జోయలుక్కాస్‌పై దేశవ్యాప‍్తంగా ఐటీ దాడులు | Jewellery Chain Joyalukkas Raided At Multiple Places In | Sakshi
Sakshi News home page

జోయలుక్కాస్‌పై దేశవ్యాప‍్తంగా ఐటీ దాడులు

Published Wed, Jan 10 2018 10:30 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

Jewellery Chain Joyalukkas Raided At Multiple Places In - Sakshi

సాక్షి, చెన్నై:  ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయలుక్కాస్‌కు ఆదాయ పన్నుశాఖ షాక్‌ ఇచ్చింది.  దేశవ్యాప్తంగా ఐడీ  సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయ ప​న్ను అధికారులు  దాడి చేశారు. హైదరాబాద్‌, కేరళ, బెంగళూరు,ముంబై తదితర నగరాల్లో ఏకకాలంలో షాపులు  మూసివేసి మరీ సోదాలు  నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ సోదాలు ప్రారంభించగా, షాపులు మూసేసి మరీ అధికారులు సోదాలు చేపట్టారు. తమిళనాడుతో పాటు అనేక రాష్ట్రాల్లో జ్యూయలరీ చైన్ జోయలుక్కాస్‌కు చెందిన షోరూంలలో అధికారులు తనిఖీలు చేపట్టారు.  

ఇప్పటికి 4 లాకర్లు,  20 దస్తావేజులు, అధికారికంగా రూ.4 కోట్లు, 60 లక్షల విలువైన  డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీనియర్ ఆదాయపు పన్ను అధికారి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కాగా గల్ఫ్ దేశాలలో స్థాపించబడిన జ్యూయలరీ మేజర్‌ జోయలుక్కాస్‌ గ్రూపు ఒమన్, బహ్రెయిన్, ఇండియా, యూకే  సహా 11 దేశాలలో 130 షోరూంలను నిర్వహిస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement