February
-
Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారతదేశంలో ఫిబ్రవరి 10కి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజును ప్రజాస్వామ్యంలో పండుగ రోజుగా అభివర్ణిస్తారు. దేశంలోని పౌరులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడం ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే 1952లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికలు పెద్ద సవాలుగా నిలిచాయి.1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూవచ్చారు. 1952 ఫిబ్రవరి 10.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ముఖ్యమైన రోజుగా మారింది. ఆరోజు నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ లోక్సభలోని 489 సీట్లలో 249 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో ఈ ఎన్నికలు విజయబావుటా ఎగురవేశాయి.ఫిబ్రవరి 10న భారత్తో పాటు ప్రపంచ చరిత్రలో ప్రముఖంగా నిలిచిన ఘట్టాలను ఒకసారి నెమరువేసుకుందాం.1818: ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్లో బ్రిటిష్ సైన్యం, మరాఠా సైన్యం మధ్య మూడవ, చివరి యుద్ధం జరిగింది.1921: మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠాన్ని ప్రారంభించారు.1921: బ్రిటిష్ పాలకుడు కన్నాట్ డ్యూక్ ఇండియా గేట్ నిర్మాణానికి పునాది రాయి వేశారు.1952: స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి, దేశంలో ప్రజాస్వామ్య స్థాపనను ప్రకటించింది.1990: గెలీలియో అంతరిక్ష నౌక బృహస్పతి వైపు వెళుతూ, శుక్ర గ్రహం ముందునుంచి వెళ్లింది.1996: చదరంగం ఒక మైండ్ గేమ్గా పేరొందింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్- డీప్ బ్లూ మధ్య ఫిబ్రవరి 10న ఒక మ్యాచ్ జరిగింది. దీనిలో కాస్పరోవ్ 4-2 తేడాతో గెలిచారు. మరుసటి సంవత్సరం ఈ పోటీలో డీప్ బ్లూ విజయం సాధించించారు.2005: బ్రిటన్ యువరాజు చార్లెస్ తన చిరకాల స్నేహితురాలు కెమిల్లా పార్కర్తో వివాహాన్ని ప్రకటించారు.2009: ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ భీమ్సేన్ జోషికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. 2008 నవంబర్లో ఆయనకు భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.2010: పాకిస్తాన్లోని పెషావర్ సమీపంలోని ఖైబర్ పాస్ ప్రాంతంలో పోలీసు అధికారుల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. దీనిలో 13 మంది పోలీసు అధికారులతో పాటు మొత్తం 17 మంది మృతిచెందారు.2013: అలహాబాద్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతిచెందారు. 39 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: 11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు? -
సామాన్యుడి జేబుకి చిల్లు!: రేపటి నుంచి కొత్త రూల్స్..
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్తో అనేక మార్పులు జరగనున్నాయి. అవి మాత్రమే కాకుండా ప్రతి నెలా పలు విభాగాల్లో రూల్స్ మారుతూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, యూపీఐ లావాదేవీలు వంటివాటితో పాటు మారుతి సుజుకి కంపెనీ తన వాహనాల ధరలను కూడా పెంచనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతూ ఉంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ల ధరలను అప్డేట్ చేస్తూ ఉంటాయి. సిలిండర్ ధరలలో జరిగే మార్పులు నేరుగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి రేపు (శనివారం) సిలిండర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే విషయం తెలియాల్సి ఉంది.యూపీఐ లావాదేవీలుఫిబ్రవరి 1వ తేదీన యూపీఐ నిబంధలనలకు సమందించిన కీలక మార్పులు రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్దిష్ట UPI లావాదేవీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్ కూడా విడుదలైంది. కాబట్టి కొత్త రూల్స్ రేపటి నుంచే అమలులోకి రానున్నాయి.తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన యూపీఐ ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.కార్ల ధరలుదిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), తన వాహన ధరలను గణనీయంగా పెంచనుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ధరలను పెంచనున్నట్లు.. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6, ఫ్రాంక్స్, ఇన్విక్టో, జిమ్నీ, గ్రాండ్ విటారా మొదలైన కార్ల ధరలను పెంచనుంది.బ్యాంకింగ్ రూల్స్కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సాధారణ సర్వీస్.. చార్జీలలో మార్పులు తీసుకురానుంది. ఈ మార్పుల గురించి తన వినియోగదారులకు తెలియజేసింది. కాబట్టి కొత్త నియమాలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో ఉచిత ఏటీఎమ్ లావాదేవీల పరిమితికి తగ్గించడం.. బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన చార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అయ్య బాబోయ్.. ఇక బంగారం కొనలేం!ఏటీఎఫ్ ధరలుఫిబ్రవరి 1 నుంచి విమాన ఇంధనం, ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన విమాన ఇంధన ధరలను సవరిస్తాయి. కాబట్టి, ఫిబ్రవరి 1వ తేదీన ధరలలో మార్పు జరిగితే, అది నేరుగా విమాన ప్రయాణికులపై ప్రభావం చూపుతుంది. -
ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని మోదీ..!
వాషింగ్టన్:కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ తొలిసారి అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఫిబ్రవరిలో మోదీ అమెరికా వెళ్లే అవకాశాలున్నాయి.ఈ పర్యటనపై ట్రంప్,మోదీ మధ్య ఫోన్లో చర్చ జరిగినట్లు వైట్హౌజ్ సోమవారం(జనవరి27) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ, ట్రంప్కు ఫోన్ చేసి అభినందించారు.ఈ సందర్భంగా వారిరువురి మధ్య ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే క్వాడ్ సదస్సు కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చింది. మిడిల్ ఈస్ట్, యూరప్లో ప్రస్తుత పరిస్థితులపైనా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.కాగా, భారత్ సభ్య దేశంగా ఉన్న బ్రిక్స్ కూటమిలోని దేశాలపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తానని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీనికి తోడు ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానంపైన భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
వచ్చే నెలలో బ్యాంక్ పని ఉందా? ఫిబ్రవరి సెలవులు ఇవే..
సంవత్సరంలో రెండవ నెల ఫిబ్రవరి (February) అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెలలో 28 రోజులే ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ 28 రోజుల్లో కూడా బ్యాంకులు పని చేసేది కొన్ని రోజులే. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది.ఫిబ్రవరి నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు ఈ సెలవుల జాబితాను తప్పక తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మొత్తం 14 రోజులుఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు మొత్తం 14 రోజులు మూసిఉంటాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతోపాటు పండుగలు, పర్వదినాలు, స్థానిక సెలవులు ఇందులో ఉంటాయి. స్థానిక సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి ఉంటాయి. ఫిబ్రవరిలో ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయన్నది పూర్తి జాబితా ఇక్కడ ఇస్తున్నాం..ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితాఫిబ్రవరి 2: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 3: సోమవారం సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో సెలవుఫిబ్రవరి 8: రెండవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 9: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 11: మంగళవారం థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో హాలిడే.ఫిబ్రవరి 12: బుధవారం శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో సెలవు.ఫిబ్రవరి 16: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 15: శనివారం లుయి-నగై-ని సందర్భంగా ఇంఫాల్లో బ్యాంకులకు సెలవు.ఫిబ్రవరి 19: బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై , నాగ్పూర్లోని బ్యాంకుల మూతఫిబ్రవరి 20: గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటానగర్లో హాలిడేఫిబ్రవరి 22: నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 23: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 26: బుధవారం మహా శివరాత్రి కారణంగా అనేక చోట్ల సెలవు.ఫిబ్రవరి 28: శుక్రవారం లోసార్ కారణంగా గ్యాంగ్టక్లో బ్యాంకుల మూత. -
మోదీ, ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనుందా? ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? అవుననే అంటోంది రాయిటర్స్ వార్తా సంస్థ. వారు వాషింగ్టన్లో భేటీ కానున్నారని భారత దౌత్యవర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువరించింది. ‘‘ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది. చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్–1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు’’ అని రాయిటర్స్ పేర్కొంది. భారత్కు అతి పెద్ద వర్తక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023–24లో 118 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వర్తకం జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లవర్స్కు గుడ్ న్యూస్.. ఆ రోజే ఏకంగా ఐదు సినిమాలు!
'ఫిబ్రవరి అంటే వెంటనే... సినిమా లవర్స్కు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రేమ నేపథ్యంలో వచ్చే చిత్రాలను విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు ప్రయత్నిస్తే, ప్రేక్షకులు కూడా లవ్ మూవీస్ని ఆశిస్తారు. దానికి తగ్గట్టే ఫిబ్రవరిలో అరడజను ప్రేమకథా చిత్రాలు థియేటర్స్లోకి రానున్నాయి. వీటితో పాటు యాక్షన్, ఎమోషనల్ మూవీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలా వచ్చే ఫిబ్రవరి నెలలో సినిమాల సందడి మరింత పెరగనుంది. 'రాజుగాడి లవ్స్టోరీ..‘లవ్స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి జోడీగా నటించిన సినిమా ‘తండేల్’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ఇంటెన్స్ లవ్స్టోరీ ఫిల్మ్ను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రకథ విషయానికొస్తే... ఉత్తరాంధ్ర మత్స్యకారులు జీవనో΄ాధి కోసం గుజరాత్కు వెళ్తారు. అక్కడి సముద్ర తీరంలో తెలియక ఇండియన్ బోర్డర్ దాటి, పాకిస్తాన్ కోస్టు గార్డులకు బంధీలుగా చిక్కుతారు. వీరందరి జీవితాలు ఏమయ్యాయి? అన్నదే ‘తండేల్’ సినిమా కథ అని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాలోని రాజు పాత్ర కోసం నాగచైతన్య, ఉత్తరాంధ్రకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్నారు.సాయిరామ్ శంకర్ 'ఒక పథకం ప్రకారం'..ఇక ‘ఒక పథకం ప్రకారం’ అంటూ ఇదే రోజు థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు హీరో సాయిరామ్ శంకర్. ‘143, బంపర్ ఆఫర్’ వంటి సినిమాల్లో నటించిన సాయిరామ్ శంకర్ నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఒక పథకం ప్రకారం’. క్రైమ్ మిస్టరీగా రానున్న ఈ మూవీలో సాయిరామ్ శంకర్ అడ్వొకేట్ పాత్రలో, సముద్ర ఖని పోలీస్ ఆఫీసర్గా నటించారు. గార్లపాటి రమేష్తో కలిసి ఈ చిత్రదర్శక–నిర్మాత వినోద్ కుమార్ విజయన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. శ్రుతీ సోధి, ఆషిమా నర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు మరో మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఆర్ఆర్ అందించారు. ఇక ఈ సినిమాల కంటే ముందు అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లీడ్ రోల్స్లో నటించిన ‘రాచరికం’ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. దర్శక–ద్వయం సురేష్ లంకపల్లి, ఈశ్వర్ వాసె దర్శకత్వంలో ఈ మూవీని ఈశ్వర్ నిర్మించగా, ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్కు సిద్ధం అవుతోంది. ఇటు ప్రేమ... అటు సంఘర్షణవిశ్వక్ సేన్ హీరోగా నటించిన యూత్ ఫుల్ లవ్స్టోరీ మూవీ ‘లైలా’ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోనూగా, అమ్మాయి లైలాగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్స్లో నటిస్తున్నారు విశ్వక్ సేన్. రామ్ నారాయణ్ డైరెక్షన్లో సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఆకాంక్షా శర్మ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.కిరణ్ అబ్బవరం దిల్ రూబా..మరోవైపు ఇటీవలే ‘క’తో ఓ మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లవర్స్ డే రోజున ‘దిల్ రూబా’ అనే లవ్ అండ్ యాక్షన్ మూవీతో థియేటర్స్లోకి వస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా, నాజియా డేవిసన్ మరో కీలక ΄ాత్రలో నటించిన ఈ మూవీకి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయిన ఓ అబ్బాయి, మరోసారి మరో అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లుగా తెలిసింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఈ రెండు సిటీ లవ్స్టోరీ మూవీస్తో పాటు ఓ గ్రామీణ లవ్స్టోరీ కూడా ఇదే రోజున థియేటర్స్లోకి రానుంది. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ సినిమాలు తీసిన దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి, మరో నిర్మాత రాహుల్ మోపిదేవితో కలిసి ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే తెలంగాణ గ్రామీణ ప్రేమకథ తీశారు. ఖమ్మం– వరంగల్ల సరిహద్దు నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీతో సాయిలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గత ఏడాది నవంబరులో జరిగిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ గ్లింప్స్ వీడియోలో ఈ మూవీని ఫిబ్రవరి 14న థియేటర్స్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా నటీనటులు సాంకేతిక నిపుణులపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. తాతా మనవడు... తండ్రీకొడుకుఈ ప్రేమికుల దినోత్సవం రోజున లవ్స్టోరీ మూవీస్ మాత్రమే కాదు.. ఎమోషనల్ చిత్రాలు కూడా థియేటర్స్లోకి వస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ‘బ్రహ్మా ఆనందం’ మూవీలో మాత్రం తాతా మనవళ్లుగా నటించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కానీ గురువారం ఈ సినిమా టీజర్ను విడుదల చేసి, ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు.ధన్రాజ్ 'రామం రాఘవం'నటుడు ధన్రాజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘రామం రాఘవం’ మూవీ కూడా ఫిబ్రవరి 14నే రిలీజ్ కానుంది. తండ్రి పాత్రలో సముద్రఖని, తనయుడి పాత్రలో ధన్రాజ్ కనిపిస్తారు. తండ్రీకొడుకుల ఎమోషన్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీని గత ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. కొడుకు ప్రయోజకుడైతే చూడాలనుకునే తండ్రి, తనను తన తండ్రి సరిగా అర్థం చేసుకోవడం లేదనుకునే ఓ కొడుకు మధ్య సాగే భావోద్వేగ సంఘర్షణల నేపథ్యంలో ఈ ‘రామం రాఘవం’ మూవీ రానుంది.సందీప్ కిషన్ మజాకా..గత ఏడాది ఫిబ్రవరిలో ‘ఊరి పేరు భైరవకోన’ అనే ఓ హారర్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు సందీప్ కిషన్. ఈ సెంటిమెంట్ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారేమో. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మజాకా’ మూవీతో సందీప్ కిషన్ వస్తున్నారు. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా, రావు రమేశ్, ‘మన్మధుడు’ ఫేమ్ నటి అన్షు ప్రధాన ΄ాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘మజాకా’. ‘నేను లోకల్, ధమాకా’ చిత్రాల ఫేమ్ నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సందీప్ కిషన్, రావు రమేశ్ తండ్రీ కొడుకులుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేశ్ దండా నిర్మించిన ఈ ‘మజాకా’ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.శివరాత్రికి నితిన్..శివరాత్రికి ‘తమ్ముడు’గా థియేటర్స్లోకి రానున్నారు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘తమ్ముడు’ అనే మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు.ఇక సుధీర్బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘జటాధర’. శాస్త్రీయ, పౌరాణిక అంశాలతో ఈ మూవీకి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రేరణా అరోరా, సివిన్ నారం, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమా ఫస్ట్ లుక్స్ను రిలీజ్ చేశారు. ఆ సమయంలో ‘జటాధర’ మూవీని మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ‘తమ్ముడు, జటాధర’ రిలీజ్ డేట్స్పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.అలాగే ఫిబ్రవరి 28న థియేటర్స్లో ఆది పినిశెట్టి ‘శబ్దం’ చేయనున్నారు. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా మూవీ ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ల్స్, ఎం.ఎస్. భాస్కర్ ఇతర కీలక ΄ాత్రల్లో ఈ మూవీని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఫిబ్రవరి నెల ఆరంభానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యేందుకు మరికొన్ని సినిమాలు బరిలోకి రావొచ్చు లేదా ఆల్రెడీ ఫిబ్రవరి రిలీజ్కు రెడీ అయిన సినిమాల్లో విడుదల వాయిదా పడే అవకావం లేకపోలేదు. మరి... ఫిబ్రవరిలో ఫైనల్ రిలీజ్ బెర్త్లు ఖరారు చేసుకున్న సినిమాలేవో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. అనువాదాలు రెడీ..అజిత్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘విదాముయర్చి’. తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో అర్జున్ నటించారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ్ర΄÷డక్షన్స్ నిర్మించిన ఈ యాక్షన్ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది.ఇక అనిఖా సురేంద్రన్, పవిష్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని, ఫిబ్రవరిలోనే రిలీజ్ ఉండొచ్చనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.2022లో విడుదలైన ‘లవ్ టుడే’ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగు ప్రేక్షకులకు నటుడిగా దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరోగా నటించిన తమిళ చిత్రం ‘డ్రాగన్’ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. తమిళంలో లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా, కేఎస్ రవికుమార్, మిస్కిన్, వి.జె. సిద్ధు, హర్షద్ ఖాన్లు ఇతర లీడ్ రోల్స్లో నటించారు. తెలుగులోనూ ఈ మూవీని ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.– ముసిమి శివాంజనేయులు -
ప్రత్యేక ఫిబ్రవరి.. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా!
ఈ ఏడాది ఫిబ్రవరికో ప్రత్యేకత ఉంది. 2025 ఫిబ్రవరి (February) నెలలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని తెనాలి (Teanali) డిగ్రీ కాలేజి అధ్యాపకుడు ఎస్వీ శర్మ చెప్పారు. – తెనాలిమేక బండి.. ట్రెండ్ సెట్ చేసిందండీ! ఇప్పటి వరకూ మనం ఎండ్ల బండి, గుర్రం బండి చూశాం. కానీ, కోనసీమ జిల్లా మలికిపురం (Malikipuram) మండలం కేశనపల్లిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆవుల పాల ఉత్పత్తి, ఎండ్ల అందాల పోటీల్లో శనివారం మేక బండి అందరినీ ఆకర్షించింది. అంబాజీపేటకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ ట్రెండ్ సెట్ చేద్దామని ఎంతో శ్రమించి, రూ.7 వేలు వెచ్చించి ఈ బండిని రూపొందించారు. – మలికిపురంశునక వానర స్నేహం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో శునక వానర స్నేహం ఐదేళ్లుగా జాతి వైరాన్ని మరచి వర్ధిల్లుతోంది. ఐదేళ్ల క్రితం ఒక కొండముచ్చుల గుంపు ఈ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ శునకాలతో అలవాటు పడిన ఓ కొండముచ్చు తన గుంపును వదిలేసింది. గ్రామంలోని శునకాల గుంపుతోనే ఉంటోంది. – మలికిపురం'చుక్కలు' కాదు.. సమర సన్నాహాలుసముద్రం ఒడ్డున అంత జనం నిలబడి ఆకాశంలోని తారలను ఆసక్తిగా తిలకిస్తున్నట్టుగా ఉంది కదా ఈ చిత్రం. నిజానికి అవి నక్షత్రాలు కావు. యుద్ధ విమానాలు. విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్లో శనివారం నావికాదళం అద్భుత విన్యాసాలు ప్రదర్శించింది. వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు విశాఖ నగర వాసులు భారీగా బీచ్కు తరలివచ్చారు. దీంతో సముద్రతీరం జనసంద్రాన్ని తలపించింది. సాగర తీరంలో నేవీ విన్యాసాలను చూసి వైజాగ్ వాసులు అచ్చెరువొందారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు -
కియా కొత్త ఎస్యూవీ సిరోస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సిరోస్ను భారత్ వేదికగా అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. 2025 జనవరి 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర ఎక్స్షోరూంలో రూ.10–15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. 118 బీహెచ్పీ, 172 ఎన్ఎం టార్క్తో పెట్రోల్ వేరియంట్ 1.0 లీటర్ త్రీ–సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్తో తయారైంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ను ఎంచుకోవచ్చు. లెవెల్–2 అడాస్, 6 ఎయిర్బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. 30 అంగుళాల పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్ వంటి హంగులు జోడించారు. -
బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో జరుగుతుందని పార్టీలోని విశ్వసనీవర్గాలు వెల్లడించాయి. జేపీ నడ్డా నుంచి కొత్త అధ్యక్షుడు ఫిబ్రవరిలో పగ్గాలు చేపడతారని వెల్లడించాయి. సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జనవరి మధ్యకల్లా పూర్తవుతాయని, తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉటుందని వివరించాయి. 60 శాతం రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిందని, వీరి స్థానాల్లో .జనవరి మధ్యకల్లా కొత్త అధ్యక్షులు ఎన్నికవుతారని తెలిపాయి. కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే.. సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికావాలని బీజేపీ నిబంధనావళి చెబుతోంది. మంత్రివర్గంలో నుంచి ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అని ప్రశ్నించగా.. మంత్రి కావొచ్చు లేదా పార్టీలో ఒకరు కావొచ్చు.. అని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. కొత్త అధ్యక్షుడెవరనే విషయంలో ఇంకా ఏదీ ఖరారు కాలేదని వివరించాయి. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా 2020 ఫిబ్రవరిలో పార్టీ పగ్గాలు చేపట్టారు. సాధారణంగా అధ్యక్షుడికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. అయితే లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డాకు పొడిగింపునిచ్చిన విషయం తెలిసిందే. -
సునీత రాక ఫిబ్రవరిలోనే!
కేప్కనావెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడానికి బోయింగ్ స్టార్లైనర్ క్యాప్యూల్ సురక్షితం కాదని నాసా తేల్చిచెప్పింది. వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని శనివారం పేర్కొంది. ఆ రిస్క్ తీసుకోరాదని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్్కకు చెందిన స్పేస్ ఎక్స్ షటిల్ డ్రాగన్ క్యాప్సూల్లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది.పలు వైఫల్యాల తర్వాత బోయింగ్ స్టార్లైనర్ గత జూన్లో సునీత, విల్మోర్లను అంతరిక్ష కేంద్రానికి చేర్చడం తెలిసిందే. థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీకేజీ తదితర సమస్యల నడుమ అతికష్టమ్మీద∙స్టార్లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వారం కోసమని వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. ఫిబ్రవరిలో తిరుగు ప్రమాణమంటే ఎనిమిది నెలలకు పైగా ఐఎస్ఎస్లోనే గడపనున్నారు. స్టార్లైనర్కు మరమ్మతులు చేయడానికి బోయింగ్ ఇంజనీర్లతో కలిసి నాసా తీవ్రంగా శ్రమించింది. మూడునెలల ప్రయత్నాల అనంతరం.. మానవసహిత తిరుగు ప్రమాణానికి స్టార్లైనర్ సురక్షితం కాదని తేల్చేసింది. అది ఒకటి, రెండు వారాల్లో ఐఎస్ఎస్ నుంచి విడివడి ఆటోపైలెట్ మోడ్లో ఖాళీగా భూమికి తిరిగి రానుంది. తమ విమానాల భద్రతపై ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్న బోయింగ్కు స్టార్లైనర్ వైఫల్యం గట్టి ఎదురుదెబ్బే.స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలోనే ఉంది. మార్చి నుంచి ఐఎస్ఎస్లో ఉన్న నలుగురు వ్యోమగాములను తీసుకుని సెపె్టంబరు నెలాఖరులో భూమికి తిరిగివస్తుంది. అత్యవసరమైతే తప్ప అందులో మరో ఇద్దరిని ఇరికించడం సురక్షితం కాదని నాసా తెలిపింది. రష్యాకు చెందిన సోయుజ్ క్యాప్సూల్ కూడా ఐఎస్ఎస్లోనే ఉన్నా అందులోనూ ముగ్గురికే చోటుంది. ఏడాదిగా ఐఎస్ఎస్లో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు అందులో తిరిగొస్తారు. డ్రాగన్ సెపె్టంబరులో ఇద్దరు వ్యోమగాములతో ఐఎస్ఎఐస్కు వెళ్తుంది. తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను కూడా తీసుకొస్తుంది. -
ఎగుమతులు రికార్డ్
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు ఫిబ్రవరిలో రికార్డు సృష్టించాయి. 11 నెలల గరిష్ట స్థాయిలో 41.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023 ఏప్రిల్తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో ఎగుమతుల వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్, ఫార్మా ఎగుమతులు పెరగడం మొత్తం సానుకూల గణాంకాలకు దారితీసింది. ఇక ఇదే కాలంలో దిగుమతులు 12.16 శాతం పెరిగి 60.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 18.70 బిలియన్ డాలర్లు. ► పసిడి దిగుమతులు ఫిబ్రవరిలో గణనీయంగా 133.82% పెరిగి, 6.15 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 39% పెరిగి 44 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు ఫిబ్రవరిలో 15.9 శాతం పెరిగి 9.94 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు 55 శాతం ఎగసి 3 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ ఎగుమతుల (వస్తువులు, సేవలు) విలువ 0.83 శాతం వృద్ధితో 709.81 బిలియన్ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతుల విలువ 782.05 బిలియన్ డాలర్లు. ► 2021–22లో ఎగుమతుల విలువ 422 బిలియన్ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లు. 2022–23లో వస్తు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్ డాలర్లు. -
ఈక్విటీ ఎంఎఫ్లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల పెట్టుబడులు వచ్చాయని భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గడిచిన 23 ఏళ్లలో గరిష్టం. ఈ జనవరిలో వెల్లువెత్తిన రూ.21,721 కోట్లతో పోలిస్తే కూడా 23% అధికం. కొత్త ఫండ్ల ఆవిష్కరణ, థీమాటిక్/సెక్టోరియల్ ఫండ్లపై ఆసక్తి ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) పథకాల్లోకి కూడా ఫిబ్రవరి జీవితకాల గరిష్టం రూ.19,186 కోట్లకు చేరాయి. జనవరి ఇవి రూ.18,838 కోట్లుగా ఉన్నాయి. -
టాప్గేర్లో వాహనాల స్పీడు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరిలో 20,29,541 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 17,94,866 యూనిట్లు నమోదైంది. రిటైల్ విక్రయాలు గత నెలలో 13 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) గురువారం తెలిపింది. ‘భారత్లో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు రిటైల్లో 12 శాతం దూసుకెళ్లి 3,30,107 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 13 శాతం ఎగసి 14,39,523 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 5 శాతం అధికమై 88,367 యూనిట్లు, త్రీవీలర్లు ఏకంగా 24 శాతం పెరిగి 94,918 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం ఎగసి 76,626 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు 2024 ఫిబ్రవరి నెలలో గరిష్ట విక్రయాలను నమోదు చేశాయి’ అని ఎఫ్ఏడీఏ వివరించింది. ‘కొత్త ఉత్పత్తుల వ్యూహాత్మక పరిచయం, మెరుగైన వాహన లభ్యత ప్యాసింజర్ వాహనాల అమ్మకాల జోరుకు కారణమైంది. టూవీలర్ల విషయంలో గ్రామీణ మార్కెట్లు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, విస్తృత ఉత్పత్తి లభ్యత, వెల్లువెత్తిన ఆఫర్లు వృద్ధిని నడిపించాయి. -
తయారీ చక్రం స్పీడ్
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం ఫిబ్రవరిలో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.9కి ఎగసింది. ఇది ఐదు నెలలు గరిష్ట స్థాయి. జనవరిలో సూచీ 56.5గా నమోదయ్యింది. సమీక్షా నెల్లో సూచీకి దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ సహకారం లభించినట్లు ఈ మేరకు వెలువడిన ఒక నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ద్రవ్యోల్బణం 2023 జూలై కనిష్ట స్థాయికి తగ్గడంతో తయారీ సంస్థల మార్జిన్లు మెరుగుపడినట్లు సర్వే పేర్కొనడం గమనార్హం. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానెల్లో కొనుగోలు చేసే మేనేజర్లకు పంపిన ప్రశ్నలు, ప్రతిస్పందనలను ఎస్అండ్పీ గ్లోబల్ మదింపుచేసే హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐని ఆవిష్కరిస్తుంది. -
ఫిబ్రవరిలోనూ ‘రయ్ రయ్’
ముంబై: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు ఆదరణ పెరగడంతో ఫిబ్రవరిలోనూ రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. మొత్తం 3.73 లక్షల ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు జరిగాయి. తద్వారా పరిశ్రమ చరిత్రలో అత్యధిక పీవీలు అమ్ముడైన మూడో నెలగా ఫిబ్రవరి ఆవిర్భవించింది. ద్విచక్ర వాహనాలకూ డిమాండ్ కొనసాగింది. కాగా ట్రాక్టర్స్ అమ్మకాల వృద్ధిలో క్షీణత జరిగింది. -
ఫిబ్రవరి 29.. ప్రాధాన్యతలివే!
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 29 సంవత్సరంలో 60వ రోజు. సంవత్సరాంతానికి ఇంకా 305 రోజులు మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 29వ తేదీన దేశ, ప్రపంచ చరిత్రలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 29న పుట్టిన వారు ప్రతి సంవత్సరం తమ పుట్టినరోజును జరుపుకోలేరు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తమ పుట్టినరోజును జరుపుకోగలుగుతారు. ఫిబ్రవరిలో 29 రోజులు ఉండే సంవత్సరాన్ని లీపు సంవత్సరం అని అంటారు. ఈ రోజు (ఫిబ్రవరి 29) భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ జన్మించారు. ఇలా ఫిబ్రవరి 29న చోటు చేసుకున్న ప్రముఖ ఘట్టాలను ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 29.. కొన్ని ముఖ్యమైన ఘటనలు 1504: క్రిస్టోఫర్ కొలంబస్ తన పశ్చిమ యాత్రలో జమైకాలో చిక్కుకుపోయాడు. స్థానికులను చంద్రగ్రహణం పేరుతో భయపెట్టి, తన బృందానికి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. 1796: బ్రిటన్తో పాత వివాదాలకు స్వస్తి పలికిన జే ఒప్పందాన్ని నాటి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. 1856: రష్యా- టర్కియే మధ్య యుద్ధ విరమణ ప్రకటన 2000 - రష్యన్ దళాలు చెచ్న్యాలో 99 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. రువాండా ప్రధాని పియర్ సెలెస్టిన్ రివిగేమా తన పదవికి రాజీనామా చేశారు. 2004 - ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యాత్రికుడు మిచెల్ అలెగ్జాండర్ కల్లెరి అంతరిక్షంలో కాలు మోపారు. అయితే అతని స్పేస్ సూట్లోని లోపం కారణంగా స్టేషన్కి తిరిగి వచ్చాడు. 2004: ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ చలనచిత్రం అకాడమీ అవార్డ్స్లో 11 అవార్డులను గెలుచుకుంది. ఇది మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 2008 - ప్రసిద్ధ సాహిత్యవేత్త డాక్టర్ బచ్చన్ సింగ్కు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2008 - భారత సంతతికి చెందిన రిచా గంగోపాధ్యాయ 26వ అందాల పోటీలో మిస్ ఇండియా యూఎస్ఏ-2007 టైటిల్ను గెలుచుకుంది. ఫిబ్రవరి 29న పుట్టిన ప్రముఖులు 1932 – సిఎస్ శేషాద్రి (భారతదేశ ప్రముఖ గణిత శాస్త్రవేత్త) 1904 - రుక్మిణీ దేవి అరుండేల్ (ప్రముఖ భరతనాట్య నర్తకి) 1812 - టాస్మానియా నాయకుడు విల్సన్ కన్నుమూత. 1896 - మొరార్జీ దేశాయ్ (భారతదేశ మొదటి కాంగ్రెసేతర ప్రధాని) ఫిబ్రవరి 29న కన్నుమూసినవారు 1880 - సర్ జేమ్స్ విల్సన్ (టాస్మానియన్ రాజకీయ నేత) 1952 – కుష్వాహా కాంత్ (భారతదేశ ప్రసిద్ధ నవలా రచయిత) ఫిబ్రవరి 29 ముఖ్యమైన సందర్భాలు జాతీయ డీ అడిక్షన్ డే (మొరార్జీ దేశాయ్ పుట్టినరోజు) -
లీప్ ఇయర్ అంటే? ఫిబ్రవరిలో 29 రోజులు లేకపోతే? ఇంట్రస్టింగ్ సంగతులు
Leap year 2024: భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని అందరికీ తెలుసు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి 365 రోజులు, ఐదు గంటలు, నలభై ఎనిమిది నిమిషాలు,నలభై ఆరు సెకన్లు పడుతుంది. కాబట్టి, దాదాపు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఒక రోజు వస్తుంది. అలా 366 రోజులు ఉండే సంవత్సరాన్నే లీప్ ఇయర్ అంటాం. అలా 2024 ఏడాదికి 366 రోజులుంటాయి. లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది? ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది అనుకున్నాం కదా! లీప్ సంవత్సరాన్ని నాలుగుతో భాగిస్తే శేషం ఖచ్చితంగా సున్నా వస్తుంది. కానీ 100తో కూడా భాగింపబడితే మాత్రం అది లీప్ సంవత్సరం కాదు. ప్రతీ ఏడాదిలా కాకుండా లీప్ ఫిబ్రవరి నెలలో 29 రోజులుంటాయి నాలుగేళ్లకొకసారి లీప్ డే ఉంటుందా? ఇంట్రస్టింగ్ లెక్కలు అయితే, ప్రతి నాలుగు సంవత్సరాలకు లీప్ డే జోడించడదనీ, క్యాలెండర్ను 44 నిమిషాలు పొడిగింపు మాత్రమే ఉంటుందని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం నిపుణులు అంటున్నారు. కాలక్రమేణా, అంటే వేసవి నవంబర్లో వస్తుందని బర్మింగ్హామ్లోని అలబామా విశ్వవిద్యాలయ ఫిజిక్స్ బోధకుడు యూనాస్ ఖాన్ అన్నారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగేళ్లకొకసారి లీప్ ఇయర్ వస్తుందనీ, 1700, 1800, 1900 సంవత్సరాల్లో లీప్ డే లేదని తెలిపారు. 2000 సంవత్సరంలో ఒక లీప్ డే ఉంది, ఎందుకంటే ఇది 100, 400 రెండింటితో భాగించబడే సంవత్సరం. అలాగే తరువాతి 500 సంవత్సరాలలో 2100, 2200, 2300 , 2500లో కూడా లీప్ డే ఉండదు. మళ్లీ 2028, 2032, 2036లో లీప్ డేస్ ఉంటాయి. లీప్ డే ఆలోచన కాలక్రమేణా క్యాలెండర్ మార్పు అభివృద్ధి చెందిందని నిపుణులు అంటున్నారు. లీప్ డే కలపపోతే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు ఒక రోజు, అంటే 24 గంటల సమయం పడుతుంది. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాలు పడుతుంది. అంటే పావు రోజు సమయం కిందకి వస్తుంది. పావు రోజుని కలపడం కుదరదు కనుక నాలుగేళ్ల పాటు నాలుగు పావు రోజులు కలిపితే ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరిలో తక్కువ రోజులు ఉండటంతో అదనంగా వచ్చిన ఒక రోజుని ఫిబ్రవరిలో నెలలో పెట్టారు. ఈ లీప్ డే లేకపోతే, రైతులు సరైన సీజన్లో నాటడానికి ఇబ్బంది పడవచ్చంటారు ఖాన్. అంతేకాదు క్రిస్మస్ వేసవిలో వస్తుంది. అప్పుడు స్నో ఉండదూ.. క్రిస్మస్ ఫీలింగూ ఉండదు అంటారాయన. నాసా ప్రకారం ప్రతి క్యాలెండర్ సంవత్సరం 365 రోజుల కంటే దాదాపు ఆరు గంటలు ఎక్కువ. ఈ నేపథ్యంలో నాలుగేళ్లకొకసారి ఈ అదనపు రోజు కలపకపోతే రుతువుల్లో మార్పులొస్తాయని నాసా చెబుతోంది. వేసవి కాలం మధ్యలో శీతాకాలం వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగేళ్లకి ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చే విధంగా గ్రెగెరియన్ క్యాలెండర్ను రూపొందించారు. ఇది కూడా లెక్కల ఆధారంగా ఉంటుంది. ఈక్వినాక్స్ అయనాంతం వంటి వార్షిక సంఘటనలకు నెలలు కనెక్ట్ అయ్యేలా చూసుకోవడానికి ఈ అదనపు రోజు ఉపయోగిస్తారని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది. -
Valentine's Day: ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు..
