Income Tax Department
-
నిజంగానే వ్యవసాయ ఆదాయం ఉందా? లేక...
మీ అందరికీ తెలిసిందే. వ్యవసాయం మీద ఆదాయం చేతికొస్తే, ఎటువంటి పన్ను భారం లేదు. ఈ వెసులుబాటు 1961 నుంచి అమల్లో ఉంది. చట్టంలో నిర్వచించిన ప్రకారం వ్యవసాయ భూమి ఉంటే, అటువంటి భూమి మీద ఆదాయం/రాబడికి ఆదాయపు పన్ను లేదు. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి ఎటువంటి ఏ ఇతర ఆదాయం లేకపోతే, వచ్చిన ఆదాయం ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేకుండా మినహాయింపులోనే ఉంటుంది. ఎటువంటి పన్నుకి గురి కాదు. భూమి, ఆదాయం ఈ రెండూ, తూ.చా. తప్పకుండా ఆదాయపు పన్ను చట్టంలో నిర్వచించిన ప్రకారం ఉండాలి. ఎటువంటి తేడాలు ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే మినహాయింపు ఇస్తారు.కొంత మందికి అటు వ్యవసాయ ఆదాయం, ఇటు వ్యవసాయేతర ఆదాయం రెండూ ఉండొచ్చు. వారు రిటర్న్ వేసేటప్పుడు రెండు ఆదాయాలను జోడించి వేయాలి. దానికి అనుగుణంగా ఆ ఆదాయాలపై పన్ను లెక్కించి, అందులో మినహాయింపులు ఇవ్వడమనేది .. ఇదంతా ఒక రూలు. దాని ప్రకారం లెక్క చెప్తే పన్నుభారం పూర్తిగా సమసిపోదు కానీ ఎక్కువ శాతం రిలీఫ్ దొరుకుతుంది. పై రెండు కారణాల వల్ల, రెండు ఉపశమనాల వల్ల ట్యాక్స్ ఎగవేసే వారు.. ఎప్పుడూ ఎలా ఎగవేయాలనే ఆలోచిస్తుంటారు. ట్యాక్స్ ప్లానింగ్లో ప్రతి ఒక్కరికి అనువుగా దొరికేది వ్యసాయ ఆదాయం. అక్రమంగా ఎంతో ఆర్జించి, దాని మీద ట్యాక్స్ కట్టకుండా బైటపడే మార్గంలో అందరూ ఎంచుకునే ఆయుధం ‘వ్యవసాయ ఆదాయం’. దీన్ని ఎలా చూపిస్తారంటే..👉 తమ పేరు మీదున్న పోరంబోకు జాగా, 👉 ఎందుకు పనికిరాని జాగా. 👉 వ్యవసాయ భూమి కాని జాగా 👉 సాగుబడి చేయని జాగా 👉 తమ పేరు మీద లేకపోయినా చూపెట్టడం 👉 కౌలుకి తీసుకోకపోయినా దొంగ కౌలు చూపడం 👉 కుటుంబంలో తాత, ముత్తాతల పొలాలను తమ పేరు మీద చూపెట్టుకోవడం 👉 బహుమతులు, ఇనాముల ద్వారా వచ్చిన జాగా 👉 దురాక్రమణ చేసి స్వాధీనపర్చుకోవడం మరికొందరు నేల మీదే లేని జాగాని చూపెడతారు. ఇలా చేసి ఈ జాగా.. చక్కని మాగణి అని.. బంగారం పండుతుందని బొంకుతారు. కొంత మంది సంవత్సరానికి రూ. 50,00,000 ఆదాయం వస్తుందంటే ఇంకొందరు ఎకరానికి రూ. 5,00,000 రాబడి వస్తుందని చెప్పారు. ఈ మేరకు లేని ఆదాయాన్ని చూపించి, పూర్తిగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లోకి పాకింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా కొనసాగింది. హైదరాబాద్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూముల మీద లెక్కలేనంత ఆదాయం చూపించారు. అధికారులు, మామూలుగానే, వారి ఆఫీసు రూమ్లో అసెస్మెంట్ చేస్తేనే అసెస్సీలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అధికారులు అడిగే ప్రశ్నలకు, ఆరా తీసే తీరుకు కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటిది, ఈసారి అధికారులు శాటిలైట్ చిత్రాల ద్వారా వారు చెప్పిన జాగాలకు వెళ్లారు. అబద్ధపు సర్వే నంబర్లు, లేని జాగాలు, బీడు భూములు, అడవులు, చౌడు భూములు, దొంగ పంటలు, దొంగ కౌళ్లు, లేని మనుషులు, దొంగ అగ్రిమెంట్లు.. ఇలా ఎన్నో కనిపించాయి. ఇక ఊరుకుంటారా.. వ్యసాయ ఆదాయాన్ని మామూలు ఆదాయంగా భావించి, అన్ని లెక్కలూ వేశారు. ఇరుగు–పొరుగువారు ఎన్నో పనికిమాలిన సలహాలు ఇస్తారు. వినకండి. ఫాలో అవ్వకండి. ఒకవేళ ఫాలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎగవేతకు ఒక మార్గమే ఉంది. కానీ ఇప్పుడు ఎగవేతలను ఏరివేసి, సరిచేసి, పన్నులు వసూలు చేసే మార్గాలు వందలాది ఉన్నాయి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ప్రత్యేక కేసుల్లోనే సోషల్ మీడియా, డిజిటల్ యాక్సెస్
న్యూఢిల్లీ: కొత్త ఆదాయపన్ను బిల్లు కింద కేవలం సెర్చ్, సర్వే ఆపరేషన్లలోనే పన్ను చెల్లింపుదారుల డిజిటల్ ఖాతాలు, కంప్యూటర్ పరికరాల ప్రవేశాన్ని ఆదాయపన్ను శాఖ బలవంతంగా తీసుకుంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అది కూడా పాస్వర్డ్లను పంచుకునేందుకు తిరస్కరించినప్పుడే ఇలా జరుగుతుందన్నారు. అంతేకానీ, సాధారణ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి స్క్రుటినీ కేసుల్లో ఆన్లైన్ గోప్యతకు భంగం కలిగించేది ఉండదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!ఈ తరహా చర్యలు తీసుకునే అధికారం 1961 ఆదాయపన్ను చట్టం కింద ప్రస్తుతం సైతం ఉన్నట్టు అధికారి చెప్పారు. ఇవే అధికారాలను ఆదాయపన్ను బిల్లు 2025లోనూ పేర్కొన్నట్టు తెలిపారు. ఎల్రక్టానిక్ రికార్డులు, పన్ను చెల్లింపుదారుల ఈ–మెయిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్, క్లౌడ్ స్టోరేజీ నుంచి సమాచారం పొందే అధికారం కొత్త ఆదాయపన్ను బిల్లులోని సెక్షన్ 247 కింద దఖలు పడనున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిరస్కరించారు. ఇవి కేవలం భయాన్ని కల్పించేవిగా పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా ఖాతాలు లేదా ఆన్లైన్ కార్యకలాపాలపై పన్ను శాఖ నిఘా పెట్టబోదన్నారు. -
లెక్కల్లో గోల్మాల్.. శ్రీచైతన్య కార్యాలయాల్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్ కార్యాలయంతోపాటు, ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లోని ప్రాంతీయ కార్యాలయాల్లో సోమవారం ఉదయం నుంచి ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు.పన్ను ఎగవేత ఆరోపణలపై అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. సీఆర్పీఎఫ్ బలగాల భద్రతతో సోదాలు కొనసాగాయి. కాలేజీల నిర్వహణ, విద్యార్థుల ఫీజుల చెల్లింపునకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, సంస్థ ఆయా బ్రాంచీలవారీగా చెల్లిస్తున్న ఆదాయం పన్ను వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. ఆదాయం పన్ను నుంచి తప్పించుకునేందుకు విద్యార్థుల నుంచి అధికశాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. రూ. 5 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్వేర్లను ఐటీ అధికారులు పరిశీలించారు. 2020లోనూ శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటి సోదాలు నిర్వహించగా, గతంలోనూ 11 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను కూడా ఐటీ శాఖ పరిశీలిస్తోంది. మాదాపూర్లోని శ్రీచైతన్య హెడ్ ఆఫీస్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. -
ఆదాయపన్ను శాఖకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ
-
పెట్టుబడిదారులకు ప్రోత్సాహం చట్టాలలో కీలక మార్పులు
-
వేతన జీవులకు బిగ్ రిలీఫ్ .. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
పేదలు, మహిళల కోసం కొత్త పథకాలు
-
Income Tax Slabs : సామాన్యుడిపై పన్నుల భారం తగ్గించండి
-
మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.బ్యాంకు ఖాతాలో నగదు జమసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడంఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.ఆస్తి లావాదేవీలుస్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులుక్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమాషేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుషేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు. -
క్రెడిట్కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు..
ఆదాయపన్ను శాఖ (Income tax) ప్రతిఒక్కరినీ ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. అన్ని లావాదేవీలపైనా నిఘా ఉంచుతుంది. ప్రస్తుతం క్రెడిట్కార్డుల వినియోగం పెరిగింది. అన్ని రకాల చెల్లింపులకూ క్రెడిట్ కార్డులే (Credit cards) వినియోగిస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను నోటీసు రాకుండా నివారించాలనుకుంటే పొరపాటున కూడా చేయని లావాదేవీలు కొన్ని ఉన్నాయి.క్రెడిట్ కార్డులతో చేసే కొన్ని లావాదేవీలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి రావచ్చు. మీకు నోటీసు పంపవచ్చు. ఇవి అలాంటి లావాదేవీలైతే, సీఏలు కూడా మిమ్మల్ని రక్షించలేరు. అందుకే ఈ సమాచారం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు చాలా ముఖ్యమైనది. ఎటాంటి లావాదేవీలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయో ఇక్కడ తెలుసుకోండి.ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే దాని డేటా ఆదాయపు పన్ను శాఖకు వెళుతుంది.క్రెడిట్ కార్డ్పై సంవత్సరానికి రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా ఉంచుతుంది. రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు వంటి పెద్ద లావాదేవీలు శాఖ దృష్టిని ఆకర్షించవచ్చు.ఒక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా బాండ్లలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు.రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దాని సమాచారం ఆటోమేటిక్గా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది.బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం ఆదాయపు పన్ను శాఖ దృష్టిని ఆకర్షిస్తుంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే నోటీసు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.నగదు రూపంలో జరిగే వ్యాపార లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంచుతుంది. రూ.50,000 కంటే ఎక్కువ వ్యాపార లావాదేవీల సమాచారం కోసం డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడగవచ్చు. -
‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’
వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని వాణిజ్య సంఘాలు కోరాయి. అలాగే, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలకు ప్రేరణనివ్వాలని, ఇంధనం(Fuel)పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్(Budget 2025) ముందస్తు సమావేశంలో భాగంగా ఈమేరకు ప్రతిపాదనలు చేశాయి.ఈ కార్యక్రమంలో వాణిజ్య మండళ్ల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దీపమ్ కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పాల్గొన్నారు. 2025 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి మీడియాతో మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు.‘భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉత్పత్తులు చైనా ద్వారా దిగుమతి అవుతుండడం చూస్తున్నాం. వాతావరణానికి సంబంధించి సమస్యలు, ఇతర అంశాలు ఆహార భద్రత, ద్రవ్యోల్బణం(Inflation)పై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ దిశగా మేము పలు సూచనలు చేశాం. అధిక ఉపాధికి అవకాశం ఉన్న వ్రస్తాలు, పాదరక్షలు, పర్యాటకం, ఫర్నీచర్ తదితర రంగాలకు ప్రేరణ కల్పించే చర్యలు తీసుకోవాలని కోరాం. ఎంఎస్ఎంఈ(MSME)లకు సంబంధించి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాల్యూ చైన్తో భారత్ను అనుసంధానించాలని కోరాం. పెట్రోల్పై కొంత ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా ఖర్చు పెట్టే ఆదాయాన్ని పెంచొచ్చని సూచించాం’ అని పురి వివరించారు.ఇదీ చదవండి: కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలుచైనా దిగుమతులతో ఇబ్బందులు..చైనా సొంత ఆర్థిక వ్యవస్థ నిదానించడంతో చౌకగా ఉత్పత్తులను భారత్లోకి పంపిస్తోందంటూ, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు తాము తెలియజేశామని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్ తెలిపారు. ఆదాయపన్ను తగ్గించడం వల్ల ప్రజల చేతుల్లో ఆదాయం మిగులుతుందని, వినియోగాన్ని పెంచుతుందని సూచించినట్టు పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ హేమంత్ జైన్ వెల్లడించారు. జీఎస్టీని సులభంగా మార్చాలని కూడా కోరినట్టు తెలిపారు. సరఫరా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈలకు కావాల్సిన వాటిపై (రుణాల లభ్యత, టీడీఎస్ సులభతరం) దృష్టి పెట్టాలని కోరినట్టు అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ పేర్కొన్నారు. -
అజిత్ పవార్ కు భారీ ఊరట..
-
పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!
నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తున్నా ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. ‘అదేంటి నెలకు రూ.6 లక్షల చొప్పున వార్షిక ఆదాయం రూ.72 లక్షలు అవుతుంది కదా. 30 శాతం ట్యాక్స్ స్లాబ్లోకి వస్తున్నా పన్ను చెల్లించకపోవడం ఏంటి’ అనుకుంటున్నారా? నెలకు అంతలా సంపాదిస్తుంది ప్రముఖ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగో లేదా ఎగ్జిక్యూటివ్ స్థాయి ఆఫీసరో అనుకుంటే పొరపడినట్లే. ఈ సంపాదన ఓ దోసె బండి నిర్వాహకుడిది. అవునండి. వీధి వ్యాపారులు, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నవారు తాము సంపాదిస్తున్న డబ్బుపై ట్యాక్స్ చెల్లించడం లేదు. ఈమేరకు ఇటీవల నవీన్ కొప్పరం అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదికాస్తా విభిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.‘మా ఇంటి పక్కన దోసె బండి నిర్వాహకుడు రోజు రూ.20,000 సంపాదిస్తాడు. నెలకు రూ.6 లక్షలు ఆదాయం ఉంటుంది. అందులో సగం వరకు ఖర్చులు తీసేసినా రూ.3 లక్షలు-రూ.3.5 లక్షలు సంపాదన. దానిపై తాను ఎలాంటి ట్యాక్స్ చెల్లించడు. అదే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నెలకు రూ.60,000 సంపాదిస్తే అందులో 10 శాతం ట్యాక్స్ చెల్లించాలి’ అని నవీన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంలో ఆదాయ వ్యత్యాసాలు, పన్ను హేతబద్ధీకరణ వంటి అంశాలపై కామెంట్లు వస్తున్నాయి.A street food dosa vendor near my home makes 20k on an average daily, totalling up to 6 lakhs a month.exclude all the expenses, he earns 3-3.5 lakhs a month.doesn’t pay single rupee in income tax.but a salaried employee earning 60k a month ends up paying 10% of his earning.— Naveen Kopparam (@naveenkopparam) November 26, 2024ఇదీ చదవండి: తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న అనధికారిక రంగాన్ని మరింత క్రమబద్ధీకరించి అందుకు అనుగుణంగా పన్నుల పరిధిని పెంచాలని కొందరు నెటిజన్లు తెలియజేస్తున్నారు. దీనికోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చసాగాలని చెబుతున్నారు. కొందరు వైద్యులు, న్యాయవాదులు, చిన్న వ్యాపార యజమానులు.. వంటి ఇతర స్వయం ఉపాధి పొందేవారి సంపాదన పన్ను రహితంగా ఉండడంపట్ల ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ‘డాక్టర్లు, లాయర్లు, టీ దుకాణాదారులు, గ్యారేజీ నిర్వహకులు, వాణిజ్య ప్రాంతాల్లోని ఇతర వ్యాపారుల సంగతేంటి? చాలామంది ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా విదేశీ సెలవులకు వెళుతున్నారు. ఇళ్లు కొంటున్నారు. ఏటా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది?’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. -
అకౌంట్లో క్యాష్.. ఎన్ని లక్షలు ఉండొచ్చు?
