ఫిబ్రవరి 1నుంచే ఇ-వే బిల్లు | GST Council approves mandatory inter-state e-Way Bill compliance from Feb 1 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 1 నుంచే ఇ-వే బిల్లు

Published Sat, Dec 16 2017 1:36 PM | Last Updated on Mon, Oct 1 2018 5:24 PM

GST Council approves mandatory inter-state e-Way Bill compliance from Feb 1 - Sakshi

జీఎస్‌టీ కౌన్సిల్‌    కీలక  నిర్ణయం  తీసుకుంది. జీఎస్‌టీ పన్ను పరిధిలో ఇ-వే బిల్లు విధానాన్ని  కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది.  ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం జరిగిన ఈ సమావేశంలో ఇ-వే బిల్లు విధానాన్ని తప్పని సరిచేస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇంట్రా-స్టేట్  ఇ-వే బిల్లు జూన్ 1 నుంచి తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వస్తువుల అంతర్ రాష్ట్ర  ఇ-వే బిల్లు  మాండేటరీ అని జీఎస్‌టీ కౌన్సిల్‌  ప్రకటించింది.  దీన్ని ట్రయల్‌ రన్‌ కోసం జనవరి 16నాటికి సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొంది.  

ఇ-వే బిల్లు విధానం,  ఇన్‌వాయిస్‌ మ్యాచింగ్‌  తదితర అంశాలపై చర్చించిన 24వ జీఎస్‌టీ మండలి సమావేశం  ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం  రూ. 50వేల విలువకంటే ఎక్కువ వస్తువులను రవాణా చేస్తే తప్పనిసరిగా ఇ-వే బిల్లు,  రాష్ట్రంలో 10 కి.మీ లోపు వస్తువులను రవాణా చేస్తే ఇంట్రా స్టేట్‌ ఇ-వే బిల్లు  ఉండాలి.

కొన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 1 నుంచి స్వచ్ఛంద ప్రాతిపదికన ఇంటర్-స్టేట్ , ఇంట్రాస్టేట్‌ ఇ-వే బిల్లును అమలు చేస్తాయని కౌన్సిల్‌ తెలిపింది.  అయితే ఇంట్రా స్టేట్‌ ఇ-వే బిల్లు  విధానం మాత్రం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

కాగా  అంతర్‌ రాష్ట్ర వస్తువుల రవాణా,  పన్నుల ఎగవేత నిరోధాన్ని  ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 1 నుంచి దశలవారీగా..ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి  తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. దీనిపై రివ్యూ నిర్వహించిన మండలి ఈ నిర్ణయం అమలు  ఫిబ్రవరికి  ప్రీ పోన్‌  చేసింది.  అలాగే  నవంబరులో గువాహటిలో జరిగిన గత మండలి సమావేశంలో 178 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement