అనుగుణంగానే డొకోమోకు అనుకూలంగా ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుపై భారత్లో లేవనెత్తిన అభ్యంతరాలను వెనక్కితీసుకోవాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది’ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తమ మధ్య జరిగిన సెటిల్మెంట్కు అనుమతించడంతోపాటు.. ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియను నిలిపివేయాలని(సస్పెండ్) ఢిల్లీ హైకోర్టుకు డొకోమో, టాటా సన్స్ విన్నవించాయి. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడం... కొత్త చైర్మన్గా ఎన్.చంద్రశేఖరన్ పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ వివాదానికి తెరపడుతుండటం గమనార్హం. చట్టపరమైన చర్యలకు బ్రేక్: డొకోమో ‘ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ప్రకారం టాటా సన్స్ 1.18 బిలియన్ డాలర్లను ఇప్పటికే డిపాజిట్ చేసింది. తాజాగా కుదిరిన సెటిల్మెంట్ మేరకు ఈ మొత్తాన్ని ఇక కోర్టు మాకు చెల్లించేందుకు దోహ దం చేస్తుంది. టాటా టెలిసర్వీసెస్లో మా వాటా షేర్లను టాటా సన్స్కు బదలీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది’ అని డొకోమో ఒక ప్రకటన లో పేర్కొంది. వివాదాన్ని సంయుక్తంగా భారత్లో నే పరిష్కరించుకుంటున్న నేపథ్యంలో... అమెరికా, బ్రిటన్లలో టాటాలపై తాము చేపట్టిన చట్టపరమైన చర్యలను సస్పెండ్ చేసేందుకు అంగీకరించామని డొకోమో తెలిపింది. తాజా పరిణామాలతో భారత్ నుంచి డొకోమో పూర్తిగా వైదొలిగేందుకు లైన్ క్లియర్ అయింది. కాగా, డొకోమోతో భవిష్యత్తులో మళ్లీ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని టాటా సన్స్ పేర్కొంది. మరోపక్క, టాటాసన్స్తో కొత్త భాగస్వామ్య ఒప్పందం కింద మళ్లీ తాము భారత్లో పెట్టుబడులను పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని డొకోమో కూడా చెప్పడం గమనార్హం. వివాదం సంగతిదీ... ⇒ 2009 నవంబర్లో టాటా టెలిసర్వీసెస్లో జపాన్ కంపెనీ ఎన్టీసీ డొకోమో 26.5% వాటాను కొనుగోలు చేసింది. టాటాడొకోమో జాయింట్ వెంచర్(జేవీ)లో భాగస్వామిగా చేరింది. షేరుకి రూ.117 చొప్పున దాదాపు రూ.12,740 కోట్లను టాటా టెలి హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్కు చెల్లించింది. ⇒ అయితే, తాము గనుక ఐదేళ్ల వ్యవధిలోపే ఈ జేవీ నుంచి వైదొలగిన పక్షంలో తాము చెల్లించిన ధరలో కనీసం 50 శాతాన్ని తమకు వెనక్కి ఇవ్వాలని డొకోమో షరతు పెట్టింది. దీనికి టాటా సన్స్ కూడా అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది. ⇒ వ్యాపార ప్రతికూలతలతో డొకోమో 2014లో జేవీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. డీల్ మేరకు షేరుకి రూ.58 చొప్పున రూ.7,200 కోట్లు చెల్లించాలని టాటాలను కోరింది. ⇒ అయితే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం షేరుకి రూ.23.34 చొప్పున మాత్రమే తాము ఇవ్వగలమని టాటా గ్రూప్ పేర్కొంది. ⇒ దీనిపై డొకోమో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్కు వెళ్లింది. టాటాలు డొకోమోకు 1.18 బిలియన్ డాలర్లను చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. ⇒ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల మేరకు ఆర్బీఐ తన విదేశీ మారక చట్టం నుంచి మినహాయింపునివ్వాలని డొకోమో కోరింది. ఈ మినహాయింపు కోసం ఆర్బీఐ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. అయితే, ఈ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. కాగా, టాటా–డొకోమోకు ఓకే చెబితే చాలా కేసుల్లో ఇలాంటి మినహాయింపులు ఇవ్వాల్సివస్తుందన్న కారణంతోనే ఆర్థిక శాఖ నిరాకరిస్తున్నట్లు సమాచారం. తాజా సెటిల్మెంట్తో బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులోకి చేరింది. -
ఇక టాటా సన్స్ సారథి ‘చంద్ర’
నేడు చైర్మన్గా బాధ్యతల స్వీకరణ ముంబై: పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ చైర్మన్గా ఎన్. చంద్రశేఖరన్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అంతా ’చంద్ర’గా పిల్చుకునే చంద్రశేఖరన్ (54).. టాటా గ్రూప్ 150 ఏళ్ల చరిత్రలో తొలి పార్సీయేతర చైర్మన్ కావడం గమనార్హం. ఇప్పటిదాకా ఆయన టాటా గ్రూప్లో భాగమైన ఐటీ దిగ్గజం టీసీఎస్కు సారథ్యం వహించారు. ట్రస్టీలతో విభేదాల నేపథ్యంలో సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన టాటా గ్రూప్.. జనవరి 12న చంద్రశేఖరన్ను ఆయన స్థానంలో నియమించిన సంగతి తెలిసిందే. ఫొటోగ్రఫీపై మక్కువ కలిగిన చంద్ర .. ప్రపంచవ్యాప్తంగా పలు మారథాన్స్లో కూడా పాల్గొన్నారు. కొత్త హోదా తనపై మరింత భారీ బాధ్యత మోపిందని, ఇందులో ఇటు సవాళ్లతో పాటు అటు అవకాశాలు కూడా ఉన్నాయని చంద్రశేఖరన్ గత వారం వ్యాఖ్యానించారు. సవాళ్లతో స్వాగతం..: కొత్త హోదాలో చంద్రశేఖరన్కి పలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. ముందుగా టాటా స్టీల్ యూరప్ కార్యకలాపాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. టాటా స్టీల్ ఇప్పటికే బ్రిటన్లోని కొన్ని అసెట్స్ను విక్రయించడం మొదలుపెట్టింది. అయితే, ఎంత మేర అసెట్స్ను విక్రయించాలి, కార్యకలాపాలను మళ్లీ గాడిలో పెట్టడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై చంద్రశేఖరన్ కసరత్తు చేయాల్సి రానుంది. ఇక రతన్ టాటా కలల ప్రాజెక్టు నానో కార్ల విషయంలోనూ ఆయన తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా నష్టాలతో టాటా మోటార్స్కి నానో ప్రాజెక్టు గుదిబండగా మారింది. ఇవి కాకుండా మిస్త్రీకి ఉద్వాసన వ్యవహారంలో కేంద్ర బిందువులైన టాటా ట్రస్ట్స్, ట్రస్టీలతో చంద్రశేఖరన్ ఏవిధంగా నడుచుకోబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. టీసీఎస్ చైర్మన్గా చంద్రశేఖరన్; సీఈఓగా గోపీనాథన్ టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రశేఖరన్ నేటి నుంచి టీసీఎస్ చెర్మన్గా కూడా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా కంపెనీ ఎండీ, సీఈఓగా ఆయన వ్యవహరించారు. ఇక ప్రస్తుత టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజేష్ గోపీనా«థన్ సీఈఓ, ఎండీగా బాధ్యతలు తీసుకుంటారు. కొత్త సీఎఫ్ఓగా వి. రామకృష్ణన్ను నియమించారు. మరోపక్క, సీఓఓ ఎన్.గణపతి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. -
టాటా సన్స్ నుంచి సైరస్ మిస్త్రీ ఔట్
డైరెక్టర్ పదవినుంచి తొలగింపు • ఈజీఎమ్లో తీర్మానాన్ని ఆమోదించిన వాటాదారులు • టాటా గ్రూప్తో తెగిన చివరి అనుబంధం ముంబై: టాటా గ్రూప్తో సైరస్ మిస్త్రీకి మిగిలిన చివరి అనుబంధం(హోదా పరంగా) తెగిపోయింది. టాటా సన్స్ డైరెక్టర్గా మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. సోమవారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)లో డైరెక్టర్గా సైరస్ మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి వాటాదారులు తగిన మెజారిటీతో ఆమోదం తెలిపారని టాటా సన్స్ పేర్కొంది. ఈ పరిణామం కారణంగా టాటా సన్స్ కంపెనీలో 18.5 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి పదేళ్ల తర్వాత తొలిసారిగా ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. షాపూర్జీ పల్లోంజీ కుటుంబం ఈ కంపెనీలో 1965 నుంచి వాటాదారుగా ఉంది.1980లో మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ డైరెక్టర్గా చేరారు. 2004లో వైదొలిగారు. రెండేళ్ల తర్వాత 2006లో సైరస్ మిస్త్రీ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన టాటా సన్స్ చైర్మన్ అయ్యారు. పనితీరు బాగా లేదంటూ చైర్మన్ పదవి నుంచి ఆయనను టాటా సన్స్ కంపెనీ గత ఏడాది అక్టోబర్ 24న తొలగించింది. తదనంతరం టాటా మోటార్స్, టీసీఎస్ తదితర ఆరు టాటా గ్రూప్ కంపెనీలు ఆయనను డైరెక్టర్గా తమ తమ డైరెక్టర్ల బోర్డ్ నుంచి తొలగించాయి. విఫలమైన మిస్త్రీ ప్రయత్నాలు డైరెక్టర్గా మిస్త్రీని తొలగించడానికి అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్) నిర్వహించనున్నామని గత నెలలోనే టాటా సన్స్ ప్రకటించింది. దీనిని న్యాయపరంగా అడ్డుకోవడానికి మిస్త్రీ చేసిన పలు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈజీఎమ్ నిర్వహణను అడ్డుకోవాలంటూ మిస్త్రీ వేసిన పిటీషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ గత నెల 31న కొట్టేసింది. ఈ ఈజీఎమ్కు వ్యతిరేకంగా మిస్త్రీకి చెందిన రెండు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు దాఖలు చేసిన పిటీషన్లను గత వారంలో నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది. దీంతో ఈజీఎమ్కు మార్గం సుగమం అయింది. ఈ ఈజీఎమ్లో డైరెక్టర్గా ఆయనను తొలగించే తీర్మానం ఆమోదం పొందింది. -
టాటా సన్స్పై మిస్త్రీ పిటిషన్ తిరస్కృతి
న్యూఢిల్లీ: టాటా సన్స్పై ఆ గ్రూప్ బహిస్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన అప్పిలేట్ పిటిషన్ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తోసిపుచ్చింది. మిస్త్రీని బోర్డ్ డైరెక్టర్ బాధ్య తల నుంచి తొలగించడానికి టాటా సన్స్ సోమవారం నిర్వహించతలపెట్టిన షేర్ హోల్డర్ల సమావేశాన్ని నిలుపుచేయాలని కోరుతూ మిస్త్రీ నేతృత్వంలోని రెండు కంపెనీలు తొలుత ముంబై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించాయి. జనవరి 31న ఎన్సీఎల్టీ దీనిని తోసిపుచ్చడంతో అప్పిలేట్ ట్రిబ్యునల్ను మిస్త్రీ ఆశ్రయించారు. తాజాగా ఇక్కడా ఆయనకు ప్రతికూల తీర్పు వెలువడింది. ‘‘మేము ఎలాంటి సానుకూల రూలింగ్నూ ఇవ్వడం లేదు. ఇందుకు సంబంధించి మూడు అప్పీళ్లనూ తిరస్కరిస్తున్నాం. తరువాత సవివరమైన ఉత్త్తర్వులను వెలువరిస్తాం’’ అని జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. గౌరవనీయ పరిష్కారం... మిస్త్రీ కంపెనీల పిటిషన్ను తిరస్కరించిన అప్పిలేట్ ట్రిబ్యునల్, కేసు పరిష్కారం విషయంలో కీలక సూచనలూ చేసింది. ‘‘ఈ కేసులో పార్టీలు గౌరనీయమైన ఒక పరిష్కారానికి రావాలి. అలాకాని పక్షంలో ఇరువైపుల ప్రతిష్ట దెబ్బతింటుంది. వాణిజ్య ప్రయోజనాలకూ విఘాతం కలుగుతుంది. అలాగే ఉద్యోగుల నైతికతా దెబ్బతింటుంది.’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
మిస్త్రీ ధిక్కరణ పిటిషన్పై 18న ఉత్తర్వులు
ముంబై: రతన్టాటా, టాటాసన్స్ డైరెక్టర్లపై సైరస్ మిస్త్రీ నేతృత్వం లోని రెండు సంస్థలు దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్పై తన ఉత్తర్వులను ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఈ నెల 18వ తేదీ వరకూ రిజర్వ్ చేసింది. ఎన్సీఎల్టీ డిసెంబర్ 22న ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చి మిస్త్రీని బోర్డ్ నుంచి తొలగించడానికి టాటా సన్స్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది పిటిషనర్ల ఆరోపణ. బీఎస్వీ ప్రసాద్ కుమార్ (మెంబర్–జ్యుడీషియల్), ఎన్ నల్లసేనాపతి (మెంబర్–టెక్నికల్)లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఇరువర్గాల వాదనలు సోమవారం ముగిశాయి. తనను బోర్డ్ నుంచి తొలగించేందుకు జరపతలపెట్టిన ఫిబ్ర వరి 6 ఈజీఎంను నిలిపివేయాలని, ఇలాంటి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తదుపరి సమావేశాలనూ నిరోధించాలని పిటిషన్లో మిస్త్రీ కంపెనీలు కోరాయి. -
కోహ్లీ రిసర్చ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా కొత్త సారథి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కోహ్లి రిసర్చ్ బ్లాక్ను టాటా సన్స్ కాబోయే చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సోమవారం ప్రారంభించారు. ఇంటెల్లిజెంట్ సిస్టమ్స్ రంగంలో పరిశోధన, బోధన, ఎంట్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఫౌండేషన్ కోహ్లి సెంటర్ను ఏర్పాటు చేసింది. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ కేంద్రం ఐటీ రంగంలో అభివృద్ధికి ప్రేరణ కలిగిస్తుందని చంద్రశేఖరన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇంటెల్లిజెంట్ సిస్టమ్స్ రంగంలో అధునాతన పరిశోధనకై విద్యావేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ఆటోమేషన్ సంచలనాలను సృష్టిస్తుందని, అత్యుత్తమ పరిశోధనకు కోహ్లి రిసర్చ్ సెంటర్ కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. -
30 ఏళ్ల... ‘చంద్ర’యాన్
కాలేజీ నుంచి టీసీఎస్ ఉద్యోగానికి • కెరీర్ మొత్తం అక్కడే; ఇపుడు గ్రూపు చైర్మన్గా • నా సామర్థ్యానికి గౌరవమిది: చంద్రశేఖరన్ పూర్తిపేరు నటరాజన్ చంద్రశేఖరన్. అందరూ పిలిచేది మాత్రం చంద్ర... అనే. వయసు 54 ఏళ్లు. తమిళనాడులోని తిరుచ్చి రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి బయటకొచ్చిన తరవాత ఆయన ఎంచుకున్నది టీసీఎస్నే. తన పూర్తి సామర్థ్యాన్ని కంపెనీకే ధారపోసిన చంద్రశేఖరన్... 2009 నాటికి టీసీఎస్ ఎండీ, సీఈవో స్థాయికి చేరుకున్నారు. 2014లో ఐదేళ్ల పదవీ కాలం ముగిసినా... రెండోసారీ దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన మర్నాడే చంద్రశేఖరన్ను టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డులోకి తీసుకున్నారు. తాజాగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలకు ఎంపిక చేశారు. టీసీఎస్ విజయం వెనక ‘చంద్ర’ చంద్రశేఖరన్ విషయంలో చెప్పుకోవాల్సింది ఒకటుంది. ఇప్పటిదాకా టాటా సన్స్ పగ్గాలు దక్కించుకున్నది టాటాల కుటుంబీకులు... లేదా వాటాదారులు మాత్రమే. ఒక ఉద్యోగికి ఈ స్థాయి దక్కటం ఇదే తొలిసారి కూడా. రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా, జేఎల్ఆర్కు చెందిన రాల్ఫ్ స్పెత్, పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి తదితరులతో పోటీ పడి మరీ అగ్ర పీఠాన్ని దక్కించుకున్నారు. విశేషమేంటంటే ఒకదశలో టాటా అగ్రపీఠానికి టీసీఎస్ మాజీ సీఈఓ రామదురై పేరు కూడా వినిపించింది. టీసీఎస్ ఎండీ కావటానికి ముందు... నాటి సీఈవో రామదొరైకు సహాయకుడిగా చంద్ర సేవలందించారు కూడా. రెండు దశాబ్దాల కాలంలో ప్రత్యర్థి కంపెనీలను దాటుకుని దేశీయ అగ్రగామి ఐటీ కంపెనీగా టీసీఎస్ అవతరించడం, రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో టాటా గ్రూపునకు కల్పవృక్షంగా మారటం వెనక చంద్ర కృషి చాలా ఉంది. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఆయన టీసీఎస్ను అగ్రగామిని చేశారు. టాటా గ్రూపు లాభాల్లో 80 శాతానికి పైగా టీసీఎస్ నుంచే వస్తుండటం గమనార్హం. 2015లో ఐటీ సేవల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రాండ్గా టీసీఎస్ ఖ్యాతిని సొంతం చేసుకుంది కూడా. 2015–16లో 16.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. దేశంలో 3.78 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది కూడా. సానుకూలతలే కాదు... సవాళ్లూ ఉన్నాయ్ టీసీఎస్లో సుదీర్ఘ అనుభవం, గ్రూపునకు ఆశాకిరణంగా కనిపిస్తున్న జేఎల్ఆర్లు చంద్రకు సానుకూలాంశాలు. అయితే గ్రూపులోని పలు కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి గాడిన పెట్టడం పెద్ద సవాలే. చంద్రకు భార్య లలిత, కుమారుడు ప్రణవ్ ఉన్నారు. ఇండో–యూఎస్, భారత్–బ్రిటిష్ సీఈవోల ఫోరంలో చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐటీ పరిశ్రమ అసోసియేషన్ నాస్కామ్కు 2012–13లో చైర్మన్గా పనిచేశారు. మార్పు దశలో టాటా...: చంద్రశేఖరన్ టాటా గ్రూపు మార్పు దశలో ఉందని ఆ గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎంపికైన చంద్రశేఖరన్ అన్నారు. టాటాలు సృష్టించిన విలువలు, నైతికత, సంస్కృతితో గ్రూపును ప్రగతి దిశగా నడిపించడమే తన కర్తవ్యమన్నారు. టాటా సన్స్ తనను చైర్మన్గా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ‘‘కొత్త పాత్ర ఎన్నో బాధ్యతలతో కూడుకున్నదని నాకు తెలుసు. దేశ ప్రజల్లో సమున్నత స్థానాన్ని ఆక్రమించిన ఓ గొప్ప సంస్థను నడిపించేందుకు నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. టాటా గ్రూపుతో 30 ఏళ్ల పాటు కలసి నడుస్తూ ఈ స్థాయికి చేరుకోవడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారాయన. -
‘టాటా’ మనిషికే పగ్గాలు
టాటా సన్స్ చైర్మన్గా టీసీఎస్ చంద్రశేఖరన్ • గురువారం సాయంత్రం బోర్డు భేటీలో నిర్ణయం • అనిశ్చితికి తెర; ఫిబ్రవరి 21న బాధ్యతలు ముంబై: టాటా సన్స్కు కొత్త చైర్మన్ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్.చంద్రశేఖరన్ను టాటా గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించారు. సైరస్ మిస్త్రీ వ్యవహారంతో ఇబ్బందులెదుర్కొన్న రతన్ టాటా... ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా తనకు నమ్మకంగా ఉండే చంద్రశేఖరన్వైపు మొగ్గు చూపించారని తెలుస్తోంది. దీనికితోడు గ్రూపులో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అయిన టీసీఎస్ను విజయవంతంగా నడిపిస్తున్న చరిత్ర కూడా చంద్రశేఖరన్కు ఉంది. గురువారం సాయంత్రం ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నూతన చైర్మన్గా ఆయన్ను టాటా సన్స్ ఎంపిక చేసింది. ఇక కొత్త బాధ్యతలను చంద్రశేఖరన్ ఫిబ్రవరి 21న స్వీకరిస్తారు. ‘‘టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎన్S.చంద్రశేఖరన్ టాటాసన్స్ డైరెక్టర్ల బోర్డు గురువారం నాటి సమావేశంలో నియమించింది. ఎంపిక కమిటీ ఏకగ్రీవ సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది’’ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాకపోతే చంద్రశేఖరన్ పదవీ కాలం ఎన్నాళ్లుంటుంది? రతన్టాటాకు గ్రూపులో కొత్తగా ఏవైనా బాధ్యతలు అప్పగిస్తున్నారా? వంటి వివరాలను మాత్రం టాటా సన్స్ వెల్లడించలేదు. ఎంపిక కమిటీ ఏకగ్రీవ సిఫారసు గతేడాది అక్టోబర్ 24న టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ పీ మిస్త్రీని తప్పించడంతో తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా పగ్గాలు చేపట్టారు. ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు భిన్న రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న 103 బిలియన్ డాలర్ల విలువగల టాటా గ్రూపు చైర్మన్గా అర్హత కలిగిన వ్యక్తి ఎంపిక కోసం... అదే రోజున రతన్టాటా, టీవీఎస్ గ్రూపు హెడ్ వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్యతో ఓ కమిటీ ఏర్పడింది. కమిటీకి కొత్త చైర్మన్ ఎంపిక కోసం 4 నెలల సమయం ఇచ్చారు. కానీ కమిటీ దీన్ని 2 నెలల్లోనే ముగించింది. తాజా నిర్ణయంతో టాటా గ్రూపు నాయకత్వంపై రెండు నెలలుగా ఏర్పడిన సందిగ్ధతకు తెరపడినట్లే. మిస్త్రీ కుటుంబం టాటా సన్స్పై న్యాయపోరాటం చేస్తున్న కీలక సమయంలో ‘చంద్ర’ టాటా చైర్మన్ బాధ్యతల్లోకి వస్తుండడం గమనార్హం. చంద్రశేఖరుడిపై ఆశలు... ‘‘చంద్రశేఖరన్ టీసీఎస్ సీఈవో, ఎండీగా ఉత్తమనాయకత్వాన్ని అందించారు. టాటా గ్రూపు మొత్తం తన సామర్ధ్యాన్ని గుర్తించడంతోపాటు ఆయా వ్యాపారాల్లో నాయకులుగా రాణించేందుకు ఆయన స్ఫూర్తినిస్తారని నమ్ముతున్నాం. అలాగే, మా విలువలతో కూడిన వ్యవస్థను, నైతికతను కొనసాగిస్తారని, టాటా గ్రూపు విధానాలను అనుసరిస్తారని భావిస్తున్నాం’’ అని టాటా సన్స్ ప్రకటనలో పేర్కొంది. నియమకాన్ని ఆహ్వానిస్తున్నాం.. టాటాసన్స్ చైర్మన్గా చంద్రశేఖరన్ నియామకాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ నిర్ణయంతో టాటా గ్రూపు దేశ వ్యాపార రంగంలో అగ్రగామిగా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషిని కొనసాగిస్తుందనే నమ్మకం ఉంది. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ సారథ్యానికి తగిన వ్యక్తి... టీసీఎస్ను ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి స్థాయికి తీసుకె ళ్లారు. అంతర్జాతీయంగా చంద్రశేఖరన్కున్న అనుభవం, వ్యాపార చతురత, టాటాలతో సుదీర్ఘ అనుబంధం నూతన బాధ్యతలకు ఆయన తగిన వారని నిరూపిస్తుంది. – చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో సవాళ్లను ఎదుర్కోనే సత్తా చంద్రకు ఉంది.. టాటా గ్రూపు చైర్మన్గా చంద్రశేఖరన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ సామర్థ్యం తనకు ఉందని ఆయన ఇప్పటికే టీసీఎస్లో నిరూపించుకున్నారు. – ఎన్.నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఇండియన్ ఐకాన్ రక్షకుడు.. కొత్త బాధ్యతలు స్వీకరించనున్న చంద్రశేఖరన్ను అభినందనలు. మీరిప్పుడు ఇండియన్ ఐకాన్ సంరక్షకులు. ఆ బాధ్యతను చేపట్టగల విశాలమైన భుజస్కంధాలు మీకున్నాయి. – ఆనంద్ మహింద్రా, మహింద్రా గ్రూపు చైర్మన్ -
ఇక్కడ అన్న..అక్కడ తమ్ముడు
ముంబై: టాటా మిస్త్రీ బోర్డ్ వార్ లో టాటా గ్రూప్ లో కీలక నియామకాలు గురువారం చోటు చేసుకున్నాయి. టాటాసన్స్ కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ ఎండీ ఎన్ చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. గురువారం నిర్వహించిన టాటా సన్స బోర్డ్ సమావేశంలొ ఈ మేరకు నిర్ణయం జరిగింది. దీంతో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ సీఈవో గా రాజేష్ గోపీనాథన్ ను టాటా గ్రూపు నియమించింది. అలాగే ఎన్ జీ సుబ్రమణియం కొత్త సీవోవోగా ఎంపికయ్యారు. అయితే ఎన్ జీ సుబ్రమణియం చంద్రశేఖరన్ కు సోదరుడు. టీసీఎస్ విజన్ రోడ్ మ్యాప్ లో ఎలాంటి మార్పులు ఉండవని టీసీఎస్ కొత్త బాస్ గోపీనాథన్ ప్రకటించారు. తన ఎంపికపై సంతోషాన్ని ప్రకటించిన టాటా సన్స్ కొత్త ఛైర్మన్ చంద్రశేఖరన్ టీసీఎస్ కు గోపీనాథన్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు మంచి వ్యాపార దక్షత ఉందని కొనియాడారు. టీసీఎస్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ లో అపారమైన అనుభవం ఉందన్నారు. ఆయన నేతృత్వంలో టీసీఎస్ మరింత వ్యాపారంలో్ మరింత ఎత్తుకు ఎదగగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు టాటాసన్స్ కొత్త చైర్మన్ గా చంద్రశేఖరన్ ఎంపిక పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య, నీతి ఆయోగ్ ఛైర్మన్ అమితాబ్ కాంత్ తదితర ప్రముఖులు చంద్రశేఖరన్ నియామకాన్ని స్వాగతించారు. -
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక
-
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక
ముంబై: టాటా- మిస్త్రీ బోర్డ్ వార్ అనంతరం కీలక పరిణామం చేసుకుంది. టాటా సన్స్ బోర్డ్ ఛైర్మన్గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం గురువారం టాటా సన్స్ బోర్డ్ కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం బోర్డ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీసీఎస్ చీఫ్ నటరాజన్ చంద్రశేఖరన్ ను టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా ఎంపిక చేశారు. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 21 నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే దీనిపై టాటా గ్రూపు అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ కొత్త చీఫ్ గా రాజేష్ గోపీనాథ్ ఎంపిక ఖాయమైనట్టు తెలుస్తోంది. టాటా సన్స్ మధ్యంతర ఛైర్మన్ రతన్ టాటా, టీవీఎస్ గ్రూపు చైర్మన్ వేణు శ్రీనివాసన్, బైన్ కేపిటల్ అమిత్ చంద్ర, రోనన్ సేన్ ,లార్డ్ కుమార్ భట్టాచార్యలతో కూడిన ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ సమావేశంలో కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ బాస్ ను ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే ఎన్. చంద్రశేఖరన్ టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా ఎంపిక కానున్నారనే అంచనాలపై పలువురు పారిశ్రామికవేత్తలు, మార్కెట్ నిపుణులు ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి స్పందిస్తూ టాటా సన్స్ చైర్మన్ గా ఆయన సక్సెస్ అవుతారనే దానిపై ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి అని, చంద్రశేఖరన్ ను ఎంపిక చేస్తే ఐటీ రంగానికి మంచిదేనంటూ వ్యాఖ్యానించారు. చంద్రశేఖరన్ ఎంపిక అంచనాలపై మరో ఐటీ మేజర్ విప్రోతోపాటు, బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా , టైటన్ ఎండీ భాస్కర్ భట్ కూడా హర్షం వ్యక్తం చేశారు. -
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక మరి కొద్దిసేపట్లో?