మనలో చాలా మందికి బ్యాంకులలో సేవింగ్ ఖాతాలు ఉంటాయి. వివిధ అవసరాల నిమిత్తం వీటిలో లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ అకౌంట్లలో లెక్కకు మించి క్యాష్ ఉంచుకునేందుకు వీలు లేదు. ఇందు కోసం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పరిమితి ఉంది.బ్యాంకు, ఇతర పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితి అనేది ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించకుండా ఒక వ్యక్తి నిర్దిష్ట వ్యవధిలో డిపాజిట్ చేయగల గరిష్ట నగదు మొత్తాన్ని సూచిస్తుంది. నగదు లావాదేవీల ప్రవాహాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం, మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడం కోసం ఆదాయపు పన్ను నిబంధనల మేరకు ఈ పరిమితిని సెట్ చేశారు.రూ.10 లక్షలు మించితే..భారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ముఖ్యమైన నగదు డిపాజిట్లతో సహా నగదు లావాదేవీలకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి రూ.50 లక్షలు ఉంటుంది. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడానికి ఆర్థిక సంస్థలు బాధ్యత వహిస్తాయని గుర్తించడం అవసరం.ఇదీ చదవండి: మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?ఇక నగదు ఉపసంహరణల విషయానికి వస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్లో టీడీఎస్ నిబంధనలు పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ. 1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయని వ్యక్తులకు విత్డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ. 1 కోటికి మించితే 5% టీడీఎస్ వర్తిస్తుంది. -
ట్యాక్స్ ప్లానింగ్.. సరిగమపదని..
‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకోండి. ’ఎగవేత’ భూతం ’కబంధ’ హస్తాల నుంచి బైటపడ్డాం. ఇప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ మీద దృష్టి సారించి, ప్లానింగ్ రాగాల్లో స,రి,గ,మ,ప,ద,ని తెలుసుకుందాం. గత దశాబ్దంగా మనం వింటున్న పదం.. జనాలు నలుగురు మెచ్చిన పదం ’మేనేజ్మెంట్’.. కేవలం కంపెనీలు, కార్పొరేట్లు, వ్యాపారం, వాణిజ్య రంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ’మేనేజ్మెంట్’ కంపల్సరీ. సంస్థలతో బాటు వ్యక్తులకు, మనందరికీ వర్తించేది ’మేనేజ్మెంట్’. ట్యాక్స్ని మేనేజ్ చేయాలి. ట్యాక్స్ మేనేజ్మెంట్లో ముఖ్యమైన ప్రాథమిక అంశం, కీలకాంశం ’ట్యాక్స్ ప్లానింగ్’. ఇది క్రియాశీలక చర్య .. చర్చ!ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాచట్టరీత్యా, రాచమార్గంలో పన్నుభారాన్ని తగ్గించే మార్గం. అవసరం అయినంత, అర్హత ఉన్నంత .. అన్ని ప్రయోజనాలు, తగ్గింపులు, మినహాయింపులు పొంది, ఆదాయాన్ని తగ్గించుకోవడం లేదా పెద్ద శ్లాబు నుంచి తక్కువ/చిన్న శ్లాబుకి తెచ్చుకోవడం, 30 శాతం నుంచి 20 శాతానికి, 20 శాతం నుంచి 10 శాతానికి, ఇంకా 10 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించుకోవడం.ట్యాక్స్ ప్లానింగ్ మూడు రకాలుగా ఉంటుంది. స్వల్పకాలికం.. అంటే ఆ సంవత్సరానికి పన్ను తగ్గించుకోవడం. దీర్ఘకాలికం.. అంటే భవిష్యత్లో పన్నుని తగ్గించుకోవడం. మూడోది, విరాళాల ద్వారా తగ్గించుకోవడం.పన్ను తగ్గించుకోవడం: స్వల్పకాలికంగా గానీ దీర్ఘకాలికంగా గానీ పన్నులను తగ్గించుకోవడం.పోస్ట్పోన్ చేసుకోవడం: ఈ విధంగా ఎప్పుడు చేసుకోవచ్చంటే.. బడ్జెట్కు ముందు.. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మార్చి 31 లోపల లేదా ఏప్రిల్ 1 తర్వాత.. స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఇలా పోస్ట్పోన్ చేసుకోవచ్చు.పన్ను భారాన్ని విభజించుట: ఒకే మనిషి మీద ఎక్కువ ట్యాక్స్ పడే పరిస్థితుల్లో ఆదాయాన్ని చట్టప్రకారం అగ్రిమెంట్ల ద్వారా ఆదాయాన్ని విభజించడం. ఉదాహరణకు ఆలుమగలు వారి పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్లను మార్చి వడ్డీ సర్దుబాటు చేసుకోవచ్చు.తప్పించుకోవడం: సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రకారం తప్పించుకోవడాన్ని చట్టరీత్యా కూడా చేయొచ్చు. చట్టంలోని లొసుగుల్లోని అంశాలకు లోబడి పన్ను తప్పించుకోవచ్చు. ఉదాహరణకు భార్యా, భర్త ఇద్దరికీ పన్నుభారం వర్తిస్తుంది. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ స్కూల్ ఫీజులు కడుతున్నారు. అలాంటప్పుడు ఇద్దరి స్కూల్ ఫీజును ఒకరి కేసులో, మిగతా పిల్లల ఫీజును మరొక కేసులో క్లెయిం చేయొచ్చు. ఒకరకంగా కాకుండా మరో విధంగా కట్టడాన్ని ఇంగ్లీషులో disguise taxation అని అంటారు. మారువేషం కాదు. మరో వేషంలాంటిది. అంటే, చేసే వ్యాపారం భాగస్వామ్యం లేదా కంపెనీలాగా చేస్తే 30 శాతం పన్ను పడుతుంది. అలా కాకుండా సొంత వ్యాపారంగా చేస్తే శ్లాబుల వారీగా 10 శాతం, 20 శాతం, 30 శాతం చొప్పున కట్టొచ్చు. బేసిక్ లిమిట్ కూడా వర్తిస్తుంది.సంపూర్తిగా ఆలోచించాలి: పాటల ట్యూనింగ్లాగే ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఉంటుంది. గీత రచనను బట్టి స్వర రచన. ఏదైనా ఏడు స్వరాల్లో ఇమడాలి. పూర్తి సమాచారం ఉండాలి. చట్టాన్ని అతిక్రమించకూడదు. పన్ను భారం తగ్గాలి, చట్టప్రకారం జరగాలి.పన్నుకు సంబంధిచిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ-మెయిల్ పంపించగలరు -
ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానా
పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కొత్త వార్నింగ్ ఇచ్చింది. విదేశీ ఆస్తులు లేదా విదేశాల నుండి సంపాదించిన ఆదాయాన్ని తమ ఐటీఆర్లో బహిర్గతం చేయడంలో విఫలమైతే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్యాక్స్ పేయర్స్ను హెచ్చరిస్తూ అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించింది.పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో అసెస్మెంట్ ఇయర్ 2024-25కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నివేదించేలా చూడటమే లక్ష్యంగా ఈ "కంప్లయన్స్-కమ్-అవేర్నెస్ క్యాంపెయిన్"ను ఐటీ శాఖ చేపట్టింది. ఉల్లంఘించినవారికి బ్లాక్ మనీ నిరోధక చట్టం కింద జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.విదేశీ ఆస్తి అంటే ఏమిటి?ఐటి శాఖ అడ్వైజరీ ప్రకారం.. భారతీయ నివాసితులకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, నగదు రూప బీమా ఒప్పందాలు, ఏదైనా సంస్థ లేదా వ్యాపారంపై ఆదాయం, స్థిరాస్తి, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీలు, ట్రస్టీలుగా ఉండే ట్రస్ట్లు, సెటిలర్ ప్రయోజనాలు, మూలధన ఆస్తి వంటి వాటిని విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు. -
రూ.12.11 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ 20 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 15.41 శాతం అధికంగా రూ.12.11 లక్షల కోట్ల నికర పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో రూ.5.10 లక్షల కోట్లు కార్పొరేట్ పన్ను రూపంలో రాగా, రూ.6.62 లక్షల కోట్లు నాన్ కార్పొరేట్ రూపంలో సమకూరింది. ఇక స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్ నుంచి నవంబర్ 10 వరకు రూ.15.02 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగింది. ఈ కాలంలో రూ.2.92 లక్షల కోట్ల రిఫండ్లను ఆదాయపన్ను శాఖ పూర్తి చేసింది. -
ఐటీ వెబ్సైట్ను చూస్తూ ఉండండి.. ఎందుకంటే..
ప్రతి రోజూ కాకపోయినా వారానికొకసారైనా ఇన్కంట్యాక్స్ వెబ్సైట్ని చూస్తూ ఉండండి. రోజు, తిథి, వారం, నక్షత్రాల్లాగా, వాతావరణం రిపోర్ట్లాగా, బంగారం రేట్లలాగా, షేర్ మార్కెట్ల ధరల్లాగా, చూడక తప్పదు. సైటు తెరవగానే హోమ్పేజీలో ఇంపార్టెంట్ విషయాలు ఇరవై ఉంటాయి. వీటిని తెరిస్తే మీకు ఉపయోగపడే సమాచారం కనిపిస్తుంది. వీటిలో ముఖ్యమైనవి.. ఈ–వెరిఫికేషన్ స్టేటస్, పాన్ స్టేటస్, చెల్లించిన పన్ను స్టేటస్, మీ అధికారి ఎవరు, మీ రిఫండ్ స్టేటస్, ఆధార్తో అనుసంధానం వివరాలు, నోటీసు వివరాలు.మీకు అవసరమైన విండోని ఓపెన్ చేస్తే అందులో ఉన్న కాలాలు అన్నీ పూరిస్తే, వివరాలు తెలుస్తాయి. రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రిఫండ్ ఇంకా రాలేదేంటి అని ప్రశ్నించడం మొదలెడతారు. అలాగే, అసెస్మెంట్ స్టేటస్కు సంబంధించి సాధారణంగా మీ రిజిస్టర్డ్ మొబైల్కు సమాచారం వస్తుంది. ఓటీపీతో మొదలు అన్ని స్టేజీల్లోనూ మీకు సమాచారం అందుతూనే ఉంటుంది. ఆ సమాచార స్రవంతిని ఫాలో అవ్వండి. ఒకరోజు టీవీ, సీరియల్స్ని మిస్ అయినా ఫర్వాలేదు. ఈ ట్రాక్ని వదలకండి. పోస్టులో మీ ఇంటికి వచ్చి, తలుపు కొట్టి నోటీసులు ఇచ్చే రోజులు కావివి. అంతా ఆన్లైన్. అంతే కాకుండా నోటీసులు కూడా పంపుతున్నారు. ఈ మెయిల్స్ని ట్రాక్ చేయండి. అప్పుడప్పుడు నోటీసులు, సమాచారాలు ఈమెయిల్ బాక్సులో స్పామ్లోకి వెళ్లిపోతాయి. అలా పోయినా మనకు నోటీసు ఇచ్చినట్లుగానే భావిస్తారు డిపార్ట్మెంట్ వారు. ఫోన్లో మెసేజీ వచ్చిన వెంటనే మెయిల్ రాకపోవచ్చు. పది, పదిహేను రోజులు ఆగండి.టాక్స్ కాలెండర్ఇవన్నీ కాకుండా ‘టాక్స్ కాలెండర్’ కనిపిస్తుంది. అందులో ప్రతి తేదీని క్లిక్ చేస్తూ పోతే, ఆ రోజు మీరేం చేయాలో తెలుస్తుంది. ఉదాహరణకు సెప్టెంబర్ 15 అనుకోండి.. ఈ తేదీలోపల మీరు ఏయే ఫారాలు వెయ్యాలో, మీ ఎన్నో వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో చెబుతుంది. మీకు ఏ విషయంలో వారి సహాయం కావాలో, ఆ సలహా, సహాయం అందిస్తారు. మార్గదర్శకాలను కూడా చెబుతారు. ఫైలింగ్, టీడీఎస్, ట్యాక్స్, పాన్, టాన్, వార్షిక సమాచార నివేదికకి సంబంధించిన తప్పొప్పులు.. ఇలాంటి వాటి గురించి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఇవన్నీ ఫ్రీ కాల్స్! మీరు దాఖలు చేసే ప్రతి ఫారం 1,2,3,4,5,6,7.. ఇలాంటి వాటికి సంబంధించి ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి. మీరు నేరుగా సంప్రదించవచ్చు. సంప్రదించే ముందు మీ వివరాలు, అంటే పాన్, పేరు, పుట్టిన తేదీ, పన్నుకి సంబంధించిన వివరాలు ఉండాలి. అప్పటికప్పుడే మీకు సమాచారం దొరుకుతుంది. అలాగే మీ మెయిల్స్కి రెస్పాన్స్ వస్తుంది.ఇంకొక మంచి అవకాశం ఏమిటంటే, మీరు ఫిర్యాదులు కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఐటీ రిఫండ్ విషయం ఉంటుంది. అవసరం అనిపిస్తే ఫిర్యాదులు చేయండి. మీ ఫిర్యాదుని నమోదు చేసుకుంటారు. ఎక్నాలెడ్జ్ చేస్తారు. దానికో నంబర్ కేటాయిస్తారు. ఆ ఫిర్యాదుల స్టేటస్ని తెలుసుకోవచ్చు. వెంటనే దర్శించి, అన్నీ తెలుసుకోండి. మీ పాన్ నంబరు, పాస్వర్డ్ మీ దగ్గరుండాలి. ఈ సైట్ స్నేహపూర్వకమైనది. చాలా సులభతరమైనది. మీకు అన్నీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇది ఉచితం. త్వరగా పని పూర్తవుతుంది. రెస్పాన్స్ బాగుంటుంది. వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఈ సైట్ డైనమిక్ అండోయ్!! పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ నోటీసులు
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందుకున్నారు. టీడీఎస్ క్లెయిమ్లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉద్యోగులకు కట్ చేసిన టీడీఎస్లలో కొంత భాగం ఆదాయపు పన్ను శాఖ రికార్డులలో నమోదు కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో డిమాండ్ చేసిన మొత్తాలు రూ.50,000 నుంచి రూ.1,45,000 వరకు ఉన్నాయి. టీడీఎస్ వ్యత్యాసాలపై వడ్డీ, ఛార్జీలను సైతం నోటీసుల్లో పేర్కొన్నారు.ట్యాక్స్ పోర్టల్లో సాంకేతిక సమస్యల కారణంగా టీడీఎస్ క్లెయిమ్లు ఆటోమేటిక్గా అప్డేట్ కాకపోయి ఉండవచ్చని టీసీఎస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. తాము క్లెయిమ్స్ను మ్యాన్యువల్ సమర్పించాల్సి వచ్చిందని, సిస్టమ్లో నమోదు కాని టీడీఎస్ మొత్తానికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు పంపిందని ఆ ఉద్యోగి వివరించారు.ఇదీ చదవండి: కలవరపెడుతున్న డెల్ ప్రకటనటీడీఎస్ రికార్డుల్లోని వ్యత్యాసాల కారణంగా చాలా మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీఫండ్లు ఆలస్యం అయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ నుండి ప్రాథమిక అంచనా ఆందోళన కలిగించింది. సమస్యలను సరిదిద్దే వరకు ట్యాక్స్ రీఫండ్లో మరింత జాప్యం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ నోటీసులు ఉన్నప్పటికీ, పన్ను అధికారుల ద్వారా రీప్రాసెసింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇంటర్నల్ ఈ-మెయిల్స్లో తెలియజేసింది. -
ట్యాక్స్ రీఫండ్.. పన్ను చెల్లింపుదారులూ జాగ్రత్త!