ప్రేమ..అదో మధురానుభూతి. ఈ భావాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రతి ఒక్కరికీ ఎప్పుడో.. అప్పుడు ఎవరిపైనో మనసులాగేసే ఉంటుంది. ఆ సందర్భంలో మనసులోని వింత అనుభావాలను ఆస్వాధించే ఉంటారు.. ‘ప్రేమించడం కన్నా.. ప్రేమించబడడం అదృష్టం’ అన్నాడో సినీ కవి. అలా దాన్ని చివరి వరకు నిలుపుకుని భాగస్వామి సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నాయి. ప్రేమ..పెళ్లి పీటల వరకు చేరే క్రమంలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ఒక్కటయ్యారు. ప్రేమలో గెలిచి దంపతులుగా అన్యోన్య జీవనం గడుపుతున్న కొన్ని జంటల జీవితాలను ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ పాఠకుల ముందు ఆవిష్కరిస్తోంది. ప్రియురాలిని ప్రయోజకురాలిగా చేసి.. ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లికి చెందిన దేవరపల్లి ప్రవీణ్రెడ్డి మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడేనికి చెందిన బంధువుల అమ్మాయి భవానిరెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ఇద్దరిలో ప్రేమను చిగురింపజేసింది. అయితే, నిరుపేద కుటుంబానికి చెందిన భవానీరెడ్డి డిగ్రీ మధ్యలో చదువు మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ప్రవీణ్రెడ్డి ప్రియురాలిని పీజీ వరకు చదివించాడు. ఆ వెంటనే ఆమెకు వీఆర్వో ఉద్యోగం వచ్చింది. అయినా.. ఆమెను ప్రోత్సహించడంతో 2019లో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత 2021లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని కమిషనరేట్లో భవానీరెడ్డి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్రెడ్డి కూడా హైదరాబాద్లో ఎల్ఎల్బీ ప్రాక్టీస్ చేస్తున్నారు. తొమ్మిది నెలల బాబుతో సంతోషంగా జీవిస్తున్నారు. అడ్డంకులను అధిగమించి.. మోత్కూరు : వారిద్దరి మనసులు కలిశాయి. కులా లు అడ్డుగోడలుగా నిలిచినా ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు.. మోత్కూరుకు చెందిన ఎడ్ల శ్రీకాంత్, సముద్రాల సింధూజ దంపతులు. మోత్కూరులో ఫొటోగ్రాఫర్ వృత్తి నేర్చుకుంటున్న శ్రీకాంత్కు పట్టణంలోని సముద్రాల వెంకన్న కూతురు సంధ్యతో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమంలో ప్రేమగా మారింది. విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో అడ్డంకులు సృష్టించారు. సంధ్యను హైదరాబాద్లో బీటెక్ చదివిస్తూ అక్కడే సోదరుడి వద్ద ఉంచారు. శ్రీకాంత్ రెండేళ్ల ఎడబాటు తర్వాత సంధ్యను కలుసుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2018వ సంవత్సరం ఫిబ్రవరి 15న యాదగిరిగుట్టలో సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వ్యతిరేకించి సంధ్య తల్లిదండ్రులు శ్రీకాంత్పై కేసు పెట్టినా కోర్టు ప్రేమజంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈ దంపతులు మోత్కూరులో ఫొటో స్టూడియో, ఇంటర్నెట్ సెంటర్ నడుపుకుంటూ తమ ఆరేళ్ల కుమారుడు రెహాన్‡్ష, నాలుగేళ్ల కూతురు శ్రీహన్షతో ఆనందంగా జీవిస్తున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు రామగిరి (నల్లగొండ): మిర్యాలగూడకు చెందిన తుమ్ములూరి మురళీధర్ రెడ్డి హాలియాకు చెందిన పుష్పలత ఇద్దరు బంధువులు. అయినా మొదట్లో వీరికి పరిచయం లేదు. బంధువుల వివాహంలో పుష్పలత తొలిసారిగా మురళీధర్ రెడ్డిని చూసింది. ఆ తర్వాత మురళీధర్ రెడ్డి అడ్రస్ తెలుసుకొని ఉత్తరాలే రాసేది. అవి చూసి తను తెలిసీతెలియక రాస్తుందేమో అనుకునేవాడు. అలా చాలా సార్లు లెటర్లు రాసూ్తనే ఉండేది. అప్పుడు మురళీధర్రెడ్డికి అనిపించింది..ఆమె నన్ను నిజంగా ప్రేమిస్తుందని. అప్పటికీ వారి చదువు పూర్తి కాలేదు. ఇంట్లో వాళ్లకు విషయం తెలిసింది. కానీ వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మురళీధర్ రెడ్డి నల్లగొండలో కంప్యూటర్ హార్డ్వేర్గా స్థిరపడగా, పుష్పలత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు. అశుతోష్ రెడ్డి ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడగా, అమిత్ రెడ్డి డిఫెన్స్ అకాడమీలో పైలెట్గా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తే టీసీ ఇచ్చి పంపించారు.. భూదాన్పోచంపల్లి : తెలిసీ తెలియని వయస్సులో మైనర్ను ప్రేమించాడు. బాలికకు సైతం అతనంటే ఇష్టమే. కానీ తల్లిదండ్రులకు విషయం తెలిస్తే ఏమి అవుతుందోనని భయం. చివరకు ఈ విషయం తెలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించారు. అయినా పట్టువిడవకుండా అమ్మా యి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. చివరకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని 38 ఏళ్లుగా అన్యోన్య జీవనం సాగిస్తున్న భూదాన్ పోచంపల్లి జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి ప్రేమపెళ్లి గా«థ ఇది. భూదాన్పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన కోట మల్లారెడ్డి పోచంపల్లి జెడ్పీ హైసూ్కల్లో 9వ తరగతి చదువుతుండగా ఇదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సామల పుష్పలతను ప్రేమించాడు. ఈ విషయం పుష్పలత తల్లిదండ్రులు, ఇటు స్కూల్లో ఉపాధ్యాయులకు తెలిసి రచ్చ అయ్యింది. దాంతో మల్లారెడ్డికి ప్రధానోపాధ్యాయుడు టీసీ ఇచ్చి పంపించారు. పెళ్లి చేసుకోవడానికి ఆస్తులు, అంతస్తులు అడ్డు వచ్చి పుష్పలత తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఇంటర్ పూర్తి చేసిన నాలుగేళ్ల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి 1989 మే 10న పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పుష్పలత ప్రస్తుతం పోచంపల్లి మండల జెడ్పీటీసీగా ఉన్నారు. కాగా కోట మల్లారెడ్డి ప్రతి ఏటా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున తన సతీమణికి గిఫ్ట్ ఇస్తూ ప్రేమను చాటుతున్నారు. ఒకే ఇంట్లో మూడు ప్రేమ వివాహాలు కోదాడ: తల్లిదండ్రులు కులాలకు అతీతంగా ప్రేమ వివాహం చేసుకోగా.. వారి బాటలోనే వారి ఇద్దరు కుమారులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోదాడ మండల పరిధిలోని కొమరబండకు చెందిన దివ్యాంగుడు కందుల పాపయ్య అదే గ్రామానికి చెందిన వెంకట్రావమ్మను 1980వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెద్ద కుమారుడు కందుల మధు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ తన క్లాస్మేట్ విజయలక్షి్మని 2010లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పాపయ్య చిన్న కుమారుడు కందుల విక్రమ్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ 2014లో తన తోటి ఉద్యోగి ఉషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు ప్రేమ వివాహాలు చేసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖండాలు దాటి.. ఇంగ్లండ్లో చిగురించిన ప్రేమ కోదాడ: ఇండియాలో పుట్టిన వారు ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్కు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీలో కలిసిన మనస్సులు కులమతాలకు అతీతంగా వారిని ఒకటి చేశాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరి నచ్చడంతో వారిమధ్య చిగురించిన ప్రేమ పెళ్లిపీటల వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం వారు ఇద్దరు పిల్లలతో అక్కడే నివాసముంటున్నారు. ప్రేమించడం కన్నా ఆ ప్రేమను నిలుపుకోవడం ముఖ్యమంటున్నారు లంకెల బాలకృష్ణారెడ్డి– నీనశ్రీ దంపతులు. కోదాడకు చెందిన లంకెల బాలకృష్ణారెడ్డి 2007లో ఎంఎస్ చదవడానికి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కు వెళ్లాడు. ఎంఎస్ కోసం అదే యూనివర్సిటీలో హైదరాబాద్కు చెందిన నీనశ్రీ కూడా చేరారు. ఇద్దరు కులాలు వేరైనా అభిప్రాయాలు కలవడంతో వారి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఇండియాలో ఉన్న పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఇంగ్లండ్ వారసత్వాన్ని పొందారు. ప్రేమికుల రోజు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమించడం.. ప్రేమించబడడం అదృష్టమని దాన్ని చివరి వరకు నిలుపుకొని భాగస్వామి సంతోషాన్నే తమ సంతోషంగా ఇరువురు భావించినపుడే అ బంధం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని చెప్పారు. తొలి పరిచయంలోనే ఇష్టపడి.. హుజూర్నగర్ : రెండు భిన్న కులాలకు చెందిన యువతీ, యువకుడి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు వివాహానికి అంగీకరించక పోడంతో రాజకీయ నాయకుల సహాయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం వర్ధాపురం గ్రామానికి చెందిన బచ్చలకూరి బాబు, శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ప్రవీణ 26 ఏళ్ల క్రితం హుజూర్నగర్లో తొలి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించలేదు. దీంతో స్థానిక సీపీఐ నాయకుడు కేవీరాజు సహాయ సహకరాంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. పెద్దమ్మాయి అఖిల అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికై ఇటీవల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. కాగా చిన్న కూతురు అచ్యుత బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం వారి కుటుంబం హుజూర్నగర్లో నివాసం ఉంటోంది. -
వాలెంటైన్స్ డే వేళ... కొన్ని సరదా సంగతులు!
ఫిబ్రవరి 14... వాలెంటైన్స్ డే.. అంటే ప్రేమికుల రోజు. ఆ రోజున ప్రేమికులంతా ఆనంద డోలికల్లో మునిగితేలుతుంటారు. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు చాలామందికి తెలియవు. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. మొదటి వాలెంటైన్ డే వేడుక 15వ శతాబ్దంలో ఫ్రాన్స్లో జరిగింది. మొదటి అధికారిక వాలెంటైన్స్ డే పారిస్లో జరిగిందని చెబుతారు. ఫిబ్రవరినాటి మధ్యస్థ రోజుల్లో పక్షుల సంభోగంలో పాల్గొంటాయట. అందుకే ఇది శృంగారాన్ని జరుపుకోవడానికి తగిన సమయమని అంటుంటారు. వాలెంటైన్స్ డే నాడు ప్రతి సంవత్సరం 145 మిలియన్ గ్రీటింగ్ కార్డ్లను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక వాలెంటైన్స్ గ్రీటింగ్ కార్డులు పంచుకుంటారట. పెంపుడు జంతువుల యజమానులలో 25 శాతం మంది వాలెంటైన్స్ డే సందర్భంగా తమ పెంపుడు జంతువులకు వాలెంటైన్స్ డే బహుమతులు ఇస్తారు. అంటే వాలెంటైన్స్ డే.. కేవలం మనుషులకే కాదు కుక్కలు, పిల్లులు,పక్షులు, ఇతర పెంపుడు జంతువులకు సంబంధించినది కూడా. హృదయాకార మిఠాయిలను 1800లో తయారుచేశారట. బోస్టన్ ఫార్మసిస్ట్ ఆలివర్ చేజ్ వీటిని తయారుచేసే ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. ప్రతి సంవత్సరం ఎనిమిది బిలియన్ల హృదయ సంభాషణలు రూపొందిస్తారట. వివిధ రకాల క్యాండీలపై క్లాసిక్ రొమాంటిక్ పదబంధాలలో ‘బి మైన్’, ‘క్యూటీ పై’ ‘ఐ యామ్ యువర్స్’ అనే అక్షరాలను ముద్రిస్తారు. వాలెంటైన్స్ డే నాడుప్రేమికులు 58 మిలియన్ పౌండ్ల విలువైన చాక్లెట్లు, మిఠాయిలను కొనుగోలు చేస్తారట. వాలెంటైన్స్ డే మిఠాయి అమ్మకాలలో గుండె ఆకారంలో ఉండే చాక్లెట్ బాక్స్లు దాదాపు 10శాతం ఉంటాయి. 1850లో క్యాడ్బరీ కంపెనీ చాక్లెట్లతో కూడిన బాక్స్ రూపొందించింది. దశాబ్ధకాలం తరువాత మొదటి గుండె ఆకారపు చాక్లెట్ బాక్స్ను తయారయ్యింది. మొదటి వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డు జైలు నుండి పంపించారు. డ్యూక్ ఆఫ్ ఓర్లీన్స్ 15వ శతాబ్దం ప్రారంభంలో ఖైదీగా మారినప్పుడు మొదటి వాలెంటైన్ లేఖ రాశాడు. దానిలో ఒక కవిత రాసి, తన రెండవ భార్యకు పంపాడు. అయితే అతను జైలులో ఉన్నందున ఆ కవితకు ఆమె నుంచి వచ్చిన స్పందనను అతను చూడలేదు. అత్యధికంగా టీచర్లు వాలెంటైన్డే గ్రీటింగులను అందుకుంటారు. వాలెంటైన్స్ డే కోసం 250 మిలియన్ల గులాబీలను పండిస్తారు! రోమన్ ప్రేమ దేవత వీనస్కు ఇష్టమైనవి ఎరుపు రంగు గులాబీలు. ఇవి శృంగారాన్ని, ప్రేమను సూచిస్తాయి. -
‘ప్రామిస్ డే’ అంటే ఏమిటి? వాలంటైన్ వీక్లో దీని ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ‘ప్రామిస్ డే’గా జరుపుకుంటారు. ఇది ప్రేమికుల వారంలో ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి సంబంధానికి ఈ రోజు ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ప్రేమికులకు ‘ప్రామిస్ డే’ ఎంతో ప్రాధాన్యత కలిగినది. ‘ప్రామిస్ డే’నాడు ప్రేమికులు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. బలహీనపడ్డ బంధాలకు తిరిగి ప్రాణం పోయవచ్చు. అయితే మీరు మీ భాగస్వామికి ఎలాంటి ప్రామిస్ చేయలి? ఈ విషయంలో ఎంత నిజాయితీగా వ్యవహరించాలి? అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అనుబంధాల విషయంలో మీ ఇష్టాలు, అయిష్టాలను అవతలి వ్యక్తిపై ఎట్టిపరిస్థితుల్లోనూ రుద్దకూడదు. అలా కాదని మీకు నచ్చినట్లు వ్యవహరిస్తే క్రమంగా సంబంధం బలహీనపడుతుందని గుర్తించండి. మీరు నిజాయితీగా భాగస్వామిని ప్రేమిస్తే వారు ఎలా ఉన్నారో అలానే అంగీకరించండి. ఈ ప్రామిస్ డే నాడు హృదయ పూర్వకంగా భాగస్వామికి ఇటువంటి వాగ్దానం చేయండి. నాకోసం నువ్వు మారాలని ఏనాడూ కోరనని వాగ్దానం చేయండి. గతంలో ఏమి జరిగినా, వాటిని హృదయపూర్వకంగా అంగీకరించండి. మధురంగా మాట్లాడటం, బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమికులు పరస్పరం ప్రపోజ్ చేసుకుంటారు. ప్రతి కష్టమైన మలుపులో తోడుగా ఉంటానని చెప్పుకుంటారు. ఈ హామీని ప్రతీ ఒక్కరూ నిలబెట్టుకోలేరు. అయితే దీనిని నిలబెట్టుకోవడంలోనే అసలైన ప్రామిస్కు అర్థం ఉంటుంది. అబద్ధం చెప్పే అలవాటు ఉంటే ఎలాంటి సంబంధమైనా కొద్దికాలానికే తెగిపోతుంది. అబద్ధాలు వినడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే వాటిని చాలామంది అలవోకగా మాట్లాడేస్తుంటారు. ప్రామిస్ డే నాడు మీ భాగస్వామితో జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని వాగ్దానం చేయండి. -
ఫిబ్రవరి సినిమాల జోరు
-
వచ్చే నెలలో బ్యాంకుల బంద్! ఎన్ని రోజులంటే..
వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 18 రోజులు మాత్రమే పని చేస్తాయి. ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, సాధారణ సెలవులతోపాటు పండుగలు, ఇతర ప్రత్యేక దినోత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. వచ్చే నెలలో దాదాపు 11 బ్యాంకులకు సెలవులు ఉంటాయి కాబట్టి, ఆ నెలలో బ్యాంక్ బ్రాంచ్ని సందరర్శించే పని ఉన్నవారు సెలవుల జాబితాను ఓ సారి చూసుకోవడం మంచిది. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్లైన్ మోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించవచ్చు. ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఫిబ్రవరి 4 - ఆదివారం ఫిబ్రవరి 10- రెండవ శనివారం ఫిబ్రవరి 11- ఆదివారం ఫిబ్రవరి 14- బసంత్ పంచమి (త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో సెలవు) ఫిబ్రవరి 15- లూ-నాగి-ని (మణిపూర్లో సెలవు) ఫిబ్రవరి 18- ఆదివారం ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలో సెలవు) ఫిబ్రవరి 20- రాష్ట్ర దినోత్సవం (మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో సెలవు) ఫిబ్రవరి 24- రెండవ శనివారం ఫిబ్రవరి 25- ఆదివారం ఫిబ్రవరి 26- న్యోకుమ్ (అరుణాచల్ ప్రదేశ్లో సెలవు) -
ఇటు హీరోగా... అటు నిర్మాతగా...