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్ గా ఎవరు అనే సస్పెన్స్ కు మరి కొద్ది పేపట్లో తెరపడనుంది. సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం నూతన చైర్మన్ ఎంపిక కసరత్తు ఈ రోజుతో ముగియనుంది. గురువారం అనుకోని బోర్డు సమావేశంలో ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది. సాయంత్రం 5 గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో మార్కెట్ వర్గాల్లో ప్రముఖమైన వ్యక్తినే ఈ పదవికి ఎంపిక చేసు అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే టాటా సన్స్ బోర్డు వైస్ ఛైర్మన్ అ భ్యర్థి ఎంపికను ఈ సమావేశంలోనే ఎంపిక చేయనున్నారు. కాగా గత ఏడాది అక్టోబర్ లో మిస్త్రీ తొలగింపు తర్వాత రతన్ టాటా మధ్యంతర ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. -
రతన్ టాటాపై కోర్టు ధిక్కార పిటిషన్
• టాటా సన్స్పై మిస్త్రీ న్యాయ పోరాటం • బోర్డ్ నుంచి తొలగింపు ప్రయత్నం జరుగుతోందని విమర్శ ముంబై: టాటా గ్రూప్ చీఫ్ రతన్ టాటాసహా హోల్డింగ్ కంపెనీ– టాటా సన్స్ డైరెక్టర్లపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో సైరెస్ మిస్త్రీ నేతృత్వంలోని రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు తాజాగా ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాయి. బోర్డ్ నుంచి మిస్త్రీని తప్పించడానికి చర్యలు ప్రారంభిస్తూ, ట్రిబ్యునల్ గత ఉత్తర్వుల ఉల్లంఘనలకు టాటా సన్స్ పాల్పడుతోందన్నది బుధవారం దాఖలు చేసిన ఈ పిటిషన్ ప్రధాన ఆరోపణ. ఫిబ్రవరి 6వ తేదీన టాటా సన్స్ ఈజీఎం జరగనుందని, ఈ సమావేశాన్ని నిలుపుచేయడంతోపాటు, ఆ తేదీసహా మరే రోజునా... గతంలో ట్రిబునల్ ఇచ్చిన రూలింగ్ను ఉల్లంఘిస్తూ చర్యలు తీసుకోకుండా ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ పిటిషన్లో సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్లో కోరాయి. జైలుశిక్ష.. జరిమానా విధించండి... టాటా బోర్డ్ నుంచి డైరెక్టర్గా మిస్త్రీని తొలగించడానికి సంబంధించి జనవరి 3న టాటా సన్స్ ఒక ప్రత్యేక నోటీసు జారీ చేసిందని పిటిషన్ పేర్కొంది. డిసెంబర్ 22న ఎన్సీఎల్టీ జారీ చేసిన ఉత్తర్వును పూర్తిస్థాయిలో ఉల్లంఘించడం కిందకే వస్తుందని పిటిషన్ వివరించింది. ఈ ఉల్లంఘనలకు గాను టాటాసహా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జి ట్రస్ట్ డైరెక్టర్లకు ఆరు నెలల వరకూ వర్తించే విధంగా సాధారణ జైలు శిక్ష లేదా రూ.2,000 జరిమానా లేదా రెండు శిక్షలూ విధించాలని పిటిషన్ ట్రిబునల్ను ఆశ్రయించింది. మిస్త్రీ పిటిషన్లో ఉన్న డైరెక్టర్లలో ఎన్ఏ సూనావాలా, ఆర్కే కృష్ణకుమార్, ఆర్ వెంకటరమణలు ఉన్నారు. ఇంతక్రితం తాము దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేస్తూ... ఈ అంశాన్ని పరిష్కారించేంతవరకూ దీనిపై ఎటువంటి చర్యలు లేదా ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశించిందని దిక్కార పిటిషన్ పేర్కొంది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ– టాటాసన్స్ డైరెక్టర్గా మిస్త్రీని తొలగించడానికి ఫిబ్రవరి 6వ తేదీన షేర్హోల్డర్ల సమావేశం నిర్వహించడానికి రంగం సిద్ధం అయిన నేపథ్యంలో మిస్త్రీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి అక్టోబర్ 24న మిస్త్రీకి హఠాత్తుగా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన ఆరు కంపెనీల బోర్డులకూ రాజీనామా చేశారు. అయితే టాటా సన్స్, ఆ కంపెనీ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాపై ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. కార్పొరేట్ నియమనిబంధనలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. -
మర్యాదగా చెబితే మిస్త్రీ వినలేదు!
ఉద్వాసనకు ముందే రాజీనామా కోరిన టాటా • తిరస్కరించడంతో తొలగింపు • ఆయనపై నమ్మకం కోల్పోవడం వల్లే • కంపెనీ లా ట్రిబ్యునల్కు టాటాసన్స్ వెల్లడి ముంబై: టాటా గ్రూపు చైర్మన్గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికే ముందు టాటా సన్స్ ఆయనకు రాజీనామా చేసే అవకాశం ఇచ్చిందట. టాటా సన్స్ బోర్డు మిస్త్రీపై నమ్మకం కోల్పోవడంతో రాజీనామా చేయాలని ఆయన్ను రతన్టాటా స్వయంగా అడిగారు. కానీ, రాజీనామా చేసేందుకు మిస్త్రీ నిరాకరించడంతో మెజారిటీ ఓటు మేరకు తొలగించాల్సి వచ్చిందని టాటా సన్స్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కు వివరించింది. మిస్త్రీ కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు టాటాసన్స్, రతన్టాటాలకు వ్యతిరేకంగా కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి పిటిషన్లకు సమగ్రమైన స్పందనను 204 పేజీల అఫిడవిట్ రూపంలో టాటా సన్స్ దాఖలు చేసింది. మిస్త్రీ నాయకత్వంలో ఎటువంటి పురోగతి లేకపోవడం లేదా చాలా తక్కువగా ఉండడంతో గతేడాది అక్టోబర్ 24న చైర్మన్గా ఆయన్ను తొలగించినట్టు తెలిపింది. టాటాసన్స్ బోర్డులోని తొమ్మిది మంది డైరెక్టర్లకు గాను ఫరీదా ఖంబటా గైర్హాజరు కాగా... మిగిలిన వారిలో ఏడుగురు మిస్త్రీని మార్చేందుకుఅనుకూలంగా ఓటు వేశారని, డైరెక్టర్గా మిస్త్రీని ఓటు వేసేందుకు అనర్హుడిగా ప్రకటించినట్టు పేర్కొంది. ‘‘2016 అక్టోబర్ 24న టాటాసన్స్ బోర్డు సమావేశానికి ముందే రతన్టాటా, నితిన్ నోహ్రియా సైరస్ మిస్త్రీతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్చైర్మన్ పదవికి రాజీనామా చేసే అవకాశం ఆయన ముందుంచారు. కానీ, తప్పుకునేందుకు మిస్త్రీ తిరస్కరించారు’’ అని టాటాసన్స్ తెలిపింది. అంతేకానీ, ఈ నిర్ణయం ఆకస్మికంగా, తొందరపాటుతో తీసుకోలేదని పేర్కొంది. టాటా గ్రూపు నిర్మాణాన్ని బలహీనపరిచారు.. ‘‘నాలుగేళ్ల మిస్త్రీ నాయకత్వంలో కలతకు గురిచేసే ఎన్నో వాస్తవాలు చోటు చేసుకున్నాయి. మూలధన కేటాయింపు నిర్ణయాల్లో క్రమశిక్షణ లోపించింది. నిర్వహణలో జాప్యం, వ్యూహాత్మక, వ్యాపార ప్రణాళికలు లేకపోవడం, వృద్ధికి అవకాశం ఉన్నకొత్త వ్యాపారాల్లోకి అడుగు పెట్టే అర్థవంతమైన చర్యలు లోపించడం, ఉన్నత స్థాయి యాజమాన్యం బలహీనపడడం వంటివి జరిగాయి. టాటా గ్రూపులోని మేజర్ కంపెనీల్లో టాటాసన్స్ డైరెక్టర్ల ప్రాతినిథ్యాన్ని తగ్గించేందుకు మిస్త్రీ క్రమపద్ధతిలో ప్రణాళికమేరకు వ్యవహరించారు. క్రమపద్ధతిలో పలుచన చేసే ఈ చర్యలు... టాటా విలువలు, సంస్కృతి, పరిపాలన మార్గదర్శకాలు, గ్రూపు వ్యూహాత్మక విధానాలు, నిర్మాణాన్ని నిర్వీర్యపరిచాయి’’ అని అఫిడవిట్లో టాటాసన్స్ వివరించింది. నాయకుడిగానూ విఫలం: వెనుకటి నుంచీ ఉన్న సమస్యలకే మిస్త్రీ దృష్టి పరిమితం అయిందని విమర్శించింది. ఇన్వెస్టర్లు, వాటాదారులతో సానుకూల సంబంధాలు నెలకొల్పడం నాయకుడి ప్రధాన విధుల్లో భాగమని, వీటిలోనూ మిస్త్రీవిఫలమయ్యారని పేర్కొంది. దీంతో టాటాసన్స్, టాటా ట్రస్ట్ల మధ్య విశ్వాస అంతరం పెరిగిపోయిందని పేర్కొంది. టాటా సన్స్ చైర్మన్గా మిస్త్రీని రతన్ టాటానే ఆహ్వానించారని... ఆ హోదాలోనే రతన్Sటాటా టాటాసన్స్ బోర్డు డైరెక్టర్ల సమావేశాల్లోపాల్గొనే హక్కు కలిగి ఉన్నారని పేర్కొంది. అయినప్పటికీ గతేడాది అక్టోబర్ 24 నాటి సమావేశానికి ముందెప్పుడూ రతన్టాటా గౌరవ చైర్మన్ హోదాలో పాల్గొన్న సందర్భం లేదని వివరించింది. మిస్త్రీ కుటుంబానికి ఆ హక్కులేదు... టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్ను నియమించే హక్కు మిస్త్రీ కుటుంబానికి లేదని టాటా సన్స్ స్పష్టం చేసింది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం ఇందుకు అవకాశం లేదని తెలిపింది. టాటా గ్రూపు నిర్వహణ కంపెనీ అయిన టాటా సన్స్... డైరెక్టర్పదవి నుంచి మిస్త్రీని తప్పించేందుకు ఫిబ్రవరి 9న సమావేశం కానున్న విషయం తెలిసిందే. ‘‘టాటా సన్స్లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి 1965 నుంచీ 18.4 శాతం వాటా ఉంది. అయినప్పటికీ పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ టాటా సన్స్ బోర్డులోడైరెక్టర్గా 1980లో తొలిగా నియమితులయ్యారు. 2004లో రిటైర్ అయ్యారు. రెండేళ్ల తర్వాత రతన్ టాటా ప్రతిపాదించగా ఆయన కుమారుడైన సైరస్ మిస్త్రీ టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్గా చేరారు. అంతేగానీ పల్లోంజీ మిస్త్రీ లేదా సైరస్ మిస్త్రీ నైతికంగానియామక హక్కు కలిగి లేరు’’ అని టాటా సన్స్ తన అఫిడవిట్లో పేర్కొంది. -
టాటా సన్స్ డైరెక్టర్గా మిస్త్రీపై వేటు!
వచ్చే నెల 6న ఈజీఎం న్యూఢిల్లీ: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) వచ్చే నెల 6న జరగనున్నది. సైరస్ మిస్త్రీని డైరెక్టర్గా తొలగించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని టాటా సన్స్ తెలిపింది. చైర్మన్గా తొలగించిన తర్వాత మిస్త్రీ టాటా గ్రూప్ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో నిరాధార ఆరోపణలు చేశారని, కంపెనీ రహస్య ఫైళ్లను బహిర్గతం చేశారని పేర్కొంది. ఆయన కారణంగా టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ పడిపోయిందని, వాటాదారులకు పరోక్షంగా నష్టం వాటిల్లిందని వివరించింది. చైర్మన్గా మిస్త్రీని టాటా సన్స్ గతం ఏడాది అక్టోబర్ 24న తొలగించిన విషయం తెలిసిందే. మిస్త్రీ డైరెక్టర్గా ఉన్న టాటా గ్రూప్ కంపెనీల నుంచి ఆయనను తొలగించడానికి ఆయా కంపెనీలు ఈజీఎంలను కూడా నిర్వహించాయి. ఈజీఎంలు జరుగుతుండగానే ఆయన ఆరు టాటా కంపెనీల డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు తనను చైర్మన్గా తొలగించినందుకు టాటా సన్స్, ప్రస్తుత చైర్మన్ రతన్ టాటాలపై సైరస్ మిస్త్రీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసులు దాఖలు చేశారు. -
రహస్య పత్రాలను 48 గంటల్లో వెనక్కిచ్చేయండి
మిస్త్రీకి టాటా సన్స్ మరో లీగల్ నోటీసు... సమాచారం బయటపెట్టనని హామీ ఇవ్వాలంటూ డిమాండ్ న్యూఢిల్లీ: కంపెనీకి సంబంధించిన రహస్య సమాచార పత్రాలన్నింటినీ తమకు వెంటనే తిరిగి స్వాధీనం చేయాలని టాటా సన్స్... సైరస్ మిస్త్రీని కోరింది. కంపెనీ ఆంతరంగిక సమాచారాన్ని బయటపెట్టడం ద్వారా గోప్యతా నిబంధనల్ని మిస్త్రీ ఉల్లంఘించారంటూ టాటా సన్స్ ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. తప్పుడు పద్ధతుల్లో, విశ్వాసరహితంగా, తమ అనుమతి లేకుండా కంపెనీ నుంచి ఈ పత్రాలను తీసుకెళ్లినట్టు ఆరోపించింది. చట్ట ప్రకారం శిక్షించదగిన నేరంగా దీన్ని పేర్కొంది. వెంటనే 48 గంటల్లోపు వాటిని తమకు స్వాధీనం చేయాలని, కాపీలను కూడా తన దగ్గర ఉంచుకోవద్దని కోరింది. ఆ సమాచారాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ బహిర్గతపరచనని, గోప్యతను కాపాడతానని హామీ పత్రంపై సంతకం చేయాలంటూ గురువారం లీగల్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో మిస్త్రీకి ఇది రెండో లీగల్ నోటీసు కావడం గమనార్హం. ‘‘టాటా సన్స్తోపాటు, నిర్వహణ కంపెనీలకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్గా వ్యవహరించిన మీ దగ్గర కంపెనీకి సంబంధించిన రహస్య, వాణిజ్యపరంగా సున్నితమైన సమాచారం ఉంది. చట్ట ప్రకారం విధుల్లో భాగంగా ఆ గోప్యతను, డైరెక్టర్గా మీకు తెలిసిన రహస్య సమాచారాన్ని కాపాడాల్సి ఉంటుంది. దీన్ని వెల్లడించరాదు. ఈ సమాచారాన్ని దేనికీ వినియోగించరాదు. అలాగే, అనుబంధ సంస్థలు, బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయరాదు’’ అంటూ టాటా సన్స్ తన నోటీసులో మిస్త్రీని కోరింది. చట్టబద్ధమైన ఈ విధులను ఉల్లంఘిస్తే టాటా సన్స్కు కోలుకోలేని నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. టాటా సన్స్, టాటా గ్రూపునకు సంబంధించి ఎంతో విలువైన సమాచారం మిస్త్రీ వద్ద ఉందని పేర్కొంది. అభ్యర్థన మాత్రమే... టాటా సన్స్ పంపిన లీగల్ నోటీసుపై మీడియా విచారణలకు మిస్త్రీ కార్యాలయం స్పందించింది. నోటీసుగా పేర్కొంటున్న టాటా లేఖ... కోర్టులు, ట్రిబ్యునళ్లకు డాక్యుమెంట్లను, రికార్డులను అందించవద్దని, అవి గోప్యంగా ఉంచాల్సినవంటూ చేసిన అభ్యర్థన మాత్రమేనని పేర్కొంది. దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించబోమని, వార్తల కోసం ప్రత్యుత్తరం ఇవ్వబోమని మిస్త్రీ కార్యాలయం స్పష్టం చేసింది. గోప్యత అంటూ వారు తమ లేఖలను మీడియాకు విస్తృతంగా పంపిణీ చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. ఈ విధమైన ప్రవర్తన న్యాయ వ్యవస్థ పరిధిలో జోక్యం చేసుకోవడంగా భావిస్తున్నట్టు మిస్త్రీ కార్యాలయం ప్రకటన జారీ చేసింది. -
రహస్యాల ఉల్లంఘనకు పాల్పడ్డారు!
మిస్త్రీకి టాటా సన్స్ లీగల్ నోటీస్ • ఎన్సీఎల్టీ ముందు సున్నితమైన కంపెనీ పత్రాలను ఉంచారని విమర్శ • ఈ చర్యలకు పాల్పడవద్దని స్పష్టీకరణ ముంబై: ‘‘మీరు అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న పనులు నేరపూరిత విశ్వాస ఘాతుక చర్యల పరిధిలోకి వస్తాయి’’ ఇది తాజాగా బహిష్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీపై టాటా సన్స్ విమర్శ. ఈ మేరకు మంగళవారం మిస్త్రీకి టాటా సన్స్ ఒక లీగల్ నోటీస్ను జారీ చేసింది. తనను చైర్మన్గా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దాఖలు చేసిన పిటిషన్లో పలు కీలక సున్నిత కంపెనీ పత్రాలను బహిరంగ పరిచారని టాటా సన్స్ ఈ లీగల్ నోటీసుల్లో పేర్కొంది. ఇందులో బోర్డ్ సమావేశాల మినిట్స్, ఫైనాన్షియల్ అంశాలు, గణాంకాలు ఉన్నాయని పేర్కొన్న టాటా సన్స్, ఇది రహస్యాల ఉల్లంఘనలకు పాల్పడ్డమేనని పేర్కొంది. ‘‘టాటా సన్స్ డైరెక్టర్ హోదాలో మీకు అందిన కీలక, రహస్య, సున్నిత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడాన్ని ఇకముందు మానుకోండి’’ అని టాటా సన్స్ డిమాండ్ చేసింది. నేపథ్యం ఇదీ... టాటా గ్రూపు చైర్మన్గా ఉద్వాసనకు గురైన మిస్త్రీ, ఆ తర్వాత గ్రూపు నిర్వహణ లోపాలపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. అనూహ్యంగా టాటా గ్రూపు కంపెనీల బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన మిస్త్రీ మరుసటి రోజే అంటే ఈ నెల 20న కంపెనీ లా ట్రిబ్యునల్లో సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్తోపాటు, మిస్త్రీ కుటుంబానికే చెందిన స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసింది. టాటా సన్స్ బోర్డ్ నిర్ణయాలను తోసిపుచ్చాలని, యాజమాన్య లోపాలను సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్ను పిటిషన్ కోరింది. అయితే పిటిషన్లపై జనవరి 31, ఫిబ్రవరి 1తేదీల్లో విచారణ జరిపేందుకు ట్రిబ్యునల్ డివిజన్ బెంచ్ అంగీకరించింది. అప్పటికప్పుడు మధ్యం తర ఉపశమనం కల్పించాలన్న పిటిషనర్ వినతిని పరిశీలించబోమని... అసలు మధ్యంతర చర్యలను అనుమతించబోమని మాత్రం స్పష్టం చేసింది. అయితే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ట్రిబ్యునల్, విచారణను వేగంగా పూర్తి చేసి ఓ నెలలో ఆదేశాలు జారీకి అంగీకరించడం మిస్త్రీకి కొంతలో కొంత ఊరట. ఆయా పరిణామాల నేపథ్యంలో తాజాగా మిస్త్రీకి ఈ లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. మిస్త్రీకి టాటా సన్స్ తరఫున లా ఫామ్ ష్రాదుల్ అమర్చంద్ మంగళ్దాస్ అండ్ కంపెనీ జారీ చేసిన తాజా లీగల్ నోటీసులో మరికొన్ని ముఖ్యాంశాలు... ⇔ పిటిషన్లో భాగంగా సైరస్ మిస్త్రీకి సంబంధించి రెండు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా పలు కీలక పత్రాలను దాఖలు చేశాయి. వీటిలో టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన ఆర్థిక సమాచార అంశాలు, వ్యాపార వ్యూహాలు రహస్య గణాంకాలు ఉన్నాయి. ⇔ టాటా కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద మీ బాధ్యతలను, టాటా సన్స్ పట్ల మీ విశ్వాస విధులను, రహస్య, కీలక సమాచారాన్ని బహిరంగ పరచకూడదన్న నిబంధనలను అన్నింటినీ మీరు ఉల్లంఘించారు. ⇔ ఒక డైరెక్టర్గా ఇది మీ న్యాయపరమైన బాధ్యతలను ఉల్లంఘించడమే కాదు, మా క్లయింట్ల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మీరు చేసిన చర్యలు టాటా సన్స్కు, టాటా గ్రూప్ కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయి. ⇔ మీ చర్యలు అన్నీ నిర్వహణారాహిత్య చర్యల కిందకి వస్తాయి. టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీల శ్రేయస్సును మీరు ఎంతమాత్రం కోరుకోవడం లేదన్న విషయాన్ని మీ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. జేఎన్ టాటా సౌశీల్యతలు మీ ప్రవర్తనలో కనిపించడం లేదు. ⇔ మీ లీగల్ పొసీడింగ్స్లో ఇచ్చే సమాచారం, వినియోగించే పత్రాలు టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీల ప్రయోజనాలకు ఎంతమాత్రం విఘాతం కలిగించరాదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ⇔ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే... న్యాయపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. -
సైరస్ మిస్త్రీని వెంటాడుతున్న కష్టాలు
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని కష్టాలు వెంటాడుతున్నాయి. కంపెనీకి చెందిన రహస్య విషయాలు వెల్లడించారని ఆరోపిస్తూ టాటా సన్స్ మంగళవారం ఆయనకు లీగల్ నోటీసు పంపించింది. టాటా గ్రూపు నియమావళి, గోప్యతను ఉల్లంఘించారని ఆరోపించింది. టాటా సన్స్ డైరెక్టర్గా మిస్త్రీ కీలక, రహస్య సమాచారాన్ని వెల్లడించారని నోటీసులో పేర్కొంది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. దిగ్గజ గ్రూప్ను ముందుకు నడిపించే విషయంలో సైరస్ మిస్త్రీపైనా, ఆయన సామర్ధ్యంపైనా నమ్మకం కోల్పోయినందునే బోర్డు ఉద్వాసన పలికిందని టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టాటా గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టర్ హోదా నుంచి సైరస్ మిస్త్రీ వైదొలిగారు. టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ సహా ఆరు లిస్టెడ్కంపెనీల బోర్డుల నుంచి వైదొలుగుతున్నట్లు మిస్త్రీ వెల్లడించారు. -
‘టాటా’పై సంధి లేదు.. సమరమే!