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు పూర్తయి పన్నుచెల్లింపుదారులు ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భాన్నే సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు పొంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది.మోసపూరిత కాల్స్, పాప్-అప్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ సోషల్ మీడియా ద్వారా సూచించింది. ఒకవేళ అలాంటి సందేశం వచ్చినట్లయితే, అది ఐటీ శాఖ నుంచి వచ్చినదేనా అని అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.“క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థించే ఈమెయిల్లకు ప్రత్యుత్తరం ఇవ్వవద్దు లేదా వెబ్సైట్లను సందర్శించవద్దు. పన్ను చెల్లింపుదారులను అందించిన ఈమెయిల్ చిరునామా ద్వారా మాత్రమే వారిని ఆదాయపు పన్ను శాఖ సంప్రదించవచ్చు” అని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది.pic.twitter.com/d5oVz6aiPW— Income Tax Mumbai (@IncomeTaxMum) August 15, 2024 -
ఐటీఆర్ ప్రాసెసింగ్.. ఐటీ శాఖ అప్డేట్
2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITRs) ప్రాసెసింగ్పై ఆదాయపు పన్ను శాఖ అప్డేట్ విడుదల చేసింది. జూలై 31 నాటికి 6.21 కోట్ల ఐటీఆర్లు ఈ-వెరిఫై అయ్యాయి. వీటిలో 5.81 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా వైరిఫై చేశారు.ఐటీ శాఖ ప్రకటన ప్రకారం.. ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలైన ఐటీఆర్లలో ఇప్పటికే 2.69 కోట్ల ఐటీఆర్లను ప్రాసెస్ చేశారు. ఇవి మొత్తం దాఖలు చేసిన రిటర్న్స్లో 43.34 శాతం అని ఐటీ శాఖ పేర్కొంది.జూలై 31 గడువు నాటికి రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ఐటీఆర్లు దాఖలు అయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 7.5 శాతం పెరిగాయి. ఈసారి గణనీయమైన సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. ఈ విధానంలో 5.27 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. పాత పన్ను విధానంలో 2.01 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. 58.57 లక్షల మొదటిసారి ఫైలర్లు ఉన్నారు. -
సమీపిస్తున్న గడువు.. ఐటీ శాఖ బిగ్ అప్డేట్!
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 ఆఖరి రోజు. పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. గడువు సమీపిస్తుండడంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో రిటర్న్స్ దాఖలయ్యాయి.ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది రిటర్న్స్ దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు వెల్లడించింది. గతేడాదిలో దాఖలైన ఐటీ రిటర్న్స్తో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం అధికమని ‘ఎక్స్’ పోస్ట్లో పేర్కొంది.గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-ఫైలింగ్ పోర్టల్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ శాఖకు సాంకేతిక సాయం అందించే ఇన్ఫోసిస్కు సూచించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రిటర్న్స్ పోటెత్తినా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామంది. కాగా గతేడాది మొత్తం 8.61 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. -
ఐటీఆర్ గడువు పొడిగింపు? ఐటీ శాఖ క్లారిటీ
ఐటీఆర్ రిటర్న్స్ గడువుకు సంబంధించి చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్ ఆదాయపు పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ వార్త ఫేక్ అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31 అని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. “ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీ పొడిగింపునకు సంబంధించి సందేశ్ న్యూస్ పేరుతో న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు మాకు తెలిసింది. ఇది ఫేక్ న్యూస్. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక వెబ్సైట్/పోర్టల్ నుంచి వచ్చే అప్డేట్లను మాత్రమే అనుసరించాలని పన్ను చెల్లింపుదారులకు సూచిస్తున్నాం’’ అని వివరించింది.అదే విధంగా ఆదాయపు పన్ను రీఫండ్లకు సంబంధించి చేస్తున్న స్కామ్ గురించి కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. “తమ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి, ఒక కొత్త రకమైన స్కామ్ ఆందోళనలు లేవనెత్తింది. ట్యాక్స్ రీఫండ్ పేరుతో స్కామర్లు ఎస్ఎంఎస్లు, మెయిల్ పంపుతూ ట్యాక్స్ పేయర్స్ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును హరించడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అప్రమత్తం చేసింది.కాగా 22 జూలై వరకు 4 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో దాఖలు చేసిన రిటర్న్లతో పోలిస్తే 8% ఎక్కువ. జూలై 16న రోజువారీ దాఖలు చేసిన ఐటీఆర్ల సంఖ్య 15 లక్షలు దాటింది. గడువు తేదీ సమీపిస్తుండటంతో రోజువారీ ఫైలింగ్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. -
తప్పుడు క్లెయిమ్లతో చిక్కులు తప్పవు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు క్లెయిమ్లు నమోదు చేసి ఆదాయపన్ను మినహాయింపులు పొందాలంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవని ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ రేంజ్–5 అడిషనల్ కమిషనర్ పి.సుమిత హెచ్చరించారు. ఆదాయపు పన్ను సకాలంలో చెల్లింపు, మినహాయింపు మార్గాలు, జత చేయాల్సిన ధ్రువపత్రాలు, అవకతవకలకు పాల్పడితే విధించే జరిమానాలు తదితర అంశాలపై ఆదాయ పు పన్ను శాఖ అధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్లోని లారస్ ల్యాబ్స్ కార్యాలయంలో అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. సంస్థ ఉద్యోగులకు అడిషనల్ కమిషనర్ సుమిత, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్.రామకృష్ణ శాస్త్రి పలు అంశాలను వివ రించారు. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో గతే డాది నుంచి ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు సుమిత తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తమ అడ్రస్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలను ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా/ఈ–ఫైలింగ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా అడ్రస్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ మారితే విధిగా అప్డేట్ చేయాలని సూచించారు. పన్ను ఎగవేసేందుకు ఆదాయ వివరాలు దాచిపెట్టినా.. సబ్ రిజి్రస్టార్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, కెడ్రిట్/డెబిట్ కార్డులు, వాహనాలు కొనుగోలు ఇలా అన్ని రకాలుగా ఐటీ అధికారులకు సమాచారం అందుతుందని స్పష్టం చేశారు. ఏవైనా తేడాలు ఉంటే పదేళ్ల తర్వాత కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పన్ను చెల్లింపుదారులు సాధారణంగా చేస్తున్న పొరపాట్లు తదితర అంశాలపై ఎన్.రామకృష్ణ శాస్త్రి సూచనలు చేశారు. ఐటీ శాఖ నుంచి వచ్చే నోటీసులకు విధిగా స్పందించాలని, సకాలంలో స్పందించకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆధార్ కార్డును పాన్ నంబర్తో లింక్ చేయకపోతే అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుందని, అర్హతలేని రిటర్న్లు క్లెయిమ్ చేయొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ సర్కిల్–5 అసిస్టెంట్ కమిషనర్ జి.శ్రీనివాస్, లారస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సీహెచ్ సీతా రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాసుల పంట.. భారీగా పన్ను వసూళ్లు
దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 11 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.54 శాతం వృద్ధి చెంది రూ. 5.74 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ పన్ను వసూళ్లు రూ.4.80 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది.నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.74 లక్షల కోట్లలో (జూలై 11 నాటికి) కార్పొరేషన్ పన్ను (CIT) రూ. 2.1 లక్షల కోట్లు (రీఫండ్ మినహాయింపు తర్వాత), వ్యక్తిగత ఆదాయపు పన్ను (PIT) రూ. 3.46 లక్షల కోట్లు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) రూ. 16,634 కోట్లు (రీఫండ్ మినహాయింపు తర్వాత) ఉన్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) వివరించింది.కాగా ప్రభుత్వం 2024-25లో జూలై 11 వరకు రూ. 70,902 కోట్ల ప్రత్యక్ష పన్ను రీఫండ్లను జారీ చేసింది. 2023-24లో జారీ చేసిన రూ. 43,105 కోట్లతో పోలిస్తే ఇది 64.49 శాతం పెరిగింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పూర్తి ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-మార్చి) రూ. 21.99 లక్షల కోట్ల వసూళ్లను అంచనా వేసింది.ఒక నిర్దిష్ట సంవత్సరానికి ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన పన్ను వసూళ్లు ముఖ్యమైనవి . కేంద్రం మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక లోటు 5.2 శాతం లక్ష్యంగా పెట్టుకుంది. స్థూల ప్రాతిపదికన, రీఫండ్లను సర్దుబాటు చేయడానికి ముందు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు జూలై 11 నాటికి రూ. 6.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 23.24 శాతం వృద్ధి. -
ఐటీ రిటర్న్.. చలో ఆన్లైన్!
ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. జూలై 31 తుది గడువు. చివరి రోజు వరకు ఆగకుండా ముందుగా రిటర్నులు దాఖలు చేయడం సూచనీయం. చాలా మందికి రిటర్నుల విషయంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వేరొకరి సాయం తీసుకుంటుంటారు. కానీ, ఎవరికివారే ఆదాయపన్ను శాఖ ఈ–ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులను ఎల్రక్టానిక్ రూపంలో సమరి్పంచొచ్చు. ఈ–ఫైలింగ్ పోర్టల్ను యూజర్లకు అనుకూలంగా మార్చేందుకు ఆదాయపన్ను శాఖ ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ, ఐటీఆర్ దాఖలు ప్రక్రియ అర్థం కాని వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారికి ఉన్నమెరుగైన ప్రత్యామ్నాయ మార్గం.. మధ్యవర్తిత్వ సంస్థల సాయం తీసుకోవడం. వీటి ద్వారా చాలా సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఈ విషయంలో ఇవి మెరుగైన సేవలను అందిస్తున్నాయి. వీటి గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.ఈఆర్ఐలుఈ–రిటర్న్ ఇంటర్మీడియరీలు (ఈఆర్ఐలు) ఎలక్గ్రానిక్ రూపంలో పన్ను రిటర్నులు వేసేవారికి కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తున్నాయి. ఇవి అనుసంధానకర్తగా వ్యవహరిస్తాయి. సాఫ్ట్వేర్ ఆధారితంగా నడిచే ప్లాట్ఫామ్లు. వీటి ద్వారా ఎవరైనా రిటర్నులు సమరి్పంచొచ్చు. పన్ను చెల్లింపుదారుల తరఫున పన్ను రిటర్నుల దాఖలుకు ఐటీ శాఖ నుంచి వీటికి అనుమతి ఉంది. క్లియర్ట్యాక్స్, క్వికో, ట్యాక్స్బడ్డీ, మైఐటీ రిటర్న్, ఈజెడ్ట్యాక్స్, ట్యాక్స్2విన్ ఇవన్నీ ఈఆర్ఐలే. రిటర్నుల ఆటోఫిల్, రివ్యూ, ఈ–ఫైల్.. ఇలా మూడంచెల్లోనే రిటర్నులను సమరి్పంచొచ్చు. పన్ను రిటర్నులు వేయడం ఇంత సులువా? అనేలా ఇవి సేవలు అందిస్తున్నాయి.సౌకర్యం..ఇవి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కావడంతో పన్ను చెల్లింపుదారులు తమ ఇంటి నుంచే ఖాళీ సమయంలో సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. వీటి యూజర్ ఇంటర్ఫేస్ అర్థం చేసుకునేందుకు సులభంగా, సమకాలీనంగా ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో ఈ ప్లాట్ఫామ్లను వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. మొబైల్ యాప్ల నుంచి రిటర్నులు వేసే సౌకర్యాన్ని సైతం అందిస్తున్నాయి. క్వికో అయితే యూపీఐ ద్వారా పన్ను చెల్లించే సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్, ఫామ్ 16 పత్రాల కాపీలను దగ్గర ఉంచుకుంటే, రిటర్నులు వేగంగా సమరి్పంచొచ్చు. ఈ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై మూలధన లాభాలు ఉన్న వారూ ఈ ప్లాట్ఫామ్ల ద్వారా రిటర్నులు సులభంగానే దాఖలు చేసుకోవచ్చు. ప్రముఖ స్టాక్ బ్రోకర్లతో వీటికి ఒప్పందం ఉంది. కనుక పన్ను చెల్లింపుదారుల సమ్మతితో వారికి సంబంధించి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వివరాలను బ్రోకర్ల సర్వర్ల నుంచి సెకన్ల వ్యవధిలో తీసుకుని రిటర్నుల పత్రంలో నమోదు చేస్తాయి. కనుక వీటిని విడిగా నమోదు చేయాల్సిన ఇబ్బంది ఉండదు. అందుకే తమ స్టాక్ బ్రోకర్తో టైఅప్ ఉన్న ఈఆర్ఐని ఎంపిక చేసుకోవాలి. లేదంటే విడిగా ప్రతీ పెట్టుబడికి సంబంధించిన కొనుగోలు తేదీ, ధర, విక్రయం తేదీ, ధర తదితర వివరాలు నమోదు చేయాల్సి వస్తుంది.అన్ని విధాలా సహకారం పన్ను అంశాల్లో పూర్తి సహకారం అందించేందుకు ఇవి సిద్ధంగా ఉంటాయి. పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది అనుకూలం? వ్యక్తి ఆదాయ వనరుల ఆధారంగా దాఖలు చేయాల్సిన ఐటీఆర్ పత్రాన్ని ఈఆర్ఐ సిస్టమ్ ఆటోమేటిక్గా ఎంపిక చేస్తుంది. కేవలం వేతనమే కాదు, ఈక్విటీలు, ఎఫ్అండ్వో ఆదాయం, విదేశీ ఆస్తుల ద్వారా ఆదాయం ఇలా భిన్న రూపాల్లో ఆదాయ వనరులు ఉన్న వారికి ఐటీఆర్ పత్రం ఎంపికను ఇవి సులభతరం చేస్తాయి. రిటర్నులు దాఖలు చేయడమే కాదు, ఈ వెరిఫికేషన్ను కూడా అక్కడే పూర్తి చేయవచ్చు. ట్యాక్స్బడ్డీ ప్లాట్ఫామ్ ద్వారా రిటర్నులు వేసినట్టయితే.. ఒకవేళ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడం, నోటీసుకు ఇవ్వాల్సిన సమాధానం విషయంలోనూ సహకారం లభిస్తుంది. ఈఆర్ఐ ప్లాట్ఫామ్లపై రిటర్నుల దాఖలుకు సంబంధించి రెండు స్కీమ్లు ఉంటాయి. ఒకటి సొంతంగా దాఖలు చేసుకోవడం. రెండోది నిపుణుల సహకారంతో దాఖలు చేసుకోవడం. కొంత చార్జీ చెల్లించి పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారాన్ని రిటర్నుల విషయంలో తీసుకోవచ్చు. వర్చువల్గా నిపుణులతో సమావేశమై సందేహాలు తీర్చుకోవచ్చు. అడ్వాన్స్డ్ ట్యాక్స్ విషయంలోనూ ఈ ప్లాట్ఫామ్లు సాయం అందిస్తున్నాయి.. అంతేకాదు ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందడానికి వీలుగా పెట్టుబడుల విషయంలోనూ సలహాలు తీసుకోవచ్చు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఎన్పీఎస్, ఈఎల్ఎస్ఎస్, పన్ను ఆదా డిపాజిట్లలో పెట్టుబడులపై సహకారం లభిస్తుంది. సేవలకు చార్జీలు... ఈ ప్లాట్ఫామ్లు రిటర్నుల దాఖలుకు కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. నిపుణుల సహకారం లేకుండా సొంతంగా రిటర్నుల ఫైలింగ్కు చార్జీ రూ.200 నుంచి రూ.1,600 వరకు ఉంది. ఆదాయస్థాయికి అనుగుణంగా ఈ చార్జీ మారుతుంది. కొన్ని ప్లాట్ఫామ్లు పన్ను చెల్లింపుదారులు సొంతంగా రిటర్నులు దాఖలు చేసుకుంటే ఎలాంటి చార్జీ తీసుకోవడం లేదు. నిపుణుల సాయం తీసుకుని, రిటర్నులు వేయాలనుకుంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఆర్ఐ సంస్థలకు యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. ప్లాట్ఫామ్ సేవలను ఎలా వినియోగించుకోవచ్చన్నదానిపై వీడియోలు చూసి తెలుసుకోవచ్చు. వ్యక్తిగత ఆరి్థక అంశాలపై సమాచారం అందించే వీడియోలు సైతం అక్కడ లభిస్తాయి. డేటా భద్రత సంగతి?