నటుడిగా ఆమిర్ ఖాన్ మేకప్ వేసుకుని దాదాపు రెండేళ్లవుతోంది. ‘లాల్సింగ్ చద్దా’ (2022)లో చేసిన టైటిల్ రోల్, ‘సలామ్ వెంకీ’ (2022)లో చేసిన అతిథి పాత్ర తర్వాత ఆమిర్ ఖాన్ నటుడిగా మేకప్ వేసుకోలేదు. ఫైనల్గా ఫిబ్రవరిలో కెమెరా ముందుకు రానున్నారు. హీరోగా ‘సితారే జమీన్ పర్’ అంగీకరించారు ఆమిర్. ఫిబ్రవరి 2న ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఈ చిత్రంలోని పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆమిర్ ఖాన్. పలు లుక్స్ ట్రై చేసి, చివరికి ఒకటి ఖరారు చేశారు. అలాగే పలుమార్లు స్క్రిప్ట్ని చదివారు. అన్నీ సంతృప్తికరంగా అనిపించడంతో ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్లాన్ చేశారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 70 నుంచి 80 రోజులు డేట్స్ ఇచ్చారు ఆమిర్. ఈ చిత్రాన్ని క్రిస్మస్కి విడుదల చేయాలనుకుంటున్నారు. సన్నీ డియోల్ హీరోగా.. నిర్మాతగా ‘లాహోర్: 1947’ చిత్రాన్ని నిర్మించనున్నారు ఆమిర్ ఖాన్. రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా మాత్రమే కాదు.. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్లో (ఏకేపీ) మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆమిర్ భార్య కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్’. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. మరోటి ‘ప్రీతమ్ ప్యారే’. సంజయ్ శ్రీవాస్తవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమిర్ బుక్ న్యారేటర్గా అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రం కూడా ప్రథమార్ధంలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ చేపట్టడం విశేషం. ఇలా హీరోగా, ఏకేపీ నిర్మించే చిత్రాలతో ఆమిర్ బిజీ. -
Asmita Sood: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్ (ఫోటోలు)
-
రానున్నది పూర్తిస్థాయి బడ్జెటేనా? ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పారు?
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో సమర్పించే బడ్జెట్ .. ఓట్ ఆన్ అకౌంట్ మాత్రమేనని, అందులో ఎటువంటి అద్భుతమైన ప్రకటనలు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాంటి వాటి కోసం, ఎన్నికలయ్యాక ఏర్పడే కొత్త ప్రభుత్వం జూలైలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టే దాకా ఎదురు చూడాల్సిందేనని ఆమె తెలిపారు. సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎన్నికల ముంగిట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ .. కొత్త సర్కార్ కొలువు తీరే వరకు అయ్యే ప్రభుత్వ వ్యయాలకు ఆమోదం పొందేందుకు ఉద్దేశించి ఉంటుంది. దీన్ని ఓట్ ఆన్ అకౌంట్గా వ్యవహరిస్తారు. సాధారణంగా ఇలాంటి వాటిలో ప్రభుత్వం భారీ ప్రతిపాదనలేమీ చేయదు. మరోవైపు, అన్ని రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడంతో రెండో క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అత్యధికంగా నమోదైనట్లు రాజ్యసభలో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా భారత్ కొనసాగుతోందని ఆమె చెప్పారు. గత ఎనిమిదేళ్ల వ్యవధిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎకానమీల జాబితాలో భారత్ 10వ స్థానం నుంచి అయిదో స్థానానికి చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్ ఇండియా, పీఎల్ఐ (ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల స్కీము) వంటి తోడ్పాటు చర్యలతో తయారీ రంగం కూడా ఎకానమీ వృద్ధిలో గణనీయంగా పాలుపంచుకుంటోందని మంత్రి చెప్పారు. నిరుద్యోగిత రేటు 2017–18లో దాదాపు 18 శాతంగా ఉండగా ప్రస్తుతం 10 శాతానికి దిగి వచ్చిందన్నారు. -
ఫిబ్రవరి 8న పాకిస్తాన్ ఎన్నికలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన సాధారణ ఎన్నికలు జరుపుతామని అధ్యక్షుడు అరిఫ్ అల్వీ గురువారం ప్రకటించారు. దేశంలో ఆర్థిక అస్థిరత తీవ్రరూపం దాలి్చన ఈ సమయంలో అధ్యక్షుడితో చర్చించి, ఎన్నికల తేదీని ఖరారు చేయాలంటూ అంతకుముందు ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్(ఈసీపీ) చీఫ్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా, కమిషన్లోని నలుగురు సభ్యులు, అటార్నీ జనరల్ ఉస్మాన్ అవాన్ కలిసి అధ్యక్షుడు అరిఫ్ అల్వీని కలిశారు. ఎన్నికల నిర్వహణపై చర్చలు జరిపారు. అనంతరం ఎన్నికల తేదీని 2024 ఫిబ్రవరి 8గా నిర్ణయించినట్లు అధ్యక్షుడు ప్రకటించారు. -
బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?
గత ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ బృందం ‘సర్వే’ కోసం బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో పరిశీలనలు మాత్రమే జరుగుతున్నాయని, సోదాలు చేయడం లేదని (సీబీడీటీ )సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీనియర్ అధికారి ఒకరు నాడు స్పష్టం చేశారు. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలను తనిఖీ చేసేందుకు పన్ను అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో మరో అధికారి తెలిపారు. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు ఈ చర్యలు చేపట్టడం విశేషం. అలాగే భారత ప్రభుత్వం బీబీసీ వలసవాద మనస్తత్వం కలిగి ఉందని ఆరోపించింది. యజమాని ఎవరు? బీబీసీ 1922, అక్టోబరు 18 న ఒక ప్రైవేట్ కంపెనీగా ఆవిర్భవించింది. అప్పట్లో దీనిని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా పిలిచేవారు. ప్రారంభంలో ఈ వ్యాపారంలో తనను తాను నిరూపించుకోవడానికి బీబీసీ ఎన్నో కష్టాలు పడింది. 1926 సార్వత్రిక సమ్మె సమయంలో విస్తృతమైన కవరేజ్ అందించి, బీబీసీ బ్రిటిష్ ప్రజల ఆదరణను చూరగొంది. అదే సంవత్సరంలో, పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ద్వారా బీబీసీ ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కార్పొరేషన్గా మార్పుచెందింది. దీనితో కంపెనీ.. పార్లమెంటుకు జవాబుదారీతనం కలిగివుండాలని నిర్ణయించారు. కానీ బీబీసీ దాని పని తీరు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. బీబీసీని జాన్ రీత్ (1889–1971) స్థాపించారు. 1922లో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా సంస్థను స్థాపించినప్పుడు దాని మొదటి జనరల్ మేనేజర్గా, 1927లో పబ్లిక్ కార్పొరేషన్గా మారినప్పుడు దాని మొదటి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ ప్రచార సాధనాలను ఎదుర్కొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మరో సమాచార మంత్రిత్వ శాఖను సృష్టించింది. దీనికి జాన్ రీత్ను సమాచార మంత్రిగా నియమించింది. ఐరోపాలో హిట్లర్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బ్రిటిష్ ప్రజలను మానసికంగా యుద్ధానికి సిద్ధం చేయడం అతని పనిగా ఉండేది. డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? బీబీసికి వచ్చే నిధులలో ఎక్కువ భాగం వార్షిక టెలివిజన్ ఫీజు ద్వారా వస్తుంది. ఇదే కాకుండా, బ్రిటన్ పార్లమెంట్ కూడా బీబీసీకి గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరుస్తుంది. బీబీసీకి ఇతర ఆదాయ వనరులు బీబీసీ స్టూడియోస్, బీబీసీ స్టూడియోవర్క్స్. భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? బీబీసీ భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1940 మే 11న ప్రారంభమైంది. విశేషమేమిటంటే, ఈ తేదీన విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో బీబీసీని ప్రారంభించడం వెనక ఉద్దేశ్యం భారత ఉపఖండంలోని సైనికులకు వార్తలను అందించడమే. బీబీసీ హిందీ డాట్ కామ్ 2001లో ప్రారంభమమైంది. ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి? -
ఎనిమిది పరిశ్రమల గ్రూప్.. అక్కడక్కడే!
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు ఫిబ్రవరిలో దాదాపు నిశ్చలంగా 6 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.9 శాతం. 2023 జనవరిలో వృద్ధి రేటు భారీగా 8.9 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో క్రూడ్ ఆయిల్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లో (బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్) ఉత్పత్తి పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మాత్రం 4.9 క్షీణించింది (2022 ఫిబ్రవరితో పోల్చి). కాగా, మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య గ్రూప్ వృద్ధి రేటు 7.8 శాతంకాగా, 2021–22 ఇదే కాలంలో ఈ రేటు 11.1 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ రెండవ వారం ప్రారంభంలో ఫిబ్రవరి ఐఐపీ గణాంకాలు వెలువడతాయి. ఎకానమీ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో మౌలిక రంగం పురోగతి రానున్న కాలంలో కొంత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. కీలక రంగాలకు ప్యాకేజీ అవసరమని కూడా సూచిస్తున్నారు. మున్ముందు ఈ రంగాల గణాంకాలపై ‘బేస్ ఎఫెక్ట్’ ప్రభావం ప్రధానంగా ఉంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. -
డెట్ ఫండ్స్లో కొనసాగుతున్న అమ్మకాలు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ వరుసగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరిలో డెట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.13,815 కోట్ల మేర నికరంగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డెట్ ఫండ్స్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు తరలిపోవడం వరుసగా మూడో నెలలోనూ చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో రూ.10,316 కోట్లు, గత డిసెంబర్లో రూ.21,947 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేష్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022 నవంబర్లో డెట్ ఫండ్స్లోకి రూ.3,668 కోట్ల మేర వచ్చాయి. డెట్లో మొత్తం 16 విభాగాలు ఉంటే, తొమ్మిది విభాగాల్లోని పథకాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిగిలిన విభాగాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. విభాగాల వారీగా.. ► లిక్విడ్ ఫండ్స్ నుంచి అత్యధికంగా రూ.11,304 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.2,430 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.1,904 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ నుంచి రూ.1,665 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ► ఓవర్నైట్ ఫండ్స్లోకి అత్యధికంగా రూ.2,946 కోట్ల అమ్మకాలు చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్లో రూ.662 కోట్లు, డైనమిక్ బాండ్ ఫండ్స్లోకి రూ.502 కోట్లు, గిల్ట్ ఫండ్స్లోకి రూ.451 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► డెట్ విభాగంలో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్నైట్ ఫండ్ విభాగాలు 50 శాతానికి పైగా ఆస్తులు కలిగి ఉన్నాయి. -
ఆభరణాల ఎగుమతుల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2023 ఫిబ్రవరిలో రూ.28,833 కోట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధి అని జెమ్, జువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) తెలిపింది. చైనా, మధ్యప్రాచ్య మార్కెట్ల రికవరీ ఇందుకు కారణమని వెల్లడించింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో కట్, పాలిష్డ్ డైమండ్ ఎగుమతులు 32 శాతం ఎగసి రూ.19,582 కోట్లుగా ఉంది. బంగారు ఆభరణాలు 30 శాతం అధికమై రూ.5,829 కోట్లకు చేరుకున్నాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం తరువాత యూఏఈకి బంగారు ఆభరణాల ఎగుమతులు 45 శాతం దూసుకెళ్లాయి. స్వల్ప క్షీణత తరువాత తిరిగి మధ్యప్య్రాచ్య మార్కెట్ పుంజుకుంటోందని అనడానికి ఇదే నిదర్శనం’ అని వివరించింది. కలిసి వస్తున్న చైనా మార్కెట్.. : ‘ప్రధానంగా యూఎస్కు ఎగుమతయ్యే రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాల విక్రయాలు 2023 ఫిబ్రవరిలో 20 శాతం అధికం అయ్యాయి. కొన్ని నెలలుగా తిరోగమన వృద్ధి నమోదు చేసిన హాంగ్కాంగ్ ఇప్పుడు తిరిగి గాడిలో పడింది. చైనా మారెŠక్ట్ పుంజుకోవడం గొప్ప మెరుగుదలకు దారితీయవచ్చు. చైనాలో సగటు పొదుపు రేటు దాదాపు 40 శాతంగా ఉంది. పొదుపు విలువ లక్షల కోట్ల రూపాయలకు సమానం. సుదీర్ఘ లాక్డౌన్ వ్యవధి తర్వాత ఇతర ప్రపంచ మార్కెట్లలో చూసిన విధంగా ’ప్రతీకార కొనుగోలు’కు అవకాశం ఉంది. ఫలితంగా వజ్రాలు, వజ్రాభరణాల పరిశ్రమలో వచ్చే ఆరు నెలల్లో పెద్ద ఎత్తున వృద్ధి నమోదయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నాం’ అని కౌన్సిల్ అభిప్రాయపడింది. -
భారత్ ‘సేవలు’ భేష్...
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఫిబ్రవరిలో చక్కటి పనితీరు ప్రదర్శించింది. దేశ ఎకానమీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 59.4 వద్ద ముగిసింది. గత 12 ఏళ్లలో ఈ స్థాయి పురోగతి ఇదే తొలిసారి. దేశంలో డిమాండ్ పరిస్థితులు, కొత్త వ్యాపారాలు ఊపందుకోవడం వంటి అంశాలు దీనికి కారణమని గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సూచీ జనవరిలో 57.2 వద్ద ఉంది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన చూస్తే, సేవల రంగం వరుసగా 19 నెలల నుంచి వృద్ధిలోనే కొనసాగుతోంది. కాగా, ఉపాధి అవకాశాల పరిస్థితులు మాత్రం ఇంకా మందగమనంలోనే ఉన్నట్లు డీ లిమా తెలిపారు. సేవలు–తయారీ కలిపినా... పురోగతి! తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ కూడా ఫిబ్రవరిలో పటిష్ట స్థాయిలో 59 వద్దకు చేరింది. జనవరిలో సూచీ 57.5 వద్ద ఉంది. ఇది 11 ఏళ్ల గరిష్టం. ఒక్క తయారీ రంగాన్ని చూస్తే మాత్రం సూచీ ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది. -
పెట్రోల్, డీజిల్ విక్రయాలు మళ్లీ పైకి
న్యూఢిల్లీ: శీతాకాలం ప్రభావం తొలగిపోవడంతో ఫిబ్రవరిలో మళ్లీ పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పుంజుకున్నాయి. రెండంకెల వృద్ధిని చూశాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల గణాంకాలను పరిశీలిస్తే.. ఫిబ్రవరిలో పెట్రోల్ అమ్మకాలు 12 శాతం పెరిగి 2.57 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో పెట్రోల్ అమ్మకాలు 2.29 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. 2021 ఫిబ్రవరి విక్రయాలు 1.57 మిలియన్ టన్నులతో పోల్చినా వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే.. జనవరి నుంచి ఫిబ్రవరికి పెట్రోల్ అమ్మకాలు 13.5 శాతం పెరిగాయి. ఇక డీజిల్ విక్రయాలు గత నెలలో 6.52 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో విక్రయాలతో పోలిస్తే 13 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరి నెల విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 9.2 శాతం వృద్ధి నమోదైంది. పర్వత ప్రాంతాల్లో మంచు వల్ల జనవరిలో డీజిల్ అమ్మకాలు 8.6 శాతం తగ్గడం గమనార్హం. ట్రక్కులు తిరిగి పూర్తి స్థాయిలో రోడ్లపైకి రావడం, రబీ సాగు సీజన్ రద్దీగా మారడంతో ఇక ముందూ డీజిల్ అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విమానయాన సేవలు పెరగడం ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) అమ్మకాలను పెంచింది. గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 2023 ఫిబ్రవరిలో ఏటీఎఫ్ విక్రయాలు 41 శాతం పెరిగి 5,74,200 టన్నులుగా ఉన్నాయి. ఎల్పీజీ అమ్మకాలు 2.43 శాతం పెరిగి 2.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
ఫిబ్రవరిసేల్స్: మారుతి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతి సుజుకి ఇండియా తన కస్టమర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే క్రమంలో పలు మోడళ్ల కార్లపై తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో బాలెనో, సియాజ్ , ఇగ్నిస్ వంటి మోడల్ కార్లపై నేరుగా నగదు తగ్గింపులతో పాటు, కార్పొరేట్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందించింది. (ఇదీ చదవండి: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్పై అదిరిపోయే ఆఫర్లు) మారుతీ సుజుకి సియాజ్ హై-ఎండ్ సెడాన్. మారుతి సుజుకి సియాజ్ రూ.40,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ , రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు. 105 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రధాన ఫీచర్లు (Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ) మారుతీ సుజుకి బాలెనో హై-ఎండ్ హ్యాచ్బ్యాక్ మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ మోడల్ కొనుగోలుపై రూ. 15,000 వరకు ఆదా చేయవచ్చు. బాలెనోలోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 90 హార్స్పవర్ను ఉత్పత్తి చేస్తుంది మారుతీ సుజుకి ఇగ్నిస్ పలు చిన్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఇగ్నిస్ పై గరిష్టంగా రూ.50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ.25వేల వరకు క్యాష్ డిస్కౌంట్. మారుతి సుజుకి ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో 83 హార్స్పవర్ను ఉత్పత్తి చేస్తుంది. -
ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు పది రోజులు సెలవు..లిస్ట్ ఇదిగో
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2023 ఫిబ్రవరి బ్యాంకు సెలవుల జాబితా ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే నెలలో బ్యాంకులకు పది రోజులు సెలవులున్నాయి. వీటిల్లో శని, ఆదివారాలు కలిపి ఉన్నాయి. అయితే బ్యాంకులకు పది రోజులపాటు సెలవులునప్పటికీ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి. ఆన్లైన్ సేవలను కస్టమర్లకు వినియోగించుకోవచ్చు.ఆర్బీఐ జారీ చేసిన ఫిబ్రవరి సెలవుల జాబితా దేశవ్యాప్తంగా ఒకేలా ఉండదు. రాష్ట్రాల్ని బట్టి మారుతూ ఉంటుందనేది గమనించాలి. ఇందులో పబ్లిక్ హాలిడేస్తో పాటు ప్రాంతీయ హాలిడేస్ కూడా ఉన్నాయి. 2023, ఫిబ్రవరి లో బ్యాంకుల సెలవుల జాబితా ఫిబ్రవరి 5 - ఆదివారం ఫిబ్రవరి 11- రెండో శనివారం ఫిబ్రవరి 12 - ఆదివారం ఫిబ్రవరి 15 - ఇంఫాల్లో సెలవు ఫిబ్రవరి 18 -ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, బేలాపుర్, భోపాల్, భువనేశ్వర్, రాయ్పూర్, రాంచీ, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, తిరువనంతపురం, కొచ్చి, లక్నో, నాగ్పూర్, షిమ్లా, శ్రీనగర్లో మహా శివరాత్రి సెలవు ఫిబ్రవరి 19 - ఆదివారం ఫిబ్రవరి 20 - మిజోరాంలో సెలవు ఫిబ్రవరి21-సిక్కింలో లోసార్ సెలవు ఫిబ్రవరి 25 -నాలుగో శనివారం -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...!