గ్రూప్లో వాటాలు వదులుకోం: బహిష్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీ • నిర్వహణా లోపాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ ముంబై: రతన్ టాటాతో రాజీపడే ప్రసక్తేలేదని.. గ్రూప్ కంపెనీల్లో నిర్వహణా లోపాలపై తన పోరాటం కొనసాగుతుందని సైరస్ మిస్త్రీ తేల్చిచెప్పారు. గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధంతరంగా తనను తొలగించడంపై టాటా సన్స్తో న్యాయ పోరాటానికి దిగిన మిస్త్రీ.. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ దిగ్గజం వరకూ ఎదిగిన 149 సంవత్సరాల గ్రూప్కు టాటా కుటుంబ యేతర చైర్మన్గా మొట్టమొదటిసారి బాధ్యతలు చేపట్టి, అనూహ్య పరిస్థితిల్లో ఈ బాధ్యతలను కోల్పోయిన మిస్త్రీ ఆయా అంశాలకు సంబంధించి ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో కొన్ని ముఖ్యాంశాలు ... ⇔ 103 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన గ్రూప్లో దాదాపు 18.5%గా మా హోల్డింగ్ను వదులుకోకుండా, గ్రూప్లో నిర్వహణా పరమైన సవ్యతలకోసం నా పోరాటం కొనసాగుతుంది. ⇔ పోరు విస్తృత స్థాయిలో ఉంటుంది. ఒకవేళ న్యాయపోరాటంలో ఓడిపోయినా... గ్రూప్ నుంచి మా కుటుంబ వాటాల ఉపసంహరణ జరగదు. ⇔ గ్రూప్లో నిర్వహణ, సంస్కరణల గురించే నేను పోరాడాను. పోరాడతాను. ఒకటి, రెండు రోజులుకాదు... 50 సంవత్సరాల నుంచీ మేము అక్కడ ఉన్నాము. నిర్వహణ మెరుగుపడితే అంతా మంచే జరుగుతుంది. ⇔ ఇప్పుడు జరుగుతోంది బిజినెస్ గ్రూప్ పోరాటం కాదు. అలాంటి తరహా పరిస్థితి ఇక్కడ తలెత్తలేదు. అదే అయితే నేను అక్కడ (బోర్డులో) కూర్చోవడానికే ఇష్టపడేవాడిని. వ్యాపార అంశాలకు సంబంధించినది కాదుకాబట్టే నేను అక్కడి నుంచి నాకునేనుగా తప్పుకున్నాను. ⇔ నన్ను చైర్మన్ బాధ్యతల నుంచి తొలగించడం నిర్వహణ లోపాన్ని, విలువలు తగ్గడాన్ని సూచిస్తోంది. టాటాల నిర్వహణకు సంబంధించి ఒక మార్పు స్థితిలో గ్రూప్ ఉంది. వ్యాపారాలకు భవిష్యత్ రక్షణ అవసరం. ఇందుకు వ్యవస్థాగతమైన ప్రక్రియ ప్రారంభంకాక తప్పదు. లేదంటే వాణిజ్య ప్రయోజనాలు కిందకు జారే అవకాశం ఉంది. ⇔ ట్రస్టులు తప్పుడు నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఉంటే, నిర్వహణ కూడా గాడి తప్పుతుంది. అలాంటప్పుడు కంపెనీల పరిస్థితి ఏమవుతుంది? ఇలాంటి ధోరణి దీర్ఘకాలంలో కంపెనీ ప్రయోజనాలకు తగింది కాదు. ⇔ నా చర్యల వల్ల గ్రూప్ విలువ పడిపోతోందన్న ఇన్వెస్టర్లు కొందరు ఆందోళనగా ఉన్న విషయం వాస్తవమే. అయితే అసలు నిజం ఏమిటన్న విషయం తెలుసుకోడానికి కొంత సమయం పడుతుంది. దీర్ఘకాలంలో జరిగే మంచి ఫలితం కోసం తగిన కృషి చేయడం ఎప్పుడూ అవసరమే. ⇔ నిర్వహణ పరమైన అంశాలకు సంబంధించి ఎంతో చర్చ జరుగుతోంది. టాటా ట్రస్టులు, టాటా సన్స్ బోర్డు, ఆపరేటింగ్ కంపెనీల బోర్డుల విషయంలో ఎంత కార్పొరేట్ గవర్నెర్స్ ఉందన్న అంశం నన్ను చైర్మన్గా తొలగించడానికి ఉద్దేశించి, నాడు టేబుల్లో ఉంచిన ఒక ముసాయిదా తెలియజేస్తోంది. న్యాయపోరాటం షురూ.. • నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ • రేపు విచారణ జరిగే అవకాశం ముంబై: ఆరు టాటా లిస్టెడ్ కంపెనీల బోర్డుల నుంచీ తనకుతానుగా తప్పుకున్న మరుసటి రోజే టాటా సన్స్పై సైరెస్ మిస్త్రీ న్యాయ పోరాటం ప్రారంభించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. టాటా సన్స్పై ఇక్కడి ఎన్సీఎల్టీలో మిస్త్రీ నియంత్రిత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు తాజా పిటిషన్ను దాఖలు చేసినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల సమాచారం ప్రకారం– కంపెనీ చట్టంలోని 241వ సెక్షన్ కింద టాటా సన్స్కు వ్యతిరేకంగా అణచివేత, నిర్వహణా లోపాల ఆరోపణలతో ఈ పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్పై విచారణ డిసెంబర్ 22న జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టాటా గ్రూప్ సంస్థల బోర్డులకు రాజీనామా చేస్తూనే రతన్ టాటాపై ఆయన పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించారు. తన పోరాటాన్ని మరింత విస్తృత వేదికకు తీసుకువెళ్లనున్నట్లూ తెలిపారు. అసాధారణ సర్వ సభ్య సమావేశాల వేదికల నుంచి దూరంగా వెళ్లగలిగితేనే.. సంస్కరణల అమలు, ఉద్యోగులు.. షేర్హోల్డర్లు, ఇతర వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాల సాధనకు సమర్ధంగా పనిచేయడం సాధ్యపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. -
ట్రస్ట్ల చైర్మన్గా రతన్ కొనసాగుతారు
టాటా సన్స్ వెల్లడి ముంబై: టాటా ట్రస్ట్ల చైర్మన్గా రతన్ టాటా కొనసాగుతారని, ప్రస్తుతానికి తప్పుకునే యోచనేదీ ఆయనకు లేదని టాటా సన్స్ వెల్లడించింది. చైర్మన్గా ఆయన తప్పుకోనున్నారంటూ వార్తలు వచ్చిన దరిమిలా టాటాసన్స్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘టాటా ట్రస్ట్ల చైర్మన్ హోదా నుంచి తప్పుకునే యోచనేదీ లేదని తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా స్పష్టం చేశారు’ అని వివరించింది. జాతీయ స్థాయిలో ప్రయోజనంచేకూర్చేలా టాటా ట్రస్ట్లు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటిల్లో పాలుపంచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు టాటా సన్స్ తెలిపింది. అయితే, తదుపరి బాధ్యతల బదలాయింపు సులువుగా ఉండేలాతగు వారసత్వ ప్రణాళికలు ఉండాలని టాటా యోచిస్తున్నట్లు వివరించింది. హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో టాటా ట్రస్ట్లకు 66% వాటాలు ఉన్నాయి. టాటా సన్స్ చైర్మన్గా ఉద్వానసకు గురైన సైరస్ మిస్త్రీ,రతన్ టాటాల మధ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో టాటా ట్రస్ట్ల పాత్ర కీలకంగా మారింది. టాటా సన్స్ చైర్మన్గా రిటైరైన తర్వాత కూడా ట్రస్ట్లను ఉపయోగించుకుని మొత్తం గ్రూప్పై రతన్ టాటా ఆధిపత్యంచలాయిస్తున్నారని మిస్త్రీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వాడియా అంశంపై ఈజీఎంలకు లైన్ క్లియర్.. స్వతంత్ర డైరెక్టరుగా నుస్లీ వాడియాను తొలగించే దిశగా టాటా గ్రూప్ సంస్థలు అసాధారణ సర్వ సభ్య సమావేశాలు (ఈజీఎం) నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. వీటిలో ప్రమోటర్లు ఓటింగ్ చేయకుండాఆదేశించాలంటూ మైనారిటీ షేర్హోల్డర్లు వేసిన పిటీషన్పై బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, తదుపరి ఉత్తర్వుల వరకూ బోర్డులో ఖాళీ అయిన డైరెక్టర్ల స్థానాలను భర్తీచేయొద్దంటూ టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్ సంస్థలను ఆదేశించింది. షేర్హోల్డర్ల పిటీషన్ మీద జనవరి 15లోగా వివరణ దాఖలు చేయాలని టాటా సన్స్కు సూచించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కువాయిదా వేసింది. డిసెంబర్ 21 నుంచి 23 దాకా ఈజీఎంలు జరగనున్నాయి. టాటా సంస్థల షేర్ల వెంట ఫండ్స్.. టాటా గ్రూప్లో ఇటీవలి పరిణామాలతో కరెక్షన్కు లోనైన టాటా సంస్థల షేర్లను మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తున్నాయి. టీసీఎస్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్ సంస్థల్లో మ్యూచువల్ ఫండ్స్ వాటాలునెల రోజుల వ్యవధిలో గణనీయంగా పెరిగాయి. అన్నింటికన్నా అత్యధికంగా టాటా మోటార్స్లో 1.38 కోట్ల షేర్ల కొనుగోళ్లు జరిగాయి. ఇది క్రితం నెలతో పోలిస్తే 11 శాతం అధికం. ఇక టాటా పవర్లో ఇన్వెస్టర్లు అదనంగా8.36 శాతం వాటాలు, టాటా స్టీల్లో 8.17 శాతం మేర వాటాలు కొనుగోలు చేశారు. -
టాటా టెలీ చైర్మన్గా మిస్త్రీ ఔట్!
-
టాటా టెలీ చైర్మన్గా మిస్త్రీ ఔట్!
ఈజీఎంలో ఏకగ్రీవంగా తీర్మానం ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి తాజాగా మరో టాటా గ్రూప్ కంపెనీ ఉద్వాసన పలికింది. డైరెక్టరు, చైర్మన్ హోదా నుంచి ఆయన్ను తొలగిస్తున్నట్లు టాటా టెలీసర్వీసెస్ తెలిపింది. బుధవారం నిర్వహించిన అసాధారణ వాటాదారుల సమావేశంలో(ఈజీఎం) టాటా సన్స్ ప్రతిపాదించిన తీర్మానానికి షేర్హోల్డర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ వివరించింది. దీంతో టాటా గ్రూప్ సంస్థల్లో మిస్త్రీని బోర్డు నుంచి తొలగించిన మూడో కంపెనీగా టాటా టెలీ నిల్చింది. ఇప్పటికే టాటా ఇండస్ట్రీస్, టీసీఎస్ ఆయనకు ఉద్వాసన పలకడం తెలిసిందే. మరోవైపు, టాటా గ్రూప్లో ప్రక్షాళనకు, గవర్నెన్స్ అమలుకు, వాటాదారుల హక్కుల పరిరక్షణ కోసం వివిధ వేదికల నుంచి పోరు కొనసాగిస్తానని మిస్త్రీ స్పష్టం చేశారు. టీసీఎస్ డైరెక్టరుగా తనను తొలగించడాన్ని ప్రస్తావిస్తూ.. దాదాపు 70% మంది నాన్ ప్రమోటర్ టీసీఎస్ షేర్హోల్డర్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడమో లేదా ఓటింగ్కు దూరంగా ఉండటమో జరిగిందన్నారు. ’నన్ను తొలగించే తీర్మానానికి వ్యతిరేకంగా 78% మంది రిటైల్ ఇన్వెస్టర్లు, దాదాపు 48% మంది సంస్థాగత ఇన్వెస్టర్లు ఓటు వేశారు’ అని ఆయన చెప్పారు. ఈ ఓటింగ్ ద్వారా గ్రూప్లో కార్పొరేట్ గవర్నెన్స్ను అమలు చేయాలన్న సూచన పెడచెవిన పెట్టరాదని మైనారిటీ షేర్హోల్డర్లు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు మిస్త్రీ పేర్కొన్నారు. నానోపై రతన్ టాటాతో విభేదాలు: వాడియా కంపెనీ ఆర్థిక వనరులకు పెను భారంగా మారిన నానో కారు ప్రాజెక్టుపై టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాకు, తనకు మధ్య తీవ్ర విభేదాలు ఉండేవని టాటా మోటార్స్ స్వతంత్ర డైరెక్టర్ నుస్లీ వాడియా వెల్లడించారు. నానోపై పెట్టుబడులు, నష్టాలు వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. టాటా మోటార్స్ స్వతంత్ర డైరెక్టరుగా ఆయన తొలగింపునకు సంబంధించి ఈ నెల 26న ఈజీఎం జరగనున్న నేపథ్యంలో షేర్హోల్డర్లకు రాసిన లేఖలో వాడియా ఈ విషయాలు తెలిపారు. ’రూ. 1 లక్ష రేటుతో అమ్మే ఆలోచనతో 2008లో నానో కారు తెరపైకి వచ్చింది. కానీ ఇది టాటా మోటార్స్కు ఆర్థికంగా పెనుభారంగా మారింది. రూ. 2.25 లక్షల రేటు పెట్టినా కూడా కారు అమ్మకాలు లేవు. పోనీ అమ్ముడైనా కూడా కంపెనీకి గణనీయంగా నష్టమే మిగులుతోంది’ అని వాడియా చెప్పారు. వాణిజ్యపరంగా నానో విఫలం కావడంతో ఆ ప్రాజెక్టును కొనసాగించడాన్ని తాను గట్టిగా వ్యతిరేకించానని తెలిపారు. -
టాటా మోటార్స్లో పెరిగిన టాటా సన్స్ వాటా
న్యూఢిల్లీ: టాటా సన్స్ సంస్థ, టాటా మోటార్స్లో తన వాటాను పెంచుకుంది. టాటా మోటార్స్కు చెందిన 5 కోట్ల షేర్లు(1.73% వాటాను) టాటా సన్స్కొనుగోలు చేసిందని ఎన్ఎస్ఈ బల్క్డీల్ గణాంకాలు వెల్లడించాయి. ఈ షేర్లను ఒక్కోటి రూ.486.13 సగటు ధరకు కొనుగోలు చేశారు. దీంతో ఈ డీల్విలువ రూ.2,431 కోట్లుగా ఉంది. టాటా మోటార్స్ నుంచి సైరస్ మిస్త్రీని డైరెక్టర్గా తొలగించేందుకు ఈ నెల 22న టాటా మోటార్స్ ఈజీఎమ్(అసాధారణ సర్వ సభ్య సమావేశం) నేపథ్యంలో ఈ డీల్ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ డీల్ నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్ బీఎస్ఈలో 3.4 శాతం లాభంతో రూ.470 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో ఇంట్రాడేలో 7 శాతం లాభపడి రూ.486ను తాకింది. ప్రస్తుతం టాటా మోటార్స్లో టాటా సన్స్కు 26.98 శాతం వాటా ఉంది. గత నెలలో నాటకీయంగా జరిగిన పరిణామాల కారణంగా టాటా సన్స్ చైర్మన్ గిరీ నుంచి సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు గురయ్యారు. ఆయన స్థానంలోకి వచ్చిన రతన్ టాటా గ్రూప్ కంపెనీలపై తన పట్టు బిగించారు. ఇప్పటికే టాటా ఇండస్ట్రీస్, టీసీఎస్ల నుంచి మిస్త్రీ తొలగింపునకు వాటాదారులు ఓకే చెప్పారు. -
మిస్త్రీకి టీసీఎస్ టాటా..
• బోర్డు నుంచి ఉద్వాసనకు ఈజీఎంలో మెజారిటీ ఓటింగ్ • మిస్త్రీకి బాసటగా కొందరు షేర్హోల్డర్లు ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీని మిగతా గ్రూప్ సంస్థల బోర్డుల నుంచి కూడా సాగనంపే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మంగళవారం జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అసాధారణ సర్వ సభ్య సమావేశంలో (ఈజీఎం) సంస్థ డైరెక్టరుగా ఆయన్ను తొలగించే ప్రతిపాదనకు మెజారిటీ షేర్హోల్డర్లు అనుకూలంగా ఓటేశారు. మిస్త్రీ తొలగింపుపై మొత్తం 86.71 శాతం వాటాలున్న షేర్హోల్డర్లు ఓటింగ్ వేయగా.. 93.11 శాతం మంది అనుకూలంగా, 6.89 వ్యతిరేకంగాను ఓటు వేశారు. రిటైల్ ఇన్వెస్టర్లలో మాత్రం 78 శాతం మంది మిస్త్రీ తొలగింపును వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. సైరస్ మిస్త్రీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా మాత్రం ఈజీఎం ఆసాంతం ఉన్నారు. టీసీఎస్ మధ్యంతర చైర్మన్ ఇషాత్ హుస్సేన్ ఈజీఎంకి సారథ్యం వహించకుండా పక్కకు తప్పుకోవడంతో ఆయన స్థానంలో స్వతంత్ర డైరెక్టర్ అమన్ మెహతా..సమావేశాన్ని నిర్వహించారు. మిస్త్రీ తొలగింపు అంశం కేవలం పని తీరుకు మాత్రమే సంబంధించినది కాదని.. ప్రమోటర్ గ్రూప్ టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ విశ్వాసాన్ని కోల్పోయినందుకే ఆ యన్ను తొలగించినట్లు మెహతా చెప్పారు. ఈ పరిస్థితుల్లో టీసీఎస్ బోర్డు నుంచి ఆయన తనంత తానుగా తప్పుకోవడమే కంపెనీకి శ్రేయస్కరమని మెహతా పేర్కొన్నారు. కారణాలు చెప్పాలన్న అదిల్ ఇరానీ టీసీఎస్లో టాటా సన్స్కి మెజారిటీ వాటాలు ఉన్నందున ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది అంతా ముందుగానే ఊహించినదే అయినా .. సమావేశంలో కొంత మంది షేర్హోల్డర్లు మిస్త్రీకి మద్దతుగా మాట్లాడటం గమనార్హం. దాదాపు 150 నిమిషాల పాటు సాగిన ఈజీఎంలో 38 మంది షేర్హోల్డర్లు మాట్లాడారు. వీరిలో చాలా మంది టాటాకే మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ.. మిస్త్రీకి మద్దతుగా మాట్లాడిన వారికీ అభినందనలు దక్కాయి. అసలు మిస్త్రీని తొలగించడానికి సరైన కారణాలేమిటో చెప్పాలంటూ అదిల్ ఇరానీ తదితర షేర్హోల్డర్లు నిగ్గదీశారు. ’మీ డ్రైవర్నో, ఆఫీస్ బాయ్నో ఈ విధంగా తీసేస్తారా.. అలాంటిది మా చైర్మన్ను ఎందుకు తీసేశారు. సరైన కారణాలు చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు. సమావేశంలో కొన్ని నాటకీయ పరిణామాలూ చోటు చేసుకున్నాయి. రతన్ టాటా ఆశయాల కోసం తాము ప్రాణత్యాగానికి కూడా సిద్ధమంటూ ఇద్దరు షేర్హోల్డర్లు పేర్కొన్నారు. టాటా గ్రూప్నకు ’టాటా’ వారసులే సారథ్యం వహించాలని కొందరు అభిప్రాయపడ్డారు. టాటా–మిస్త్రీ మధ్య పోరుతో 149 ఏళ్ల చరిత్ర గల గ్రూప్ ప్రతిష్ట మసకబారుతోందని మరో షేర్హోల్డరు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోసం పాకులాడటం లేదు: మిస్త్రీ టాటా ఇండస్ట్రీస్ బోర్డు నుంచి కూడా ఉద్వాసనకు గురైన మిస్త్రీ.. తాజాగా ఓటింగ్ సందర్భంగా టీసీఎస్ షేర్హోల్డర్లకు మిస్త్రీ లేఖ రాశారు. తాను అధికారం కోసం తాను పాకులాడటం లేదని, టాటా గ్రూప్ విలువలను కాపాడేందుకే పోరాడుతున్నానని ఆయన తెలిపారు. టీసీఎస్ బోర్డు నుంచి తనను తొలగించే ప్రతిపాదనకు సంబంధించి మనస్సాక్షికి అనుగుణంగా ఓటెయ్యాలని కోరారు. గడిచిన కొన్ని వారాలుగా గ్రూప్లో గుడ్ గవర్నెన్స్ను గాలికొదిలేశారని, ఇష్టారీతిగా వ్యవహరించడం.. వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం జరుగుతోందని మిస్త్రీ ఆరోపించారు. టాటా గ్రూప్ చైర్మన్గా మిస్త్రీని తొలగిస్తున్నట్లు అక్టోబర్ 24న టాటా సన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పలు గ్రూప్ సంస్థల బోర్డుల్లోని డైరెక్టర్ హోదా నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడానికి మిస్త్రీ నిరాకరించడంతో ఆయన్ను తప్పించే అంశంపై ఏడు గ్రూప్ సంస్థలు డిసెంబర్లో ఈజీఎంలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే టీసీఎస్ ఈజీఎం జరిగింది. దీని ఫలితాలు ఇతర గ్రూప్ కంపెనీల ఈజీఎంల మీద ప్రభావం చూపనుండటంతో ఈ పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీసీఎస్లో ప్రమోటర్లకు మెజారిటీ హోల్డింగ్స్ ఉన్నప్పటికీ.. ఈజీఎంలు నిర్వహించనున్న కొన్ని సంస్థల్లో కేవలం 28% వాటాలే ఉన్నాయి. దీంతో సంస్థాగత షేర్హోల్డర్లు ఎటు మొగ్గు చూపుతారన్నది కీలకంగా మారింది. టీసీఎస్లో విదేశీ ఇన్వెస్టర్లకు 17.02%, బీమా కంపెనీలకు 4.1%, మ్యూచువల్ ఫండ్స్.. దేశీ ఆర్థిక సంస్థలు.. బ్యాంకులకు 1.03% వాటాలు ఉన్నాయి. -
టాటా మోటార్స్లో నేడు ఏం జరుగబోతుంది?