ఈఆర్ఐలు అన్నీ కూడా పన్ను చెల్లింపుదారులకు సంబంధించి సున్నితమైన వ్యక్తిగత డేటాను పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. కనుక ఆయా ప్లాట్ఫామ్ల భద్రత ఎంతన్నది ముందే విచారించుకోవాలి. పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని మరొకరితో పంచుకోవడం లేదా విక్రయించడం చేయబోమని ఈ వేదికలు హామీ ఇస్తున్నాయి. ఈ ప్లాట్ఫామ్లు టెక్నాలజీ, భద్రత కోసం తగినంత ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటి విషయంలో రాజీకి అవకాశం లేదు.రిటర్నులు ఎవరు వేయాలి? వార్షిక ఆదాయం రూ.2,50,000 వరకు ఉన్న వారు పన్ను పరిధిలోకి రారు. పాత పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు ఆదాయ పరిమితి రూ.2,50,000. అదే కొత్త పన్ను విధానంలో అయితే వార్షికాదాయం రూ.3,00,000 మించని వారు పన్ను రిటర్నులు దాఖలు చేయనవసరం లేదు. ఇంతకు మించి ఆదాయం కలిగిన ప్రతి ఒక్కరూ రిటర్నులు విధిగా దాఖలు చేయాల్సిందే. అయితే పన్ను చెల్లించే ఆదాయం లేకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో రిటర్నులు దాఖలు చేయాలని చట్టంలోని సెక్షన్ 139 స్పష్టం చేస్తోంది.ఏ సందర్భాల్లో రిటర్నులు వేయాలి..? (సెక్షన్ 139)→ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు (షేర్లు) కలిగి ఉన్న వారు రిటర్నులు దాఖలు చేసి, అందులో ఆ వివరాలు పేర్కొనాలి. విదేశీ కంపెనీల్లోని వాటాల ద్వారా వచ్చే డివిడెండ్ వివరాలను సైతం వెల్లడించాలి. విదేశీ కంపెనీల బాండ్లు, విదేశాల్లో ఇల్లు, ఆ ఇంటి నుంచి అద్దె ఆదాయం వస్తున్న ప్రతి ఒక్కరూ రిటర్నులు దాఖలు చేయాలని సెక్షన్ 139(1) చెబుతోంది. భారత్కు వెలుపల ఏ దేశంలో అయినా అకౌంట్కు సంతకం చేసే అధికారం కలిగి ఉన్న వారు కూడా రిటర్నులు వేయాలి. తన పేరు మీద ఇన్వెస్ట్ చేసినా లేదా తల్లిదండ్రుల పేరు మీద విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినా సరే.. రిటర్నుల దాఖలు తప్పదు. → ఒక వ్యక్తి తాను, తన జీవిత భాగస్వామి, లేదా ఇతరుల (తల్లిదండ్రులు తదితర) విదేశీ పర్యటనల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలు, అంతకుమించి ఖర్చు చేసినట్టయితే రిటర్నులు వేయాల్సి ఉంటుంది. → ఒక ఆరి్థక సంవత్సరంలో విద్యుత్ బిల్లుల మొత్తం రూ.లక్ష దాటినా సరే రిటర్నుల దాఖలు తప్పనిసరి. → మూలధన లాభాలపై పన్ను మినహాయింపు కోరుకునే వారు రిటర్నులు దాఖలు చేయాలి. → మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూళ్లు (టీసీఎస్) ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.25,000, అంతకుమించి ఉంటే రిటర్నులు వేయాలని ఆదాయపన్ను శాఖ 2022 ఏప్రిల్ నాటి నోఫికేషన్ స్పష్టం చేస్తోంది. ఇదే నోటిఫికేషన్ ప్రకారం.. ఒక ఆరి్థక సంవత్సరంలో బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో రూ.50లక్షలు అంతకుమించి డిపాజిట్ చేసిన సందర్భాల్లో, వ్యాపార టర్నోవర్ లేదా వ్యాపారం నుంచి రావాల్సిన మొత్తం రూ.60లక్షలు మించి ఉన్నా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. → స్వయం ఉపాధిలోని వారు కరెంట్ ఖాతా కలిగి, అందులో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.కోటి డిపాజిట్ చేసిన సందర్భంలోనూ రిటర్నులు వేయాలి. → వడ్డీ ఆదాయం, డివిడెండ్లపై టీడీఎస్ అమలు చేస్తుంటారు. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు, ఇలా టీడీఎస్ రూపంలో మినహాయించినది తిరిగి పొందాలంటే (రిఫండ్), ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువులోపు రిటర్నులు వేయకపోతే?జూలై 31 తర్వాత రిటర్నులు దాఖలు చేసే వారు సెక్షన్ 234ఎఫ్ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న వారికి రూ.1,000, రూ.5 లక్షలు మించి ఆదాయం ఉంటే రూ.5,000 పెనాల్టీ కింద చెల్లించాలి. -
ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి వాటిని ఎంచుకోవడంలో ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈతరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఎలాంటి ఆదాయాలు ఉన్నవారు ఏయే ఫారాలు ఎంచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.సరైన ఫారం ఎంపికఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే పన్నుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీటీటీ) మొత్తం ఏడు రకాల ఫారాలను నోటిఫై చేసింది. వీటిలో పన్నుదారులు వారి ఆదాయమార్గాలకు అనుగుణంగా ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. కొత్త పన్ను శ్లాబును ఎంచుకున్నవారి వేతనం రూ.7.5లక్షల కంటే ఎక్కువ వార్షిక వేతనం ఉండి, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ, వ్యవసాయ రాబడి రూ.5000 కంటే తక్కువ..వంటి తదితర మార్గాల్లో అదనంగా ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు.ఐటీఆర్-2వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలకు చెందిన పన్నుదారులు దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉన్నవారు ఎంచుకోవాలి.ఎలాంటి వ్యాపార ఆదాయం ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్ 3వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు.వ్యవసాయ ఆదాయం ఎంతైనా ఉండవచ్చు. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లిస్తుండాలి.ఐటీఆర్-4వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల్లో భాగస్వామ్యం కలిగిఉన్న పన్నుదారులు ఈ ఫారం దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం వేతనం ఉండాలి.ఒక ఇల్లు మాత్రమే ఉండాలి.వ్యాపార ఆదాయం ఉండవచ్చు. కానీ మీ మొత్తం ఆదాయంలో బిజినెస్ టర్నోవర్ 8 శాతానికి మించి ఉండకూడదు.వ్యవసాయ ఆదాయం రూ.5000లోపు ఉండాలి. అయితే ఐటీఆర్ సమయంలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇతరమార్గాల ద్వారా వచ్చే మూలధన రాబడులపై ట్యాక్స్ చెల్లించకూడదు.ఇదీ చదవండి: పన్నుదారులు తెలుసుకోవాల్సినవి..ఐటీఆర్-5ఒకరికంటే ఎక్కువమంది కలిసి ఏదైనా వ్యాపారంసాగిస్తే ఈ ఫారం దాఖలు చేయవచ్చు.ఎలాంటి వేతన ఆదాయం ఉండకూడదు.ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉండవచ్చు.వ్యాపార ఆదాయం ఉండాలి.ఇతరమార్గాల ద్వారా ఆదాయం ఉండవచ్చు.కంపెనీలు దాఖలు చేసే ఫారం ఐటీఆర్-6. ఐటీఆర్ 7 ఫారాన్ని ట్రస్టులు అవి చెల్లించిన ఆదాయాన్ని రిటర్ను చేసుకోవడానికి దాఖలు చేస్తాయి. -
ఎల్&టీ కంపెనీకి ఐటీ శాఖ భారీ జరిమానా
లార్సెన్ & టూబ్రో లిమిటెడ్కు ఆదాయపు పన్ను శాఖ రూ.4.68 కోట్లకు పైగా జరిమానా విధించింది. 2021 ఏప్రిల్ 1న కంపెనీలో విలీనమైన ఎల్ & టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పన్ను ప్రొసీడింగ్స్కు సంబంధించి రూ.4,68,91,352 జరిమానా విధించినట్లు ఎల్ & టీ తాజా ఫైలింగ్లో తెలిపింది.2020-21 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి కంపెనీ ఆదాయపు పన్ను మదింపు, రిటర్న్ చేసిన ఆదాయంలో సర్దుబాటు వ్యత్యాసాలపై ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించినట్లు కంపెనీ ఫైలింగ్లో పేర్కొంది. అయితే, ఈ జరిమానాతో తాము ఏకీభవించనందున ఈ ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేస్తామని, ఉన్నత వేదికపై సానుకూల ఫలితాన్ని ఆశిస్తున్నామని తెలిపింది.ఎల్& టీ అనేది 27 బిలియన్ డాలర్ల భారతీయ మల్టీ నేషనల్ కంపెనీ. 2022 మార్చి 31 నాటికి ఎల్&టీ గ్రూప్లో 93 అనుబంధ సంస్థలు, 5 అసోసియేట్ కంపెనీలు, 27 జాయింట్ వెంచర్లు, 35 ఉమ్మడి కార్యకలాపాలు ఉన్నాయి. ఇవి ప్రాథమిక, భారీ ఇంజనీరింగ్, నిర్మాణం, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్లో పనిచేస్తున్నాయి. -
Lok Sabha Election 2024: 1100 కోట్లు సీజ్ చేసిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు-2024 షెడ్యూల్లో భాగంగా రేపు చివరి దశలో పోలింగ్ జరుగనుంది. నిన్నటితో ప్రచారానిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి మే 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐటీ సోదాల్లో రూ.1100 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో బంగారం కూడా సీజ్ అయ్యింది.వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో సుమారు రూ. 1100 కోట్ల నగదును సీజ్ చేశారు. మే 30వ తేదీ వరకు ఆదాయపన్ను శాఖ మొత్తం 1100 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కూడా చేసింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే సీజ్ నగదు విలువ దాదాపు 182 శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. గత లోక్సభ ఎన్నికల వేళ 390 కోట్ల నగదును సీజ్ చేశారు.ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఐటీ శాఖ అన్ని రాష్ట్రాల్లోనూ దాడులు, సోదాలు, తనిఖీలను పెంచేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుతున్న డబ్బును సీజ్ చేశారు. ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వందల కోట్లకు పైగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఏకంగా రూ.150 కోట్ల వరకు నగదును సీజ్ చేశారు. ఇక, తెలంగాణ, ఒడిషా, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కలిసి దాదాపు రూ.100 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
ట్యాక్స్ పేయర్స్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలెర్ట్ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్ కార్డ్కు ఆధార్ కార్డ్ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్ ట్యాక్స్ డిడక్ట్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్ను మే 31, 2024లోపు ఆధార్తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్ను మీ ఆధార్తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్కు ఆధార్ లింక్ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్కు ఆధార్ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024 -
నాసిక్లోని బులియన్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
-
రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) 72 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తు లభ్యమైంది. పట్టణంలోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదినాథ్ అర్బన్ మలీ్టస్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 10వ తేదీన సోదాలు ప్రారంభించారు. 12వ తేదీ ఈ సోదాలు ముగిశాయి. వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారం సహా మొత్తం రూ.170 కోట్ల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదును లెక్కించడానికి 14 గంటలు పట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి. -
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్మెంట్ ఇయర్కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. -
ఆ డబ్బులు మావే ఇచ్చేయండి
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో పచ్చ పత్రికాధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ డ్రామాలకు తెరలేపింది. ఆ నగదుతోపాటు చెక్కులు కూడా తమవేనని చెబుతున్న మార్గదర్శి ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపమంటే చూపడం లేదు. దీంతో ఈ సొమ్ము మార్గదర్శిది కాదని.. టీడీపీ నేతలు ఓట్ల కొనుగోలుకు తరలిస్తున్న నగదని అంతా చెబుతున్నారు. ఇప్పటికే ఈ నగదుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. అంతేకాకుండా ఈ వ్యవహారం ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్లిపోయింది. ఆధారాలు చూపించి నగదును తీసుకునే అవకాశం ఉన్నా ఆ పనిచేయకుండా జిల్లా ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది తిరగడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ అధికారులకు ఆధారాలు చూపాల్సిందే.. ఎఫ్ఐఆర్ నమోదుతో మార్గదర్శి పేరుతో జరిగిన మనీలాండరింగ్కు సంబంధించిన అంశం ఐటీ శాఖ చేతుల్లోకి వెళ్లింది. దీంతో పట్టుబడిన ప్రతి పైసాకు లెక్కలతో సహా ఆధారాల్ని పోలీసులతో పాటు ఐటీ అధికారులకు మార్గదర్శి సమర్పించాల్సి ఉంటుంది. కానీ.. ఆ సొమ్ము మార్గదర్శిది కాదని.. అందుకే ఐదు రోజులు గడుస్తున్నా లెక్కా పత్రాలు చూపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఖర్చులకు తమకు అనుకూలమైన పార్టీకి చెందిన రాజకీయ నాయకులకు అందించేందుకు మార్గదర్శి పేరుతో పక్కా ప్లాన్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరికి ఇస్తున్నారో అధికారులు దర్యాప్తు చేసి రామోజీరావు నడిపిస్తున్న మనీలాండరింగ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆధారాల్లేకుండా అధికారుల చుట్టూ.. ఈ నెల 2న విశాఖ ద్వారకానగర్ ప్రాంతంలో రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. వీటిని ఇద్దరు మార్గదర్శి సిబ్బంది స్కూటీపై సూట్కేసులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, చెక్కులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. నగదు తరలింపుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం తమ పరిధిలో లేదని రెండు రోజుల క్రితం మార్గదర్శి సిబ్బందికి ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ.. కలెక్టరేట్లోని ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది ప్రదక్షిణలు చేస్తూ.. నగదు, చెక్కులు ఇప్పించాలంటూ హడావుడి చేస్తున్నారు. తమ పరిధిలో లేదని చెబుతున్నా వదలకపోవడంతో ‘ఆధారాలు చూపించండి.. పోలీసులు, ఐటీ సిబ్బందికి ఇస్తాం’ అని ఎన్నికల యంత్రాంగం చెప్పడంతో.. తామేమీ ఆధారాలు తీసుకురాలేదని అక్కడి నుంచి మార్గదర్శి సిబ్బంది పలాయనం చిత్తగించారు. అయితే శనివారం సాయంత్రం మళ్లీ ఎన్నికల అధికారుల వద్దకు వచ్చి నగదు కోసం ఒత్తిడి తెచ్చారు. విధులకు ఆటంకం కలిగిస్తుండటంతో మార్గదర్శి సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
పాన్కార్డ్ జాగ్రత్త.. ఈ విద్యార్థికి జరిగిందే మీకూ జరగొచ్చు!
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థికి ఆదాయపన్ను శాఖ నుంచి రూ.46 కోట్లకు ట్యాక్స్ నోటీసు వచ్చింది. మామూలు విద్యార్థికి అన్ని కోట్ల పన్ను నోటీసు రావడమేంటి అనుకుంటున్నారా? అతని పాన్ కార్డ్ను కొందరు దుర్వినియోగం చేశారు. దీంతో ఆ విద్యార్థికి ఐటీ నోటీసు వచ్చింది. తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గ్వాలియర్కు చెందిన ప్రమోద్ కుమార్ దండోటియా అనే కాలేజీ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో 2021లో తన పాన్కార్డ్ నెంబర్తో ఓ కంపెనీ ప్రారంభించి లావాదేవీలు నిర్వహించారని ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ విభాగాల నుంచి నోటీసు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, తన పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు వాపోయాడు. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం మరోసారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని, మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు. -
Income Tax Department: సీపీఐ, సీపీఎంలకు ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను నోటీసుల పరంపరం కొనసాగుతోంది. రూ.11 కోట్లు చెల్లించాలంటూ సీపీఐకి ఐటీ డిపార్టుమెంట్ నోటీసు జారీ చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత కొన్నేళ్లలో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల్లో పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు ఫెనాలీ్టలు, వడ్డీ కింద రూ.11 కోట్లు చెల్లించాలంటూ ఈ నోటీసు ఇచి్చనట్లు తెలిపాయి. ఈ నోటీసులను న్యాయస్థానంలో సవాలు చేయడానికి సీపీఐ నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అలాగే సీసీఎంకు కూడా ఐటీ నోటీసులు అందాయి. 2016–17లో ఇచ్చిన పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంటూ ఐటీ విభాగం తాజాగా సీపీఎంకు నోటీసులు ఇచి్చంది. అప్పట్లో ఐటీ రిటర్నుల్లో బ్యాంకు ఖాతాను నిర్ధారించనందుకు రూ.15.59 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
Income Tax Department: రూ.1,823 కోట్లు చెల్లించండి
న్యూఢిల్లీ: రూ.1,823.08 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను విభాగం నుంచి తాజాగా తమ పార్టీకి నోటీసులు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, అజయ్ మాకెన్ చెప్పారు. ఐటీ చట్టాలను అధికార బీజేపీ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ ఉల్లంఘలనకు గాను బీజేపీ నుంచి రూ.4,617.58 కోట్లు వసూలు చేయాలని ఐటీ అధికారులను డిమాండ్ చేశారు. వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని, లోక్సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు తమకు విరాళాలు ఇచి్చనవారి పేర్లు, చిరునామాలను ఫామ్ 24ఏలో పొందుపర్చి, ఎన్నికల సంఘానికి సమరి్పంచాల్సి ఉంటుందని అజయ్ మాకెన్ చెప్పారు. బీజేపీ మాత్రం ఇలాంటి వివరాలను ఏనాడూ సక్రమంగా సమరి్పంచలేదని విమర్శించారు. ఐటీ విభాగం బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆక్షేపించారు. కేవలం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని నోటీసులు ఇస్తోందని అన్నారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం అని తేలి్చచెప్పారు. పాత ఐటీ రిటర్నులను మళ్లీ తెరవడం ఏమిటని ప్రశ్నించారు. ఇది రాహుల్ గ్యారంటీ ఐటీ డిపార్టుమెంట్ ఇచి్చన తాజా నోటీసులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేస్తూ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్య వలువలు ఊడదీస్తున్నవారికి ప్రభుత్వం మారిన తర్వాత తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తాము తీసుకొనే చర్యలు ఎలా ఉంటాయంటే.. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా భయపడేలా ఉంటాయని, ఇది రాహుల్ గ్యారంటీ అని తేలి్చచెప్పారు. -
కాంగ్రెస్కు మరో బిగ్ షాక్.. ఈసారి భారీ ఐటీ నోటీసులు
ఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ.. కాంగ్రెస్ పార్టీకి పన్ను నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటిరోజే.. ఆదాయ పన్ను శాఖ రూ.1700 కోట్ల బకాయి పన్ను రికవరీ చేయాలని నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా వెల్లడించారు. 2017-18 నుంచి 2020-21 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీని కలిపి పన్ను రికవరీ చేయాలని నోటీసులో పేర్కొంది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్న శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్తో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది. రీఅసెస్మెంట్ ప్రక్రియ చేపట్టేందుకు తగిన అధికారాలు ఐటీ శాఖ దగ్గర ఉన్నాయని.. తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇక.. 2014-15, 2015-16, 20216-17 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి..రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను మార్చి 22న కోర్టు కోట్టివేసిన విషయం తెలిసిందే. ఈ రీఅసెస్మెంట్కు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసింది. చదవండి: ముఖ్తార్ అన్సారీపై విష ప్రయోగం?, జైల్లో ఆహారంలో 40 రోజులుగా.. -
ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. తమ అకౌంట్లను ఆదాయపు పన్నుశాఖ ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కాగా లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ చర్యలను ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ సవాల్ చేసింది. 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలుగా ఐటీ అధికారులు తమపై ప్రారంభించిన టాక్స్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్లు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈ కేసులో టాక్స్ అథారిటీ ఎలాంటి చట్టబద్దమైన నిబంధనల్ని ఉల్లంఘించలేదని.. పార్టీ ఎగ్గొ ఆదాయం రూ. 520 కోట్ల కంటే ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్ రిట్ పిటిషన్లను కొట్టివేస్తున్నామని తెలిపింది. అయితే తొలుత ఈ పిటిషన్లపై మార్చి 20న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసి నేడు తీర్పు వెల్లడించింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్న రూ. 105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. దీంతో లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. చదవండి: అందుకే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు: శరద్ పవార్ కాగా అంతకుముందు ఐటీ శాఖ సీజ్ చేసిన రూ.105 కోట్లను రిలీజ్ చేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. 2018-19 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించి రూ.102 కోట్ల బకాయి పన్నును రికవరీ చేయాలని ఐటీ శాఖ కాంగ్రెస్కు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్టే విధించాలని హస్తం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) నోటీసుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ.. స్టే కోరుతూ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇక తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అబద్దంగా మారిందని ఆరోపిన్నారు. ఎన్నికల్లో పోరాడకుంటా తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాటి చర్యలు లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ న్యాయస్థానంలోనూ కాంగ్రెస్కు నిరాశే ఎదురైంది. -
కారణాలు చెప్పే అరెస్టు చేశాం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కవిత ఇంట్లో తనిఖీలు ప్రశాంతంగా సాగాయని, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రకటించారు. శుక్రవారం కవిత నివాసంలో తనిఖీలు ముగిశాక పంచనామా నివేదికను విడుదల చేశారు. ఆ వివరాలు ‘‘పంచ్లు (వీరి సమక్షంలో అధికారులు విచారణ చేస్తారు) బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ పి.శ్రీనివాస్రెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ ఏద్దుల వివేకానందకుమార్రెడ్డి ఎదుట వివరాలు సేకరించాం. ఈడీ అదనపు డైరెక్టర్ కపిల్రాజ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత నివాసంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించాం. మొదట తనిఖీల అధికారిక పత్రంపై కవిత సంతకాన్ని తేదీతో సహా తీసుకున్నాం. తర్వాత అదే పత్రంపై మేం కూడా తేదీతో సహా సంతకం చేశాం. మధ్యాహ్నం 1.45 గంటలకు తనిఖీలు ప్రారంభించాం. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)–2002లోని సెక్షన్ 17 ప్రకారం కవిత వాంగ్మూలాన్ని నమోదు చేశాం. సెక్షన్ 19 ప్రకారం సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్టు చేశాం. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నామో కారణాలను ఆమెకు వివరించాం. పలు రికార్డులు/ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు 5 ఫోన్ల సీజ్ చేశాం. సాయంత్రం 4.15 గంటలకు అధికారి మమత నారా వెళ్లడంతో మరో అధికారి వరలక్ష్మి వచ్చి పాల్గొన్నారు. సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో కవిత సోదరుడు, మరికొందరు వ్యక్తులు, న్యాయవాదులు చట్టవిరుద్ధంగా తనిఖీల ప్రాంతంలోకి వచ్చారు. వారెవరో మాకు వివరాలు చెప్పలేదు. విచారణకు ఆటంకం కలిగించారు. సాయంత్రం 6.45 గంటలకు తనిఖీలు ముగించాం. ప్రశాంతంగా, ఇంట్లోని ఏ వస్తువులకూ ఎలాంటి నష్టం కలగకుండా కొనసాగించాం. ప్రారంభంలో తనిఖీలను కవిత సున్నితంగా తిరస్కరించారు’’అని పంచనామాలో ఈడీ అధికారులు వివరించారు. ఈ తనిఖీల్లో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్తోపాటు డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ, అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్గోయల్, అధికారులు విక్రాంత్కుమార్, కార్తీక్ మెహ్రా, హిమాన్షు చౌదరి, మమతా నారా, బ్రజేష్ చౌరాసియా పాల్గొన్నట్టు తెలిపారు. -
కలకలం.. ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని గంటల్లో వెలువడనుండగా, భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీమద్యం కుంభకోణంలో నిందితురాలుగా పేర్కొంటూ శుక్రవారం సాయంత్రం కవితను అరెస్టు చేసిన ఈడీ, రాత్రి ఢిల్లీకి తరలించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సమయంలో కవిత అరెస్టు జరగడం సర్వత్రా ఉత్కంఠను రేపింది. లిక్కర్ స్కామ్ సుమారు ఏడాదిన్నరగా నడుస్తుండగా, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముందు కవితను అరెస్టు చేయడం.. తమ పార్టీ అధినేత కేసీఆర్ను నైతికంగా దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రజాక్షేత్రంలో రాజకీయంగా, కోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆ పార్టీ ప్రకటించినా, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కవిత అరెస్టు అంశం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్ర బిందువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. వంద రోజుల్లోనే కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే శ్వేతపత్రాలు, విచారణలు, కేసుల పేరిట కాంగ్రెస్ ముప్పేట దాడి చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ ఒత్తిడి పెంచుతోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ను రాజకీయంగా బలహీన పరచ డం లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో పాటు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించే వ్యూహంపై పార్టీలోనూ, బయటా ఆసక్తి నెలకొంది. తొలుత సీబీఐ..తర్వాత ఈడీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో సాక్షిగా పేర్కొంటూ 2022 డిసెంబర్ 3న కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 6న సీబీఐ బృందం హైదరాబాద్లోని కవిత నివాసంలో ఆమెను విచారించింది. ఇదే కేసులో సమాంతర విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2023 జనవరి నుంచి పలుమార్లు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణలో ఉన్నందున రాలేనంటూ కవిత పలుమార్లు సమాధానం ఇచ్చారు. చివరకు 2023 మార్చి 9న ఈడీ నోటీసులకు స్పందనగా అదే నెల11, 20 తేదీల్లో విచారణకు హాజరై తన వద్ద ఉన్న ఫోన్లు, సిమ్ కార్డులను అప్పగించారు. ఆ తర్వాత ఈడీ మరోమారు నోటీసు జారీ చేయగా, మహిళలను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ కేసు తాజాగా ఈ నెల 19కి వాయిదా పడింది. ఏడాదిన్నరగా వేడి కవిత వ్యవహారంపై ఏడాదిన్నరగా బీజేపీ, బీఆర్ఎస్ నడుమ విమర్శల యుద్ధం జరుగుతోంది. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత ‘అరెస్టు’అంశంపై బీజేపీ పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లోగా కవితను అరెస్టు చేయిస్తామంటూ బీజేపీ ముఖ్య నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. మరోవైపు ఇప్పటివరకు కవితను అరెస్టు చేయకపోవడం బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ విమర్శలు చేస్తూ వచి్చంది. రాజకీయ, న్యాయ పోరాటం దిశగా బీఆర్ఎస్ అడుగులు రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా క్రియాశీలంగా పనిచేసిన కల్వకుంట్ల కవిత, 2014 లోక్సభ ఎన్నికల వేదికగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి గెలుపొందిన కవిత 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో 2020, 2022లో నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల లేదా ఆర్మూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావించినా అలా జరగలేదు. తాజాగా జరిగే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మరోమారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్తిగా పోటీ చేయాలని భావించారు. అయితే రెండు నెలల క్రితమే టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. కాగా కవిత అరెస్టు అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్లు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ ఎదురుదాడి వ్యూహానికి పదును పెడుతోంది. కవిత అరెస్టును రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు న్యాయ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తోంది. -
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్, నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లి.. విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1.45 గంటల సమయంలో సోదాలు ప్రారంభించారు. కవిత, ఆమె భర్త అనిల్కుమార్ సహా అక్కడున్నవారి సెల్ఫోన్లను సీజ్ చేశారు. సోదాల్లో పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని, పీఎంఎల్ఏ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్–2002)లోని 3, 4 సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు కారణాలను తెలియజేస్తూ 14 పేజీల కాపీని కవితకు అందజేశారు. తర్వాత సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను ఈడీ బృందం అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన సమాచార లేఖను ఆమె భర్త అనిల్కుమార్కు అందించింది. కవితను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది ఈడీ అధికారుల బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తరలింపు.. ఈడీ సోదాల విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కవిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ సోదాలు కొనసాగినంత సేపూ నిరసన తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్రావు, ఇతర నేతలు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లకుండా ఈడీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సుమారు ఇరవై నిమిషాల పాటు కేటీఆర్, హరీశ్రావు, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉన్నారు. ఒకదశలో బీఆర్ఎస్ శ్రేణులు గేటు తోసుకుని కవిత నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీనితో పోలీసులు బందోబస్తు పెంచారు. రోప్ పారీ్టలను పిలిపించారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అక్రమమంటూ వాగ్వాదం! కొంతసేపటి తర్వాత కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు అక్రమం, చట్టవ్యతిరేకమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారి భానుప్రియ మీనా కల్పించుకుని కేటీఆర్, ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చారని మండిపడ్డారు. వారందరినీ వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారిని ఆదేశించారు. ఈ సమయంలో కేటీఆర్ కలగజేసుకుని.. ‘‘మేడం.. సెర్చ్ చేయడం అయిపోయింది. అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, మెజి్రస్టేట్ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తాను అంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు (ఈడీ అధికారులు) ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్ ట్రబుల్లో పడతారు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరికీ అభివాదం చేసి.. సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చారు. ఈ సమయంలో కవిత ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. కుమారుడి కన్నీటిని తుడిచి, త్వరగా వస్తానని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించారు. కవితను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు పోలీసులతో కలసి ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. అయితే కవిత తన భర్త అనిల్కుమార్ కారులో వస్తానని చెప్పారు. ఈడీ అధికారులు అంగీకరించడంతో భర్తతో కలసి కారులో బయలుదేరారు. ఈ కారు ముందు వెనుక ఈడీ, పోలీసు వాహనాలు కాన్వాయ్గా శంషాబాద్కు చేరుకున్నాయి. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈడీ అధికారుల బృందం విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన యూకే–870 విమానంలో రాత్రి 8.58 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. నేడు కోర్టు ఎదుట హాజరు కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. శనివారం మధ్యాహ్నం ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. లిక్కర్ కేసులో అరెస్టులు ఇవీ.. సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) సెప్టెంబర్ 27, 2022 శరత్చంద్రారెడ్డి (ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్) నవంబర్ 10, 2022 వినయ్బాబు (ఫెర్నాడ్ రికార్డ్ కంపెనీ) నవంబర్ 10, 2022 అభిషేక్ బోయినపల్లి (రాబిన్ డిస్ట్రిబ్యూషన్) నవంబర్ 14, 2022 విజయ్ నాయర్ (మద్యం వ్యాపారి) నవంబర్ 14, 2022 అమిత్ అరోరా (బడ్డీ రిటైల్ డైరెక్టర్) నవంబర్ 30, 2022 గోరంట్ల బుచ్చిబాబు (కవిత మాజీ ఆడిటర్) ఫిబ్రవరి 9, 2023 గౌతం మల్హోత్రా (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 9, 2023 మాగుంట రాఘవ (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 11, 2023 మనీష్ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) ఫిబ్రవరి 26, 2023 కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ) మార్చి 15, 2024 నేడు కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీకి.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు మరికొందరు కీలక నేతలు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ఈడీ తీరు చట్టవిరుద్ధం: కవిత న్యాయవాది మోహిత్రావు సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది మోహిత్రావు పేర్కొన్నారు. హైదరాబాద్లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మంగళవారానికి వాయిదాపడిందని.. ఈ కేసులో కవితపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో కోర్టుకు హామీ ఇచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తీసుకోబోమన్న ఈడీ హామీ వర్తిస్తుందని చెప్పారు. అయినా ముందస్తు పథకంలో భాగంగా సోదాల పేరిట వచ్చి కవితను అరెస్ట్ చేశారని.. విమానం టికెట్లు కూడా ముందుగానే బుక్ చేశారని ఆరోపించారు. కవిత ముందు న్యాయపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, అరెస్ట్ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. -
అప్పిలేట్ ట్రిబ్యునల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తమ పారీ్టకి సంబంధించిన రూ.210 కోట్ల నిధులను స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. కిందటి సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ సమరి్పంచిన ఐటీ రిటర్నుల్లో లోపాలు ఉన్నాయంటూ ఐటీ శాఖ ఆ పారీ్టకి రూ.210 కోట్ల జరిమానా విధించించిన సంగతి తెలిసిందే. ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ కాంగ్రెస్ ఖాతాలున్న బ్యాంకులను ఐటీ శాఖ ఆదేశించింది. వేర్వేరు బ్యాంకుల్లోని తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండా రూ.65 కోట్లను ఐటీ శాఖ విత్డ్రా చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. రూ.205 కోట్లను స్తంభింపజేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాలపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది.పిటిషన్ను కొట్టివేస్తూ ట్రిబ్యునల్ శుక్రవారం తీర్పు వెలువరించింది. -
కాంగ్రెస్ అకౌంట్ నుంచి రూ. 65 కోట్లు రికవరీ చేసిన ఐటీ
న్యూఢిల్లీ: జాతీయ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 65 కోట్ల బకాయిలను ఆదాయ పన్ను శాఖ రికవరీ చేసింది. ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ మొత్తం రూ. 115 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతానికి రూ. 65 కోట్లు రికవరీ చేసింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతా నుంచి ఈ నిధులను ఐటీ శాఖ రికవరీ చేసింది. రూ. 65 కోట్ల రికవరీకి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్ను ఆశ్రయించింది. ఐటీ శాఖ రికవరీ చర్యలపై ఫిర్యాదు చేసింది. బెంచ్ ముందుకు విచారణ ఫలితం కోసం వేచిచూడకుండానే బ్యాంకుల వద్ద కాంగ్రెస్ ఖాతాల్లో ఉన్న డబ్బులో కొంత మొత్తాన్ని ఐటీ శాఖ బకాయిల కింద రికవరీ చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన స్టే దరఖాస్తు వ్యవహారం తేలేవరకూ ఆదాయ పన్ను శాఖ చర్యలను నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహరంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని ట్రిబ్యునల్ ఆదేశించింది. చదవండి: పెళ్లి తర్వాత మహిళా ఉద్యోగి తొలగింపు.. కేంద్రానికి సుప్రీం షాక్ -
Income Tax Department: కాంగ్రెస్ ఖాతాల స్తంభన
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం కలకలం సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులో ఐటీ రిటర్నుల్లో రూ.210 కోట్ల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటి రికవరీ కోసం ఆయా ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసినట్లు వార్తలొచ్చాయి. పార్టీ ప్రధాన ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది. వెంటనే ఐటీ, ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ కాస్త కాంగ్రెస్కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఆయా ఖాతాల్లో మొత్తంగా రూ.115 కోట్లు అలాగే నిల్వ ఉంచి మిగతాది మాత్రమే విత్డ్రా, ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చని సూచించింది. వెంటనే ఆయా ఖాతాలను డీ ఫ్రీజ్ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో సంబంధిత ఖాతాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. ట్రిబ్యునల్ ఈ అంశంపై బుధవారం మరోసారి వాదనలు విననుంది. ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో యూత్ కాంగ్రెస్ ఖాతాలూ ఉన్నాయి. ఖాతాల స్తంభనపై మోదీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ 2018–19 ఆర్థికంలో ఐటీ రిటర్నులను కాస్త ఆలస్యంగా సమరి్పంచాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతభత్యాలను పారీ్టకి విరాళాల రూపంలో ఇచ్చారు. అలాంటి కొన్ని మొత్తాలు ఐటీ రిటర్నుల్లో ప్రతిబింబించలేదు. అంతమాత్రానికే ప్రధానమైన తొమ్మిది ఖాతాలను స్తంభింపజేస్తారా?’ అని కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మాట్లాడారు. ‘‘ ఖాతాల్లో ఉన్న మొత్తంలో రూ.115 కోట్లే అత్యంత ఎక్కువైనది. సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి మిగతా డబ్బు అస్సలు సరిపోదు. రాబోయే లోక్సభ ఎన్నికల వేళ ఇలా ఖాతాలను ఫ్రీజ్ చేస్తే ఎన్నికల్లో పార్టీ భాగస్వామి కావడం చాలా కష్టం’’ అని మాకెన్ అన్నారు. భయపడకండి మోదీ జీ: రాహుల్ ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘ భయపడకండి మోదీ జీ! కాంగ్రెస్ ప్రజాశక్తికి కాంగ్రెస్ చిరునామా. నియంతృత్వం ముందు మోకరిల్లేది లేదు’’ అన్నారు. అధికార దాహంతో లోక్సభ ఎన్నికల వేళ దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టాక ఇలాంటి ఆరోపణలకు కాంగ్రెస్ చాలా సమయం దొరుకుతుందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎద్దేవాచేశారు. -
కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన కేంద్రం
-
భారీగా సవరణ రిటర్నులు
న్యూఢిల్లీ: సవరణ రిటర్నులు ఆదాయపన్ను శాఖకు అదనపు పన్ను ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. గడిచిన రెండేళ్లలో 56 లక్షల మేర సవరించిన ఐటీ రిటర్నులు దాఖలు కాగా, వీటి ద్వారా రూ.4,600 కోట్ల పన్ను ఆదాయం సమకూరినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చీఫ్ నితిన్ గుప్తా ప్రకటించారు. తమ సేవలను మెరుగుపరుచుకుంటూ, వివాద రహిత వాతావరణం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఒకసారి దాఖలు చేసిన ఐటీఆర్లకు సంబంధించి సవరణలు చేసుకునే అవకాశాన్ని 2022–23 బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత నుంచి రెండు సంవత్సరాల వరకు ఇలా సవరణలు దాఖలు చేసుకునే వెసులుబాటు వచి్చంది. రూ.కోటికి పైగా పన్నుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారానికి వీలుగా కర్ణాటకలోని మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు గుప్తా వెల్లడించారు. 2014–15 నాటికి రూ.25వేల వరకు పెండింగ్లో ఉన్న పన్ను డిమాండ్లను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర బడ్జెట్లో మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. ఇలాంటి 1.1 కోట్ల పన్ను డిమాండ్ల ఉపసంహరణతో కేంద్రం రూ.2,500–3,600 కోట్లను కోల్పోనుంది. కానీ, ఈ వెసులుబాటు 80 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పస్తుందని నితిన్ గుప్తా తెలిపారు. ఏటా పన్నుల ఆదాయం రూ.19.5 లక్షల కోట్లతో పోలిస్తే ఇది స్వల్ప మొత్తమేనన్నారు. -
2024–25 ఐటీఆర్ల నోటిఫై
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలు.. ఐటీఆర్ 2, 3, 5ను నోటిఫై చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సీబీడీటీ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు సులభంగా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా రిటర్నుల పత్రాల్లో మార్పులు చేశారు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. -
వారికి ఐటీ శాఖ ఫైనల్ వార్నింగ్!
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ అప్రమత్తం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గత జూలై 31 లోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారు డిసెంబర్ 31 లోపు ఫైల్ చేయాలని ఆఖరిసారిగా సూచించింది. ఆలస్యమైన లేదా సవరించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2023 డిసెంబర్ 31 వరకు ఐటీ శాఖ అవకాశం కల్పించింది. ఇంక రెండు రోజుల్లో ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ చేసింది. ఐటీఆర్ దాఖలు చేయనివారు వెంటనే ఫైల్ చేయాలని ఆఖరిసారిగా సూచించింది. అవసరమైన సమాచారం కోసం వెబ్సైట్ లింక్ను అందించింది. ఎవరు చేయాలి? ఎవరెవరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనే దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ జమ చేయడం, విదేశాలకు వెళ్లేందుకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయడం, విద్యుత్ బిల్లుల కోసం 1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు కచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఐటీ శాఖ పంపింది నోటీసా.. సమాచారమా? ఎవరైనా నిర్దిష్ట సమయంలోగా ఆదాయపు పన్ను రిటర్న్ను ఫైల్ చేయడంలో విఫలమైతే, వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(4) ప్రకారం ఆలస్యంగా రిటర్న్ను ఫైల్ చేయవచ్చు. అయితే ఇందు కోసం ప్రత్యేక ఫారం ఉండదు. పన్ను చెల్లింపుదారు నిర్దిష్ట అసెస్మెంట్ సంవత్సరానికి నోటిఫై చేసిన ఫారాలనే తప్పనిసరిగా ఉపయోగించాలి. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమౌతుంది? ఆలస్యమైన ఐటీఆర్ కూడా ఫైల్ చేయకపోవడం ప్రతికూల పరిణామాలకు దారి తీయవచ్చు. సెక్షన్ 234A కింద వడ్డీ విధించడం, సెక్షన్ 234F కింద రుసుము, 10A, 10B సెక్షన్ల కింద మినహాయింపులకు అనర్హత వంటి ఎదురుకావచ్చు. దీంతోపాటు చాప్టర్ 6-A పార్ట్ సి కింద తగ్గింపులు అందుబాటులో ఉండవు. సెక్షన్ 234F కింద రూ.5,000 (చిన్న పన్ను చెల్లింపుదారులకైతే రూ.1,000) జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పెండింగ్లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపులకు సెక్షన్ 234A కింద నెలకు 1 శాతం చొప్పున జరిమానా వడ్డీ వర్తిస్తుంది. ఇక దాఖలు చేసిన ఐటీఆర్లు 30 రోజులలోపు వెరిఫై కావడం కూడా చాలా కీలకం. వెరిఫై కాని ఐటీఆర్ ఆదాయపు పన్ను శాఖ పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి ఇంకా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారు వెంటనే ఫైల్ చేయాలని సూచిస్తున్నాం. Kind Attention Taxpayers! Here's your last and final call to file your ITR for A.Y. 2023-24 by 31st December, 2023. Hurry!#FileNow. For more information, please visit https://t.co/uv6KQUbXGv pic.twitter.com/DxMV5Xzu0e — Income Tax India (@IncomeTaxIndia) December 29, 2023 -
ఐటీ శాఖ పంపింది నోటీసా.. సమాచారమా?