ఎప్పుడో 50 వేల ఏళ్ల క్రితం కన్పించిన ఓ తోకచుక్క త్వరలో మళ్లీ మనల్ని పలకరించనుంది. ఫిబ్రవరి 1న భూమికి అత్యంత సమీపంగా, అంటే 2.6 కోట్ల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది. జనవరి 26 నుంచి వారం పాటు మామూలు కంటికి కూడా కన్పిస్తుందని నాసా చెబుతోంది. అది ప్రస్తుతం మనకు 11.7 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. సి2022 ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్కను నాసా సైంటిస్టులు కెమెరాలో బంధించారు. అన్నట్టూ, భూమి మాదిరిగానే ఇది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుందట. 50 వేల ఏళ్లకు ఒక పరిభ్రమణం పూర్తి చేస్తుందట! 2020 జూలైలోనూ ఇలాగే ఒక తోకచుక్క మనకు కన్పించేంత సమీపంగా వచ్చింది. -
హైదరాబాద్కు రానున్న బిల్ గేట్స్, సత్య నాదెళ్ల
సాక్షి, హైదరాబాద్ః వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా 20వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించేందు కు కేంద్ర ఎంఎస్ఎంఈ విభాగంతో బయో ఏషి యా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏషియాలో అతిపెద్దదైన లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ వేదికగా బయో ఏషియా సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. ఆ సదస్సులో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయిస్తారు. ఇందులో వైద్య ఉపకరణాలు, ఫార్మా స్యూటికల్స్తో పాటు అనుబంధ పరిశ్రమలకు చెందిన 60 ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్లో జరుగుతున్న ఈ సదస్సులో హెల్త్కేర్, లైఫ్సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలతో పాటు స్థానిక సంస్థలు భాగస్వాములుగా ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సదస్సుకు అనేక మంది నోబుల్ బహుమతి విజేతలతో పాటు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోవార్టిస్ సీఈఓ వాస్ నర్సింహన్, మెడ్ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా వంటి ప్రముఖులు హాజరవుతున్నట్లు బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ వెల్లడించారు. (క్లిక్ చేయండి: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ) -
గోల్డ్ ఫండ్స్కు అమ్మకాల ఒత్తిడి
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఈక్విటీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు ఫిబ్రవరిలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. రూ.248 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. బంగారం ఈటీఎఫ్ల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం అంతకుముందు నెలలోనూ నమోదైంది. జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి మరింత మొత్తంలో రూ.452 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అంతకుముందు కాలం లో ప్రతి నెలా నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే ఈ విష యం తెలుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చోటుచేసుకున్నా కానీ.. ఈ పథకాల నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.17,839 కోట్లుగా ఉంటే.. ఫిబ్రవరి ఆఖరికి రూ.18,727 కోట్లకు పెరిగింది. ఫోలియోల సంఖ్య కూడా ఫిబ్రవరిలో 3.09 లక్షలు పెరిగి 37.74 లక్షలకు చేరింది. 2021 మొత్తం మీద గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.4,814 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. అంతకుముందు 2020లో వచ్చినమొత్తం రూ.6,657 కోట్లుగా ఉంది. ఇతర అవకాశాల కోసం.. బంగారాన్ని పెట్టుబడుల వైవిధ్య సాధనంగా చూసే ధోరణి పెరిగినట్టు, మార్కెట్ అస్థిరతలకు హెడ్జ్ సాధనంగా పరిగణిస్తున్నట్టు ఎల్ఎక్స్ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతి రాతి గుప్తా తెలిపారు. ప్రస్తుత పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలిస్తే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఈక్విటీకి (పోర్ట్ఫోలియో రీబ్యాలన్సింగ్) మళ్లించడం, ఈక్విటీ మార్కెట్లలో కరెక్షన్ను అవకాశంగా మలుచుకోవడం కారణమై ఉంటుందని గుప్తా పేర్కొన్నారు. అలాగే, బంగారం ధరలు పెరగడంతో ట్రేడర్లు తమ లాభాలను బుక్ చేసుకుని ఉంటారని ఆమె చెప్పారు. -
డబ్బే డబ్బు!! స్టార్టప్లోకి పెట్టుబడుల వరద!
ముంబై: ఇటీవల దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి భారీగా తరలి వస్తున్న ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులు ఫిబ్రవరిలో మరింత జోరందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన ఫిబ్రవరిలో రెట్టింపై 5.8 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది(2021) ఫిబ్రవరిలో ఇవి 2.5 బిలియన్ డాలర్లు మాత్రమే. ఐవీసీఏ–ఈవై రూపొందించిన నెలవారీ గణాంకాలివి. వీటి ప్రకారం ఫిబ్రవరిలో డీల్ పరిమాణం 33 శాతం ఎగసి 117కు చేరాయి. అయితే 2022 జనవరిలో నమోదైన 122 డీల్స్తో పోలిస్తే స్వల్పంగా క్షీణించాయి. కాగా.. పీఈ, వీసీ పెట్టుబడుల్లో 88 శాతం రియల్టీ, ఇన్ఫ్రా రంగాలను మినహాయించి ప్యూర్ప్లే ఇన్వెస్ట్మెంట్స్ కావడం గమనార్హం! గతేడాది ఫిబ్రవరిలో ఈ వాటా 79 శాతమే. 17 భారీ డీల్స్ గత నెలలో మొత్తం 4.4 బిలియన్ డాలర్ల విలువైన 17 భారీ డీల్స్ జరిగాయి. నెలవారీగా చూస్తే ఇవి 24 శాతం అధికం. మొత్తం పెట్టుబడుల్లో దాదాపు సగం అంటే 2.5 బిలియన్ డాలర్లు స్టార్టప్లలోకే ప్రవహించడం విశేషం! కాగా.. 85 డీల్స్ ద్వారా అత్యధిక పెట్టుబడులను స్టార్టప్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఏడు డీల్స్ ద్వారా 1.5 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు నమోదయ్యాయి. మరోపక్క 1.4 బిలియన్ డాలర్ల విలువైన 10 విక్రయ డీల్స్ సైతం జరిగాయి. వీటిలో మూడు డీల్స్ 1.2 బిలియన్ డాలర్ల విలువైన సెకండరీ విక్రయాలు కావడం గమనార్హం! చదవండి: భారత్లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం, క్యూ కడుతున్న సరిహద్దు దేశాలు! -
దేశ వాణిజ్యలోటు రూ.20.88 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే వాణిజ్య లోటు భారీగా పెరిగింది. 2022 ఫిబ్రవరిలో 20.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో వాణిజ్యలోటు 13.12 బిలియన్ డాలర్లు. క్రూడ్ దిగుమతుల బిల్లు భారం వల్ల వాణిజ్యలోటు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ముఖ్య గణాంకాలు పరిశీలిస్తే, ఫిబ్రవరిలో దేశ ఎగుమతులు 25.1 శాతం పెరిగి 34.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు 36 శాతం పెరిగి 55.45 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 20.88 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాల ప్రకారం, మొత్తం దిగుమతుల్లో పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఏకంగా 69 శాతం పెరిగి (2021 ఇదే నెలతో పోల్చి) 15.28 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. విభాగాల వారీగా... - ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు 9.65 శాతం తగ్గి 4.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. - ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29.53 శాతం పెరిగి 6.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. - ఇక ఇంజనీరింగ్ గూడ్స్ (32 శాతం), పెట్రోలియం (88.14 శాతం), రసాయనాల (25.38 శాతం) విభాగాలు మంచి పురోగతితో విలువల్లో వరుసగా 9.32 బిలియన్ డాలర్లు, 4.64 బిలియన్ డాలర్లు, 2.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. - ఫార్మా ఎగుమతుల విలువ 1.78 శాతం పడిపోయి 1.96 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం నెరవేరినా... ఇక ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 46.09 శాతం పెరిగి 374.81 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు ఇదే కాలంలో 59.33 శాతం పెరిగి 550.56 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో వాణిజ్యలోటు 2020–21 ఇదే కాలంతో పోలి్చచూస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో 88.99 బిలియన్ డాలర్ల నుంచి 175.75 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని దేశం సాధించే అవకాశాలు ఉండడం కొంతసానుకూల అంశమైనా, క్రూడ్ ధరల వల్ల వాణిజ్యలోటు తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. -
వంట నూనెల దిగుమతులు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు ఫిబ్రవరిలో 9,83,608 టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2021 ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనె భారత్కు సరఫరా అయింది. ప్రధానంగా శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఈ స్థాయిలో వృద్ధి నమోదైందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో శుద్ది చేసిన పామాయిల్ 6,000 నుంచి ఏకంగా 3,02,928 టన్నులకు చేరింది. వంటలకు కాకుండా ఇతర ఉత్పత్తుల తయారీలో వాడే నూనెలు 42,039 నుంచి 36,389 టన్నులకు వచ్చి చేరింది. ఇతర ఉత్పత్తులకు వినియోగించే నూనెలతో కలిపి మొత్తం నూనెల దిగుమతులు 8,38,607 నుంచి 10,19,997 టన్నులకు ఎగశాయి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య అన్ని రకాల నూనెలు 7 శాతం అధికమై 46,94,760 టన్నులుగా ఉంది. శుద్ధి చేసిన పామోలిన్ 21,601 నుంచి 5,19,450 టన్నులకు చేరాయి. ముడి పామాయిల్ 24,89,105 నుంచి 15,62,639 టన్నులకు దిగొచ్చింది. ప్రతి నెల సగటున 1.75–2 లక్షల టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ విదేశాల నుంచి భారత్కు వస్తోంది. యుద్ధం కొనసాగితే.. ‘రష్యా–ఉక్రెయిన్ వివాదం సన్ఫ్లవర్ (పొద్దు తిరుగుడు) నూనె సరఫరాకు అంతరాయం కలిగించింది. ఫిబ్రవరి 2022లో దాదాపు 1,52,000 టన్నులు భారతదేశానికి దిగుమతైంది. అదే పరిమాణం ఈ నెలలోనూ వచ్చే అవకాశం ఉంది. యుద్ధానికి ముందు బయలుదేరిన ఓడలు ప్రస్తుత నెలలో భారతీయ ఓడరేవులకు చేరుకుంటాయి. యుద్ధం కొనసాగితే తరువాతి నెలల్లో సన్ఫ్లవర్ ఆయిల్ రవాణా తగ్గుతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ లభ్యత స్వల్పంగా తగ్గినప్పటికీ దేశీయంగా సోయాబీన్, ఆవనూనెల అధిక లభ్యత ఉపశమనం కలిగిస్తుంది. దేశీయ విక్రయాల పరిమితిని 20 నుంచి 30 శాతానికి పెంచుతూ మార్చి 9న ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇండోనేషియా ఎగుమతి పరిమాణాన్ని మరింత తగ్గిస్తుంది. అలాగే ప్రపంచ ఎగుమతి సరఫరాలను కఠినతరం చేస్తుంది. ఈ అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరల్లో గత కొన్ని రోజులుగా అధిక అస్థిరతకు దారితీస్తున్నాయి. పామాయిల్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి భారత్కు వస్తోంది. ముడి సోయాబీన్ నూనె అర్జెంటీనా, బ్రెజిల్ నుండి దిగుమతి అవుతోంది. ముడి సన్ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా నుండి భారత్కు సరఫరా అవుతోంది’ అని అసోసియేషన్ తెలిపింది. -
ఫిబ్రవరిలో తగ్గిన యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: యూపీఐ ప్లాట్ఫామ్పై రిటైల్ చెల్లింపుల లావాదేవీలు ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి రూ.8.27 లక్షల కోట్ల మేర నమోదయ్యాయి. సంఖ్యా పరంగా 452 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతక్రితం నెల 2022 జనవరిలో 461 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, వీటి విలువ రూ.8.32 లక్షల కోట్ల మేర ఉంది. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఆధారిత లావాదేవీలు 24.36 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.3,613 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను ఎన్పీసీఐ విడుదల చేసింది. జనవరిలో ఫాస్టాగ్ టోల్ వసూళ్ల లావాదేవీలు 23.10 కోట్లుగాను, వీటి విలువ రూ.3,604 కోట్లుగా ఉంది. ఐఎంపీఎస్ లావాదేవీల విలువ జనవరిలో రూ.3.87 లక్షల కోట్లు. ఫిబ్రవరిలో రూ.3.84 లక్షల కోట్లకు తగ్గింది. జనవరిలో 31 రోజులు కాగా, ఫిబ్రవరిలో 28 రోజులే కావడం గమనార్హం. (చదవండి: వాహనదారులకు అలర్ట్.. ఇక ఆ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి!) -
పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల భారం
న్యూఢిల్లీ: భారత పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల విలువ ఫిబ్రవరిలో భారీగా 67 శాతం పెరిగింది. విలువలో 15 బిలియన్ డాలర్లకు చేరింది. సమీప భవిష్యత్లో భారత్లో ధరల పెరుగుదలకు సంకేతంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన ఫిబ్రవరి ఎగుమతులు–దిగుమతుల గణాంకాల్లో ఈ అంశం కీలకాంశంగా ఉంది. గణాంకాల్లో కీలకాంశాలు... ► ఫిబ్రవరిలో మొత్తం ఎగుమతుల విలువ 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక దిగుమతుల విలువ 35 శాతం పెరిగి 55 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు భారీగా 21.19 డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ కేవలం 13.12 బిలియన్ డాలర్లు. ► ఎగుమతుల్లో ఇంజనీరింగ్ (31.34 శాతం పెరిగి 9.27 బిలియన్ డాలర్లు), పెట్రోలియం (66.29 శాతం పెరిగి 4.1 బిలియన్ డాలర్లు), రసాయన రంగాలు (25 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లు) మంచి పనితీరును ప్రదర్శించాయి. కాగా, ఫార్మా ఎగుమతులు 3.13 శాతం క్షీణించి 1.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ► ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు 29 శాతం పెరిగి 6.24 బిలియన్ డాలర్లకు చేరింది. 400 బిలియన్ డాలర్ల లక్ష్యం సాకారం! ఇక భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ) 374.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 45.80 శాతం అధికం. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 59.21 శాతం పెరిగి 550.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 176.07 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం, భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
జీఎస్టీ వసూళ్లు 18 శాతం అప్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను వసూళ్లు 2022 ఫిబ్రవరిలో 18 శాతం పెరిగి (2021 ఇదే నెలతో పోల్చి) రూ.1.33 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అయితే నెలవారీగా 2022 జనవరి నెలతో పోల్చిచూస్తే, వసూళ్లపై మూడవ వేల్లో సవాలుగా ఏర్పడిన ఒమిక్రాన్ ప్రభావం కనబడింది. జనవరిలో రికార్డు స్థాయిలో రూ. 1,40,986 కోట్ల వసూళ్లు నమోదయిన సంగతి తెలిసిందే. ఇక జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో మూడు రోజులు తక్కువగా ఉండడం ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.లక్ష కోట్లపైన జీఎస్టీ వసూళ్లు ఇది వరుసగా ఎనిమిదవ నెల. రూ.1.30 లక్షల కోట్లు దాటడం ఐదవసారి. ►ఒక్క సెస్ వసూళ్లు రూ.10,000 కోట్ల కీలక స్థాయిని దాటడం ఇదే మొదటిసారి. ఆటోమొబైల్ వంటి కీలక రంగాల్లో పటిష్ట రికవరీ దీనికి కారణమని ఆర్థికశాఖ ప్రకటన ఒకటి పేర్కొంది. ►2021 ఫిబ్రవరితో పోల్చితే జీఎస్టీ వసూళ్ల వృద్ధి 18 శాతం అయితే, దేశంలో కరోనా సవాళ్లు ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 2020తో పోల్చితే ఏకంగా ఈ వృద్ధి రేటు 26 శాతంగా ఉండడం గమనార్హం. ►వసూలయిన మొత్తం రూ.1,33,026 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.24,435 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.30,779 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.67,471 కోట్లు (వస్తువుల దిగుమతులపై రూ.33,837 కోట్ల వసూళ్లుసహా), సెస్ రూ.10,341 కోట్లు ((వస్తువుల దిగుమతులపై రూ.638 కోట్ల వసూళ్లుసహా). -
రెడీ టు హిట్ సినిమా సునామీ
-
పురోగతి బాటలో ఎకానమీ
ముంబై: ఆర్థికమంత్రి ఈ నెల ఒకటవ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్, సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాలు భారత్ ఎకానమీ విస్తృత స్థాయి పురోగతికి బాటలు వేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి బులిటన్లో ప్రచురితమైన ఆర్టికల్ విశ్లేషించింది. మూడవ వేవ్ను సవాళ్లను అధిగమించిన భారత్లో ఆర్థిక రికవరీ ఇప్పటికే పటిష్టం అవుతోందని వివరించింది. అంతర్జాతీయంగా ఆర్థిక అంశాలుసహా వివిధ ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ ఎకానమీ పురోగమిస్తోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ థామ్తో ప్రచురితమైన ఆర్టికల్ పేర్కొంది. ఆర్టికల్లో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో ప్రభుత్వ పెట్టుబడుల పునరుద్ధరణ వల్ల 2022–23లో ప్రైవేట్ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇది ఉపాధి కల్పన, డిమాండ్ను బలోపేతం వంటి అంశాలకూ దోహదపడుతుంది. ► మల్టీ–మోడల్ కనెక్టివిటీ, రవాణా రంగం పురోగతి ద్వారా విస్తృత స్థాయి వృద్ధిని భారత్ సాధించగలుతుంది. ఈ లక్ష్య సాధనలో గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్రణాళిక కీలకమైనది. మౌలిక సదుపాయాల పురోగతిలో ఇది కీలకమైనది. ► ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. మూడవ వేవ్ నుంచి భారత్ బయట పడిన నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలలో పునరుద్ధరణ వేగంగా ఉంది. ► డిమాండ్, ఆశావాదం ప్రాతిపదికన తయారీ, సేవల రంగాల రెండూ విస్తరిస్తున్నాయి. వినియోగదారు, వ్యాపార విశ్వాసాన్ని మెరుగుపడ్డం కూడా కలిసివస్తోంది. వ్యాపారాలు తిరిగి సాధారణ స్థితికి వస్తుండడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని విశ్వసిస్తున్నాం. ► ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం సమస్యతో సతమతమవుతోంది. క్రూడ్సహా కమోడిటీల ధరలు పెరగడం, సరఫరాల్లో సమస్యలు దీనికి ప్రధాన కారణం. ► ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంకా తీవ్ర అనిశ్చితిలోనే కొనసాగుతున్నాయి. పలు అంశాలు ఇంకా సవాళ్లవైపే పయనిస్తున్నాయి. ► భారత్కు సంబంధించినంతవరకూ ప్రభుత్వం నుంచి అధిక వ్యయాల ప్రణాళికలు, వ్యాపారాలను సులభతరం చేయడానికి చర్యలు సానుకూల అంశాలు. ఆయా అంశాలే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వరుసలో భారత్ను మొదట నిలబెడుతున్నాయి. ► ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమావేశాల్లో ద్రవ్యోల్బణం–వృద్ధి లక్ష్యంగా ఆర్బీఐ వరుసగా పదవ త్రైమాసిక బేటీలోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని అభిప్రాయపడింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. ► పెట్టుబడులకు సంబంధించి కేంద్రం మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్కు సంబంధించి) 35.4 శాతం పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే (సవరిత గణాంకాల ప్రకారం రూ.6.03 లక్షల కోట్లు), 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేటాయింపులకు భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తాజా కేటాయింపులు (రూ.7.50 లక్షల కోట్లు) రెండు రెట్లు అధికమని మంత్రి తెలిపారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ఆర్థికశాఖ నెలవారీ నివేదిక స్పష్టీకరణ న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్ (2022–23 ఆర్థిక సంవత్సరం)లో ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్ర దేశాలతో పోల్చితే వేగంగా పురోగమించనుందని ఆర్థికశాఖ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. కోవిడ్–19 అనంతర ప్రపంచం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలన్న ప్రణాళికతోనే ప్రస్తుత సంవత్సరం కూడా ముగియవచ్చని నివేదిక విశ్లేషించింది. భారత్కు సంబంధించినంతవరకూ తయారీ, నిర్మాణ రంగాలు వృద్ధి చోదకాలుగా ఉంటాయని పేర్కొంది. పీఎల్ఐ, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాల పెంపు దేశీయ ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేస్తాయని నివేదిక విశ్లేషించింది. నివేదికలోని కొన్ని కీలకాంశాలను పరిశీలిస్తే... ► నికర విత్తన విస్తీర్ణం, పంటల వైవిధ్యీకరణలో స్థిరమైన పురోగతిని వ్యవసాయ రంగం సాధిస్తోంది. ఇది దేశ ఆహార నిల్వల పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో రైతులకు కనీస మద్దతు ధరలు, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ఆదాయ బదిలీల వంటి అంశాలు ఈ రంగానికి లాభిస్తాయి. ► వేగవంతమైన వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత్ను తొలి స్థానంలో నిలిపిన విషయం గమనార్హం. జనవరి మొదట్లో భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారీగా 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. గత ఏడాది అక్టోబర్లో 9.5 శాతం అంచనాలను తాజాగా 9 శాతానికి కుదించింది. అయినా ఈ స్థాయి వృద్ధి కూడా ప్రపంచ దేశాల్లో అత్యధికమని పేర్కొంది. ► దేశంలో మూడవ వేవ్ సవాళ్లు తలెత్తినప్పటికీ, మొత్తం ఆర్థిక కార్యకలాపాలు వీటిని తట్టుకుని నిలబడ్డాయి. విద్యుత్ వినియోగం, తయారీకి సంబంధించి పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, ఎగుమతులు, ఈ–వే బిల్లులు వంటి వంటి అనేక హై ఫ్రీక్వెన్సీ సూచికలు బలమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. వృద్ధి రికవరీ పటిష్టతను ఇది ప్రతిబింబిస్తోంది. ► కోవిడ్ 19 వైరస్ వల్ల కలిగిన అనిశ్చితి, ఆందోళన ప్రజల మనస్సుల నుండి తొలగిపోయిన తర్వాత, వినియోగం పుంజుకుంటుంది. డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి సంబంధించి ఉత్పత్తిని పెంచడానికి ప్రైవేటు పెట్టుబడులకు విస్తృత స్థాయి అవకాశం ఏర్పడుతుంది. ► అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలను మినహాయిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థకు 2022–23లో పలు సానుకూల అంశాలు ఉన్నాయి. -
అలెర్ట్: బ్యాంకుల్లో మోగనున్న సమ్మె సైరన్?..లావాదేవీలు ఉంటే ఇప్పుడే చూసుకోండి!
బ్యాంక్ ఖాతాదారులకు గమనిక. బ్యాంకులకు 11రోజుల పాటు సెలవులు ఉన్నాయి. మొబైల్,ఇంటర్నెట్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగుతున్నప్పటికీ, బ్యాంక్ సెలవులతో పాటు బ్యాంకింగ్ అసోసియేషన్ల సమ్మె కారణంగా అనేక బ్యాంకుల కార్యకలాపాలు మొత్తం 11రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. బ్యాంక్ యూనియన్లు ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 24న రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో బ్యాంక్ స్ట్రైక్లతోపాటు పబ్లిక్ హాలిడేస్ల కారణంగా మొత్తం 11రోజులు బ్యాంకులు పనిచేయవనే విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని బ్యాంక్ సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏఏ రోజుల్లో బ్యాంకులు పనిచేయవంటే? ఫిబ్రవరి 12- నెలలో రెండవ శనివారం 13 ఫిబ్రవరి-ఆదివారం 15 ఫిబ్రవరి-హజ్రత్ అలీ జయంతి/లూయిస్-నగై-ని (ఉత్తరప్రదేశ్, మణిపూర్లలో బ్యాంకులు పనిచేయవు) 16 ఫిబ్రవరి-గురు రవిదాస్ జయంతి (చండీగఢ్, హిమాచల్, హర్యానా,పంజాబ్లలో బ్యాంకులు పనిచేయవు) ఫిబ్రవరి 18-దోల్ యాత్ర (పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు పనిచేయవు) ఫిబ్రవరి 19-ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (మహారాష్ట్రలో బ్యాంకులు పనిచేయవు) ఫిబ్రవరి 20-ఆదివారం ఫిబ్రవరి 23 - బ్యాంకు సమ్మె ఫిబ్రవరి 24 - బ్యాంకు సమ్మె 26 ఫిబ్రవరి-నెలలో నాలుగవ శనివారం ఫిబ్రవరి 27-ఆదివారం -
ఫిబ్రవరిలో బ్యాంకుల హాలిడేస్ జాబితా ఇదే..!
మీకు ఈ ఫిబ్రవరి నెలలో ఏమైనా ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే గమనిక. బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే సెలవు రోజులకు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో బ్యాంకులకు ఈ క్రింది రోజుల్లో సెలవులు రానున్నయి. ఫిబ్రవరి బ్యాంక్ హాలిడేస్ జాబితా: ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్ (గ్యాంగ్టాక్లో బ్యాకులకు సెలవు) ఫిబ్రవరి 5: సరస్వతి పూజా, శ్రీ పంచమి, వసంత పంచమి(కోల్కతా, భువనేశ్వర్, అగర్తలలో బ్యాకులకు సెలవు) ఫిబ్రవరి 6: ఆదివారం సాధారణ సెలవు ఫిబ్రవరి 12: రెండో శనివారం సాధారణ సెలవు ఫిబ్రవరి 13: ఆదివారం సాధారణ సెలవు ఫిబ్రవరి 15: మహమ్మద్ హజ్రత్ అలీ జయంతి, లుయిస్-నాగాయ్-ని (ఇంఫల్, కాన్పూర్, లక్నోల్లో బ్యాంకులకు సెలవు) ఫిబ్రవరి 16: గురు రవిదాస్ జయంతి(చంఢీగడ్లో బ్యాకులకు సెలవు) ఫిబ్రవరి 18: దోల్జాత్రా (కోల్కతాలో బ్యాంకులకు సెలవు) ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు) ఫిబ్రవరి 20: ఆదివారం సాధారణ సెలవు ఫిబ్రవరి 26: నాలుగో శనివారం సాధారణ సెలవు ఫిబ్రవరి 27: ఆదివారం సాధారణ సెలవు (చదవండి: కేంద్ర బడ్జెట్పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు..!) -
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
అమ్మో ఒకటో తారీఖు..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న బ్యాంకులకు సంబంధించిన కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచనుంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. ఐఎమ్పిఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్టీతో పాటు గరిష్టంగా రూ.20 వసూలు చార్జీల రూపంలో చేయనుంది. అక్టోబర్ 2021లో ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని ఆర్బిఐ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే. ► ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్కు సంబంధించిన నియమ & నిబంధనలు మారనున్నాయి. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు షురూ చేయబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్స్టాల్మెంట్లు లేదంటే ఈఎంఐ చెల్లింపులు ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.100 చార్జీ వసూలు చేస్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి. ► ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే వచ్చేనెల ఫిబ్రవరి 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఫిబ్రవరి & మార్చిలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఫిబ్రవరి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తుందా? లేదా అనేది చూడాలి. (చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..!) -
ఫిబ్రవరి కోటా టికెట్లు విడుదల చేసిన టీటీడీ
Srivari Special Darshan Quota Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ శుక్రవారం ఉదయం ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకి 12 వేల చొప్పున టోకెన్లను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు స్లాటర్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పీఆర్వో విభాగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులంతా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్లలో మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. చదవండి: (కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు.. ఏపీ ఆర్థికశాఖ ఉత్తర్వులు) -
అలా పైపైకి...
న్యూఢిల్లీ: భయపడినట్లే జరుగుతోంది. దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. డిసెంబరు 28తో పోలిస్తే జనవరి 3 తేదీకల్లా (వారం రోజుల్లో) కేసుల్లో 500 శాతానికి పైగా పెరుగుదల నమోదు కావడంతో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి నెల మధ్యకు వచ్చేనాటికి ఒమిక్రాన్ కారణంగా భారత్లో థర్డ్వేవ్ పీక్కు చేరొచ్చనే అంచనాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబరు 28న 6,358 కేసులు నమోదుకాగా... సోమవారం (జనవరి 3న) ఏకంగా 33,750 కొత్త కేసులొచ్చాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,700లకు చేరింది. వీరిలో 639 మంది కోలుకోవడమో, ఇతర ప్రదేశాలకు వెళ్లిపోవడమో జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. మహారాష్ట్ర (510), ఢిల్లీ (351)లు అత్యధిక ఒమిక్రాన్ కేసులున్న రాష్ట్రాలు. దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 3.84 శాతంగా నమోదైంది. ► దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 4,099 కేసులు వచ్చాయి. మే నెల తర్వాత ఇదే అత్యధికం. 6.46 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. జీనోమ్ స్వీక్సెనింగ్కు పంపిన శాంపిళ్లలో 81 శాతం ఒమిక్రాన్ కేసులొచ్చాయి. ► ముంబైలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 7,298 కేసులొచ్చాయి. దాంతో ముంబైలో 1–9 తరగతులకు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు బడులు/కాలేజీలను జనవరి 31 దాకా మూసివేయాలని నిర్ణయించారు. -
పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెన్షన్ దారులు తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును ఫిబ్రవరి 28, 2022 వరకూ పెంచుతూ నేడు ప్రకటన చేసింది కేంద్రం. "వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కేసుల సంఖ్య పేరుగతున్న దృష్ట్యా వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని సమర్పించడానికి ప్రస్తుతం ఉన్న 31.12.2021 కాలవ్యవధిని ఫిబ్రవరి 28, 2022 వరకూ పొడిగించాలని నిర్ణయించినట్లు" పెన్షన్ల విభాగం పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక మెమోరాండంలో తెలిపింది. అప్పటి వరకూ వారి పెన్షన్ పంపిణీకి ఎలాంటి ఢోకా ఉండబోదని పేర్కొంది. వృద్ధులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న కారణంగా లైఫ్ సర్టిఫికెట్ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారు నవంబర్ నెలలో కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్ను అందించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ప్రభుత్వం నుంచి పెన్షన్ లభిస్తుంది. అయితే ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం వీరికి ఊరట కలిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడిగించింది. (చదవండి: ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ తెలిస్తే కుర్రకారు ఫిదా కావాల్సిందే..!) -
భారత్లో కోవిడ్ థర్డ్వేవ్.. ఫిబ్రవరిలో విజృంభణ!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ థర్డ్వేవ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పతాక స్థాయికి చేరవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన ఓ ముందస్తు అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల తీరు ప్రాతిపదికగా ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. గౌసియన్ మిక్సర్ మోడల్ అనే టూల్ను ఉపయోగించి చేపట్టిన ఈ అధ్యయనాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే థర్డ్వేవ్తో సతమతమవుతున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల్లో నమోదైన రోజువారీ కేసుల డేటాను ఉపయోగించుకుంటూ దేశంలో థర్డ్వేవ్ ప్రభావంపై ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పింది. దేశంలో థర్డ్వేవ్లో డిసెంబర్ 15వ తేదీకి అటూఇటుగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదు చోటుచేసుకోగా 2022 ఫిబ్రవరి 3వ తేదీకల్లా ఇది తీవ్ర స్థాయికి చేరుకోనుంది’ అని ఆ అధ్యయనం పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ డేటాను పరిగణనలోకి తీసుకోనందున అప్పటికి కేసుల్లో పెరుగుదల ఏ మేరకు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని కూడా స్పష్టం చేసింది. -
ఉన్నది రెండు అంగుళాలే.. దీని వెనుక పెద్ద కథే ఉంది
ఈ చిత్రంలో ఏదో ఓ బొగ్గు ముక్కలా కనిపిస్తున్నది చిన్నపాటి ఉల్క. ఉన్నది కేవలం రెండు అంగుళాలే.. కానీ శాస్త్రవేత్తలను పరుగులు పెట్టిస్తోంది. ఎందుకో తెలుసా..? భూమ్మీద జీవం పుట్టుకను తేల్చేందుకు ఈ ఉల్క తోడ్పడనుంది మరి. సైన్స్ పరంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ ఉల్కను గుర్తించడం వెనుక పెద్ద కథే ఉంది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ వెంటాడి.. వేటాడి.. బ్రిటన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాత్రి ఆకాశాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు ధగధగా మెరుస్తూ భూమివైపు దూసుకొస్తున్న ఓ ఉల్క కనబడింది. సాధారణంగా చిన్న చిన్న ఉల్కలు వాతావరణంలోనే మండిపోతాయి. కాస్త పెద్దవి అయితేనే దాటుకుని వచ్చి నేలపై పడతాయి. ఈ ఉల్క కూడా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ రావడంతో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అలా ఈ ఉల్క వించ్కోంబ్ ప్రాంతం దాకా వచ్చినట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలోని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఇళ్లలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి.. ఉల్క ఎక్కడ పడిందీ సుమారుగా గుర్తించారు. తర్వాత ఏడెనిమిది మంది శాస్త్రవేత్తలు, మరికొందరి సహాయంతో గాలించి.. ఓ ఇంటి ఆవరణలో ఒక ముక్కను, రెండు కిలోమీటర్ల దూరంలోని గొర్రెల ఫారంలో మరో ముక్కను గుర్తించారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు. జీవానికి ఆధారమైన అమైనో ఆమ్లాలతో.. బొగ్గు తరహాలో నల్లగా ఉన్న ఆ ఉల్కలను తీసుకెళ్లి పరిశోధన చేపట్టారు. అది చాలా ప్రత్యేకమైనదని గుర్తించి.. తాజాగా వివరాలను వెల్లడించారు. ఇది అత్యంత అరుదైన ‘కార్బొనసియస్ కాండ్రైట్’రకానికి చెందిన ఉల్క అని, సుమారు 460 కోట్ల సంవత్సరాల కిందటిదని శాస్త్రవేత్తలు తెలిపారు. 300 గ్రాముల బరువున్న ఈ ఉల్కలో.. జీవం పుట్టుకకు ఆధారమైన అమైనో ఆమ్లాలు, నీటి ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. ‘‘సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు ఏర్పడిన తొలినాళ్ల నాటి గ్రహ శకలం ఇది. దీనిని ఆనాటి పరిస్థితులను యథాతథంగా కాపాడుతున్న ‘టైం క్యాప్సూల్’అనుకోవచ్చు.భూమి, ఇతర గ్రహాల పుట్టుకకు సంబంధించిన విశేషాలను దీనిద్వారా తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ధ్వని వేగానికి 40 రెట్ల వేగం.. అంటే గంటకు 50 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించి.. మండిపోయింది..’’అని ఇంగ్లండ్ నేషనల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకుడు డాక్టర్ ఆష్లే కింగ్ వెల్లడించారు. ఇప్పుడున్న జీవజాలం భూమ్మీద పుట్టిందేనా? అంతరిక్షంలో మరోచోటి నుంచి ఇక్కడికి వచ్చిందా? విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా అన్నదానికీ ఈ ఉల్క సమాధానం చెప్పగలదని తెలిపారు. -
'ప్లేయర్ ఆఫ్ ద మంత్' రవిచంద్రన్ అశ్విన్
దుబాయ్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్తో ముగిసిన టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించిన అశ్విన్ను ఈ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ రేసులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఉన్నప్పటికీ ఆల్రౌండ్ ప్రతిభ కనబర్చిన అశ్విన్వైపే ఐసీసీ మొగ్గుచూపింది. నాలుగు మ్యాచ్ల సిరీస్లో ఏకంగా 32 వికెట్లు తీసిన అశ్విన్.. చెన్నైలో జరిగిన రెండో టెస్ట్లో సెంచరీ కూడా సాధించాడు. ఒక సిరీస్లో 30కిపైగా వికెట్లు సాధించడం అశ్విన్కు ఇది రెండోసారి. అంతేకాదు ఈ ఫీట్ను సాధించిన ఏకైక ఇండియన్ బౌలర్ కూడా అశ్వినే కావడం విశేషం. కాగా, టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించినట్లు ఐసీసీ తన ట్వీటర్ ఖాతాలో పేర్కొంది. ఐసీసీ ఈ ఏడాది ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ను జనవరి నెలకుగాను టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎగురేసుకుపోగా, ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ను అశ్విన్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లో అద్భుతంగా రాణించిన పంత్.. ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. -
ఐదవ నెలా లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా భారీగా పడిపోయిన జీఎస్టి వసూళ్లు తిరిగి గాడిన పడ్డాయి. వరుసగా ఐదవ నెలలో కూడా జీఎస్టి వసూళ్లు లక్ష కోట్ల మార్కును దాటాయి. ఫిబ్రవరి నెలలో జీఎస్టి వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.13 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 7 శాతం పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,13,143 కోట్లు కాగా గత నెలలో వసూలు చేసిన రూ.1,19,875 కోట్ల రూపాయల కన్నా తక్కువ. ఫిబ్రవరి నెలకు గాను వసూలైన జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.21,092 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.27,273 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.55,253 కోట్లు, సెస్సులు కింద రూ.9,525 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. వరుసగా ఐదో నెలా లక్ష కోట్లు దాటాయని, జీఎస్టీ వసూళ్లు తిరిగి పుంజుకున్నాయనడానికి ఇదే నిదర్శమని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ నెలలో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 15 శాతం ఎక్కువ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కోవిన్ 2.0 రెడీ.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా! వాట్సాప్ లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్ -
సామాన్యుడి నడ్డి విరిచేలా.. ఒక నెలలోనే ‘వంద’