ముంబాయి : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధాంతరంగా బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీకి కష్టకాలం వెన్నంటే ఉన్నట్టు కనిపిస్తోంది. గ్రూప్లోని ఒక్కొక్క కంపెనీ మిస్త్రీని చైర్మన్గానే కాక, డైరెక్టర్గాను పీకేస్తున్న సంగతి తెలిసిందే. అసాధారణ సర్వసభ్య సమావేశాలు ఏర్పాటుచేసి మరీ డైరెక్టర్గా ఆయన్ను తొలగించేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ ఆటో దిగ్గజం ఉన్న టాటా మోటార్స్ మిస్త్రీని తొలగించడానికి డిసెంబర్ 22న షేర్హోల్డర్స్ మీటింగ్ నిర్వహించబోతుంది. ఈ మీటింగ్లో మిస్త్రీకి వ్యతిరేకంగా ఓటింగ్లో పైచేయి సాధించడానికి రహస్యంగా షేర్లను కొనుగోలుచేయాలని టాటా సన్స్ భావిస్తోంది. దీనికోసం నేడు ఓ భారీ బ్లాక్డీల్ను టాటా సన్స్ నిర్వహించబోతుందట. ఓ రహస్య క్లయింట్ కోసం విదేశీ బ్రోకరేజ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ 5 కోట్ల షేర్లను, సోమవారం ముగింపు ధర రూ.454.4కు 10 శాతం ప్రీమియంగా కొనుగోలు చేస్తోందని తెలుస్తోంది. ఈ డీల్ మొత్తం విలువ రూ.2,500కోట్లగా ఉండబోతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇది టాటా మోటార్స్ ఈక్విటీ క్యాపిటల్లో 1.73 శాతం. ఈ లావాదేవీ మంగళవారమే జరిగే అవకాశముందని తెలుస్తోంది. మిస్త్రీకి వ్యతిరేకంగా ఓటింగ్ లో నెగ్గడానికి కంపెనీలో 33 శాతం కంటే ఎక్కువగా తమ హోల్డింగ్ను పెంచుకోవాలని టాటా సన్స్ భావిస్తోందని, ఈ మేరకే వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం టాటా మోటార్స్లో టాటా సన్స్ 33 శాతం వాటా కలిగి ఉంది. ఈ అదనపు షేర్ల కొనుగోలు ద్వారా మిస్త్రీకి అనుకూలంగా ఓట్లు వేసే వారిమీద టాటా సన్స్ పైచేయి సాధించనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఓపెన్ లెటర్ అవసరం లేకుండా ఒక ఆర్థికసంవత్సరంలో ప్రమోటర్స్ కంపెనీలో 5 శాతం మాత్రమే వాటా కొనుగోలు చేసే అవకాశముంది. చారిత్రాత్మకంగా టాటా గ్రూప్ రహస్య డీల్ ద్వారా గ్రూప్ కంపెనీలో తన వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాగ, టాటా సన్స్ ఆదేశాల మేరకు కంపెనీ బోర్డు నుంచి మిస్త్రీని తొలగించడానికి ఆరు దిగ్గజ కంపెనీలు ముందస్తుగా అన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. అదేవిధంగా టాటా సన్స్ నుంచి మెజార్టీ సపోర్టు పొందాలని ఆశిస్తున్నాయి. ఈ రహస్య భారీ బ్లాక్ డీల్ ద్వారా గ్రూప్ కంపెనీల భవిష్యత్తును కాపాడటానికి పేరెంట్ కంపెనీ ఏదైనా చేయగలదనే సందేశాన్ని మార్కెట్లోకి పంపనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. -
చైర్మన్గిరీ కోసం మిస్త్రీ తప్పుదోవ పట్టించారు
• ఎప్పుడూ అధికారంపైనే దృష్టి • యాజమాన్య నిర్మాణాన్ని బలహీనపరిచారు • టాటా సన్స్ ఆరోపణలు న్యూఢిల్లీ: టాటా–మిస్త్రీల వివాదం మరింత ముదిరింది. సైరస్ మిస్త్రీపై టాటా సన్స్ తాజాగా ఆరోపణలతో విరుచుకుపడింది. మిస్త్రీ టాటా గ్రూపు చైర్మన్గా ఎంపికయ్యేందుకు తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. తన హామీలను విస్మరించి, అధికారాలపై దృష్టినంతా కేంద్రీకరించడమే కాకుండా తనకిచ్చిన స్వేచ్ఛతో యాజమాన్య వ్యవస్థను బలహీనపరిచారని పేర్కొంది. సైరస్ మిస్త్రీని బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించేందుకు టాటా గ్రూపు కంపెనీలు వాటాదారుల సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్గా మిస్త్రీని తొలగించేందుకు దారి తీసిన వాస్తవాలపై టాటా సన్స్ గ్రూపు కంపెనీల వాటాదారులకు వివరిస్తూ.... వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. ‘‘2011లో టాటా సన్స్ చైర్మన్గా రతన్ టాటా వారసుడి ఎంపిక కోసం ఏర్పాటైన సెలక్షన్ కమిటీని మిస్త్రీ తప్పుదోవ పట్టించారు. టాటా గ్రూపు విషయంలో తన ప్రణాళికల గురించి గొప్ప ప్రకటనలు చేశారు. భిన్న రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న దృష్ట్యా అధికారం, బాధ్యతలను పంపిణీ చేసేలా యాజమాన్య నిర్మాణం ఉండాలని ప్రతిపాదించారు. ఎంపిక కమిటీ సైరస్ మిస్త్రీని చైర్మన్గా ఎంచుకునేందుకు ఈ ప్రకటనలు కీలక పాత్ర పోషించాయి. అయితే, నాలుగేళ్లు గడిచినా ఈ యాజమాన్య స్వరూపాలు, ప్రణాళికలు ఏవీ ఫలితాన్నివ్వలేదు. మా అభిప్రాయం ప్రకారం సెలక్షన్ కమిటీని మిస్త్రీ తప్పదోవ పట్టించారు’’ అని టాటా సన్స్ వాటాదారులకు వివరించింది. మిస్త్రీ గత మూడు నాలుగేళ్ల కాలంలో టాటా గ్రూపు నిర్వహణ కంపెనీల చైర్మన్గా అధికారాన్నంతా తన చేతుల్లోనే ఉంచుకునేందుకు దృష్టి పెట్టారని, క్రమంగా టాటా కంపెనీల బోర్డుల్లో టాటా సన్స్ ప్రాతినిధ్యాన్ని తగ్గించారని ఆరోపించింది. హోల్డింగ్ కంపెనీగా టాటా సన్స్ డివిడెండ్ ఆదాయం క్రమంగా తగ్గిపోవడం, సిబ్బంది వ్యయాలు రెట్టింపు కావడంపై టాటా సన్స్ ఆందోళనకు గురైనట్టు వివరించింది. అయినా మిస్త్రీ ఇవేమీ పట్టించుకోలేదని ఆరోపించింది. టాటా సన్స్ మనుగడకే ముప్పు అయిన ఈ పరిణామాలను ఆమోదించలేకపోయినట్టు స్పష్టం చేసింది. మీ సహకారం కావాలి... టాటా గ్రూపు కంపెనీల్లో పెద్ద ఎత్తున కార్పొరేట్ నియమ, నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ గ్రూపు కంపెనీల వాటాదారులకు సైరస్ మిస్త్రీ ఇటీవల రాసిన లేఖపైనా టాటా సన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టాటా గ్రూపు 149 ఏళ్ల నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తూ, కార్పొరేట్ పాలన విషయంలో ప్రమాణాలను నెలకొల్పినట్టు పేర్కొంది. గ్రూపు హెడ్గా నాలుగేళ్ల పాటు అధికారాన్ని వెలగబెట్టిన మిస్త్రీ కార్పొరేట్ పాలనపై తమకు పాఠాలు చెబుతున్నారంటూ విమర్శించింది. మిస్త్రీ హయాంలో 2015లో ఆయన తీసుకొచ్చిన పరిపాలన మార్గదర్శకాల ప్రకారం టాటా కంపెనీలో తొలగింపునకు గురైన ఉద్యోగి టాటా కంపెనీల బోర్డులకు వెంటనే రాజీనామా చేయాలనే నిబంధన ఉందని తెలిపింది. దీని ప్రకారం ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉద్వాసనకు గురైన మిస్త్రీ గ్రూపు కంపెనీల బోర్డులకు వెంటనే రాజీనామ చేయాలని, ఆ పని చేయకుండా మార్గదర్శకాలను కావాలనే ఉల్లంఘిస్తున్నారని పేర్కొంది. రతన్తో టాటా బ్రాండ్ విలువకు గండి మిస్త్రీ మండిపాటు ముంబై: టాటా సన్స్ తనపై చేసిన ఆరోపణలకు సైరస్ మిస్త్రీ ఘాటుగా స్పందించారు. టాటా చైర్మన్గా ఎంపికయ్యేందుకు సెలక్షన్ కమిటీని తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలను తోసిపుచ్చుతూ... టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్టాటా ప్రవర్తన కారణంగా టాటా బ్రాండ్, విలువలు గణనీయంగా తుడిచిపెట్టుకుపోయాయని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం కాదని... రతన్టాటా చివరి ప్రయత్నం చూస్తుంటే ఆయన చర్యల కారణంగా కలిగిన నష్టాల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోందంటూ మిస్త్రీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అసలు టాటా సన్స్ వద్ద ఏదైనా అంశమే ఉంటే చట్టానికి లోబడి కమిటీ వేసి... మిస్త్రీకి వ్యతిరేకంగా వాటిని తార్కికంగా వెల్లడించాలని సూచించింది. టాటా సన్స్ ప్రకటనలో నోటితో చేసిన సాదాసీదా ఆరోపణలకు మించి ఏమీ లేదని పేర్కొంది. ఎంపిక కమిటీని తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలపై స్పందిస్తూ... సెలక్షన్ కమిటీలో అప్పుడూ, ఇప్పుడూ సభ్యుడిగా ఉన్న టాటాల అత్యంత సన్నిహిత మిత్రుడు లార్డ్ కుమార్ భట్టాచార్య ఆరు నెలల క్రితమే మిస్త్రీ పనితీరుపై సానుకూలంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. -
సైరస్ మిస్త్రీపై టాటా సంచలన ఆరోపణలు
తప్పుదోవ పట్టించి చైర్మన్ అయినట్టు ఆరోపణ దేశంలో అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకటైన టాటా కంపెనీలో బోర్డ్రూమ్ సంగ్రామం ఇంకా కొనసాగుతూనే ఉంది. టాటా సన్స్ చైర్మన్గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై టాటా గ్రూప్ సంచలన ఆరోపణలు చేసింది. రతన్ టాటా వారసుడి విషయంలో సెలెక్టర్లను తప్పుదోవ పట్టించి మిస్త్రీ చైర్మన్గా ఎన్నికయ్యారని, ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని, కంపెనీ అధికారాలన్నింటినీ తన చేతుల్లోకి తీసుకోవడంపైనే దృష్టిపెట్టిన మిస్త్రీ.. తనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరిచి మేనేజమెంట్ స్ట్రక్చర్ను బలహీనపరిచారని ఆరోపించింది. టాటా గ్రూప్కు చెందిన కీలక లిస్టెడ్ కంపెనీల బోర్డు నుంచి మిస్త్రీని తొలగించేందుకు మరికొన్నిరోజుల్లో వాటాదారుల సమావేశం జరగనున్న నేపథ్యంలో మిస్త్రీపై విశ్వాసం సన్నగిల్లి.. ఆయనకు ఉద్వాసన పలుకడానికి కారణమైన కీలక వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నట్టు టాటా సన్స్ తన తాజా లేఖలో తెలిపింది. రతన్టాటా వారసుడిగా టాటా సన్స్ చైర్మన్ ఎంపిక కోసం 2011లో ఏర్పాటుచేసిన సెలక్షన్ కమిటీని మిస్త్రీ తప్పుదోవ పట్టించారని, టాటా గ్రూప్ గురించి తన ప్రణాళికలపై ఆడంబర ప్రకటనలు చేశారని, టాటా గ్రూప్ కోసం విస్తారమైన మేనేజ్మెంట్ స్ట్రక్చర్ను ఏర్పాటుచేస్తానని, గ్రూప్కు ఉన్న విభిన్న వ్యాపారాల నేపథ్యంలో అధికార, బాధ్యతల విభజన కోసం మేనేజ్మెంట్ నిర్మాణాన్ని మారుస్తానని ఆయన చెప్పుకొచ్చారని, ఈ ప్రకటనలే మిస్త్రీని చైర్మన్గా ఎంపిక చేయడానికి ప్రధాన కారణమని, కానీ వాస్తవానికి నాలుగేళ్లు అయినా మేనేజ్మెంట్ స్ట్రక్చర్ విషయంలో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని, కాబట్టి ఇది సెలక్షన్ కమిటీని తప్పుదోవ పట్టించడమేనని టాటా సన్స్ పేర్కొంది. -
మిస్త్రీని తొలగించండి..
• టాటా పవర్ను కోరిన టాటా సన్స్ • డిసెంబర్ 23న టాటా కెమికల్స్ ఈజీఎం న్యూఢిల్లీ: టాటా గ్రూపును పూర్తిగా తన ఆధిపత్యంలోకి తెచ్చుకునే చర్యలను మాతృసంస్థ టాటా సన్స ఉధృతం చేసింది. సైరస్ మిస్త్రీని డెరైక్టర్గా తొలగించేందుకు వాటాదారుల సమావేశం నిర్వహించాలని గ్రూపు కంపెనీ టాటా పవర్ను తాజాగా కోరింది. అదే సమయంలో సైరస్ మిస్త్రీ, నుస్లీ వాడియాలను డెరైక్టర్లుగా తొలగించేందుకు టాటా కెమికల్స్ వచ్చే నెల 23న వాటాదారుల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించనుంది. టాటా గ్రూపు చైర్మన్గా సైరస్ మిస్త్రీని టాటా సన్స గత నెలలో తప్పించగా, గ్రూపు కంపెనీలు కొన్నింటికి ఆయన చైర్మన్గా, డెరైక్టర్గా కొనసాగుతున్నారు. దీంతో మిస్త్రీని పూర్తిగా గ్రూపు నుంచి పంపించే చర్యలను టాటా సన్స ముమ్మరం చేసింది. ఇందుకోసం ఈజీఎంలను నిర్వహించాలని గ్రూపు కంపెనీలను కోరింది. మిస్త్రీని డెరైక్టర్గా తొలగించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఈజీఎం నిర్వహించాలని ప్రమోటర్ టాటా సన్స నుంచి ప్రత్యేక నోటీసు అందుకున్నట్టు టాటా పవర్ బీఎస్ఈకి తెలియజేసింది. -
మిస్త్రీని డైరెక్టర్గానూ తీసేద్దాం!
• వాటాదారులకు టీసీఎస్ నోటీసు వచ్చేనెల 13న ఈజీఎం • టాటా సన్స విశ్వాసాన్ని కోల్పోరుునందుకేనని వివరణ న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు (టీసీఎస్) సైరస్ మిస్త్రీ తీవ్ర హాని తలపెట్టారంటూ ఆ కంపెనీలో ప్రధాన వాటాదారైన టాటా సన్స తాజాగా ఆరోపించింది. కంపెనీ బోర్డు డెరైక్టర్గా సైరస్ మిస్త్రీని తొలగించేందుకు వాటాదారుల సమ్మతిని కోరింది. టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టాక టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీ ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో చైర్మన్గా ఇషాంత్ హుస్సేన్ను నియమించారు. అంతేకాదు, టీసీఎస్ డెరైక్టర్ పదవి నుంచీ మిస్త్రీని తొలగించేందుకు వాటాదారుల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించాలని టాటా సన్స కోరింది. దీంతో గతవారం సమావేశమైన టీసీఎస్ బోర్డు వచ్చే నెల 13న ఈజీఎం నిర్వహించాలని నిర్ణరుుంచింది. ఈజీఎం నోటీసును టీసీఎస్ తన వాటాదారులకు పంపించింది. ‘‘టాటా సన్స ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తొలగింపునకు గురైన తర్వాత మిస్త్రీ నిరాధారమైన ఆరోపణలు చేశారు. టాటా సన్సపై మాత్రమే కాకుండా బోర్డు డెరైక్టర్లు, టాటా గ్రూపు మొత్తంపై నిందలు మోపారు. టీసీఎస్ కూడా గ్రూపులో భాగమే. గోప్యత అంటూనే ఆరోపణలను బహిరంగ పరిచారు. మిస్త్రీ తన ప్రవర్తనతో టాటా గ్రూప్, టీసీఎస్, టీసీఎస్ వాటాదారులు, ఉద్యోగులకు తీవ్ర హాని కలిగించారు. ఈ నేపథ్యంలో డెరైక్టర్గా సైరస్ మిస్త్రీని తొలగించాలని డెరైక్టర్ల బోర్డు నిర్ణరుుంచింది’’ అని టీసీఎస్ వాటాదారులకు టాటా సన్స వివరించింది. మిస్త్రీ టాటా సన్స విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొంది. ఇండియన్ హోటల్స్ ఈజీఎం 20న టాటా గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ సైతం మిస్త్రీని డెరైక్టర్గా తొలగించే అంశాన్ని తేల్చేందుకు వచ్చే నెల 20న వాటాదారుల సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ నిర్ణయం తీసుకుంది. వాడియా పరువు నష్టం నోటీసు ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, బోంబే డైరుుంగ్ చైర్మన్ నుస్లీ వాడియా టాటా సన్సకు పరువు నష్టం నోటీసులు పంపించారు. టాటా గ్రూపులోని పలు కంపెనీలకు స్వతంత్ర డెరైక్టర్గా ఉన్న వాడియా... తనపై చేసిన నిరాధార, తప్పుడు, పరువుకు భంగం కలిగించే, అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని నోటీసులో డిమాండ్ చేశారు. కాగా, నుస్లీ వాడియా నోటీసుకు తగిన విధంగా స్పందిస్తామని టాటా సన్స స్పష్టం చేసింది. -
రెండు బోర్డు మీటింగ్లకు మిస్త్రీ డుమ్మా
• టీసీఎస్, టాటా సన్స్ సమావేశాలకు దూరం • డిసెంబర్ 13న టీసీఎస్ ఈజీఎం • డెరైక్టర్గా మిస్త్రీ తొలగింపునకు ముహూర్తం ఖరారు ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ గురువారం జరిగిన రెండు గ్రూపు సంస్థల బోర్డు సమావేశాలకు దూరంగా ఉండిపోయారు. ముంబైలో ఉదయం జరిగిన టీసీఎస్ బోర్డు సమావేశానికి, ఆ తర్వాత జరిగిన టాటా సన్స బోర్డు మీటింగ్కు కూడా హాజరు కాలేదు. ఈ విషయమై టాటా సన్స బోర్డు డెరైక్టర్ విజయ్ సింగ్ మాట్లాడుతూ... ఇది సాధారణ భేటీయేనని, వ్యాపార మదింపు, వచ్చే 6 నెలలకు ప్రణాళిక కోసం ఏర్పాటు చేసిందిగా తెలిపారు. అసాధారణ సమావేశం (ఈజీఎం) ఏర్పాటు చేసే ఆలోచనేది లేదన్నారు. మిస్త్రీతోపాటు డెరైక్టర్లు ఫదీదా, రాల్ఫ్ స్పెత్ కూడా బోర్డు మీటింగ్కు హాజరు కాలేదని విజయ్ సింగ్ చెప్పారు. కాగా, గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా నిర్వహించిన అనధికారిక డెరైక్టర్ల భేటీ కావడంవల్లే హాజరు కాలేదని మిస్త్రీ వర్గాలు తెలిపారుు. డెరైక్టర్గా మిస్త్రీ తొలగింపునకు రంగం సిద్ధం టీసీఎస్ చైర్మన్ పదవిని ఇప్పటికే కోల్పోరుున సైరస్ మిస్త్రీ త్వరలోనే కంపెనీ డెరైక్టర్గా కూడా ఉద్వాసనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నారుు. డెరైక్టర్గా మిస్త్రీ తొలగింపునకు వాటాదారుల అనుమతి కోరేందుకు వీలుగా డిసెంబర్ 13న ఈజీఎం నిర్వహించాలని గురువారం నూతన చైర్మన్ ఇషాంత్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన టీసీఎస్ బోర్డు సమావేశంలో నిర్ణయం జరిగింది. ఇదే విషయాన్ని కంపెనీ బీఎస్ఈకి కూడా తెలియజేసింది. టాటా సన్స పంపిన ప్రత్యేక నోటీసు, అభ్యర్థనను పరిశీలించి, సరైనదని భావిస్తే డెరైక్టర్గా సైరస్ మిస్త్రీ తొలగింపునకు తీర్మానం ఆమోదించేందుకు వీలుగా ఈజీఎం ఏర్పాటు చేసినట్టు వివరించింది. నాడు ఎందుకు తొలగించలేదు? మిస్త్రీ ఆరోపణలపై టాటా గ్రూప్ పీఆర్ రెడిఫ్యూజన్ ప్రశ్నలు న్యూఢిల్లీ: టాటా గ్రూపు ప్రజా సంబంధాల (పీఆర్) కాంట్రాక్టును రెడిఫ్యూజన్ ఎడెల్మన్ కట్టబెట్టిన విషయంలో సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలకు ఆ ఏజెన్సీ హెడ్ నందా స్పందించారు. రెండేళ్ల క్రితం కాంట్రాక్టును పొడిగించే సమయంలో మిస్త్రీ తనకున్న అవకాశాన్ని ఉపయోగించి ఎందుకు తొలగించలేదని? నందా ప్రశ్నించారు. ‘‘మీ వాదనకు మద్దతుగా మాకు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని విషయాలను ప్రజలు, మీడియా ముందు ఉంచకండి’’ అంటూ మిస్త్రీకి రాసిన లేఖలో నందా కోరారు. ‘‘43 ఏళ్ల కాలంలో సంపాదించుకున్న మా పేరు, ప్రతిష్టలను దెబ్బతీసే ఎటువంటి చర్యలను అనుమతించేది లేదు. టాటా గ్రూపు పీఆర్ ఏజెన్సీ కాంట్రాక్టును 2011 నవంబర్ 1న రెడిఫ్యూజన్ చేపట్టింది. ఐదేళ్ల కాంట్రాక్టు ఈ ఏడాది అక్టోబర్ 31తో ముగియగా... మూడేళ్ల కాలానికి ఇరువైపులా ‘నో ఎగ్జిట్ క్లాజ్’ కాంట్రాక్టుపై సంతకాలు జరిగారుు. మీరు 2011 నవంబర్ నుంచి మాతో కలసి పనిచేశారు. ఐదేళ్ల తర్వాత మా కాంట్రాక్టును కొనసాగించేందుకు ఈ ఏడాది మే నెలలోనూ అంగీకరించారు’ అని నందా పేర్కొన్నారు. వైష్ణవి కార్పొరేట్ కమ్యూనికేషన్స స్థానంలో రతన్ టాటా తన అనుకూలుడైన వ్యక్తికి సంబంధించిన రెడిఫ్యూజన్కు కాంట్రాక్టును కట్టబెట్టడం వల్ల ఏడాదికి రూ.60 కోట్ల భారం పడినట్టు మిస్త్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. -
స్వతంత్ర డైరెక్టర్లపై విమర్శలు దారుణం!
• ఇది దిగజారుడుతనానికి నిదర్శనం... • టాటా సన్స్ పై మిస్త్రీ ఎదురుదాడి... ముంబై: టాటా-మిస్త్రీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. టాటా గ్రూప్ కంపెనీలు తన హయాంలో పూర్తిగా అదుపుతప్పాయన్న టాటా సన్స ఆరోపణలను సైరస్ మిస్త్రీ తిప్పికొట్టారు. దీనిలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు దేశీ పారిశ్రామిక రంగంలో ఎంతో పేరుప్రఖ్యాతులున్న కొంతమంది గ్రూప్ కంపెనీల స్వతంత్ర డెరైక్టర్లపై టాటా సన్స విమర్శలు గుప్పించడంపైనా మండిపడ్డారు. ఇది అత్యంత దురదృష్టకరమైన అంశమని పేర్కొన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని అర్ధంతరంగా తొలగించడం.. ఆతర్వాత రతన్ టాటా, టాటా సన్స బోర్డు సభ్యులపై మిస్త్రీ తీవ్రమైన ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనికిబదులిస్తూ.. తాజాగా టాటా సన్స తొమ్మిది పేజీల లేఖను విడుదల చేసింది. ఇందులో మిస్త్రీపై ఎదురుదాడి చేయడమే కాకుండా ఆయనను విశ్వాసఘాతకుడిగా కూడా అభివర్ణించింది. అంతేకాదు టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి కూడా మిస్త్రీని తొలగించింది. గ్రూప్ కంపెనీలకు చెందిన చైర్మన్ పదవుల నుంచి కూడా ఆయనను పీకేయడానికి వేగంగా పావులు కదుపుతోంది. మరోపక్క, కొన్ని గ్రూప్ కంపెనీలకు చెందిన స్వతంత్ర డెరైక్టర్లు మిస్త్రీ నాయకత్వాన్ని సమర్థించడంతో వారిపైనా తీవ్ర విమర్శలు చేయడంతోపాటు పదవుల నుంచి తొలగించే చర్యలు చేపడుతోంది. ‘స్వతంత్ర డెరైక్టర్లుగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న వారిపై విమర్శలు చేయడం వ్యూహం ప్రకారమే జరుగుతోంది. ఇదంతా కావాలనే చేస్తున్నట్లు కనబడుతోంది. ఇది టాటా సన్స దిగజారుడుతనానికి నిదర్శనం. దీపక్ పరేఖ్, నుస్లీ వాడియా, నాదిర్ గోద్రెజ్ తొమ్మిది మంది కార్పొరేట్ రంగ ప్రముఖుల ప్రవర్తన, పనితీరులను ప్రశ్నించడం నిజంగా దురదృష్టకరం’ అని మిస్త్రీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండియన్ హోటల్స్ కంపెనీని మిస్త్రీ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించారని.. ఇందుకోసం ఆయన స్వతంత్ర డెరైక్టర్లను తనకు అనుకూలంగా మలచుకున్నారంటూ టాటా సన్స తన లేఖాస్త్రంలో ఆరోపించడం తెలిసిందే. మద్దతిస్తున్నందుకేనా.. ఇటీవల జరిగిన బోర్డు సమావేశాల్లో ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్ స్వతంత్ర డెరైక్టర్లు మిస్త్రీ సారథ్యాన్ని సమర్థించడం విశేషం.దీంతో టాటా కెమికల్స్ స్వతంత్ర డెరైక్టర్ పదవి నుంచి నుస్లీ వాడియాను తొలగించేలా టాటా సన్స చర్యలు చేపట్టింది. -
ఆ 6 కంపెనీల చైర్మన్గా తొలగింపు అంతతేలిక్కాదు..