Income tax department: మీరు ట్యాక్స్ పేయరా..? ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకేదైనా సమాచారం వచ్చిందా..? వస్తే అది నోటీసా లేక సమాచారమా? ఐటీ శాఖ ఏం చెప్పింది? పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR)లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీల నుంచి అందిన సమాచారం మధ్య అసమతుల్యతపై ఆదాయపు పన్ను శాఖ కొంతమంది ట్యాక్స్ పేయర్స్కు సమాచారం పంపింది. రిపోర్టింగ్ ఎంటిటీలు అంటే ఐటీ శాఖ సమాచారం తీసుకునే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్టాక్ మార్కెట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు, ప్రాపర్టీ రిజిస్ట్రార్లతో సహా పలు ఏజెన్సీలు. "ఇది పన్ను చెల్లింపుదారులందరికీ పంపిన నోటీసు కాదు. ఐటీఆర్లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీ నుంచి అందిన సమాచారం మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉన్న సందర్భాల్లో మాత్రమే పంపిన సలహా" అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్.. 2024-25 ఐటీఆర్ ఫారాలు విడుదల ఐటీ శాఖ కంప్లయన్స్ పోర్టల్లో తమ అభిప్రాయాన్ని అందించడానికి, అవసరమైతే ఇప్పటికే దాఖలు చేసిన రిటర్న్లను సవరించడం లేదా ఇప్పటివరకు దాఖలు చేయకపోతే రిటర్న్స్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించడమే ఈ సమాచారం లక్ష్యమని ఆదాయపు పన్ను శాఖ వివరించింది. ఇది అందినవారు ప్రాధాన్యతగా తీసుకుని ప్రతిస్పందించాలని అభ్యర్థించింది. Some references have come to the notice of the Income Tax Department regarding recent communication sent to taxpayers pertaining to transaction(s) made by them. Taxpayers may pl note that such communication is to facilitate the taxpayers & make them aware of the information… — Income Tax India (@IncomeTaxIndia) December 26, 2023 -
ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్.. 2024-25 ఐటీఆర్ ఫారాలు విడుదల
ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫారాలు - 1, 4 లను విడుదల చేసింది. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న హిందూ అవిభక్త కుటుంబాలు, వ్యక్తులు, సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఆర్జించిన ఆదాయానికి రిటర్న్లను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫారాలను సాధారణంగా మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రకటిస్తారు. అయితే, ఈ సంవత్సరం మాత్రం డిసెంబర్లోనే ఐటీఆర్ ఫారాలను ప్రకటించారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ముందస్తుగా ఐటీఆర్ దాఖలు చేయడానికి వీలు కలిగింది. ఏ ఫారం ఎవరికి? ఐటీఆర్ ఫారం-1 (సహజ్), ఐటీఆర్ ఫారం-4 (సుగమ్) అనేవి పెద్ద సంఖ్యలో ఉండే చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించిన సరళీకృత ఫారాలు. వీటిలో జీతాలు, ఇళ్లు, వడ్డీలు, వ్యయసాయం తదితర మార్గాల ద్వారా రూ. 50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులకు ఫారం-1 వర్తిస్తుంది. ఇక వ్యాపారం, వృత్తి మార్గాల ద్వారా రూ. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఆర్జించేవారు ఫారం-4 ద్వారా రిటర్న్స్ దాఖలు చేస్తారు. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.70 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు డిసెంబర్ 17వ తేదీ నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగి రూ.13,70,388 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) వాటా రూ.6.95 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ), సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వాటా రూ.6.73 లక్షల కోట్లు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన సమాచారం ప్రకారం, 2023–24 బడ్జెట్ లక్ష్యాల్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 75 శాతానికి చేరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.63 లక్షల కోట్లు. 2023–24లో ఈ లక్ష్యాన్ని రూ.18.23 లక్షల కోట్లుగా బడ్జెట్ నిర్దేశించుకుంది. రిఫండ్స్ రూ.2.25 లక్షల కోట్లు.. కాగా, డిసెంబర్ 17 వరకూ రిఫండ్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు. వీటిని కూడా కలుపుకుంటే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.15.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.7.90 లక్షల కోట్లు, ఎస్టీటీసహా వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.03 లక్షల కోట్లు. వేర్వేరుగా వసూళ్లను పరిశీలిస్తే... అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ.6.25 లక్షల కోట్లు, టీడీఎస్ రూ.7.71 లక్షల కోట్లు, సెల్ప్–అసెస్మెంట్ ట్యాక్స్ రూ.1.49 లక్షల కోట్లు. రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్ రూ. 36,651 కోట్లు. ఇతర హెడ్స్ కింద వసూళ్ల మ్తొతం రూ.14,455 కోట్లు. లక్ష్యాల సాధనపై భరోసా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్నుల (వస్తు సేవల పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్) వసూళ్ల లక్ష్యం రూ.15.38 లక్షల కోట్లు. వెరసి మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 33.61 లక్షల కోట్లు. ఈ స్థాయి పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, డిసెంబర్ 17 వరకూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 21 శాతం పెరిగాయి. పరోక్ష పన్ను దాదాపు 5 శాతం అధికంగా నమోదయ్యాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల మొత్తం రూ.30.54 లక్షల కోట్లు. 2023–24లో దీనిని 10 శాతం (రూ.33.61 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యాన్ని బడ్జెట్ నిర్దేశించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభలో ఓట్ ఆన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. లోక్సభకు ఎన్నికల అనంతరం కొలువుదీరే నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. -
వారి దగ్గర మీ సమగ్ర సమాచారం.. వెంటనే రంగంలోకి దిగండి..
ఏదైనా కారణం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను 2023 జూలై 31లోగా వేయలేకపోతే, కాస్త ఆలస్యంగానైనా దాఖలు చేసేందుకు 2023 డిసెంబర్ 31 ఆఖరు తేదీగా ఉంటుంది. ఇప్పటికే వేసి ఉంటే సరేసరి. లేకపోతే, వెంటనే రంగంలోకి దిగండి. మీ అంతట మీరే రిటర్ను వేయాలి. గడువు తేదీ లోపల వేయలేకపోతే కొంత పెనాల్టీతో గడువు ఇచ్చారు. అది కూడా ఈ నెలాఖరు లోపే వేయాలి! ఈ మధ్య కొంత మందికి మెసేజీలు పంపుతున్నారు డిపార్టుమెంటు వారు. ‘‘మా దగ్గరున్న సమాచారం ప్రకారం మీరు 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయాలి. కానీ మీరు దాఖలు చేయలేదు. దయచేసి వెంటనే దాఖలు చేయండి’’ అనేది వాటి సారాంశం (చూడండి ఎంత మర్యాదగా అడుగుతున్నారో). అలాంటప్పుడు ఆన్లైన్ ద్వారా వెంటనే జవాబు ఇవ్వండి. కాంప్లయెన్స్ పోర్టల్లోకి లాగ్ ఇన్ అవ్వండి. ఈ–ఫైలింగ్ పోర్టల్కి వెళ్లండి. ఆ తర్వాత ‘‘పెండింగ్లో ఉన్న పనులు’’ దగ్గరికి వెళ్లండి. అలా వెడితే, రిటర్నులు వేయని వారికి సంబంధించిన ‘Non & Filers’ అని టైప్ చేయండి. ఇప్పుడు జవాబు ఇవ్వండి. అయితే, ఒకటి గుర్తు పెట్టుకోండి. డిపార్టుమెంటు వారి దగ్గర మీకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా మెసేజీలు పంపుతున్నారు. సాధారణంగానైతే ఇలా పంపనవసరం లేదు. ఇది కేవలం మేల్కొనమని చెప్పడానికే. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపో వచ్చు. మీకు ఆదాయమే లేకపోవచ్చు. కానీ మీ పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంటులో ఏవో పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగి ఉండవచ్చు. వ్యవహా రం జరిగినంత మాత్రాన ఆదాయం ఏర్పడ కపోవచ్చు. కానీ ఇలా జరిగిన పెద్ద లావా దేవీలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా వివరణ అడగడానికి, మీరు ఇవ్వడానికి ఇదొక అవకాశం. ఈ మెసేజీ వచ్చిన వెంటనే మీ మీ అకౌంట్లను నిశితంగా పరిశీలించండి. ఖర్చులు (డెబిట్లు), జమలు (క్రెడిట్లు) విశ్లేషించండి. మీరే మీ ’ట్యాక్సబుల్ ఇన్కం’లో నుంచి బదిలీ చేసి ఉండొచ్చు. ఖర్చు పెట్టి ఉండొచ్చు. అటూ, ఇటూ బదిలీ చేసి ఉంటారు. ఎన్ఎస్సీలు, ఎఫ్డీలు, జీవిత బీమా, గ్రాట్యుటీ ఇలా పన్నుకి గురి అయ్యే వసూళ్లు జమ అయి ఉండొచ్చు. వివరణ సిద్ధం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు విదేశాల నుంచి పంపి ఉండవచ్చు. వారి తరఫున మీరు ఖర్చు పెట్టి ఉంటారు. రుజువులున్న వ్యవహారాలకు వివరణ ఇవ్వొచ్చు. స్నేహంలోనూ, బంధుత్వంలోనూ, మొహమాటంతో మీ అకౌంటులో వ్యవహారాలు ఎవరైనా జరిపి ఉన్నా వివరణ ఇచ్చే బాధ్యత మీ తలపైనే పడుతుంది. ఉదాహరణకు మావగారు పొలం అమ్మగా వచ్చిన నగదు; మీరే మీకు వచ్చిన బ్లాక్ అమౌంటుని జమ చేసి ఉండటం; మీ బావగారు తన కూతురి పెళ్లికని మీ అకౌంటులో వేసి ఉండొచ్చు. ఎవరికో సహాయం చేయబోయి, మీ అకౌంటులో వ్యవహారాలు జరిపి ఉండొచ్చు. ఇలా జరిగిన వాటిని అధికారుల సంతృప్తి మేరకు వివరించగలిగితే ఓకే. లేదంటే వెంటనే విశ్లేషించండి. వృత్తి నిపుణులను సంప్రదించండి. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉత్తమ పౌరుడిగా మీ బాధ్యతలు నిర్వర్తించండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. -
లెక్కకు రాని కట్టలు ఎన్నో!
రికార్డులు తిరగరాసిన ఉదంతమిది. అయితే అది వన్నె తెచ్చే రికార్డు కాకపోవడమే విషయం. యాభై మంది బ్యాంక్ అధికారులు, 40 కౌంటింగ్ మిషన్లు, ఆరు రోజుల పాటు అలుపెరగని సోదా, దొరికిన 350 కోట్లకు పైగా నగదు... దేశంలో ఇంతవరకూ ఏ దర్యాప్తు సంస్థ జరిపిన సోదాల్లోనూ కనివిని ఎరుగని కళ్ళు తిరిగే లెక్కలివి. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ కుటుంబ డిస్టిలరీ సంస్థపై రాంచీ సహా వివిధ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులు వారం రోజులుగా వార్తల్లో ముఖ్యాంశమవడానికి ఇదే కారణం. లెక్కింపు మిషన్లు కూడా మొరాయించేలా, గుట్టలు గుట్టలుగా సంచులకొద్దీ డబ్బు ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన సంస్థల్లో దొరకడం సామాన్య ప్రజానీకాన్ని ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. మునుపెన్నడూ లేనంతగా ఒకేసారి ఇంత డబ్బు ఐటీ సోదాల్లో దొరకడం సహజంగానే అధికార పక్షానికి అందివచ్చిన అస్త్రమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ను ఇరుకునపెట్టడంలో బీజేపీ నేతలు బిజీ అయ్యారు. సాక్షాత్తూ ప్రధాని, పార్లమెంట్ సాక్షిగా హోమ్ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లోని ప్రసిద్ధ ‘మనీ హైస్ట్’ సిరీస్ తరహాలో కాంగ్రెస్ అవినీతి దోపిడీ సాగుతోందని ప్రధాని వీడియో మీమ్లు పెట్టడం కొసమెరుపు. వెరసి, కాంగ్రెస్ది కక్కలేని మింగలేని పరిస్థితి. అయిదుగురు సోదరుల సాహూ కుటుంబమంతా తర తరాలుగా పార్టీ విధేయులూ, వివిధ సమయాల్లో చట్టసభ సభ్యులూ కావడంతో ఆ పార్టీ తప్పించు కోలేని దుఃస్థితి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ నడిగడ్డ మీద మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలై, అందులోనూ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి డీలా పడ్డ కాంగ్రెస్ను ఇది ఇరుకున పడేసింది. ఈ పరిస్థితుల్లో లెక్కలేని ఈ ధనరాశుల మచ్చ తనపై పడకుండేలా ఆ పార్టీ శతవిధాల యత్నిస్తోంది. బాహాటంగా సాహూను ఏమీ అనకున్నా, ఈ సోదా నగదుపై వివరణ కోరిందన్నది వార్త. సోదాల్లో దొరికిన నగదులో అధిక మొత్తం బౌద్ డిస్టిలరీస్ గ్రూపులో బయటపడ్డదే. అయితే, సాహూ కుటుంబం తరతరాలుగా సారాయి వ్యాపారంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో భారీగా సాగే ఇలాంటి వ్యాపారంలో నగదు చెల్లింపులే ఎక్కువన్నదీ బహిరంగ సత్యమే. పైగా, కుటుంబసంస్థలో కాంగ్రెస్ ఎంపీ సాహూ కనీసం డైరెక్టరైనా కాదు. సాహూ కుటుంబ సంస్థ అయినంత మాత్రాన ఆ డబ్బు సాహూది ఎలా అవుతుంది? అంతకు మించి ఆ డబ్బంతా కాంగ్రెస్దెలా అయిపోతుంది? ఇదీ హస్తం పార్టీ సమర్థకుల వాదన. సాంకేతికంగా అది నిజమే! అయితే, ఇందిరా గాంధీ కాలం నుంచి కాంగ్రెస్ వెంట నడిచి, ఒకటికి రెండు మూడు సార్లు ఎంపీలైన సాహూ సోదరుడు, సాహూ... తమ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు తమ వ్యాపార రాబడిని ఆసరాగా చేసుకొని ఉంటారనేది ఊహకందని విషయమేమీ కాదు. అది సాక్ష్యాధారాలతో సంబంధం లేని సామాన్య ఇంగితం. ఆరోపణలు, వివరణల మాటెలా ఉన్నా తాజా సాహూ వ్యవహారం మరింత లోతైన వ్యవహారాన్ని సూచిస్తోంది. సమాజంలో పేరు, పలుకుబడి ఉన్న పెద్దమనుషుల వద్ద లెక్కాజమా లేకుండా పోగుపడుతున్న ధనరాశుల చిట్టాలో ఇది లవలేశమేనన్న స్పృహ కలిగిస్తోంది. దాదాపు నూటికి 42 మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బీద రాష్ట్రంలో, నూటికి 48 మంది ప్రజానీకం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న రాష్ట్రంలో ఒక మద్యం డిస్టిలరీ సంస్థ వద్ద ఇంత ధనం దొరకడం సమకాలీన సమాజంలోని విరోధాభాస. సామాన్యులు తమ ప్రతి పైసా ఆదాయానికీ, ఖర్చుకూ లెక్కలు పూచీపడుతుంటే, బడా బాబుల వద్ద లెక్కకందని డబ్బుల కట్టలు మూలుగుతుండడం బయటపడ్డ ప్రతిసారీ దిగ్భ్రాంతి కలిగిస్తూనే ఉంది. పెద్ద నోట్ల రద్దు లాంటి ఆలోచనలు పదేపదే నిష్ఫలమైన తీరునూ కళ్ళ ముందుంచుతోంది. నిజానికి రాజకీయాలకూ, వ్యాపారానికీ మధ్య బంధం కొత్తేమీ కాదు. విజయ్ మాల్యా, అదానీ, అంబానీ అంటూ పేర్లు మారవచ్చేమో కానీ, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనుకూలురితో అధికార పీఠం బంధాలు పెనవేసుకోవడం దశాబ్దాలుగా దేశంలో చూస్తున్నదే. వందల రెట్లలో ఎదుగుతున్న వ్యాపార లెక్కల పైనే కాదు... పీఎం కేర్ ఫండ్స్ మొదలు పార్టీలకు అందుతున్న విరా ళాలు, ఎలక్టోరల్ బాండ్స్పైనా రచ్చ రేగుతున్నది అందుకే. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పన్ను లెక్కల్లో చూపని అక్రమ ధనం స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాతా దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉండడం విషాదం. ప్రతి 10–15 ఏళ్ళకోసారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ప్రకటిస్తున్నా నల్ల డబ్బు చీడ తొలగలేదు. చివరకివి ఆర్థికవ్యవస్థనే తలకిందులుచేసే స్థాయికి పెరిగిపోవడం దిగ్భ్రాంతికరం. డిజిటల్ చెల్లింపులు ప్రాచుర్యంలో పెట్టామని జబ్బలు చరుచుకొంటే చాలదు. ఆ పరిధిలోకి రాని ఇలాంటి నగదు గుట్టలను అరికట్టే ప్రణాళికలు చేపట్టాలి. రెండో ప్రపంచ యుద్ధానంతరం కొన్ని దేశాల్లో చేసినట్టే... నిర్ణీత పరిమితి దాటి ఎవరైనా అనధికారికంగా నగదు కలిగివుంటే తక్షణ శిక్షార్హ నేరంగా పరిగణించేలా చట్టం తేవాలి. అధికార పార్టీ నేతలపైనా ఆరోపణలు వినిపిస్తున్న వేళ, తరతమ భేదాలు లేని చర్యలు అవసరం. పైగా, వచ్చే ఎన్నికల్లో అవినీతి అంశాన్ని అస్త్రంగా చేసుకొని ఉరకాలని భావిస్తున్న అధికార పార్టీ నుంచి మరింత జవాబుదారీతనం ఆశిస్తాం. ప్రతిపక్షానికి సైతం తామే కాదు... తమ ఎంపీలూ పులు కడిగిన ముత్యాలేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అవేమీ లేకుండా, సామాన్యులకు చిరకాలం గుర్తుండే ఈ నగదు కట్టల దృశ్యాలు వట్టి వైరల్ వీడియోలుగా, శుష్క ఆరోపణలుగా మిగిలిపోతేనే కష్టం. -