సాక్షి, అమరావతి: సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు అమాంతం పెంచాయి. దీంతో వంటింట్లో గ్యాస్ బండ సామాన్యులకు మోయలేని భారంగా మారుతోంది. ఒక్కో సిలిండర్పై ఈ నెల 4వ తేదీన రూ.25, 15న రూ.50 పెంచగా ప్రస్తుతం మరో రూ.25 ధర పెంచాయి. ఒకే నెలలో సుమారు రూ.100 వరకు ధర పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గృహ వినియోగ సిలిండర్ (14.2 కేజీల) ధర ప్రస్తుతం విజయవాడలో రూ.816.50, ఒంగోలులో రూ.839.50, కందుకూరులో రూ.841.50కు (రవాణా చార్జీల వల్ల వ్యత్యాసం) పెరిగింది. భవిష్యత్తులో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సబ్సిడీలోనూ భారీ కోత వినియోగదారులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీలోనూ భారీగా కోత విధించారు. ఒక్కో సిలిండర్పై గత ఏడాది రూ.220 చొప్పున సబ్సిడీ మొత్తం వినియోగదారుల బ్యాంకు అకౌంట్కు జమ అయ్యేది. ప్రస్తుతం సబ్సిడీ మొత్తం కేవలం రూ.15.38 మాత్రమే జమ చేస్తున్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు ప్రతి రోజూ సగటున రెండు లక్షలకు పైగా సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. గతంలో రోజూ సబ్సిడీ మొత్తం రూ.4.50 కోట్లు వినియోగదారులకు అందుతుండేది. ప్రస్తుతం ఆ మొత్తం కేవలం రూ.30.76 లక్షలకు మాత్రమే పరిమితమైంది. మున్ముందు సబ్సిడీ పూర్తిగా ఎత్తేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, గ్యాస్ ధర పెంపుపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. చదవండి: బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! తాడిపత్రిలో బయటపడ్డ ‘జేసీ’ ప్రలోభాలు -
ఈ నెలాఖరున ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ ఈ నెలాఖరున జారీ చేసేందుకు ఎంసెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించే ఈ పరీక్షల్లో సాధారణంగా ముందు మూడ్రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్లైన్లో ఇంజనీరింగ్ ఎంసెట్ను 6 సెషన్లలో (రోజుకు 2 సెషన్లు) నిర్వహిస్తారు. అవసరమైతే 8వ తేదీన కూడా ఒక సెషన్ నిర్వహించే అవకాశముంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు(జూలై 3న), ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒకరోజు గడువే ఉంటోంది. మరోవైపు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష తేదీలు ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి నీట్ తేదీలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ ఎంసెట్ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్ ఎంసెట్ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో మరోసారి ఉన్నత విద్యామండలితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎంసెట్ కమిటీ భావిస్తోంది. ఇక, ఈసారి 160 ప్రశ్నలకు బదులు 180 ప్రశ్నలిస్తే విద్యార్థులకు 20 ప్రశ్నలు ఆప్షన్గా ఉండేలా కసరత్తు చేస్తోంది. వీటన్నింటిపై చేపట్టిన ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా పూర్తయితే నెలాఖరున ఎంసెట్ నోటిఫికేషన్ను జారీ చేయనుంది. లేదంటే వచ్చే నెల మొదటి వారంలో జారీ చేయనుంది. -
బంగారం కొనే వారికి గుడ్న్యూస్
న్యూఢిల్లీ: బంగారం కొనాలనుకునే వారికీ గుడ్న్యూస్. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరిగిన కూడా దేశీయ మార్కెట్ లో పసిడి ధరలు పడిపోవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని ప్రకటించడంతో ఆ ప్రభావం పసిడిపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దింతో ఏడు నెలల కనిష్టానికి బంగారం ధరలు చేరుకున్నాయి.(చదవండి: రిలయన్స్ జోరుకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్) దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారు రేట్లు తగ్గుతూ వచ్చాయి. ఎంసిఎక్స్లో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.440 క్షిణించి రూ.48,380 చేరుకుంది. బెంగుళూరు నగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.44,350గా ఉంది. కాస్మోపాలిటన్ నగరమైన హైదరాబాద్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.440 క్షిణించి రూ.48,380 చేరుకోగా పది గ్రాముల 22క్యారెట్ల బంగారం 400 పతనంతో 44,350 రూపాయలకు చేరుకుంది. దింతో పాటు కేజీ వెండిపై వెయ్యి రూపాయలు దిగొచ్చి రూ.72 వేల 200కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. -
మూవీ క్విజ్: రవితేజ ‘భద్ర’లో హీరోయిన్ ఎవరు?
సినీ సెలబ్రిటీలు తమ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడంలో చాలా ఆసక్తి చూపుతారు. తమ సినిమాలను వారు పుట్టిన లక్కీ నెలలో ప్రకటించడం, విడుదల చేయటం వంటివి చేస్తారు. తాజాగా ఫిబ్రవరి నెలలో పుట్టి, ప్రేక్షకుల మనసు దోచుకున్న పులువురు మూవీ స్టార్స్ గురించి క్విజ్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1521341774.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1531341776.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్డేట్
ప్రపంచ వ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన మెసేజింగ్ యాప్లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇంతలా ఆదరిస్తున్న తన వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా కొత్త ఏడాదిలో కూడా కొత్త అప్డేట్ తో ముందుకు వచ్చింది. ఈ అప్డేట్ లో భాగంగా టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ అప్డేట్ ను తీసుకొచ్చింది. 2021లో కొత్త నియమ నిబంధనలు తీసుకొస్తున్నట్లు గతంలో వాట్సాప్ ప్రకటించింది. అందులో భాగంగానే ఈ టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ అప్డేట్ ను తీసుకొచ్చినట్లు వాట్సాప్ తన బ్లాగ్ వాబీటా ఇన్ఫోలో ప్రకటించింది.(చదవండి: మార్కెట్లోకి వన్ప్లస్ కొత్త ప్రోడక్ట్) కొత్తగా తీసుకొచ్చిన టర్మ్స్ అండ్ ప్రైవసీ రూల్స్ని ప్రతి ఒక్కరు అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేల వాట్సాప్ కొత్త రూల్స్ని అంగీకరించక పొతే వారి మొబైల్లో తమ సేవలను 2021 ఫిబ్రవరి 8 నుంచి నిలిపివేయనునట్లు ప్రకటించింది. ప్రతి ఒక్కరికి ఈ కొత్త టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ రూల్స్ని దశల వారీగా పంపుతున్నట్లు పేర్కొంది. చాలా మంది తమకు ఈ కొత్త అప్డేట్ వచ్చినట్లు షేర్ చేసుకుంటున్నారు. గతంలో 19 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా ఫేస్బుక్ 2014లో కొనుగోలు చేసినప్పటి నుండి ఇది ఎలా పనిచేస్తుందనే దానిపై వాట్సాప్ విమర్శలను ఎదుర్కొంది. యూజర్ల గోప్యత మరియు డేటా భద్రత గురించి చాలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త రూల్స్ని తీసుకొస్తుంది. -
వాహనదారులకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. గతంలో జనవరి 1 నుండి ఫాస్ట్టాగ్ ను తప్పని సరిచేస్తూ తీసుకున్న నిబంధనలను మరోసారి సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం ఫాస్ట్టాగ్ ఉపయోగించి జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలు చేయడానికి గడువును రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ పొడిగించింది. ఈ గడువు మొదట జనవరి 1, 2021 వరకు ఉండేది. తాజాగా ఫిబ్రవరి 15, 2021 వరకు పొడిగించబడింది. అసలు గడువు ప్రకారం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జనవరి 1 నుండి టోల్ ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుకు పూర్తిగా మారాలని నిర్ణయించారు.(చదవండి: అమెజాన్లో 'మెగా శాలరీ డేస్' సేల్) ప్రస్తుతం, ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చేసిన లావాదేవీల వాటా 75-80 శాతం ఉంటుందని చెబుతున్నారు. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫీబ్రవరి 15 నుండి 100 శాతం నగదు రహిత రుసుము వసూలు చేయాలనీ కేంద్రం భావిస్తుంది. ప్రభుత్వం ఇంకో వైపు సింగల్ లేన్ మినహా అన్ని దారులను ఫాస్ట్ ట్యాగ్ లేన్లుగా మార్చాలని చూస్తుంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటం వల్ల ఇటు ఇంధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది అని కేంద్రం పేర్కొంది. -
పెన్షనర్లకు ఊరట : కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులకు ఊరట. కేంద్ర పెన్షన్దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును మరో రెండు నెలలు పెంచుతూ కేంద్రప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ గడువును పెంచాలన్న పెన్షన్దారుల సంఘాల విజ్ఞప్తి మేరకు 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచుతూ కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని లైఫ్ సర్టిఫికేట్ గడువును మరికొంత కాలం పెంచాలంటూ వివిధ పెన్షన్దారుల సంఘాల నుంచి పిటిషన్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్-19 కేసులు వరకు పెరుగుతున్న నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంతో సంప్రదించిన పిదప ఈ గడువును 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచినట్టు తెలిపారు. అలాగే పొడిగించిన కాలంలో, (ఫిబ్రవరి వరకు) ప్రతీ నెలా పెన్షన్ యథావిధిగా చెల్లిస్తామని పేర్కొన్నారు. వాయిదా ప్రధాన లక్ష్యం వివిధ శాఖల వద్ద విపరీతమైన రద్దీని నివారించడమనీ, సంబంధిత శాఖలలో సరైన పారిశుద్ధ్యం, సామాజిక దూరాన్ని పాటించాలని నోటీసులో పేర్కొంది. కాగా ప్రతీ ఏడాది పింఛనుదారులు నవంబర్లోగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. కరోనా ప్రభావం వృద్ధులపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన మేరకు కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసే చివరి తేదీని 2020 డిసెంబర్ 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
ఫిబ్రవరికల్లా కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవిడ్పై పోరుకు భారత్ బయోటెక్ కంపెనీ సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోవాగ్జిన్ పేరుతో కంపెనీ తయారు చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) లు కలిసి ఈ టీకాను తయారు చేస్తున్నాయి. వ్యాక్సిన్ సామర్థ్యం బాగానే ఉందని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త, టీకా టాస్క్ఫోర్స్ సభ్యుడు రజనీకాంత్ గురువారం న్యూఢిల్లీలో తెలిపారు. ‘‘వచ్చే ఏడాది మొదట్లో.. ఫిబ్రవరి లేదా మార్చిలలో అందుబాటులోకి (టీకా) వస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే నిజమైతే భారత్ సిద్ధం చేసిన తొలి కోవిడ్ నిరోధక టీకాగా కోవాగ్జిన్ రికార్డు సృష్టిస్తుంది. భారతీయులను నిలిపేసిన చైనా భారత్ నుంచి చైనాకు వెళ్లేందుకు కేటాయించిన విమానాలను చైనా నిలిపివేసింది. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో భారతీయులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చైనా ఎంబసీ ప్రకటించింది. దాదాపు 2 వేల మంది ఈ చర్య వల్ల భారత్లోనే ఆగిపోయే అవకాశం ఉంది. సరైన పర్మి ట్లు ఉన్నప్పటికీ నిలిపివేస్తున్నట్లు చెప్పింది. మళ్లీ 50 వేలు దేశంలో ఇటీవల కరోనా కొత్త కేసులు రోజుకు 50 వేల లోపు నమోదు కాగా, గురువారం ఆ సంఖ్య 50 వేలు దాటింది. గత 24 గంటల్లో 50,210 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,64,086కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 704 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,23,611కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోలుకున్న వారి సంఖ్య 77,11,809కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 92.20 శాతానికి చేరింది. -
వచ్చే ఫిబ్రవరిలో అండర్–17 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్
న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది నవంబర్లో జరగాల్సిన అండర్–17 మహిళల ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. మంగళవారం ఈ మెగా ఈవెంట్కు సంబంధించి కొత్త షెడ్యూల్ను అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు ప్రపంచకప్ జరుగుతుందని ‘ఫిఫా’ ప్రకటించింది. మొత్తం ఐదు వేదికల్లో (కోల్కతా, గువాహటి, భువనేశ్వర్, నవీ ముంబై, అహ్మదాబాద్) ఈ టోర్నీని నిర్వహించనుండగా... మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత మహిళల జట్టు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించింది. -
చల్లబడిన రీటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల ధరల సూచిక ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 ఫిబ్రవరిలో 6.58 శాతానికి దిగి వచ్చింది. కూరగాయలు, ఇతర వంట వస్తువుల ధరలు చల్లబడటంతో ఫిబ్రవరిలో ఆరు నెలల తర్వాత తొలిసారి రిటైల్ ద్రవ్యోల్బణం 6.58 శాతానికి తగ్గిందని ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది.రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో 7.59 శాతం, గత ఏడాది ఫిబ్రవరిలో 2.57 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో మాంసం, చేపల విభాగ ద్రవ్యోల్బణం 10.2 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో ఇది 10.5 శాతంగా ఉంది. 2019 ఆగస్టు నుండి పెరుగుతూ వస్తున్న సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం తొలిసారని తనదిశను మార్చుకుంది. కూరగాయల ధరల ద్రవ్యోల్బణం జనవరిలో 50.19 శాతం గరిష్ట స్థాయి నుండి 31.61 శాతానికి చల్లబడింది. ప్రోటీన్ అధికంగా ఉండే పప్పుధాన్యాలు గుడ్ల విషయంలో ధరల పెరుగుదల రేటు కూడా నెమ్మదిగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన సీపీఐ గణాంకాల ప్రకారం 2020 ఫిబ్రవరిలో ఆహారద్రవ్యోల్బణం 10.81 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో ఇది 13.63 శాతం. అయితే, 'ఇంధన కాంతి' విభాగంలో ద్రవ్యోల్బణం అంతకుముందు నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో దాదాపు 6.36 శాతానికి పెరిగింది. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనాకి కరోనా వైరస్ ఆందోళనలు తోడు కావడంతో ఆర్బీఐ ఈసారి భారీగా వడ్డీ రేట్ల కోత పెట్టనుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2020 ఏప్రిల్ 3 నుంచిప్రారంభంకానున్న ఏంపీసీ సమావేశాల్లో ఈసారి 50 బీపీఎస్పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. గత సమీక్షలో రెపో రేటును 5.15 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఇప్పటికే పలుదేశాల కేంద్రబ్యాంకులు వడ్డీరేటు కోతను ప్రకటించాయి. -
మారుతి కార్ల విక్రయాలు డౌన్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమన భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్ల విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.1 శాతం పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ 1,48,682 కార్లను విక్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1,48,682 యూనిట్ల అమ్మకాలు జరిగాయని మారుతి సుజుకి ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశీ కార్ల విక్రయాలు గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 1.6 శాతం తగ్గాయని..అల్టో, వాగనార్, వంటి మినీ కార్ల విక్రయాలు మాత్రం 11.1 శాతం పెరగడం గమనార్హం. ఇక స్విఫ్ట్, బలేనో, ఇగ్నిస్, డిజైర్ వంటి కాంపాక్ట్ సెగ్మెంట్లో అమ్మకాలు 3.9 శాతం తగ్గుదల నమోదైంది. ఇక విటారా బ్రెజా, ఎస్ క్రాస్, ఎర్టిగా సేల్స్ గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.5 శాతం మేర పెరిగాయని కంపెనీ తెలిపింది. మరోవైపు ఫిబ్రవరిలో ఎగుమతులు 7.1 శాతం వృద్ధి నమోదు చేశాయని మారుతి సుజుకి వెల్లడించింది. చదవండి : కొత్త ఇంజీన్తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్ -
కేజ్రీవాల్.. ఫిబ్రవరి 14!