న్యూఢిల్లీ: ఏడు లిస్టెడ్ కంపెనీల్లో ఆరు సంస్థల చైర్మన్ బాధ్యతల నుంచి సైరస్ మిస్త్రీని తొలగించాలని టాటా సన్స భావిస్తే, అది అంత తేలిక వ్యవహారం కాదని ఇన్గవర్న్ రిసెర్చ్ సర్వీసెస్ తన నివేదికలో పేర్కొంది. ‘నేడు మిస్త్రీని చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించిన టీసీఎస్ను మినహారుుస్తే... మిగిలిన 6 సంస్థల్లో ప్రమోటర్ హోల్డింగ్ 30-39% మధ్య ఉంది. కనుక టాటా సన్స కోరిక నెరవేరాలంటే, వ్యవస్థాత ఇన్వెస్టర్ల మద్దతు తప్పనిసరి’ అని నివేదిక పేర్కొంది. ఈ 6 కంపెనీల్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్, గ్లోబల్ బేవరేజెస్లు ఉన్నారుు. టాటా మోటార్స్ యూనియన్తో రతన్ భేటీ టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా గురువారం మోటార్స్ ఉద్యోగ యూనియన్ నాయకులతో సమావేశమయ్యారు. వచ్చే వారం టాటా మోటార్స్ కీలక బోర్డ్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. -
వాస్తవాలు దాచిపెట్టారు...
టాటా సన్స్ ఆరోపణలపై మిస్త్రీ వర్గం ఫైర్ ముంబై: టాటా సన్స్ మిస్త్రీపై చేసిన తాజా ఆరోపణలపై ఆయన వర్గం తీవ్రంగా మండిపడింది. టాటా సన్స్ ఆరోపణలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేసింది. ‘చైర్మన్ పదవి నుంచి అన్యాయంగా, ఎలాంటి వివరణా కోరకుండా తొలగించిన తర్వాత 17 రోజుల పాటు దీనిపై టాటాలు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అర్థంపర్థంలేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికీ కూడా మా (మిస్త్రీ) వివరణ తీసుకోకుండా సహజ న్యాయాన్ని ఉల్లంఘిస్తూ అర్థంతరంగా తొలగించాల్సి వచ్చిందనేదానిపై సరైన సమాధానమివ్వటం లేదేం?’’ అని మిస్త్రీ సన్నిహిత వర్గాలు విమర్శించారుు. టాటా సన్స్ తాజా లేఖలో కేవలం కొన్ని అంశాలనే ప్రస్తావించారని.. వాస్తవాలు కూడా దాచిపెట్టారని స్పష్టం చేశారుు. కాగా, టీసీఎస్ గణాంకాలను వదిలేసి.. మిస్త్రీ పనితీరు బాగోలేదని విమర్శలు గుప్పించడం.. టాటా మోటార్స్ భారత్ వ్యాపారం దెబ్బతినడానికి ఆయనే కారణమని ఆరోపించడాన్ని కూడా మిస్త్రీ వర్గాలు ప్రస్తావించారుు. కావాలనే టాటా సన్స వివక్షాపూరితంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారుు. -
విశ్వాసఘాతకుడు.. మిస్త్రీ!
• నమ్మకంతో అప్పగిస్తే దెబ్బతీశారు • ప్రధాన కంపెనీలపై పెత్తనానికి ప్రయత్నించారు... • ఇండియన్ హోటల్స్ను చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకున్నారు... • ఇందుకు స్వతంత్ర డెరైక్టర్లను వాడుకున్నారు... • టాటా మోటార్స్ దేశీ మార్కెట్ వాటా పడిపోయింది.. • గత నాలుగేళ్లలో గ్రూప్ రుణ భారం రూ.69 వేల కోట్ల నుంచి • రూ.2.25 లక్షల కోట్లకు పెరిగిపోరుుంది... • టర్న్ఎరౌండ్ చేయడం చేతకాక, పెట్టుబడులను రైటాఫ్ చేశారు.. • మాజీ చైర్మన్పై టాటా సన్స్ ఎదురుదాడి... • తొమ్మిది పేజీల లేఖలో మిస్త్రీపై ప్రత్యారోపణలు... ముంబై: సైరస్ మిస్త్రీ- టాటాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నారుు. చైర్మన్ పదవి నుంచి తొలగించిన తర్వాత మిస్త్రీపై టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అరుున టాటా సన్స్ మరోసారి తీవ్రంగా విరుచుకుపడింది. 100 బిలియన్ డాలర్ల విలువైన గ్రూప్లోని ప్రధాన కంపెనీలపై పెత్తనం చేయాలని ప్రయత్నించారని... విశ్వాస ఘాతకానికి పాల్పడ్డారని పేర్కొంది. మిస్త్రీ చేసిన ప్రతి ఆరోపణనూ తిప్పికొడుతూ సవివరంగా గురువారం తొమ్మిది పేజీల లేఖను విడుదల చేసింది. గత నెల 24న మిస్త్రీని టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డు ఉన్నపళంగా చైర్మన్ పదవి నుంచి తొలగించి మళ్లీ రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్గా నియమించటం తెలిసిందే. ఇన్నాళ్లూ తమపై మిస్త్రీ బురదజల్లుతున్నారని పేర్కొన్న టాటా సన్స్... మొత్తమ్మీద మిస్త్రీకి ఉద్వాసన చెప్పటానికి వెనకున్న కారణాలన్నింటినీ బయటపెట్టింది. ‘‘నాలుగేళ్ల క్రితంమిస్త్రీపై ఎంతో నమ్మకం ఉంచి, ముందుచూపుతో చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాం. కానీ ఆయన మమ్మల్నే కాక టాటా ప్రతినిధులెవరినీ కూడా పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. గ్రూప్లోని కీలకమైన కంపెనీలపై నియంత్రణ కోసం పాకులాడారు. మా విశ్వాసాన్ని పూర్తిగా వమ్ముచేశారు’ అని టాటా సన్స్ తీవ్రంగా దుయ్యబట్టింది. ఇన్వెస్టర్లకు డివిడెండ్లు తగ్గిపోయారుు... ‘‘నాలుగేళ్లు చైర్మన్గా కొనసాగిన మిస్త్రీ హయాంలో గ్రూప్లోని 40కి పైగా కంపెనీల్లో ఇన్వెస్టర్లకు ఒకపక్క డివిడెండ్లు తగ్గిపోయారుు. మరోవంక వ్యయాలు తీవ్రంగా పెరిగిపోయారుు. గ్రూప్ కంపెనీల నిర్వహణ కోసం అనేక ఏళ్లుగా టాటా సన్స్ అనుసరిస్తున్న చరిత్రాత్మక యాజమాన్య స్వరూపాన్ని మిస్త్రీ మంటగలిపారు. చైర్మన్గా ఉన్న వ్యక్తి కంపెనీలన్నింటిలోనూ కామన్గా డెరైక్టర్గా కొనసాగేలా నిబంధనలు మార్చారు. ఇకపై గ్రూప్లో ఇలాంటి పరిస్థితిని కొనసాగనివ్వం’’ అని టాటా సన్స్ స్పష్టం చేసింది. ఇండియన్ హోటల్స్పై ఆధిపత్యానికి... తాజ్ గ్రూప్ ఆఫ్ హోటళ్లను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ను (ఐహెచ్సీఎల్) మిస్త్రీ తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూశారని టాటా సన్స ఆరోపించింది. మిస్త్రీ చైర్మన్గా ఉన్న ఐహెచ్సీఎల్లో టాటా సన్స్ కు 28.01 శాతం వాటా మాత్రమే ఉంది. ‘‘ఇందుకోసం ఆయన స్వతంత్ర డెరైక్టర్లందరినీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు’’ అని సంస్థ పేర్కొంది. గత వారంలో జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు మిస్త్రీ నాయకత్వాన్ని కీర్తించడంతోపాటు ఆయనను పూర్తిగా సమర్థించడం తెలిసిందే. నిర్వహణ చేతకాలేదు... నాలుగేళ్ల సారథ్యంలో మిస్త్రీ పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదని.. కంపెనీల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని టాటా సన్స్ తేల్చి చెప్పింది. ‘‘టాటా స్టీల్ యూరప్ (రతన్ టాటా హయాంలో కోరస్ను కొనుగోలు చేసిన తర్వాత పేరు మార్చారు), టాటా-డొకోమో జారుుంట్ వెంచర్, టాటా మోటార్స్ భారతీయ కార్యకలాపాలను మిస్త్రీ పూర్తిగా దెబ్బతీశారు. ఈ కంపెనీలన్నీ తీవ్ర సమస్యల్లోకి కూరుకుపోయారుు. నష్టాలు, రుణ భారం భారీగా పెరగడమే కాకుండా... మార్కెట్ వాటా పడిపోరుుంది. దీనికి ఆయన అనుసరించిన విధానాలే కారణం. టర్న్ఎరౌండ్ చేయడం చేతకాలేదు కానీ, ఆయా కంపెనీల్లో చేసిన భారీ మొత్తంలోని పెట్టుబడులను కోల్పోయేలా (రైటాఫ్) చేశారు’’ అని టాటా సన్స్ తెలియజేసింది. ఇక టాటా స్టీల్ యూరప్లో సంక్షోభం, జపాన్ టెలికం కంపెనీ డొకోమోతో జేవీ విఫలం కావడానికి మిస్త్రీయే కారణమని పేర్కొంది. కాగా, మిస్త్రీ తన ఉద్వాసన తర్వాత రాసిన లేఖలో తన ముందు చైర్మన్ (రతన్ టాటా) హయాంలో తీసుకున్న నిర్ణయాలు, విదేశీ కొనుగోళ్ల కారణంగా గ్రూప్లోని 5 కంపెనీలు రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడి నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆరోపించారు. అరుుతే, ఈ విషయాన్ని ఆయా కంపెనీల బోర్డు సభ్యులకు చెప్పానంటున్న మిస్త్రీ.. దీన్ని అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని టాటా సన్స్ ప్రశ్నించింది. అప్పులు మూడింతలు...: ‘నాలుగేళ్ల క్రితం రూ.69,877 కోట్లుగా ఉన్న గ్రూప్ రుణ భారం ఇప్పుడు రూ.2,25,740 కోట్లకు ఎగబాకింది. సమస్యలున్నాయని చెబుతున్న ఐదు కంపెనీలనూ మళ్లీ గాడిలో పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. వదిలించుకోవడానికే ప్రయత్నించారు. ఆయన అమ్మేసిన టాటా స్టీల్ యూరోపియన్ ఆస్తులను కొన్న కంపెనీ మాత్రం తొలి ఏడాదిలోనే వాటిని టర్న్ ఎరౌండ్ చేసింది’’ అని టాటా సన్స్ వివరించింది. తప్పుదోవ పట్టించారు... గ్రూప్ వ్యవహారాల్లో టాటా ట్రస్టులు జోక్యం చేసుకున్నాయని మిస్త్రీ చేసిన ఆరోపణలను కూడా తిప్పికొట్టింది. ‘‘నిజానికి ఇందులో తప్పేముంది? అరుుతే, మిస్త్రీ ఈ వ్యవహరంలో అందరినీ తప్పుదోవపట్టించారు. ట్రస్టులు తమ ఆస్తుల పరిరక్షణపై దృష్టిపెడతారుు. అంతేకాదు టాటా సన్సలో తమకున్న విలువైన పెట్టుబడులు కూడా వాటికి ముఖ్యమే. అందుకే అన్లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీకి (టాటా సన్స) సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం అత్యవసరం కూడా. టాటా మోటార్స్ మార్కెట్ వాటా పడిపోరుుంది... మిస్త్రీ నాయకత్వంలో టాటా మోటార్స్ దేశీ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని టాటా సన్స్ తెలిపింది. ‘‘గత మూడేళ్లలో కార్లు, వాణిజ్య వాహనాల్లోనూ దేశీ మార్కెట్ వాటా ఘోరంగా పడిపోరుుంది. కార్ల విషయానికొస్తే.. 2012-13లో 13% మార్కెట్ వాటా ఉంటే.. ఇప్పుడు 5%కి దిగజారింది. వాణిజ్య వాహనాల మార్కెట్ వాటా 60% నుంచి 40%కి క్షీణించింది. ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఉన్న కంపెనీకి చరిత్రలో ఇదే అత్యంత ఘోరమైన స్థారుు’’ అని వివరించింది. అరుుతే, నానో కార్ల వల్లే టాటా మోటార్స్ దేశీయంగా నష్టాల్లోకి కూరుకుపోరుుందని.. దీన్ని మూసేస్తేనే కంపెనీ బాగుపడుతుందని మిస్త్రీ చేసిన ఆరోపణలపై టాటా సన్స్ తాజా లేఖలో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి ఔట్ ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన మిస్త్రీకి గ్రూప్ కార్యకలాపాలతో సంబంధం లేకుండా చేసే పనిని టాటా సన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా కీలకమైన టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి కూడా ఆయనను తొలగించింది. తాత్కాలికంగా ఇషాత్ హుస్సేన్ను కంపెనీ చైర్మన్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ‘మిస్త్రీ తొలగింపు తీర్మానాన్ని ఆమోదించడానికి అసాధారణ వాటాదారుల సమావేశం (ఈజీఎం) కోసం నోటీసులు జారీ చేసినట్లు టాటా సన్స్ ఈ నెల 9న మాకు తెలియజేసింది. దీంతో తక్షణం మిస్త్రీని తొలగించి ఇషాత్ హుసేన్కు ఆయన స్థానంలో బాధ్యతలను అప్పగిస్తున్నట్లు కూడా పేర్కొంది. కొత్తగా పూర్తిస్థారుు చైర్మన్ను నియమించేవరకూ హుస్సేన్ కొనసాగుతారని తెలిపింది’ అని ఎక్స్ఛేంజీలకు వెల్లడించిన సమాచారంలో టీసీఎస్ వెల్లడించింది. టాటా గ్రూప్లోని టాటా స్టీల్, వోల్టాస్తో సహా చాలా కంపెనీల్లో హుస్సేన్ డెరైక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం వోల్టాస్, టాటా స్కైలకు చైర్మన్గానూ సేవలందిస్తున్నారు. కాగా,టాటా సన్స్ కు టీసీఎస్లో 73.26% వాటా ఉంది. గ్రూప్ చైర్మన్గా ఉద్వాసన పలికినప్పటికీ.. టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్, టాటా పవర్ సహా పలు టాటా గ్రూప్ కంపెనీలకు ఆయన చైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి నుంచి కూడా ఆయనను తొలగించాలనేది టాటా సన్స్ వ్యూహం. ఇండియన్ హోటల్స్ నుంచి కూడా... ఇండియన్ హోటల్స్ డెరైక్టర్ల బోర్డు నుంచి కూడా మిస్త్రీని తొలగించేందుకు రంగం సిద్ధమైంది. చైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన తీర్మానాన్ని ఆమోదించేందుకు కంపెనీ ఈజీఎంను నిర్వహించనున్నట్లు టాటా సన్స్ తెలియజేసిందని ఇండియన్ హోటల్స్ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. గత వారంలోనే కంపెనీ స్వతంత్ర డెరైక్టర్లు ఆయన నాయకత్వాన్ని సమర్థించడం, చైర్మన్గా ఆయనను కొనసాగించేందుకు మద్దతుపలకడం తెలిసిందే. కాగా, తాజాగా టాటా కెమికల్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్లు కూడా మిస్త్రీని చైర్మన్గా కొనసాగించాలంటూ సమర్థించడం విశేషం. -
మిస్త్రీపై టాటా సన్స్ మరో లేఖాస్త్రం
టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను అర్థాంతరంగా తొలగించారంటూ వాదిస్తున్న సైరస్ మిస్త్రీ ఆరోపణలను ఖండిస్తూ.. టాటా గ్రూప్ హోల్డిండ్ కంపెనీ టాటా సన్స్ తొమ్మిది పేజీల ప్రటకనను విడుదల చేసింది. గతనెల ఉన్నపళంగా సైరస్ మిస్త్రీని తొలగించడానికి గల కారణాలను ఆ ప్రకటనలో వివరణ ఇచ్చింది. మిస్త్రీని అర్థాంతంరంగా తొలగించామన్న వాదన సరికాదని పేర్కొంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆదాయాలను పక్కనపెడితే, గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీ ఎలాంటి గణనీయమైన సహకారాన్ని నిర్వర్తించలేదని తెలిపింది. మిస్త్రీ హయాంలో టాటా గ్రూప్లోని 40 ఇతర కంపెనీల డివిడెంట్లు క్రమంగా క్షీణించాయని వెల్లడించింది. 2012-13లో రూ.1,000 కోట్లగా ఈ ఇతర కంపెనీలు తీసుకునే డివిడెంట్స్ 2015-16 సంవత్సరానికి వచ్చేసరికి రూ.780 కోట్లకు దిగజారాయని మిస్త్రీ ఆరోపణలపై టాటాసన్స్ మండిపడింది. మిస్త్రీ అంతకముందు గ్రూప్ కంపెనీల వృద్ధికి, మేనేజ్మెంట్ రూపురేఖలకు కొన్ని ప్రణాళికలను తమతో షేర్ చేసుకునేవాడని, కానీ చైర్మన్గా ఎన్నికయ్యాక మాత్రం నాలుగేళ్ల కాలంలో ఈ ప్రణాళికలను అసలు అమలుపరుచలేదని ప్రకటనలో పేర్కొంది. వాటిని పక్కన బెడితే, చాలా కంపెనీలు ఇప్పుడు ఆ కొత్త నిర్మాణాలను అసలు ఆమోదించడం లేదని వెల్లడించింది. టాటా గ్రూప్లో ప్రధానమైన ఆపరేటింగ్ కంపెనీలను తన ఆధీనంగా తెచ్చుకోవాలనుకునేవాడని, చాలా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడేవాడని టాటా సన్స్ ఆరోపించింది. టాటా సన్స్ చైర్మన్గా బయటికి నెట్టేసిన అనంతరం సైరస్ మిస్త్రీ గ్రూప్పై తీవ్ర ఆరోపణలకు పాల్పడారు. తన తొలగింపు చట్టవిరుద్దమని, ఈ నిర్ణయం పనిచేయదని వ్యాఖ్యానించారు. మిస్త్రీ తొలగింపు అనంతరం ప్రపంచవ్యాప్తంగా చాలా ఈమెయిల్స్, కాల్స్ను తాము అందుకున్నామని, ఈ నిర్ణయంపై వారికి వివరణ ఇచ్చినట్టు టాటా సన్స్ గురువారం ప్రకటనలో తెలిపింది. గ్రూప్ కంపెనీల భవితవ్యంపై కూడా చాలామంది అడిగారని, వారిని ఆందోళనల నుంచి బయటపడేయడానికి ఈ ప్రకటనను వెలువరిచినట్టు పేర్కొంది. -
టాటాసన్స్ లో కీలక మార్పులు
ముంబై: టాటా సన్స్ అధినేతగా సైరస్ మిస్త్రీ పై వేటు పడిన అనంతరం సంస్థలో శుక్రవారం నూతన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిస్త్రీ ఉద్వాసన తర్వాత ఒకవైపు కొత్త చైర్మన్ కోసం ముమ్మర కసరత్తు జరుగుతుండగా, మరోవైపు సంస్థ తన సంస్థాగత నిర్మాణంలో ప్రధాన మార్పులు ప్రకటించింది. కొత్త మ్యానేజ్మెంట్ టీం ను ప్రకటించింది. టాటాసన్స్ హెచ్ ఆర్ గ్రూపు హెడ్ గా ఎస్ పద్మనాభన్ ను నియమించింది. టాటా బిజినెస్ ఎక్స్ లెన్స్ గ్రూపు బాధ్యతలకు తోడుగా ఆయనకు ఈ బాధ్యతలను కట్టబెట్టింది. విదేశీ సంస్థ నిర్వహణ బాధ్యతలను ముకుంద్ రాజన్ కు అప్పగించింది. అమెరికా, సింగపూర్, దుబాయ్, చైనా లో టాటా సన్స్ విదేశీ ప్రతినిధి కార్యాలయాలు, కార్యకలాపాలు పర్యవేక్షించే అదనపు బాధ్యతను అప్పగించింది. ముఖ్యంగా టాటా సన్స్ ముగ్గురు అగ్ర కార్యనిర్వాహకులు నిర్మల్య కుమార్ ఎన్ ఎస్ రాజన్, మధు కన్నన్ రాజీనామా తర్వాత ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించింది. చీఫ్ టెక్నాలజీ గ్రూపు హెడ్ గా గోపీచంద్ కాట్రగడ్డ కొనసాగుతారని, ఢిల్లీ కార్యాలయం నుంచి పబ్లిక్ అఫైర్స్ ను సంజయ్ సింగ్ పర్యవేక్షించనున్నారని తెలిపింది. టాటా బ్రాండ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ బాధ్యతల్లో హరీష్ భట్ లను నియమించింది. కాగా అక్టోబర్ 24 న టాటా సన్స్ బోర్డు చైర్మన్ గా మిస్త్రీ స్థానే తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలను రతన్ టాటా చేపట్టారు. సంస్థ నాలుగు నెలల్లో ఒక కొత్త చైర్మన్ ను నియామకంకోసం తీవ్ర వెదుకులాట సాగుతోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశంపై స్పష్టత లేదు. -
మోదీ వద్దకు టాటాసన్స్ వివాదం ఎందుకు?
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు రాజకీయాలకు, కేంద్రానికి మధ్యనున్న పారదర్శక పొర మరింత పలుచబడుతున్నట్లుంది. పదివేల కోట్ల డాలర్ల హోల్డింగ్ కంపెనీ ‘టాట్ సన్స్’ సంక్షోభం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లడం ఈ విషయాన్ని సూచిస్తోంది. పదవీచ్యుతుడైన సైరస్ మిస్త్రీ, ఆయన స్థానంలో టాటా సన్స్ చైర్మన్గా తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా పోటీ పడి ఒకరి తర్వాత ఒకరు వెళ్లి నరేంద్ర మోదీని కలుసుకొని ‘అసలు ఏం జరిగిందంటే...’అంటూ వివరణలు ఇచ్చుకోవడం కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశం అయింది. అక్టోబర్ 24వ తేదీన టాటా సన్స్ కంపెనీ బోర్డు మీటింగ్లో చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన విషయం తెల్సిందే. అనంతరం కంపెనీ తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన్ని తొలగించాల్సి వచ్చిందో ఆ లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత టాటా కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీకి స్వయంగా ఫోన్చేసి కంపెనీలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నరేంద్ర మోదీ, టాటాకు సుపరిచితుడు. పశ్చిమ బెంగాల్లోని సింగూర్లో కంపెనీకి కేటాయించిన స్థలం వివాదం అవడంతో నానో కార్ల కంపెనీని అక్కడి నుంచి గుజరాత్కు తరలించేందుకు టాటాకు మోదీ సహకరించిన విషయం తెల్సిందే. ప్రధానితో టాటాకున్న సాన్నిహిత్యం గురించి బాగా తెల్సిన సైరస్ మిస్త్రీ అక్టోబర్ 27వ తేదీన ఢిల్లీకి వెళ్లి మోదీని కలుసుకున్నారు. టాటాసన్స్ పరిణామాలపై తన కథనాన్ని వినిపించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెల్సిన మరునాడే కంపెనీ విమానంలో రతన్టాటా ఢిల్లీకి వెళ్లి మోదీతో భేటి అయ్యారు. ప్రధాని మోదీ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇద్దరికీ సమయం కేటాయించారు. వారు చెప్పిన అంశాలను ఆసక్తిగా ఆలకించారని తెల్సింది. అయితే వీరేమీ చెప్పారో, వాటిపై ఆయన స్పందన ఏమిటో మాత్రం తెలియరాలేదు. ఓ కార్పొరేట్ కంపెనీలో చోటు చేసుకున్న అంతర్యుద్ధాన్ని రాజకీయ వేదికపైకి ఎందుకు తీసుకెళ్లారో అర్థం కావడంలేదని మిగతా కార్పొరేట్ ప్రపంచం విస్తుపోతోంది. ఇదివరకు ఏ కంపెనీ అంతర్గత కలహాల అంశంలో ఇలా జరగిన దాఖలాలు లేవని అంటోంది. ఇతర కంపెనీలకు టాటాసన్స్ గ్రూప్కు చాలా తేడా ఉందని, ఇది పబ్లిక్ ఇష్యూ కంపెనీల గ్రూపు కావడమే కాకుండా, దానిలో చోటుచేసుకునే పరిణామాలు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందువల్ల ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంలో తప్పేమి లేదని కొంత మంది ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సైరస్ మిస్త్రీని కంపెనీ చైర్మన్ పదవి నుంచి తొలగించడంతో సంక్షోభ పరిస్థితులు సమసిపోలేదు. అసలు సంక్షోభ పరిస్థితులు ఆరంభమైనట్లు భావించవచ్చు. ఎందుకంటే మిస్త్రీ కుటుంబానికి టాటాసన్స్లో 18.4 శాతం వాటా ఉంది. అంటే ఆయన కుటుంబ సభ్యుల పేరిట 90వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. ఆయన్ని టాటాసన్స్ నుంచి తప్పించినా, అందులో డైరెక్టర్గా కొనసాగుతారు, టాటా పవర్, టాటా కెమికల్స్, జాగ్వర్ ల్యాండ్ రోవర్ లాంటి పలు టాటా గ్రూప్ కంపెనీలకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వాటి నుంచి కూడా ఆయన్ని తప్పించేందుకు ప్రయత్నిస్తే కంపెనీలో సంక్షోభ పరిస్థితులు మరింత తీవ్రం కాకతప్పదు. అప్పుడు ఎలాగు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు భారీ ఎత్తున టాటా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. ఒక్క యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ రెండు సంస్థలకు కలిపే టాటా స్టీల్స్లో 21 శాతం వాటా ఉంది. టాటా సన్స్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను స్టాక్ మార్కెట్ను నియంత్రించే సెబీ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇందులో షేర్ హోల్డర్ల హక్కుల అంశం కూడా ఇమిడి ఉన్నందున సెబీ కూడా ఏ దశలోనైనా జోక్యం చేసుకోవచ్చు. అప్పుడు ప్రభుత్వ, సెబీ వైఖరుల ఎలా ఉంటాయో రానున్న పరిణామాలే సూచిస్తాయి. -
భారీగా కుదేలైన టాటా సన్స్ లాభాలు
ముంబై : చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని బయటికి నెట్టేసి టాటా సన్స్, అసలు తమ గ్రూప్ లాభాలు ఏమేరకు ఉన్నాయా? అని లెక్కలేసుకుంది. ఈ లెక్కలో టాటా సన్స్ భారీగానే లాభాలను కోల్పోయింది. ఈ ఏడాది మార్చి వరకు టాటా సన్స్ లాభాలు 67 శాతం కుదేలై, రూ.3,013 కోట్లగా నమోదైనట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్లో పేర్కొంది. మిస్త్రీని తొలగించడానికి ప్రధాన కారణం కూడా ఆయన పనితీరు సరిగా లేదనే గ్రూప్ చెబుతోంది. అదేవిధంగా రెవెన్యూలు కూడా 39 శాతం క్షీణించి రూ.8,104 కోట్లగా నమోదుచేసింది. కానీ ఏకీకృత ప్రాతిపదికన మాత్రం కంపెనీ గతేడాదితో పోలిస్తే కొంత మెరుగైన లాభాలనే ఆర్జించింది. గతేడాది రూ.19,180 కోట్లగా ఉన్న లాభాలను రూ.23,119 కోట్లకు పెంచుకుంది. చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా తీసివేసిన తర్వాత ఆ పదవికి తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను బోర్డు ఎన్నుకుంది. గ్రూప్ వృద్ధిని పెంచడానికి రతన్ టాటా తమ స్ట్రాటజీలను మరోసారి పరిశీలిస్తున్నారని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. గత ఆర్థికసంవత్సరం టీసీఎస్ కంపెనీ చెల్లించిన ఎక్కువ డివిడెంట్లు కూడా స్వతంత్ర ఆదాయాలకు కొంత గండికొట్టినట్టు తెలిసింది. గతేడాది కంపెనీ డివిడెంట్లు కింద రూ.11,450 కోట్లను చెల్లించింది. కంపెనీ స్వతంత్ర ఆదాయాలకు, ఏకీకృత ఆదాయాకు పెద్దగా తేడా లేనప్పటికీ, లాభాల్లో మాత్రం కంపెనీ పడిపోయింది. దీంతో మిస్త్రీ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న బోర్డు సభ్యులు ... చైర్మన్ పదవికి ఎన్నికై నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. మరోవైపు మిస్త్రీ స్థానంలో ఎన్నికైన రతన్ టాటా, కంపెనీ అధినేతలందరికీ తమతమ వ్యాపారాలపై దృష్టిసారించాలని ఉపదేశం చేశారు. పనితీరుతో పాటు, లాభాలను పెంచుకోవడంపై ఫోకస్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
మిస్త్రీని తిలగిస్తే లక్ష కోట్లు చెల్లించాలా ?
-
టాటాకు ఈడీ షాక్?
ముంబై: మార్కెట్ వర్గాల్లో సంచలనం రేపిన టాటా సన్స్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో టాటాలకు మరో షాక్ తగలనుంది. కార్పొరేట్ పాలన నియమాల ఉల్లంఘనల ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు రంగంలోకి దిగినట్టు సమాచారం. టాటా సన్స్ బోర్డుకు రాసిన లేఖలో మిస్త్రీ గ్రూపు కార్యకలాపాలకు సంబంధించి నైతికత, రతన్ టాటాపైనా, కొందరు బోర్డు సభ్యులపైనా విమర్శనాస్త్రాలు సంధించిన అంశాలపై విచారించనుందని ఇండియా టుడే శనివారం రిపోర్ట్ చేసింది. మిస్త్రీ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఈడీ అధికారి వ్యాఖ్యానించినట్టు పేర్కొంది. మలేషియా ఎయిర్ లైన్స్ ఎయిర్ఏషియా, సింగపూర్ ఎయిర్లైన్స్తో జాయింట్ వెంచర్ల (జేవీ) ఏర్పాటును వ్యతిరేకించినందుకే ఇదతా జరిగిందని, దాదాపు రూ.22 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలినట్లు మిస్త్రీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపైనా ఈడీ విచారణ చేపట్టనుంది. మరోవైపు టాటా గ్రూప్ ఈ పరిణామాలపై ఇప్పటికే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి స్పందించారు. టాటా గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు మల్టి-ఏజెన్సీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు. హోల్డర్లు, రుణాలిచ్చిన బ్యాంకులు, ఉద్యోగులు, ఇతర స్టేక్ హోల్డర్లలో తీవ్రమైన ఆయోమయం నెలకొందని , వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా (ఐఐఎఎస్) వ్యాఖ్యానించింది. అటు టాటాల ఎయిర్ఏషియా లావాదేవీలకు సంబంధించి అన్ని విషయాలు పరిశీలిస్తున్నామని, చట్ట ప్రకారం ముందుకెళ్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి ప్రకటించారు. -
మిస్త్రీ.. ఏం చేస్తిరి?
-
విశ్వాసం కోల్పోయినందుకే వేటు!
మిస్త్రీ లేఖాస్త్రంపై తీవ్రంగా స్పందించిన టాటా సన్స్ • సారథిగా పూర్తి అధికారాలిచ్చాం...ఆరోపణలన్నీ నిరాధారం, కుట్రపూరితం... • బోర్డు సభ్యులకు రాసిన ‘రహస్య’ ఈ-మెయిల్ బయటికెలావచ్చింది? • మాపై బురదజల్లడం కోసమే లీక్ చేశారు.ఇది సంస్కారహీనమైన చర్య... • టాటాల సంస్కృతి, సాంప్రదాయాలను ఆయన మంటగలిపారు... ముంబై: విద్వేషాలు ఒక స్థాయికి చేరిపోతే ఇక పరువు మర్యాదల గురించి పట్టించుకోరనేది నానుడి. టాటా గ్రూప్ విషయంలో అలాగే జరుగుతోంది. దేశంలో నంబర్-1 గ్రూప్గా ఇన్నాళ్లూ ప్రజల విశ్వసనీయతను, గౌరవాన్ని అందుకున్న ఈ గ్రూప్ పరువు తాజా పరిణామాలతో వీధికెక్కుతోంది. సైరస్ మిస్త్రీని తొలగించాక ఆయన సంధించిన లేఖాస్త్రానికి... మళ్లీ టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డు స్పందిం చింది. మిస్త్రీ ఏ స్థాయిలో అయితే విమర్శలు చేశారో... అదే స్థాయిలో టాటా గ్రూప్ కూడా విరుచుకుపడింది. డైరెక్టర్ల విశ్వాసాన్ని కోల్పోయినందుకే మిస్త్రీపై వేటు వేయాల్సివచ్చిందంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మిస్త్రీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమే కాదు! కుట్రపూరితమైనవి కూడా. ప్రతిష్టాత్మక టాటా గ్రూప్ను నడిపించే బాధ్యతను ఆయనకు పూర్తి అధికారాలతోనే కట్టబెట్టాం. అయినా, ఆయన అనేక విషయాల్లో డైరెక్టర్ల విశ్వాసాన్ని కోల్పోయారు. అసలు బోర్డు సభ్యులకు రాసిన రహస్య ఈ-మెయిల్లోని విషయాలు బయటికెలా వచ్చాయి? కావాలనే దీన్ని వెల్లడి చేశారనేది అర్థమవుతోంది కదా!! ఇది చాలా దురదృష్టకరం, సంస్కారహీనమైన చర్య’’ అని టాటా సన్స్ పేర్కొంది. మా సంస్కృతిని అతిక్రమించారు... ‘‘టాటా గ్రూప్లో ఉన్న విశిష్టమైన సంస్కృతి, సాంప్రదాయాలకు భిన్నంగా మిస్త్రీ పలుమార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టాటా గ్రూపు, టాటా సన్స్ బోర్డు, గ్రూప్లోని అనేక కంపెనీలతో పాటు గౌరవప్రదమైన వ్యక్తులపై కావాలని బురదజల్లడం కోసమే మిస్త్రీ తన లేఖలో నిరాధారమైన కుట్రపూరిత ఆరోపణలను చేశారు’’ అని టాటా సన్స్ తిప్పికొట్టింది. అంతేకాదు తనను ‘అచేతన’ చైర్మన్గా మార్చేశారన్న వ్యాఖ్యలను కూడా కొట్టిపారేసింది. ‘‘స్వతంత్రంగా వ్యవహరించేలానే ఆయనకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాం. కానీ పదవి నుంచి తొలగించామనే ఉక్రోషంతో రతన్ టాటా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై తప్పుదోవపట్టించే ఆరోపణలు చేశారు. అది చాలా దురదృష్టకరం. అంతేకాదు 2006 నుంచీ టాటా గ్రూప్తో ప్రత్యక్ష సాన్నిహిత్యం ఉన్న మిస్త్రీకి... గ్రూపుతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన యాజమాన్య స్వరూపం, ఆర్థిక, నిర్వహణపరమైన విధివిధానాలన్నీ పూర్తిగా తెలుసు. గ్రూప్ ప్రతిష్టను మంటగలపడమే మిస్త్రీ ఆరోపణల లక్ష్యం. ఈ విషయంలో ఆయనను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించలేం’’ అని కూడా టాటా సన్స్ తేల్చిచెప్పింది. పదవిలో ఉన్నప్పుడు గుర్తుకురాలేదా... టాటా గ్రూప్ కంపెనీల్లో కార్పొరేట్ నైతిక నిమయాల ఉల్లంఘన జరిగిందని మిస్త్రీ ఆరోపించటంపై కూడా టాటా సన్స్ తీవ్రంగానే స్పందించింది. ‘ఆయన చైర్మన్గా పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆయనకు గుర్తుకురాలేదా? అప్పుడే వీటిని లేవనెత్తి ఉంటే బాగుండేది. అయినా, ఆయన చేసిన ఆరోపణలన్నీ అర్థరహితమని చెప్పేందుకు కంపెనీల వద్ద అనేక ఆధారాలున్నాయి. వీటన్నిటినీ అవసరమైనపుడు నియంత్రణ సంస్థలు, ఇతర ఏజెన్సీలకు అందిస్తాం’ అని పేర్కొంది. ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కలేదు.. ఉన్నపళంగా మిస్త్రీ ఉద్వాసనకు కారణాలేంటనేటు విషయమై టాటా సన్స్ వివరణిచ్చే ప్రయత్నం చేసింది. ‘‘మిస్త్రీ తీసుకున్న కొన్ని వ్యాపారపరమైన నిర్ణయాలు, అంశాలకు సంబంధించి బోర్డు డెరైక్టర్లు పదేపదే ప్రశ్నించారు. ఆందోళన కూడా వ్యక్తం చేశారు. టాటా ట్రస్ట్ల ధర్మకర్తలు కూడా మిస్త్రీ విశ్వసనీయత కోల్పోతున్నారంటూ అనేకమార్లు ఆందోళన వ్యక్తపరిచారు. ఆయన ఇవేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఆయన తొలగింపు బోర్డు సభ్యుల సమిష్టి నిర్ణయం. మిస్త్రీ ఆరోపణలన్నీ అబద్ధాలే. వాటిపై మాట్లాడటమంటే మా గ్రూపు పేరుప్రతిష్టలకే అవమానకరం. సమస్యల నుంచి పారిపోవటమనేది మా గ్రూప్ మనస్తత్వం కాదు. అదేవిధంగా ఆరోపణల్ని అదేపనిగా తిప్పికొట్టాల్సిన పనీలేదు. గ్రూపు ఉజ్వల భవిత లక్ష్యంగా ఎలాంటి సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొంటాం’’ అని టాటా సన్స్ స్పష్టం చేసింది. 6 లక్షల మంది ఉద్యోగుల స్ఫూర్తితోనే... ‘బోర్డు రూమ్లో అనుసరించే సాంప్రదాయాలు, విలువలు ఒక్కటే గ్రూప్ పటిష్టతకు కారణం కాదు. మొత్తం 6 లక్షల మందికిపైగా ఉద్యోగులు తమ విలువలకు కట్టుబడి పనిచేయడమే అన్నింటికంటే కీలకమైన అంశం. వారు అందిస్తున్న స్ఫూర్తి, సహకారంవల్లే గ్రూప్ ఇప్పుడు ఇంత ఉన్నతస్థానంలో నిలబడగలిగింది’ అని టాటా సన్స్ వ్యాఖ్యానించింది. ఆరోపణలపై దృష్టి పెడతాం...విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు టాటాల జాయింట్ వెంచర్ కంపెనీ ఎయిర్ ఏషియా ఇండియాలో రూ.22 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయంటూ మిస్త్రీ చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. దీనిపై దృష్టిపెడతామని.. ఒకవేళ ఏవైనా నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం విలేకరులకు చెప్పారు. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్లైన్స్లతో వేర్వేరు జాయింట్ వెంచర్ల ఏర్పాటు ద్వారా టాటా గ్రూప్ మళ్లీ విమానయాన రంగంలోకి అడుగుపెట్టడం తెలిసిందే. అయితే, రతన్ టాటా ఒత్తిడివల్లే ఈ రంగంలోకి గ్రూప్ మళ్లీ రావాల్సి వచ్చిందని మిస్త్రీ ఆరోపించారు. జేవీతో ఎఫ్డీఐ విధానానికి విఘాతం..: ఎఫ్ఐఏ న్యూఢిల్లీ: టాటా-ఎయిర్ఏషియా ఒప్పందం డీజీసీఏ (డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) విధానానికి పూర్తి వ్యతిరేకమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (ఎఫ్ఐఏ) పేర్కొంది. టాటా-ఎయిర్ఏషియాకు మంజూరు చేసిన ఆపరేషన్ ఏవియేషన్ అనుమతుల రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు 2014 ఏప్రిల్ నుంచీ ఢిల్లీ హైకోర్టులో పెండింగులో ఉందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికి ఈ కేసు విచారణ 17 సార్లు వాయిదా పడిందని పేర్కొన్న ఎఫ్ఐఏ, కనీసం కేసు విచారణ వేగవంతానికైనా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. లెసైన్సుకు దరఖాస్తు చేసేటప్పుడు ఎయిర్ఏషియా తన బ్రాండ్ ఈక్విటీ ఎగ్రిమెంట్ వివరాలను వెల్లడించలేదని ఎఫ్ఐఏ పేర్కొంది. ‘నానో’ ఘనత రతన్దే: భార్గవ సామాన్యులకూ అందుబాటు ధరల్లో కారును అందించడం కోసం ‘నానో’కు రూపకల్పన చేసిన ఘనత రతన్ టాటా సొంతమని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. టాటా మోటార్స్కు నానో గుదిబండగా మారిందని.. దీన్ని మూసేస్తేనే కంపెనీ బాగుపడుతుందంటూ మిస్త్రీ తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ‘అత్యంత చౌక ధరకే కారు అందించాలన్న టాటాల ఉద్దేశం చాలా అభినందించదగినది. మేం (మారుతీ) కూడా ఇందుకు ప్రయత్నించలేదు. వాళ్లు చేసి చూపించారు’ అన్నారు. తాజా పరిణామాలపై స్పందిస్తూ... ఇది టాటా గ్రూప్ అంతర్గత వ్యవహారమని.. బయటి వ్యక్తులు దీనిపై వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని చెప్పారు. మిస్త్రీని తొలగించిన విధానం తప్పు: సుప్రియా సూలే సైరస్ మిస్త్రీని తొలగించిన విధానం సరికాదని ఎన్సీపీ ఎంపీ, శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలే పేర్కొన్నారు. ‘పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలున్న టాటా గ్రూప్లో నిర్ణయాలన్నీ పారదర్శకంగా ఉంటాయి. విభేదాలుంటే ఉండొచ్చు. బోర్డు సభ్యులకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉంది. అయితే, చైర్మన్ను తొలగించే విషయంలో వారు అనుసరించిన విధానాన్నే నేను తప్పుబడుతున్నా. గౌరవప్రదంగా వ్యవహరించి ఉండాల్సింది’ అని ఆమె వ్యాఖ్యానించారు. సుప్రియకు మిస్త్రీ, ఆయన భార్య రోహికా మంచి స్నేహితులు కావడం గమనార్హం. అన్ని విషయాలను తెలియజేశాం: టాటా స్టీల్ తమ కంపెనీ కార్యకలాపాలు, వ్యవహరాలకు సంబంధించిన వివరాలన్నింటినీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశామని టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్ గురువారం వివరణ ఇచ్చాయి. మిస్త్రీ ఆరోపణలపై ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయాలేవీ లేవని స్పష్టం చేశాయి. కాగా, టాటా గ్రూప్లోని టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్ ఇతరత్రా కంపెనీలు దాదాపు రూ.1.18 లక్షల కోట్ల నష్టాలను చవిచూడాల్సి(రైట్డౌన్) వస్తుందంటూ మిస్త్రీ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
'మిస్త్రీ చేసింది క్షమించరాని తప్పు'
-
'మిస్త్రీ చేసింది క్షమించరాని తప్పు'
న్యూఢిల్లీ: టాటా సన్స్ సైరస్ మిస్త్రీల మధ్య పోటాపోటీ మాటల యుద్ధం మొదలైంది. తనకు వద్దన్నా బాధ్యతలు కట్టబెట్టి అనంతర స్వేచ్ఛ లేకుండా చేశారని, ప్రతి విషయంలో రతన్ టాటా జోక్యం చేసుకున్నారని, బోర్డు సభ్యులెవరూ తన మాటను సరిగా వినలేదని సైరస్ మిస్త్రీ చెప్పగా.. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని టాటా సన్స్ కొట్టి పారేసింది. టాటా సన్స్ బోర్డు సైరస్ మిస్త్రీపై విశ్వాసం కోల్పోయిందని చెప్పింది. సైరస్ మిస్త్రీ చేసిన ఏ ఆరోపణలకు కూడా ఆధారాలే లేవని, ఆయన తనను తాను రక్షించుకునేందుకు చేసిన చర్యేనని గురువారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. 'టాటా సన్స్ బోర్డు తన చైర్మన్కు అవకాశాలను సమన్వయం చేసుకునేందుకు సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన స్వయం అధికారాన్ని ఇచ్చింది. కానీ, కంపెనీ విలువలకు, పద్ధతికి మిస్త్రీ దూరంగా జరిగారు. మొత్తానికి పలు కారణాల మూలంగా మిస్త్రీ బోర్డు సభ్యుల విశ్వాసాన్ని కోల్పోవడం దురదృష్టకరం' అని కూడా ఆ ప్రకటన పేర్కొంది. మిస్త్రీ కంపెనీ ప్రతిష్టను ఉద్యోగుల దృష్టిలో కళంకితం చేశారు. అది క్షమించరానిది' అని కూడా లేఖలో చెప్పారు. -
మిస్త్రీ తొలగింపు వెనుక షాకింగ్ మిస్టరీ!
బోర్డు సమావేశంలో తీవ్ర గందరగోళం చెప్పపెట్టకుండా తొలగించిన టాటా గ్రూప్ కారణమిదే అంటున్న ఇన్సైడర్లు దేశ కార్పొరేట్ రంగాన్ని ఒక కుదుపు కుదిపిన సంఘటన.. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించడం.. వందల బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్నకు సారథిగా వచ్చిన మిస్త్రీని... నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే సాగనంపారు. దేశ పారిశ్రామిక వర్గాల్ని తీవ్ర షాక్కు గురిచేసిన ఈ ఘటనకు అసలు కారణం ఏమిటి? సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా అర్ధంతరంగా, అత్యంత అగౌరవమైనరీతిలో ఎందుకు తొలగించారు. మిస్త్రీని తొలగించడానికి కారణమైన సోమవారం నాటి బోర్డ్ మీటింగ్లో ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన వివరాల్ని ఒక జాతీయ మీడియా చానెల్ తన ఎక్స్క్లూజివ్ కథనంలో వివరించింది. ఆ వివరాలివి.. సాధారణంగా టాటా సన్స్ బోర్డ్ సమావేశాలు ప్రశాంతంగా ఒకింత ఊహించేరీతిలోనే జరుగుతాయి. కానీ సోమవారం నాటి భేటీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఈ భేటీలోనే సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా తొలగించాలన్న షాకింగ్ నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ ఘటన గురించి విశ్వసనీయంగా తెలిసిన ఇద్దరు కంపెనీ ఇన్సైడర్లు (ఒకరు ఈ బోర్డు మీటింగ్లో పాల్గొన్నారు కూడా) అసలు ఏం జరిగిందో వివరించారు. మిస్త్రీ ఉద్వాసన నిర్ణయం ప్రకటించడంతో ఒక్కసారిగా బోర్డు మీటింగ్లో గందరగోళంతోపాటు అసాధారణ దృశ్యాలు కనిపించాయని వారు వివరించారు. కావాలనే బోర్డు ఎజెండాలో మిస్త్రీ ఉద్వాసన అంశాన్ని చేర్చలేదని తెలుస్తోంది. ఇతరత్రా కేటగిరీలో భాగంగా బోర్డు భేటీ ముందుకు వచ్చే అదనపు అంశంగా దీనిని చేపట్టినట్టు ఒక ఇన్సైడర్ తెలిపారు. (టాటా తదుపరి చైర్మన్ ఎవరు..?) తన తొలగింపు అంశం చర్చకు రావడంతో షాక్ తిన్న మిస్త్రీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అక్రమమని మండిపడ్డారు. టాటా నిబంధనల పుస్తకం ప్రకారం కనీసం 15రోజుల ముందైనా నోటీసు ఇచ్చిన తర్వాత బోర్డు ఎదుట దీనిపై చర్చించాలని, అప్పుడు తన వాదన వినిపించుకొనేందుకు అవకాశముంటుందని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, తాము ముందే "న్యాయసలహా' తీసుకున్నట్టు బోర్డు ఆయనకు స్పష్టం చేసింది. ఆ న్యాయసలహా తనకు చూపించాల్సిందిగా మిస్త్రీ డిమాండ్ చేయగా.. ఇదేమీ కోర్టు హియరింగ్ కాదంటూ తోసిపుచ్చింది. బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేయాలని మిస్త్రీ నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నంలోపు ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టాటా సన్స్ బోర్డులో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండగా.. అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలికారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. తొమ్మిదో సభ్యుడైన మిస్త్రీ ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు నిరాకరించారు. అయితే, టాటా బోర్డు సభ్యుడిగా, డైరెక్టర్గా ఆయన కొనసాగనున్నారు. సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు కారణం ఏమిటన్న దానిపైనా ఇన్సైడర్లు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మిస్త్రీపై టాటా బోర్డుకు వ్యక్తిగత కోపం ఏమీ లేదని, కేవలం సీఈవోగా ఆయన పనితీరు నచ్చకపోవడం వల్లే ఇలా అర్థంతరంగా తొలగించారని చెప్తున్నారు. టాటా గ్రూప్లోని ఎన్నో కంపెనీలు ఉండగా మిస్త్రీ సారథ్యంలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని, మిగతా కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయని వారు తెలిపారు. టాటా గ్రూప్ సంప్రదాయ మర్యాదలు పాటించడం కంటే.. అంతర్జాతీయ పద్ధతి అయిన ఒక్కవేటుతో మిస్త్రీని తొలగించడానికి బోర్డు మొగ్గు చూపిందని మరో ఇన్సైడర్ వివరించారు. -
పనితీరు నచ్చకపోవడమే కారణమా...!