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ జీవితానికి ఫిబ్రవరి 14కి ఆసక్తికర బంధముంది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 49 రోజుల తర్వాత ఫిబ్రవరి 14ననే ఆయన రాజీనామా చేశారు. 2015లో గెలిచాక ఫిబ్రవరి 14వ తేదీనే ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోయేదీ ఫిబ్రవరి 14వ తేదీననే అని సమాచారం. కేజ్రీవాల్ది ప్రేమ వివాహం. ఎగ్జిట్ పోల్స్ నిజం! ఆప్ గెలుస్తుందన్న ఎగ్జిట్పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఢిల్లీలో ఆప్ విజయం సాధించింది. ఇండియాటుడే–యాక్సిస్, ఏబీపీ–సీ ఓటర్, టీవీ9 భరత్వర్ష్లు అంచనా వేసినట్లే సీట్లు వచ్చాయి. ఇండియా టుడే–యాక్సిస్ సర్వే ఆప్కి 59–68 సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 2 నుంచి 11 సీట్లొస్తాయని చెప్పింది. ఏబీపీ–సీ ఓటర్ ఆప్కి 49 నుంచి 63 స్థానాలూ, బీజేపీకి 5 నుంచి 19 స్థానాలూ వస్తాయని చెప్పింది. ఇక టీవీ 9 భరత్వర్ష్ అంచనాల ప్రకారం ఆప్కి 52 నుంచి 64, బీజేపీకి 6 నుంచి 16 స్థానాలు వస్తాయని వెల్లడించింది. (చదవండి: ఆప్.. మళ్లీ స్వీప్) మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్ యూ ఎన్నికల్లో ఘనవిజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆప్ విజయాన్ని భరత మాత విజయంగా అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలు తనను పెద్ద కొడుకుగా ఆదరించి ఈ విజయాన్ని అందించారన్నారు. ‘ఢిల్లీ ప్రజలారా.. మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్ యూ’ అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ఈ రోజు ఢిల్లీ ప్రజలు ‘పని రాజకీయం(పాలిటిక్స్ ఆఫ్ వర్క్స్)’ అనే కొత్త తరహా రాజకీయ సంస్కృతికి తెర తీశారు’ అని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్న వేదికపై నుంచి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. (చదవండి: ఏ.కే.–62) -
ఫిబ్రవరి 11 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే మార్చి 19వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆర్జేడీఈలను, డీఈవోలను ఆదేశించింది. నిర్ణీత తేదీల్లో అన్ని ఉన్నత పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని పేర్కొంటూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫిబ్రవరి 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 24, 25 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏప్రిల్ 7 నుంచి 16వ తేదీ వరకు వార్షిక పరీక్షలను (ఎస్ఏ–2) నిర్వహించాలని తెలిపింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6, 7 తరగతుల వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, 8వ తరగతి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు, 9వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు పేపర్–2 పరీక్షలు నిర్వహించాలని వెల్లడించింది. ఏప్రిల్ 18వ తేదీన ఫలితాలను ప్రకటించి, విద్యార్థులకు జవాబు పత్రాలను అందజేయాలని, 20వ తేదీన పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించాలని సూచించింది. -
ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సంక్షేమ భవన్లో మేడారం జాతర ఏర్పా ట్లపై ఆమె సమావేశం నిర్వహించారు. జాతరకు డిసెంబర్ చివరి వారం నుం చే భక్తుల తాకిడి ఉంటుందని, కాబట్టి డిసెంబర్ నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. పార్కిం గ్, వసతుల కల్పనలో లోపాలు ఉండద్దన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శించేందుకు వీలుగా పర్యా టక ప్రాంతాలపై ప్రచారం చేయాలన్నారు. జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. పాలు, పాల ఉత్పత్తుల సరఫ రా కోసం విజయ డైరీని భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసిందని, వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు వీటిని వెచ్చిస్తామని మంత్రి చెప్పారు. -
ఫిబ్రవరిలో తగ్గిన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఫిబ్రవరిలో ఉపశమించింది. దిగుమతులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... ► దిగుమతుల విషయంలో ఈ మొత్తం 36.26 బిలియన్ డాలర్లు. గత ఏడాది (2018 ఫిబ్రవరి) ఇదే నెలతో పోల్చిచూస్తే, ఈ విలువ 5.4 శాతం తగ్గింది. ► వెరసి వాణిజ్యలోటు ఫిబ్రవరిలో 9.6 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 2018 ఫిబ్రవరిలో 12.3 బిలియన్ డాలర్లు అయితే, 2019 జనవరిలో ఈ విలువ 14.73 బిలియన్ డాలర్లు. ►పసిడి, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు తగ్గాయి. దీనితో దిగుమతులు మొత్తంగా తగ్గాయి. పసిడి దిగుమతులు 11 శాతం తగ్గి 2.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 2.89 బిలియన్ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 8 శాతం తగ్గి 9.37 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 8.85 శాతం పెరిగి 298.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 9.75 శాతం పెరిగి 464 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు దాదాపు 166 బిలియన్ డాలర్లు. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 149 బిలియన్ డాలర్లు. అవరోధాలను అధిగమిస్తున్నాం: ఎఫ్ఐఈఓ అంతర్జాతీయంగా వాణిజ్య రక్షణాత్మక విధానాలు ఉన్నాయి. కఠిన అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు ఉన్నాయి. దేశీయంగానూ ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఎగుమతులు కొంత సానుకూలంగానే నమోదయ్యాయి. మొత్తం 30 ప్రధాన గ్రూపుల్లో 18 సానుకూల ఫలితాలను అందించాయి. – గణేశ్ కుమార్ గుప్తా, ఎఫ్ఐఈఓ సేవలు తగ్గాయి... సేవల ఎగుమతులు 2018 డిసెంబర్తో పోల్చితే, 2019 జనవరిలో 1.02 శాతం తగ్గాయి. 17.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవల దిగుమతులు కూడా ఇదే కాలంలో 3.07 శాతం తగ్గి 11.03 బిలియన్ డాలర్లకు చేరాయి. -
టోకు ద్రవ్యోల్బణానికి కూర‘గాయాల్’ సెగ
సాక్షి, న్యూఢిల్లీ : టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పైకి ఎగబాకిగింది. కూరగాయలు, ఇంధన ధరలు బాగా పెరగడంతో ఫిబ్రవరి నెలలోని డబ్ల్యూపీఐ ఇన్ప్లేషన 2.93 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. గత జనవరిలో 2.76 శాతంతో 10 ఏళ్ల కనిష్టానికి చేరినా ఫిబ్రవరిలో అంతే వేగంగా ఎగిసింది. జనవరిలో 1.84 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణంతో పోలిస్తే ప్రస్తుతం 3.29( వార్షిక ప్రాతిపదికన)శాతానికి చేరింది. -
నాలుగు నెలల గరిష్టానికి రీటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ : రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ నాలుగు నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. జనవరి మాసంలో 2.05 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 2.57 శాతానికి చేరింది. అటు ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి 1. 7 శాతానికి పడిపోయింది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 2.05 శాతం నుంచి 2.57 శాతానికి పెరిగింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి జనవరి నెలలో 2.4 శాతం నుంచి 1.7 శాతానికి క్షీణించింది. -
లక్ష కోట్ల మార్క్ దిగువకు జీఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: రికార్డు కలెక్షన్ల పరంపర నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు ఫిబ్రవరి మాసంలో తగ్గుదలను నమోదు చేశాయి. ఫిబ్రవరి మాసపు జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. జనవరి నెలలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో రూ.97,247కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం రూ.97,247కోట్లు వసూలు కాగా అందులో కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) రూ.17,626కోట్లు, రాష్ట్ర జీఎస్టీ(ఎస్జీఎస్టీ) రూ.24,192కోట్లు, ఐజీఎస్టీ రూ.46,953కోట్లుగా ఉన్నాయి. అలాగే దిగుమతుల మీద వసూలైన సెస్ కింద రూ.21,384కోట్లు, సెస్ కింద రూ.8,476కోట్లు వసూలయ్యాయి. విక్రయాలకు సంబంధించి దాఖలయ్యే రిటర్నరులు(జీఎస్టీఆర్-3బీ) 73.48లక్షలకు చేరాయి. కాగా గత నెల జీఎస్టీ వసూళ్లు రూ.1.02లక్షల కోట్లు వచ్చాయి. ఒక నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటడం ఇది మూడోసారి. గతేడాది ఏప్రిల్, అక్టోబరులో ఈ స్థాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. -
రెడ్మి నోట్ 7 లాంచింగ్ ఈ నెలలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 7 భారత్ లో విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పటినుంచో స్మార్ట్ఫోన్ ప్రియులు ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ఫోన్ను ఫిబ్రవవరి 28న ఆవిష్కరించన్నుట్టు అధికారిక ట్విటర్లో షావోమి ప్రకటించింది. ఇప్పటికే చైనా మార్కెట్లో మిలియన్ అమ్మకాలతో దూసుకుపోతోంది. రెడ్ మి నోట్ 7 లో 48 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న భారీ కెమెరాను అమర్చగా మూడు వేరియంట్లలో బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. 3 జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.10,390 ధరకు లభ్యం కానుంని తెలుస్తోంది. 4జీబీ/64జీబీ స్టోరేజ్ ధర రూ. 12,460, 6జీబీ/64జీబీ స్టోరేజ్ ధర రూ.14,540లుగా ఉండనుందని అంచనా. రెడ్మీ నోట్ 7 ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్డ్రాగన్ 660 సాక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 48+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0. Your answer to when is #RedmiNote7 launching is finally here! Unleashing the #ǝɟᴉ7ƃnɥʇ on 28th Feb 2019. Register to buy the ticket for the launch event: https://t.co/ulSUeJlVgI. Limited seats! pic.twitter.com/GwfWwVMBvh — Mi India (@XiaomiIndia) February 14, 2019 -
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ఫిబ్రవరిలోనే!
-
ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్ భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో ఫిబ్రవరిలో మరోసారి సమావేశమవుతారని వైట్హౌస్ తెలిపింది. ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణ, క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై ట్రంప్, కిమ్లు చర్చిస్తారని వెల్లడించింది. ఈ సమావేశం జరిగే వేదికను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. గతేడాది జూన్ 12న సింగపూర్లోని ఓ హోటల్లో ట్రంప్, కిమ్ తొలిసారి భేటీ అయ్యారు. కాగా, ఉత్తరకొరియా అణ్వస్త్రాలను త్యజించేవరకూ ఆంక్షలను కొనసాగిస్తామని వైట్హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ తెలిపారు. మరోవైపు, అమెరికా దక్షిణ సరిహద్దులో నెలకొన్న మానవతా సంక్షోభంతో పాటు షట్డౌన్పై శనివారం మధ్యాహ్నం 3 గంటలకు (స్థానికకాలమానం) కీలక ప్రకటన చేస్తానని ట్రంప్ ట్విట్టర్లో తెలిపారు. -
ముహూర్తం ఫిబ్రవరి 10
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తన మంత్రివర్గాన్ని ఫిబ్రవరి రెండో వారంలో విస్తరించనున్నారు. అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీ వసంత పంచమి పర్వదినాన మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండటం, మంచి ముహూర్తాలు లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణను ఫిబ్రవరిలో పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే తొలి విడతలో ఎనిమిది మందికే చోటు ఉంటుందని, లోక్సభ ఎన్నికల తరువాత జరిగే విస్తరణలో మరో ఎనిమిది మందికి అవకాశం కల్పించి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారు, ఎవరెవరికి స్థానం లభిస్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. విస్తరణలో మంత్రి పదవులు పొందే ఆ ఎనిమిది మంది ఎవరన్నదానిపై అధికార పార్టీలో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఈసారి విస్తరణలో కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవచ్చని, అందరూ పాతవారే ఉంటారని కొందరంటుంటే కనీసం ఇద్దరు కొత్త వారు ఉండే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాని వారికి ఇతరత్రా కీలక పదవులు కూడా అప్పుడే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలి, అవకాశం లేని వారిని ఏ పదవుల్లో నియమించాలన్న విషయంలో సీఎం ఇప్పటికే పలుమార్లు కరసత్తు చేసినట్లు సమాచారం. కేబినెట్ హోదా ఉండే పదవుల్లో డిప్యూటీ స్పీకర్తోపాటు శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్, మండలిలో చీఫ్ విప్, శాసనసభలో, మండలిలో ఇద్దరు లేదా ముగ్గురేసి చొప్పున విప్ల పదవులు ఉండనున్నాయి. ఇవి కాకుండా పార్లమెంటరీ కార్యదర్శుల పేరుతో మరికొందరికి కూడా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆ ఎనిమిది మంది ఎవరు? తొలి దశ మంత్రివర్గ విస్తరణలో పాత మంత్రులకే అవకాశం లభించవచ్చు. టీఆర్ఎస్లో, ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నేతలకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు మంత్రి మండలి ఉంటుందని, ఈ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని ఓ సీనియర్ నేత అన్నారు. ‘ముఖ్యమంత్రి ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలన్నీ పరిశీలిస్తే పాత వారికి దాదాపుగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే అనుకుంటున్నా. శాసనసభ ఎన్నికల్లో అనేక మంది సిట్టింగ్లు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలిసినా ఆయన నలుగురు మినహా పాత వారందరికీ టికెట్లు ఇచ్చారు. మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డిలకు కీలక పదవులిచ్చారు. ఇవన్నీ గమనిస్తే ముఖ్యమంత్రి అందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తారనిపిస్తోంది’అని ఆ సీనియర్ నేత విశ్లేషించారు. మంత్రివర్గంలో ఎవరు ఉంటారన్న విషయంలో ముఖ్యమంత్రి తన మనోగతాన్ని ఇప్పటిదాకా ఎవరితోనూ పంచుకోలేదని పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. అయితే సమయం చిక్కినప్పుడల్లా ఆయన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల జాబితా ముందు పెట్టుకొని ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారని ఓ మాజీ మంత్రి అన్నారు. తొలి దశ విస్తరణ రేసులో ఉన్నది వీరే... తొలి మంత్రివర్గ విస్తరణలో స్థానం పొందే వారిలో ఈటల రాజేందర్ (కరీంనగర్), కడియం శ్రీహరి (జనగామ), జి. జగదీశ్రెడ్డి (సూర్యాపేట), సి. లక్ష్మారెడ్డి (మహబూబ్నగర్), కేటీ రామారావు (సిరిసిల్ల), టి. హరీశ్రావు (సిద్దిపేట), తలసాని శ్రీనివాస్ యాదవ్ (గ్రేటర్ హైదరాబాద్), జోగు రామన్న (ఆదిలాబాద్) ఉండొచ్చని ఒక అంచనా. తొలి దశలోనే ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తే డీఎస్ రెడ్యానాయక్ (మహబూబాబాద్ జిల్లా)కు అవకాశం రావచ్చని అంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్గా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ పేరు వినిపిస్తోంది. స్పీకర్ పదవిని ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడంతో ఈసారి పద్మాదేవేందర్రెడ్డికి ఆ అవకాశం లేకపోవచ్చు. ఆమెకు మలి దశ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి లేదా మరో కేబినెట్ హోదా పదవి లభించొచ్చు. అయితే మలి విడత మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించే వారి సంఖ్య రెండు డజన్ల దాకా ఉంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ మంది శాసనసభకు ఎన్నిక కావడంతో పోటీ కూడా తీవ్రంగా ఉంది. లోక్సభ ఎన్నికల తరువాత విస్తరించనున్న మంత్రివర్గంలో ముగ్గురు రెడ్లకు అవకాశం లభించవచ్చు. ఈ కోటాలో మంత్రి పదవి కోసం నాయిని నర్సింహారెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎ. ఇంద్రకరణ్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి పోటీ పడుతున్నారు. వారిలో ఒకరిద్దరికి చీఫ్ విప్, విప్ పదవులు కట్టబెట్టే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్... కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాతే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల మంత్రివర్గ విస్తరణ తరువాత మార్చి రెండో వారంలో తాత్కాలిక బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలు పూర్తికాగానే మలి విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టి జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్కు సిద్ధం కావాలని ఆయన యోచిస్తున్నారు. -
ఫిబ్రవరి నెలాకరులో పీఆర్సీ నివేదిక!
-
భారీగా పెరిగిన ఎయిర్లైన్ ట్రాఫిక్: పుంజుకున్న షేర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఇండిగో, గో ఎయిర్ లాంటి విమాన యాన సంస్థలకు చెందిన విమానాలపై నిషేధం కొనసాగుతుండగా దేశీయ పాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదలను నమోదు చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తన నెలవారీ దేశీయ ట్రాఫిక్ నివేదికలో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరిలో విమాన ప్రయాణికుల సంఖ్య(ఏవియేషన్ ట్రాఫిక్) 24 శాతం జంప్చేసింది. 24 శాతం వృద్ధితో 2018 ఫిబ్రవరి నాటికి దేశీయ దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 1.07 కోట్లకు పెరిగింది. మొత్తం దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ జనవరి నెలలో 1.14 కోట్లకు పెరిగింది. డిజిసిఎ ఇచ్చిన సమాచారం ప్రకారం జనవరి-ఫిబ్రవరి 2018 నాటికి ప్రయాణీకుల రద్దీ 21.80 శాతం పెరిగింది. 2017 నాటికి 86.55 లక్షల నుంచి పెరిగినట్లు సోమవారం వెల్లడించిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దీంతో విమానయాన కంపెనీల కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. జెట్ ఎయిర్వేస్ 2 శాతం, స్పైస్జెట్ 1.2 శాతం, ఇంటర్గ్లోబ్(ఇండిగో) 0.75 శాతం లాభపడింది. -
పుంజుకున్న ఎగుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: గత జనవరిలో భయపెట్టిన భారత వాణిజ్యలోటు కొద్దిగా చల్లబడింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించి వాణిజ్య లోటు 12బిలియన్ డాలర్లుగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఎగుమతులు 4.5 శాతం దిగుమతులు 10.4 శాతం పెరిగాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 4.5 శాతం పెరుగుదలతో 25.8 బిలియన్ల డాలర్ల ఎగుమతులను సాధించామని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా వెల్లడించారు. ఫిబ్రవరి వాణిజ్య లోటు గత మాసంలోని 16.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 12 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే జనవరి 24.3 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే ఫిబ్రవరి ఎగుమతులు 25.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో దిగుమతులు 37.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, రసాయనాలు, వెండి, ముత్యాల దిగుమతి పెరగడంతో వాణిజ్య లోటు జనవరిలో 56 నెలల గరిష్ఠానికి (16.3 బిలియన్ డాలర్లు) ఎగబాకింది.