గ్రూపులోని వ్యాపారాలపై ఇప్పటికీ మిస్త్రీ పెద్దగా పట్టు సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి. పెపైచ్చు ప్రధానంగా లాభాల్లో ఉన్న కంపెనీలపైనే (టీసీఎస్ ఇతరత్రా) అధికంగా దృష్టిపెట్టారని, నష్టజాతక కంపెనీలను సరిగ్గా పట్టించుకోవడం లేదని కూడా విమర్శలొస్తున్నాయి. వీటన్నిటికీ తోడు... టాటా గ్రూప్ ఇప్పటిదాకా ఉద్యోగాల్లో కోత పెట్టిన సందర్భాలు లేవని, మిస్త్రీ మాత్రం నష్టాలొస్తున్న కంపెనీల్లో ఉద్యోగుల్ని తొలగించడానికి ఏమాత్రం వెనకాడటం లేదని, ఇది టాటా గ్రూప్ విధానానికి వ్యతిరేకం కనక టాటా సన్స్కు ఇది నచ్చటం లేదన్న కథనాలూ వినవస్తున్నాయి. నష్టాల్లో ఉన్న కొన్ని కంపెనీల తీరును చూస్తే... టాటా స్టీల్ యూకే... బ్రెగ్జిట్ ఎఫెక్ట్ యూరప్లో తీవ్ర నష్టాల్లో ఉన్న స్టీల్ వ్యాపారం (గతంలో కోరస్ స్టీల్.. ఇప్పుడు టాటా స్టీల్ యూకే) సహా, ఇతర నష్టాల్లో ఉన్న కంపెనీలను వదిలించుకునే విషయంలో మిస్త్రీ ధోరణి బోర్డు సభ్యులకు నచ్చలేదని భావిస్తున్నారు. ముఖ్యంగా టాటా స్టీల్ యూకే ఆస్తులను రైటాఫ్ చేయడం, ఆ తర్వాత వాటిని విక్రయించడంపై టాటా ట్రస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2016 తొలి త్రైమాసికంలో టాటా స్టీల్ రూ.3,000 కోట్ల భారీ నష్టాలను చవిచూడటానికి యూరప్ కార్యకలాపాలే కారణం. ఇక యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) కూడా టాటా స్టీల్ యూకేతో పాటు మొత్తం గ్రూప్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. డొకోమో కేసు.... టాటా డొకోమో జాయింట్ వెంచర్ తెగదెంపులకు సంబంధించి జపాన్ భాగస్వామ్య సంస్థ డొకోమోతో కోర్టుల్లో న్యాయపోరాటం కూడా టాటా గ్రూప్పై తీవ్ర ప్రభావాన్నే చూపింది. దీన్ని ఎదుర్కోవడంలో కూడా మిస్త్రీ సమర్థంగా వ్యవహరించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తెగదెంపుల్లో తమకు 1.2 బిలియన్ డాలర్ల పరిహారాన్ని టాటా సన్స్ చెల్లించాలంటూ బ్రిటన్లో ఆర్బిట్రేషన్కు కూడా డొకోమో తెరతీసింది. ఈ మొత్తాన్ని చెల్లించకుంటే టాటాల ఆస్తులను అటాచ్ చేయాలని కూడా కోరుతోంది. చతికిలపడిన కొత్త కార్లు... టాటా మోటార్స్ ప్రతియేటా రెండు కొత్త కార్లను తీసుకొస్తుందంటూ మిస్త్రీ ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. విడుదల చేసిన టియాగో(జికా పేరును మార్చారు) బోల్ట్లు కూడా దేశీ మార్కెట్లో నిరాశపరిచాయి. మరోపక్క, బ్రెగ్జిట్ కారణంగా జేఎల్ఆర్పైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీన్ని ఎదుర్కొనే ప్రణాళికలను మిస్త్రీ సరిగ్గా రూపొందించలేదనే వాదనలు ఉన్నాయి. టర్నోవర్ పెద్దగా పెరగలేదు... మిస్త్రీ బాధ్యతలు చేపట్టేనాటికి టాటా గ్రూప్ టర్నోవర్ 100.99 బిలియన్ డాలర్లు (20-11-12లో) కాగా.. 2015-16లో 103 బిలియన్ డాలర్లకు చేరింది. వ్యాపారాల్లో వృద్ధి అంతంతమాత్రంగా ఉండటానికి నాయకత్వలోపమే కారణమని గ్రూప్ వర్గాలు భావిస్తున్నాయి. -
సైరస్ మిస్త్రీ తొలగింపుపై విమర్శలు
టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలకడం చట్టవిరుద్ధమని టాటా గ్రూప్లోని మెజార్టీ స్టాక్హోల్డర్స్ షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ విమర్శిస్తోంది. మిస్త్రీని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందని కాదని పేర్కొంటోంది. ఈ విషయాన్ని సీనియర్ లాయర్ మోహన్ పరశారణ్ నిర్థారించారు.మొత్తం తొమ్మిది మంది బోర్డు సభ్యులో ఎనిమిది మంది ఈ నిర్ణయం తీసుకోవడంలో ఓటింగ్లో పాల్గొన్నారని పల్లోంజి గ్రూప్ తెలిపింది. వారిలో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలుకగా, మిగిలిన ఇద్దరు వ్యతిరేకించారని వెల్లడించింది. సైరస్ మిస్త్రీని తప్పించే నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందనే టాటా సన్స్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశీయ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో ఒకటైన టాటా సన్స్ సైరస్ మిస్త్రీని విధుల నుంచి తప్పిస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను నియమించింది. పూర్తిస్థాయి చైర్మన్ను నాలుగు నెలల్లో సెలక్షన్ కమిటీ నియమించనుంది. ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్రా, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య ఉన్నారు. మిస్త్రీ తొలగింపుపై ఎలాంటి కారణాలను టాటా సన్స్ వెల్లడించలేదు. కానీ లాభాపేక్ష లేని కంపెనీలను తొలగిస్తూ మిస్త్రీ తీసుకుంటున్న చర్యలతో టాటా సన్స్ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తొలగించిన్నట్టు సమాచారం. -
సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారు?
-
సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారు?
దేశీయ అతి పెద్ద ప్రైవేటు కార్పొరేట్గా పేరుగాంచిన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజి మిస్త్రీని తప్పించడం వెనుక కారణాలేమిటా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను నియమిస్తూ బోర్డు సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చైర్మన్ పదవి మార్పునకు టాటా గ్రూప్ ఎలాంటి కారణాలు వెల్లడించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. లాభాపేక్ష లేని వ్యాపారాలపై మిస్త్రీ అశ్రద్ధ వహించడం, వాటి విక్రయాలు జరుపుతూ ఇటీవల పలు నిర్ణయాలు తీసుకోవడం ఆయనపై వేటు వేయడానికి కారణాలుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వాటిలో మేజర్ డీల్ యూరప్లో ఉక్కు వ్యాపారాలను విక్రయించడం. సైరస్ మిస్త్రీ నేతృత్వంలోనే యూరప్లో తమకున్న యూరప్లో లాంగ్ ప్రొడక్ట్స్ ఉక్కు వ్యాపారాన్ని విక్రయించినట్లు టాటా స్టీల్ (యూకే) ప్రకటించింది. కేవలం ఆదాయాలపై మాత్రమే శ్రద్ధ వహించడం, లాభాపేక్ష లేని వ్యాపారాల నుంచి వైదొలగడం వంటివి మిస్త్రీ నిర్వహించే వాటిలో టాటా సన్స్కు అసంతృప్తి కలిగించే అంశాలుగా మారినట్టు సమాచారం. దీంతో కంపెనీ బోర్డు సైరస్ మిస్త్రీని తొలగించిందని వాదన వినిపిస్తోంది. బోర్డు సామూహికంగా ఈ నిర్ణయం తీసుకుందని, ప్రిన్సిపల్ షేర్హోల్డర్స్ (టాటా ట్రస్ట్స్) ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం వెలువడినట్టు టాటా గ్రూప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. టాటాసన్స్, టాటా గ్రూప్ దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుకూలంగా ఆయన్ను మార్పు చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆపరేటింగ్ స్థాయిలోని సీఈవోలో ఎలాంటి మార్పులు లేవని ఆయన తెలిపారు. నాలుగు నెలలో శాశ్వత చైర్మన్ను గ్రూప్ నియమిస్తుందని ప్రకటించారు. -
టాటా గ్రూప్లో భారీ సంచలనం
ముంబయి: ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థ టాటా సన్స్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చైర్మన్ గా ఉన్న సైరస్ పల్లోంజి మిస్త్రీని విధుల నుంచి తప్పించారు. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను నియమిస్తూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి చైర్మన్ ను నాలుగు నెలల్లో సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్రా, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య ఉన్నారు. సోమవారం నిర్వహించిన బోర్టు సమావేశంలో ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సైరస్ మిస్త్రీ నాలుగు సంవత్సరాలపాటు టాటా సన్స్కు చైర్మన్ గా పనిచేశారు. తొలిసారి 2012 డిసెంబర్ 28న ఆయన చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. సైరస్ ఐరిష్ జాతీయుడు. పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
117 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించండి
టాటా సన్స్కు లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ ఆదేశాలు ముంబై/టోక్యో: జపాన్కు చెందిన ఎన్టీటీ డొకొమోకు 117 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని భారత్కు చెందిన టాటా సన్స్ను లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. భారత్లో జాయింట్ వెంచర్ విషయమై మోసానికి పాల్పడినందుకు టాటా సన్స్ ఈ పరిహారం చెల్లించాలని లండన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసిందని ఎన్టీటీ డొకొమో తెలిపింది. కాగా ఆర్బిట్రేషన్ ఉత్తర్వులు అందాయని, అధ్యయనం చేస్తున్నామని టాటా సన్స్ పేర్కొంది. ప్రస్తుతానికైతే ఎలాంటి వ్యాఖ్య చేయలేమని వివరించింది. -
టాటా సన్స్ కు వేల కోట్ల భారీ జరిమానా
టోక్యో: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ మేజర్ ఆపరేటింగ్ ప్రమోటర్ టాటా సన్స్ లిమిటెడ్ కి లండన్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. జపాన్కు చెందిన టెలికాం కంపెనీ నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్టీటీ) డొకోమో వివాదంలో సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల బారీ జరిమానా విధించింది. 79 వేల 531 వేల కోట్ల రూపాయల(1.17 బిలియన్ డాలర్ల) నష్టపరిహారాన్ని చెల్లించాలని లండన్ లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టు ఆదేశించింది. డొకొమో తో చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఈ మొత్తాన్ని డొకొమోకు నష్టపరిహారంగా చెల్లించాలంటూ టాటా సన్స్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని టాటా సన్స్ ప్రతినిధి కూడా ధృవీకరించారు.. కోర్టు ఆదేశాలకు తమకు చేరాయని దీనిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. టాటా సన్స్ ఎల్లప్పుడూ చట్టానికనుగుణమైన పద్ధతిలో ఒప్పంద బాధ్యతలు నిర్వర్తించేందుకు కట్టుబడి ఉందని ..దీనిపై ఇపుడే వ్యాఖ్యానించలేమన్నారు. కాగా టాటా టెలిలో తనకున్న 26.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా సంయుక్త భాగస్వామ్యం నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు 2014 ఏప్రిల్ లో డొకోమో ప్రకటించింది. ఈ వాటాలను రూ.7,250 కోట్లకు కొనుగోలు చేసేందుకు తొలుత అంగీకరించిన టాటా సన్స్ ఆ తరువాత వెనుకడుగు వేసింది. టాటా సన్స్ తో కలసి తాము ఏర్పాటు చేసిన టాటా టెలి సర్వీసెస్ లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ డొకోమో లండన్లోని కోర్టులో గత ఏడాది జనవరి లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
7 నెలల సెలవులతో పాటు జీతం
న్యూఢిల్లీ : గర్భిణీ ఉద్యోగులకు ఆఫీసులకు రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది మహిళలు ఈ సమయంలోనే ఉద్యోగం మానేస్తుంటారు కూడా. మరి కొంతమంది జీవనాధారం కోసం ఎంతకష్టమైనా ఆఫీసులకు వస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులకు గర్భిణీ మహిళలు స్వస్తి చెప్పేందుకు, టాటా సన్స్ మహిళల కోసం సరికొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. ప్రసూతి సెలవుల కింద ఏడు నెలలను మంజూరు చేస్తూ, ఆ నెలల్లో కూడా పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాక ప్రసవం అనంతరం వారికి మద్దతుగా సగం జీతం-సగం పనిదినం అనే పాలసీని తీసుకొచ్చింది. ప్రసవించిన అనంతరం 18 నెలలు పాటు వారే పని సమయాన్ని నిర్ణయించుకుని, ఉద్యోగం చేసేలా అవకాశం కల్పించనుంది. ఒకవేళ టాటా సన్స్ కంపెనీలో ఐదు సంవత్సరాల ఉద్యోగం పూర్తిచేసుకున్న వారికి అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ పాలసీని ప్రవేశపెట్టింది. కేర్ టేకర్ గా బాధ్యత కలిగిన వారికి సగం జీతంతో ఏడాది పాటు సెలవులు మంజూరు చేసేలా ఈ పాలసీని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం టాటా సన్స్ కలిగి ఉన్న సాల్డ్ నుంచి సాప్ట్ వేర్ సర్వీసులకు వరకూ ఈ పాలసీలు వర్తించనున్నాయి. టాటా గ్రూప్ కు చెందిన మిగిలిన కంపెనీలు భవిష్యత్ లో ఈ పాలసీలను కల్పించనున్నాయి. భారత్ లో మహిళల పని జీవితానికి సంబంధించి టాటా సన్స్ తీసుకున్న ఈ పాలసీలే కొత్త ప్రమాణాలు. ఇప్పటివరకూ భారత్ లో చాలా కంపెనీలు మూడు నెలలు లేదా ఆరు నెలలు సెలవులు ఇస్తుంటాయి. కానీ మహిళలకు వివిధ స్టేజ్ ల్లో సెలవులు, అనుమైన పనిసమయాన్నికల్పిస్తూ ప్రవేశపెట్టిన సంపూర్ణ విధానం ఇదేనని కంపెనీ తెలిపింది. 'మహిళల విషయంలో మా సంస్థ అంకితభావంతో పనిచేస్తూ..వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో కృషిచేస్తుంది. మెటర్నిటీ అనేది చాలా క్లిష్టమైన సమయం. వారికి ఆ సమయంలో పూర్తి జీతంతో 7 నెలల ప్రసూతి సెలవులు, 18 నెలలు పోస్ట్ మెటర్నిటీ కింద సగం జీతం-సగం పని, మహిళలు వారికి అనువైన సమయంలోనే ఉద్యోగం చేసేలా అవకాశం ఇవ్వడం, మా బాధ్యతగా గుర్తించాం' అని టాటా సన్స్ చీఫ్ హ్యుమన్ రిసోర్స్ ఆఫీసర్ ఎన్ఎస్. రాజన్ తెలిపారు. చిన్న పిల్లల్ని చూసుకునేటప్పుడు వారంలో రెండు రోజులు ఇంటి దగ్గరే పనిచేసుకునేలా, అనువైన పనిదినాలను వారు ఎంపికచేసుకునేలా పాలసీలను ప్రవేశపెట్టామన్నారు. 48శాతం మహిళలు ఈ సమయంలోనే ఉద్యోగం మానేస్తుంటారని అవతార్ కెరీర్ క్రీయేటర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు సౌందర్య రాజేష్ తెలిపారు. టాటా గ్రూప్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు లక్షా 45 వేల మంది ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో వీరు 24 శాతం మంది. 2020 కల్లా రెండు లక్షల 30 వేల మంది మహిళలను ఉద్యోగులుగా చేర్చుకుంటామని టాటా గ్రూప్ 2014లో ప్రకటించింది. 2014 లో కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు లక్షా 15వేల మంది -
హైదరాబాద్ టూ చంఢీగర్ వయా ఢిల్లీ
విస్తారా కొత్త సర్వీసు ప్రారంభం చంఢీగర్: దేశీయ విమానయాన సంస్థ విస్తారా మరో నూతన సర్వీసును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. సింగపూర్ ఎయిర్లైన్సు, టాటాసన్స్ తో సంయుక్తంగా పనిచేసే విస్తారా ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి చంఢీగర్కు కొత్త సర్వీసును సోమవారం ప్రారంభించారు. త్వరలో ఢిల్లీ మీదుగా చంఢీగర్ నుంచి బెంగుళూరు, పుణే, ముంబై, భువనేశ్వర్, అహ్మదాబాద్ సర్వీసులను కూడా నడుపుతామని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ అధికారి సంజీవ్ కపూర్ తెలిపారు. చంఢీగర్, ఢిల్లీ మధ్య ధర రూ. 1990 గా ఉంది. ఈ రూటులో బిజినెస్, ఎకానమీనే కాకుండా ప్రీమియం ఎకానమీ క్లాస్ను ప్రవేశపెట్టాం. ఉత్తర భారతంలో చంఢీగర్ కీలక ప్రాంతం. ఇక్కడ పర్యాటకానికి, వ్యాపారానికి పుష్కల అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్, విశ్రాంత ప్రయాణికులపైనే ప్రధానంగా దృష్టి సారించాం. కొత్త రూటు అంతర్జాతీయ సర్వీసులకు అనుసంధానం చేసేందుకు వీలుగా ఉంటుందని సంజయ్ కపూర్ అన్నారు. నూతనంగా ప్రారంభమైన సర్వీసుతో కలిపి ఉత్తర భారతంలో ఆరు, దేశవ్యాప్తంగా 12 మార్గాల్లో విస్తారా సేవలు అందిస్తోంది. ప్రస్తుతానికి తొమ్మిది విమానాలున్నాయి. అక్టోబర్ కల్లా మరో నాలుగు కొనుగోలు చేస్తాం. వారానికి 16 మార్గాల్లో 417 సర్వీసులు నడుపుతున్నాం. త్వరలో వీటిని 580 కి పెంచుతామని కపూర్ పేర్కొన్నారు. -
ఎయిర్ ఏషియా ఇండియాకు అరుణ్ భాటియా గుడ్ బై
♦ అరుణ్ వాటాను కొంటున్న టాటా సన్స్ ♦ 49%కి పెరగనున్న టాటా వాటా న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా ఇండియా నుంచి అరుణ్ భాటియా వైదొలిగారు. ఎయిర్ఏషియా ఇండియాలో అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్ప్లేస్ కంపెనీకి దాదాపు 10 శాతం వాటా ఉంది. దీంట్లో టాటా సన్స్ సంస్థ 7.94 శాతం వాటా కొనుగోలు చేయనున్నది. మిగిలిన వాటాను ఎయిర్ ఏషియా ఇండియా చైర్మన్ రామదొరై 0.5 శాతం వాటాను, కంపెనీ డెరైక్టర్ ఆర్. వెంకటరమణన్ 1.5 శాతం వాటాను కొనుగోలు చేయనున్నారు. అరుణ్ భాటియా వాటా కొనుగోలుతో టాటా సన్స్ వాటా 41.06 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుంది. ఈ డీల్ ఈ నెల 14న జరిగిందని, వచ్చే నెలలో పూర్తవుతుందని అంచనా. కాగా మలేషియా ఎయిర్ఏషియా బెర్హాద్కు ఎయిర్ఏషియా ఇండియాలో 49 శాతం వాటా ఉంది. అరుణ్ భాటియా అసంతృప్తి చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా వ్యవహారాల పట్ల అరుణ్ భాటియా గత ఏడాది డిసెంబర్లోనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విమానయాన సంస్థపై నియంత్రణ, యాజమాన్యహక్కుల విషయంలో విభేదాల నేప థ్యంలో ఎయిర్ ఏషియా ఇండియా నుంచి అరుణ్ భాటియా వైదొలుగుతున్నారని సమాచారం. గత నెలలో ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓగా మిట్టు చాండిల్య స్థానంలో అమర్ అబ్రాల్ నియామకం జరిగింది. వచ్చే నెల 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్నది. ఎయిర్ ఏషియా ఇండియా పట్ల టాటా గ్రూప్కు అపారమైన నమ్మకం ఉందని, అందుకే వారు వాటా పెంచుకున్నారని, ఇది గొప్ప విషయమని ఏయిర్ఏషియా గ్రూప్ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ ట్వీట్ చేశారు. ఎయిర్ఏషియా ఇండియా 2014 జూన్లో కార్యకలాపాలు ప్రారంభించింది.ఆరు విమానాలతో 12 రూట్లలో 18 లక్షల మంది ప్రయాణికులకు విమాన సర్వీసులను అందిస్తోంది. -
ప్చ్... అలా జరిగింది!
గొప్ప ఆవిష్కరణ ఒక్కటీ లేదు 60 ఏళ్లుగా భారత్లో పరిస్థితులపై ఇన్ఫీ మూర్తి వ్యాఖ్యలు బెంగళూరు: గడిచిన అరవై ఏళ్లలో ప్రపంచం నలుమూలలా ఇంటింటికి చేరగలిగే ఆవిష్కరణ కనీసం ఒక్కటి కూడా భారత్ చేయలేకపోయిందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దేశీయంగా ప్రభావవంతమైన పరిశోధనలు జరిగేలా చూడటంపై దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇతర నేతలెవరూ కూడా పెద్దగా దృష్టి పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా నారాయణ మూర్తి ఈ విషయాలు చెప్పారు. ‘రేడియో, బల్బు, టీవీలు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా విదేశీ యూనివర్సిటీల నుంచి వచ్చినవే. మరోవైపు మన భారతీయ కళాశాలలు.. ముఖ్యంగా ఐఐఎస్సీ, ఐఐటీలు.. గడచిన అరవై ఏళ్లలో మన సమాజాన్ని, ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దగలిగేందుకు ఏం ఆవిష్కరణలు చేయగలిగాయని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటింటా మార్మోగేలా కనీసం ఒక్క ఆవిష్కరణైనా భారత్ నుంచి వచ్చిందా? ప్రపంచాన్ని కుదిపేసేటువంటి ఒక్క ఐడియా అయినా ఇవ్వగలిగామా? నిజంగా చెప్పాలంటే గత 60 ఏళ్ల నుంచి అలాంటివేమీ చేయలేకపోయాం’ అని మూర్తి వ్యాఖ్యానించారు. మేధస్సులోనూ, ఉత్తేజంలోనూ పాశ్చాత్య విద్యార్థులకేమాత్రం తీసిపోకపోయినప్పటికీ.. మన యువత ప్రభావవంతమైన పరిశోధనలు పెద్దగా చేయలేదని ఆయన పేర్కొన్నారు. 1962లో అమెరికా సందర్శించినప్పుడు అక్కడ పీహెచ్డీలు పూర్తి చేసుకోబోతున్న భారతీయ విద్యార్థులు స్వదేశం తిరిగొచ్చి.. విద్యా, వైద్యం మొదలైనవి మారుమూల ప్రాంతాల్లో పేదవారికి కూడా అందుబాటులోకి వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారని మూర్తి చెప్పారు. దాని ఫలితంగానే ఆటమిక్ ఎనర్జీ మొదలైన రంగాల్లో భారత్ పురోగతి సాధించగలిగిందని, ప్రస్తుతం కూడా 60 దశాబ్దం నాటి మ్యాజిక్ను మళ్లీ సృష్టించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మేధావులకు, అధ్యాపకులకు సమాజంలో సముచిత గౌరవం లభించే పరిస్థితులు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. చౌక కారు ముద్రతోనే నానోకు దెబ్బ టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా చెన్నై: నానో కారు భారీ అంచనాలతో వచ్చినా మార్కెట్లో నిలబడలేకపోవడానికి కారణం.. దాని బ్రాండింగ్ విషయంలో జరిగిన తప్పులేనని టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. నానోకు అందుబాటు ధరలోని కారుగా కాకుండా చౌక కారుగా ముద్రపడటం అత్యంత పెద్ద తప్పిదమని, ఇదే వాహన అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పారు. సాధారణంగా కారును హోదాకు చిహ్నంగా పరిగణిస్తారని, ఎవరూ కూడా అత్యంత చౌక కారుగా ముద్రపడిన దాన్ని కొనుక్కునేందుకు ఇష్టపడరని ఆయన విశ్లేషించారు. గ్రేట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 11వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నానో కారును డిజైన్ చేసిన వారి సగటు వయస్సు 25-26 సంవత్సరాలేనని, రూ.లక్షకు దీన్ని తయారుచేయడమనేది మహాయజ్ఞంలాంటిదేనని టాటా పేర్కొన్నారు. రాజకీయ కారణాల వల్ల కారు మార్కెట్లోకి రావడం ఆలస్యం కావడంతో దానిపై ఉత్కం ఠ తగ్గిపోయిందన్నారు. ఈలోగా తమకు వ్యతిరేకంగా కథనాలు అల్లడానికి పోటీ కంపెనీలకు అవకాశం చిక్కిందని చెప్పారు. వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసే ఈ-కామర్స్ భారీ స్థాయిలో వస్తున్న ఈ-కామర్స్ స్టార్టప్ సంస్థలు.. దేశీ వ్యాపార రంగం ముఖచిత్రాన్ని మార్చివేయగలవని టాటా అభిప్రాయపడ్డారు. అమెరికాలో 70, 80వ దశకాల్లో కనిపించినట్లుగా.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న అనేక మంది యువ వ్యాపారవేత్తలు ప్రస్తుతం దేశీయంగా కనిపిస్తున్నారని ఆయన చెప్పారు. దేశీ వ్యాపార రంగ ముఖచిత్రాన్ని మార్చివేయగలిగే సత్తా ఉన్న ఈ-కామర్స్, ఈ-రిటైల్ విభాగ స్టార్టప్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే తాను కొన్నింటిలో ఇన్వెస్ట్ చేసినట్లు టాటా చెప్పారు. పీసీలపైనే దృష్టి.. పెద్ద తప్పిదం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆర్లాండో: ఎప్పటికీ పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) హవానే నడుస్తుందని భావించి గతంలో పెద్ద తప్పిదం చేశామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ ఆలోచనా ధోరణి వల్లే మొబైల్ ఫోన్ల విప్లవాన్ని ఊహించలేకపోయామని, అవకాశాలు అందుకోలేకపోయామని ఆయన పేర్కొన్నారు. అయితే అలాగని భవిష్యత్తంతా మొబైల్ ఫోన్లదే అనుకుంటే గతంలో చేసిన తప్పే పునరావృతం అయినట్లవుతుందని ఒక టెక్నాలజీ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాదెళ్ల పేర్కొన్నారు. భవిష్యత్లో పెను మార్పులు తే బోయే వాటిని ముందస్తుగా పట్టుకోవడంపైనే కంపెనీ దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే విండోస్ కొత్త వెర్షన్ అని, ఫోన్ల విషయంలోనూ కాపీలు కొట్టడం కాకుండా వినూత్నంగా అందించాలన్నదే తమ లక్ష్యమని నాదెళ్ల తెలిపారు. 1992లో తాను మైక్రోసాఫ్ట్లో చేరినప్పుడు ప్రతి ఇంట్లోనూ పర్సనల్ కంప్యూటర్ ఉండాలన్నది కంపెనీ లక్ష్యమని, తాము దాన్ని సాధించగలిగామని ఆయన చెప్పారు. పర్సనల్ కంప్యూటింగ్, ఉత్పాదకతను పెంచుకోవడం, మరింత మెరుగైన క్లౌడ్ ప్లాట్ఫామ్ను రూపొందించడమనే మూడు అంశాలపై మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారిస్తోందని నాదెళ్ల తెలిపారు. నోకియా ఫోన్ల వ్యాపార విభాగంలో మార్పులు, చేర్పులను ప్రస్తావిస్తూ.. తాము రోజుకో ఫోన్ను ఆవిష్కరించడం కన్నా గణనీయమైన మార్కెట్ వాటాను దక్కించుకునే సత్తా ఉన్న కొన్ని ఫోన్లపైనే దృష్టి పెట్టదల్చుకున్నట్లు ఆయన వివరించారు. -
టాటా సన్స్పై డొకొమో దావా
న్యూఢిల్లీ/టోక్యో: జపాన్కు చెందిన టెలికం కంపెనీ ఎన్టీటీ డొకొమో టాటా సన్స్ను ఆర్బిట్రేషన్ కోర్టుకు లాగింది. టాటా టెలిసర్వీసెస్తో తాము ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో వాటా కొనుగోలు విషయంలో టాటా సన్స్ విఫలమైందనేది ఎన్టీటీ డొకొమో వాదన. ఈ నెల 3న లండన్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో టాటా సన్స్కు వ్యతిరేకంగా డొకొమో ఈ దావా దాఖలు చేసింది. వివరాలివీ... టాటా డొకొమోతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో తమకున్న 26.5 శాతం (రూ.7,250 కోట్ల విలువ) వాటాను విక్రయించడం ద్వారా ఆ జేవీ నుంచి వైదొలగనున్నామని ఎన్టీటీ డొకొమో గత ఏడాది ఏప్రిల్లో వెల్లడించింది. ఆ జేవీలో భాగస్వామిగా ఉన్న టాటా సన్స్ ఆ వాటాను కొనుగోలు చేస్తుందని పేర్కొంది. అయితే ఇరువైపులా తలెత్తిన కొన్ని విభేదాల కారణంగా ఈ డీల్ సాకారం కాలేదు. ఈ డీల్ విషయమై టాటా సన్స్తో పదే పదే సంప్రదింపులకు ప్రయత్నాలు చేశామని, అయినప్పటికీ టాటా సన్స్ విఫలమైందని డొకొమో తన పిటిషన్లో పేర్కొంది. అయితే ఈ డీల్ సాకారం కోసం తమ వంతు ప్రయత్నాలు చేశామని టాటా సన్స్ ప్రతినిధి చెప్పారు. -
ఈ-కామర్స్లో ఇన్వెస్ట్ చేస్తా..
కోల్కతా: దేశ ఈకామర్స్ రంగంలో వ్యక్తిగతంగా ఇన్వెస్ట్చేయనున్నట్లు టాటా సన్స్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. వైవిధ్యభరిత రంగాలలో వ్యక్తిగతంగా పెట్టుబడిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. వీటిలో ఈకామర్స్ ఒకటని తెలిపారు. దేశీయ వినియోగదారుల్లో అత్యధిక శాతంమందికి అవసరమైన వస్తువులు పూర్తి స్థాయిలో అందుబాటులోలేవని, దీంతో ఈకామర్స్ మార్కెట్కు భారీ అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ఈరిటైలింగ్ సంస్థ స్నాప్డీల్లో ఇన్వెస్ట్చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు టాటా నిరాకరించారు. ప్రస్తుతం ఈకామర్స్ పెట్టుబడులపై నిర్ధిష్టంగా స్పందించడం సరికాదని వ్యాఖ్యానించారు. 50-60 కోట్ల మంది దేశీ ప్రజలు వినియోగదారులేనని పేర్కొన్నారు. వ్యాఖ్యానించారు. ఇటీవల దేశీ ఈకామర్స్ రిటైలింగ్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వంటి సంస్థలు అమెజాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలకు పోటీగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. దేశీ ఈ-కామర్స్ మార్కెట్లో తొలిసారి అత్యధిక స్థాయిలో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులను గత నెలలో ఫ్లిప్కార్ట్ ఆకర్షించింది. ఈ బాటలో అమెజాన్ సైతం దేశీయంగా 2 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్చేయనున్నట్లు ప్రకటించి మరింత పోటీకి తెరలేపింది. ఈ నేపథ్యంలో రతన్ టాటా ఈకామర్స్ పెట్టుబడి ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. సింగూర్ వీడటం తెలివైన పని...: నానో కార్ల ప్లాంట్ను పశ్చిమ బెంగాల్లోని సింగూరు నుంచి తరలించడం తెలివైన నిర్ణయమని టాటా సమర్థించుకున్నారు. 2008 సంవత్సరంలో వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్లాంట్ను సింగూరు నుంచి గుజరాత్లోని సణంద్కు తరలించిన విషయం విదితమే. వెనక్కి తిరిగి చూసుకుంటే సింగూరును వీడటం తెలివైన నిర్ణయమే అయినప్పటికీ, ఇందుకు గ్రూప్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని టాటా వ్యాఖ్యానించారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టాటా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నానోపై దుష్ర్పచారం... నానో కారును తయారు చేసే సమయానికి అంతర్జాతీయ స్థాయిలో దీనిపై ఆసక్తి నెలకొందని టాటా తెలిపారు. 2,500 డాలర్ల(సుమారు రూ. లక్ష) ఆఫర్ ధరలో నానో కోసం మూడు లక్షల ఆర్డర్లు వెల్లువెత్తాయని, రెండేళ్ల వెయిటింగ్ పిరియడ్ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అయితే అదే సమయంలో ప్లాంట్ను తరలించడంతో ఏడాది కాలం ఆలస్యం అయ్యిందని, దీంతో ప్రత్యర్థి సంస్థలకు నానోపై దుష్ర్పచారాన్ని చేపట్టేందుకు వీలుచిక్కిందని వ్యాఖ్యానించారు. ఫలితంగా కారుపై ఆసక్తి క్షీణించిందని వివరించారు. మోడీకి మరింత సమయం ఇవ్వాలి... ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ క్రియాశీలక వ్యక్తని టాటా ప్రశంసించారు. సింగూర్ నుంచి నానో ప్లాంట్ను తరలించాల్సి వచ్చిన సందర్భంలో గుజరాత్లోని సణంద్లో అవకాశమిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రధానిగా మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను టర్న్ఎరౌండ్ చేసేందుకు మరింత సమయం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే మోడీ క్రియాశీలక వ్యక్తిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని చెప్పారు. ఇందుకు గుజరాత్లో జరిగిన అభివృద్ధి నిదర్శనమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో వచ్చిన మార్పుల కారణంగా 1984 తరువాత తొలిసారి ఒకే పార్టీ అధికారాన్ని సాధించగలిగిందని, దీంతో ప్రభుత్వ ఆధారిత పాలనకాకుండా వృద్ధి ఆధారిత పాలనకు తెరలేచిందని వ్యాఖ్యానించారు. రాజకీయాలపై ఆసక్తి లేదు... తనకు మార్గదర్శి అయిన జేఆర్డీ టాటా తరహాలోనే రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఏమాత్రం లేదని రతన్ టాటా స్పష్టం చేశారు. తన జీవితంలో ఏనాడూ రాజకీయాలపై దృష్టిపెట్టలేదని చెప్పారు. ఇతరులను ఎన్నడూ బాధించని వ్యక్తిగా తాను గుర్తుండిపోవాలని కోరుకుంటానని రతన్ చెప్పారు. బిజినెస్ అభివృద్ధి కోసమే కృషి చేసిన వ్యక్తిగా ఇతరుల మనసుల్లో నిలవాలని ఆశిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. -
ఎయిర్ ఏషియా ఎగిరింది..
విమానయాన సేవలు షురూ.. తొలి ఫ్లయిట్ బెంగళూరు నుంచి టేకాఫ్ బెంగళూరు: దేశంలో ఎయిర్ ఏషియా విమాన సేవలు గురువారం మొదలయ్యాయి. తొలి విమాన సర్వీసును బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి గోవాకు నడిపారు. మలేసియా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియాలోనే అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా భారతీయ విభాగమే ఎయిర్ ఏషియా ఇండియా. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఈ రంగంలోకి ఎయిర్ ఏషియా ప్రవేశంతో ధరల పోరు తీవ్రతరం కానుంది. ఇండిగో, స్పైస్జెట్, గోఎయిర్ తర్వాత దేశంలో చౌకగా విమాన సేవలందించే కంపెనీగా ఎయిర్ ఏషియా ఆవిర్భవించింది. ప్రారంభ ఆఫరుగా బెంగళూరు - గోవా టికెట్ను రూ.990గా ప్రకటించారు. అందుబాటు ధరలో విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం, విమానంలో ప్రయాణించే అవకాశాన్ని భారతీయులందరికీ కల్పించడమే తమ లక్ష్యమని ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిట్టు చాండిల్య మీడియాకు తెలిపారు. మార్కెట్ రేట్లతో పోలిస్తే తమ చార్జీలు 35 శాతం తక్కువగా ఉంటాయని చెప్పారు. స్థిరమైన కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తామనేది తమ విశ్వాసమనీ, అందుకే చార్జీలను మరింత తగ్గించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.డీజీసీఏ గణాంకాల ప్రకారం.. స్థానిక మార్కెట్లో 31.6% వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. జెట్ఎయిర్వేస్-జెట్లైట్ 21.8%, ఎయిర్ఇండియా 18.3%, స్పైస్జెట్ 17.9%, గోఎయిర్ 9.5% మార్కెట్ వాటాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎయిర్ ఏషియాపై స్వార్థశక్తుల పన్నాగం: టాటాసన్స్ న్యూఢిల్లీ: చౌక ధరలకే విమాన సేవలను అందించే ఎయిర్ ఏషియా కార్యకలాపాలను అడ్డుకోవడానికి కొన్ని స్వార్థశక్తులు యత్నిస్తున్నాయని ఈ సంస్థ వాటాదారు టాటా సన్స్ ఆరోపించింది. దేశంలో ఎయిర్ ఏషియా సర్వీసులు గురువారం ప్రారంభమైన కొద్దిసేపటికే టాటా సన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి ఎయిర్ ఏషియాపై చేసిన ఆరోపణలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. విమాన ప్రయాణికులకు ప్రయోజనం కలిగించే స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన పోటీని వ్యతిరేకిస్తున్న కొన్ని శక్తులు ఎయిర్ ఏషియా కార్యకలాపాలకు భంగం కలిగేలా దుష్ర్పచారం సాగిస్తున్నాయి’ అని టాటా సన్స్ ఘాటుగా విమర్శించింది. భారత్లో విమాన సేవలు ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి, డీజీసీఏ నుంచి అన్ని అనుమతులూ పొందామని ఉద్ఘాటించింది. స్వామి తో పాటు మరికొందరు కోర్టును ఆశ్రయించినప్పటికీ కార్యకలాపాల నిలిపివేతకు ఇంజంక్షన్ ఉత్తర్వులేమీ రాలేదని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టుకు ఈ విషయంపై పూర్తి అవగాహన ఉందనీ, న్యాయస్థానం ఆదేశాలను తాము, ఎయిర్ ఏషియా ఇండియా గౌరవిస్తామనీ టాటా సన్స్ తెలిపింది. కాగా, ఎయిర్ ఏషియా వ్యవహారం కోర్టులో ఉందనీ, కనుక ఆ సంస్థకు అనుమతి మంజూరు చేయవద్దంటూ ఎన్నికల సంఘం, డీజీసీఏకు, పౌర విమానయాన శాఖకు డాక్టర్ స్వామి గతంలో ఫిర్యాదు చేశారు. -
టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్కు 20 ఎయిర్బస్లు
-
టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్కు 20 ఎయిర్బస్లు
దోహా: టాటా-ఎస్ఐఏ ఎయిర్లైన్స్ సంస్థ సింగపూర్కు చెందిన బీఓసీ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ నుంచి 20 ఎయిర్బస్ విమానాలను లీజుకు తీసుకోనున్నది. ఈ సెప్టెంబర్-అక్టోబర్ నుంచి ఈ విమానాలను టాటా-ఎస్ఐఏకు అందజేయడం ప్రారంభిస్తామని బీఓసీకు చెందిన ఇన్వెస్టర్ రిలేషన్స్ హెడ్ క్లెయిరీ లియో వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న ఐఏటీఏ వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె ఈ వివరాలు తెలిపారు. కాగా ఈ సంస్థ ఇప్పటికే జెట్ ఎయిర్వేస్, స్పైస్జెట్- ఈ రెండు భారత విమానయాన సంస్థలకు కొన్ని విమానాలను లీజుకు ఇచ్చింది. టాటా సన్స్ సంస్థ సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి 51:49 భాగస్వామ్యంతో టాటా-ఎస్ఐఏ ఎయిర్లైన్స్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ఏ 320-200, ఏ 320-200(నియో) విమానాల ద్వారా తన సర్వీసులనందజేయనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా భారత్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఢిల్లీ కేంద్రంగా ముంబై, గోవా, పాట్నా, చంఢీగర్, శ్రీనగర్, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు విమాన సర్వీసులను నిర్వహించాలని ఈ సంస్థ యోచిస్తోంది. ఆ తర్వాత పుణే, లక్నో, వారణాసి, జైపూర్, కోల్కత, అమృత్సర్, బగ్దోగ్రా, ఇండోర్, కొచ్చిన్లకు విమాన సర్వీసులను విస్తరించనున్నది. ఈ సంస్థ విమానయాన సర్వీసులకు అనుమతిని ఇంకా పొందలేదు. కాగా టాటా గ్రూప్, ఢిల్లీకి చెందిన టెలిస్ట్రాలు భారత వెంచర్ భాగస్వాములుగా ఉన్న ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. -
మళ్ళీ ఎయిర్బస్ బస
-
మళ్ళీ ఎయిర్బస్ బస
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాలరు బలపడటం, ఆర్థిక మందగమనం వంటివి కొత్త విమానాల ఆర్డర్లపై ఎటువంటి ప్రభావం చూపలేదని విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ ప్రకటించింది. దేశీయ విమానరంగం వేగంగా విస్తరిస్తుండటంతో విమానాలకు డిమాండ్ బాగుందని ఎయిర్బస్ మార్కెటింగ్ హెడ్ (ఆసియా) జూస్ట్ వాన్ డెర్ హెయిజ్డెన్ తెలిపారు. ఇండియా ఏవియేషన్ 2014 ప్రదర్శన సందర్భంగా కలసిన విలేకరులతో జూస్ట్ మాట్లాడుతూ ఇండియా నుంచి ఇప్పటి వరకు మొత్తం 600 విమానాలకు ఆర్డర్లు రాగా అందులో 234 డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇందులో ఇండిగో అత్యధికంగా 280 విమానాలకు, గోఎయిర్, ఎయిర్ ఇండియా 90కిపైగా ఆర్డర్లు ఇచ్చినట్లు జూస్ట్ వివరించారు. ఇండియాలో ఏ-330, ఎ-320 రకం విమానాలకు డిమాండ్ అధికంగా ఉందని, ఇక్కడ ఎగురుతున్న విమానాల్లో సగం ఎయిర్బస్వేనని పేర్కొన్నారు. ఇరవైలో ఒక్కరే ఎగురుతున్నారు 120 కోట్లకు పైగా జనాభా కలిగిన ఇండియాలో విమానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని జూస్ట్ తెలిపారు. చైనాలో ప్రతి నలుగురిలో ఒకరు విమానంలో ప్రయాణిస్తుంటే ఇక్కడ ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఇండియాలో మధ్యతరగతి ప్రజల సంఖ్య వేగంగా పెరుగుతుండటమే కాకుండా తలసరి ఆదాయం, జీడీపీ వృద్ధి చెందుతుండటంతో విమానయాన రంగానికి మంచి అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు చెప్పారు. భారీ విహంగానికి టైమ్ పడుతుంది దేశంలో అతిపెద్ద విమానంగా పేరొందిన ఏ-380కి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నట్లు జూస్ట్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 20 సంస్థల నుంచి 324 విమానాలకు ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. ఏ-380కి సంబంధించి ఇండియా నుంచి ఇంత వరకు ఒక్క ఆర్డరు కూడా రాలేదని, దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు. ఏవియేషన్ షోకు ఎయిర్బస్ ఏ380 ప్రపంచంలోనే అతిపెద్దది; సీట్లు 517 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో అతిపెద్ద విమానం ఎయిర్బస్ ఏ380-800 హైదరాబాద్ వచ్చింది. విమాన సేవల సంస్థ ఎమిరేట్స్ ఈ లోహ విహంగాన్ని ఏవియేషన్ షో కోసం బుధవారం తీసుకొచ్చింది. ప్రయాణికుల విమానాల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దది. రెండంతస్తులుగా సీటింగ్ ఉంటుంది. బేస్ ఫ్లోర్లో 427 (ఎకానమీ క్లాస్) సీట్లున్నాయి. పై అంతస్తులో బిజినెస్ క్లాస్ 76, ఫస్ట్ క్లాస్లో (సూట్స్) 14 సీట్లు ఉన్నాయి. దీని ఖరీదు మన కరెన్సీలో రూ.2,500 కోట్లపైనే. ఎక్కడా ఆగకుండా 15,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సూట్ ప్రత్యేకతే వేరు.. పై అంతస్తులో 14 ఫస్ట్ క్లాస్ సీట్లున్నాయి. ఏకాంతం కోసం స్లైడింగ్ డోర్ ఉంది. ప్రతీ సీటుకు మినీ బార్, అడ్జస్టబుల్ లైటింగ్, పెద్ద టీవీ ఉంది. 1,600 చానెళ్లను వీక్షించవచ్చు. పడుకోవాలంటే సీటు కాస్తా బెడ్గా మారిపోతుంది. సీట్లను అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్ నొక్కితే చాలు. ఇందుకోసం టచ్ స్క్రీన్ కంట్రోలర్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడుకునే శాటిలైట్ ఫోన్ ఉంది. ముందున్న టచ్ స్క్రీన్లో ఇ-మెయిల్, ఎస్ఎంఎస్ పంపుకోవచ్చు. ప్రయాణికులు తమ సొంత ఫోన్లను కూడా వినియోగించవచ్చు. విమానం మొత్తం వైఫై కనెక్ట్ అయి ఉంది. పానీయాల కోసం ప్రత్యేకంగా బార్ ఉంది. సమావేశాల కోసం రెండు లాంజెస్ ఉన్నాయి. 125 విమానాలు.. ప్రస్తుతం ఏ380 మోడల్కు చెందిన 125 విమానాలు వివిధ దేశాల్లో సేవలందిస్తున్నాయి. మరో 324 విమానాలకు ఆర్డరు ఉందని ఎయిర్బస్ మార్కెటింగ్ మేనేజర్ క్లాడీ డెబ్యూక్వెన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్లో హైదరాబాద్లోని శంషాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాలు మాత్రమే ఏ380 దిగేందుకు అనువైనవి. బ్యాంకాక్ నుంచి దుబాయి వెళ్తున్న ఎమిరేట్స్ ఏ380 విమానం 2011 అక్టోబరు 23న శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. 2008లో హైదరాబాద్లో జరిగిన ఎయిర్షోలో ఇక్కడి వారిని తొలిసారిగా కనువిందు చేసింది. -
టాటా ఏఐఏ నుంచి కొత్త బీమా ప్లాన్
ఇటు టర్మ్, అటు ఎండోమెంట్ ప్లాన్ల కలయికతో టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా సెక్యూర్ 7 పేరిట బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒకవైపు బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు గ్యారంటీ రాబడులు కూడా అందించేలా దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. పాలసీ వ్యవధి 14 ఏళ్లు కాగా ప్రీమియం చెల్లింపు వ్యవధి ఏడేళ్లు ఉంటుందని పేర్కొంది. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత ఏడేళ్ల పాటు హామీపూర్వక వార్షిక రాబడులు ఇది అందిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్లో 25 శాతం మొత్తాన్ని పాలసీదారుకు కంపెనీ చెల్లిస్తుంది.