ఒడిశాలో ఐటీ దాడులు..156 సంచుల్లో డబ్బు
భువనేశ్వర్/రాంచీ: ఒడిశాకు చెందిన డిస్టిలరీ గ్రూప్పై ఆదాయ పన్ను శాఖ అధికారులు కొనసాగిస్తున్న సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో కట్టల కొద్దీ అక్రమ నగదు బయటపడుతోంది. గురువారం బొలంగీర్లోని బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో జరిపిన తనిఖీల్లో రూ.200 కోట్ల నగదు బయటపడింది. శుక్రవారం బొలంగీర్ జిల్లా సుదపడలో జరిపిన సోదాల్లో నిండా కరెన్సీ నోట్లున్న 156 సంచులను గుర్తించారు. వీటిలో ఏడు బ్యాగుల్లో నగదును లెక్కించగా రూ.20 కోట్లుగా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో, ఇప్పటి వరకు లభ్యమైన డబ్బు రూ.220 కోట్లకు చేరుకుందన్నారు. లిక్కర్ కంపెనీతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న జార్ఖండ్ ఎంపీ సెల్ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని పీటీఐ తెలిపింది. రాంచీలోని ఆయన కార్యాలయం సిబ్బంది కూడా ఎంపీ అందుబాటులో లేరని చెబుతున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు మూడు రోజులుగా డిస్టిలరీ గ్రూప్ సంస్థలకు చెందిన సంబల్పూర్, బొలంగీర్, తితిలాగఢ్, సుందర్గఢ్, రూర్కెలా, భువనేశ్వర్లలో తనిఖీలు సాగిస్తున్నారు. -
ఆదాయపన్ను రిఫండ్లు వేగవంతం
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి పన్నుకు సంబంధించిన రిఫండ్లు గడిచిన ఐదేళ్లలో వేగవంతమయ్యాయి. పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన బకాయిలను ఆదాయపన్ను శాఖ నుంచి వేగంగా పొందుతున్నారు. రిఫండ్ కోసం వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గినట్టు సీఐఐ నిర్వహించిన సర్వేలో 89 శాతం మంది వ్యక్తులు, 88 శాతం సంస్థలు చెప్పడం గమనార్హం. ఈ సర్వే వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సీఐఐ సమరి్పంచింది. తమ అంచనా పన్ను బాధ్యతకు మించి టీడీఎస్ చెల్లించలేదని 75.5 శాతం మంది వ్యక్తులు, 22.4 శాతం సంస్థలు ఈ సర్వేలో చెప్పాయి. రిఫండ్ ఏ దశలో ఉందన్న విషయం తెలుసుకోవడం సులభంగా మారినట్టు 84 శాతం మంది వ్యక్తులు, 77 శాతం సంస్థలు తెలిపాయి. ఆదాయపన్ను రిఫండ్ క్లెయిమ్ సౌకర్యవంతంగా ఉన్నట్టు 87 శాతం మంది వ్యక్తులు, 89 శాతం సంస్థలు చెప్పాయి. పన్ను ప్రక్రియ ఆటోమేషన్కు సంబంధించి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న ఎన్నో చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తెలిపారు. ‘‘గడిచిన ఐదేళ్లలో ఆదాయపన్ను రిఫండ్లను పొందే విషయంలో వ్యక్తులు, సంస్థలు వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గడం ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న విరామం లేని ఎన్నో చర్యలు ఈ ప్రక్రియను మరింత సులభంగా, సమర్థవంతంగా మార్చేశాయి’’అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. -
మాజీ ఎంపీ వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
-
ఐటీ గుబులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత నెల రోజులుగా ఆదాయపన్నుశాఖ అధికారుల వరుస సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల పోటీలో హోరాహోరీగా పోరాడుతున్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లో ఐటీ గుబులు ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల్లో తమకు ఆర్థిక ‘సర్దుబాట్లు’ చేసే బంధువులు, సన్నిహితులపైనా ఆదాయపన్నుశాఖలోని ఐటీ ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టడం నాయకులను కలవరపెడుతోంది. అధికా రులు పక్కా సమాచారంతో క్షేత్ర స్థాయిలో సోదాలు చేస్తు న్నారు. రానున్న రోజుల్లో ఎప్పుడు..ఎవరిపైన సోదాలు జరుగుతాయోనన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఇటీవల ఐటీ చేపట్టిన ప్రధాన తనిఖీలు ఇలా... ♦ అక్టోబర్ 5న ఫైనాన్స్, చిట్ఫండ్, ఈకామర్స్ వ్యాపారుల ఆర్ధికలావాదేవీలలో అవకతవకలపై ఆదాయపన్నుశాఖ వంద బృందాలతో ఏక కాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని సుమారు 24 ప్రాంతాల్లో ఆక స్మిక సోదాలు చేపట్టింది. హైదరాబాద్తోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడులకు చెందిన ఐటీ అధికారులు సైతం ఈ సోదాల్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇల్లు, ఆఫీసులు, కూకట్పల్లి హిందు ఫారŠూచ్యన్ విల్లాలోని అరికపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లు, వీరి బంధువుల ఇళ్లలో సోదాలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బంధువులు, స్నేహితుల వ్యాపారాల లక్ష్యంగానే నాటి సోదాలు జరిగినట్టు మీడియాలో ప్రచారం జరిగింది. ♦ నవంబర్ 2న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్), బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వీరి బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో కేఎల్ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఆర్థికలావాదేవీలపై ఐటీ నిఘా పెట్టింది. ఇద్దరికీ చెందిన కంపెనీలు, సంస్థలకు చెందిన వివరాలు సేకరించింది. ఈ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున డబ్బు సమీకరించారనే సమాచారంతో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్టు ప్రచారం జరిగింది. అదే రోజు బాలాపూర్ లడ్డును వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ♦ నవంబర్ 2న కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న గిరిధర్ రెడ్డికి చెందిన కోకాపేట హిడెన్ గార్డెన్ లోని నివాసంలో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ♦ ఈనెల 9, 10 తేదీల్లో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. జూబ్లీహిల్స్లోని పొంగు లేటి నివాసంతో పాటు నందగిరిహిల్స్ వంశీరామ్జ్యోతి హిల్ రిడ్జ్లోని ఫ్లాట్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని రాఘవ ప్రైడ్, బేగంపేటలోని ఆఫీసుల్లో దాడులు చేశారు. అదే సమయంలో ఖమ్మంలోని ఆయన నివాసంలోనూ సోదాలు కొనసాగాయి. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లిన రోజే ఐటీ సోదాలు జరగడం కొంత కలకలం సృష్టించింది. ♦ ఈనెల 13న నుంచి వరుసగా రెండు రోజులపాటు నగరంలోని ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధులు ప్రదీప్రెడ్డి, కె నరేంద్రరెడ్డి ఇళ్లల్లో ఐటీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల్లోని మొత్తం13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు నిర్వహించిన ఈ సోదాల్లో ఎలాంటి లెక్కల్లో లేని రూ.7.50 కోట్లు సీజ్ చేసినట్లు సమాచారం. ఐటీ సోదాలు జరిగిన ఫార్మా వ్యాపారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులని ప్రచారం జరిగింది. ఆ కోణంలోనే ఐటీ దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ♦ తాజాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్ల వారుజాము వరకు అజీజ్ నగర్లోని శ్రీనిధి విద్యా సంస్థ చైర్మన్ కేటీ మహి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొన సాగాయి. ఆయనకి సంబంధించిన ఫుట్ బాల్ అకా డమీ, క్రికెట్ అకాడమీ కార్యాలయాల్లో సైతం ఐటీ అధి కారుల తనిఖీలు కొనసాగాయి. ఓఆర్ఆర్ అప్పా కూడలి వద్ద శనివారం సాయంత్రం పోలీసులు తనిఖీల్లో ఆరు కారులలో తరలిస్తున్న సరైన పత్రాలు లేని రూ.7.50 కోట్ల నగదును పోలీసులకు పట్టుబడడం, ఈ సొమ్మును ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కోసం తరలిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీనిధి విద్యా సంస్థ చైర్మన్ కే టీ మహి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆదివారం తెల్లవారు జాము వరకు సోదాలు చేసిన అధికారులకు రూ.12 లక్షల నగదు, విలువైన పత్రాలు లభించాయి. నోటీసులు జారీ శ్రీనిధి గ్రూప్ చైర్మన్ ఇంట్లో నుంచి నగదు పట్టుబడిన కేసు లో పోలీసులు 10 మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత సమీప బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రధాన పార్టీ నేత కోసమే ఈ నగదును తీసుకెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీజ్ చేసిన నగదును పోలీసులు సోమవారం కోర్టులో డిపాజిట్ చేయనున్నారు. -
ఐటీ దాడులపై స్పందించిన బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు
-
ఆదాయపన్ను రిటర్నుల్లో గణనీయ పెరుగుదల
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య ఎనిమిదేళ్ల కాలంలో 90 శాతం పెరిగిందని, 2021–22 అసెస్మెంట్ సంవత్సరంలో (2020–21 ఆర్థిక సంవత్సరానికి) 6.37 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. వ్యక్తులు జారీ చేసే రిటర్నులు 2013– 14 అసెస్మెంట్ సంవత్సరానికి 3.36 కోట్లుగా ఉంటే, అది 2021–22 నాటికి 6.37 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. 2023–24 అసెస్మెంట్ సంవత్సరం (2022–23 ఆర్థిక సంవత్సరం)లోనూ 7.41 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్టు తెలిపింది. ఇందులో మొదటిసారి ఐటీఆర్లు దాఖలు చేసిన వారు 53 లక్షల మంది ఉన్నట్టు పేర్కొంది. ముఖ్యంగా రూ.5–10 లక్షల ఆదాయం వర్గం వారి రిటర్నులు.. 2013–14 అసెస్మెంట్ సంవత్సరం నుంచి 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి 295 శాతం పెరిగాయి. రూ.10–25 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారి రిటర్నులు 291 శాతం పెరిగాయి. ఈ వివరాలను ఆదాయపన్ను శాఖ అత్యున్నత నిర్ణయ విభాగం సీబీడీటీ ప్రకటించింది. రూ.5 లక్షల్లోపు ఆదాయం కలిగి రిటర్నులు వేసే వారి సంఖ్య 2.62 కోట్ల నుంచి 3.47 కోట్లకు పెరిగింది. స్థూల ఆదాయం పరంగా టాప్ 1 శాతం పరిధిలోని పన్ను రిటర్నులు వేసే వారు 15.9 శాతం నుంచి 14.6 శాతానికి తగ్గారు. దిగువ నుంచి 25 శాతం ఆదాయం కలిగిన వారి రిటర్నులు 8.3 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగాయి. ఇక మధ్యస్థ ఆదాయం కలిగిన 74 శాతం గ్రూప్ పరిధిలోని పన్ను చెల్లింపుదారుల రిటర్నులు 75.8 శాతం నుంచి 77 శాతానికి పెరిగాయి. మధ్య తరగతి వాసుల రిటర్నులు ప్రధానంగా పెరిగినట్టు తెలుస్తోంది. -
జప్తు చేసింది రూ.1.7 కోట్లే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కలిపి మొత్తం రూ.59.93 కోట్ల నగదు, 156 కిలోల బంగారం, 454 కిలోల వెండిని స్వాధీనం చేసుకోగా... అందులో రూ.1.76 కోట్లు మాత్రమే లెక్కలు లేని నగదుగా తేల్చి జప్తు చేశామని ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ ప్రాంత డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంజయ్ బహదూర్ వెల్లడించారు. ఇప్పటికే రూ.10.99 కోట్ల నగదును సంబంధిత యజమానులకు అప్పగించామని, మిగిలిన నగదు విషయంలో దర్యాప్తు పురోగతిలో ఉందన్నారు. బుధవారం ఆయన ఆయకార్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 1800–425– 1785తో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. ల్యాండ్లైన్ నంబర్ 040–234262201/ 23426202 లేదా వాట్సాప్/టెలిగ్రామ్ నంబర్ 7013711399ను సంప్రదించవచ్చని చెప్పారు. అభ్యర్థుల అఫిడవిట్ల పరిశీలన నామినేషన్లు ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తెలిపిన ఆస్తులు, అప్పుల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సహకారంతో తనిఖీ చేస్తామని డీజీ సంజయ్ బహదూర్ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా అభ్యర్థుల ఖర్చులపై ఈసీకి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ‘రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సహకారంతో బ్యాంకు ఖాతాల నుంచి రూ.10లక్షలకు పైగా నగదు ఉపసంహరణలను పరిశీలిస్తాం. వీసా కోసం ఎవరైనా బంధువుల ఖాతాల నుంచి తమ ఖాతాకి నగదు బదిలీ చేసుకుంటే వారికి మినహాయింపు ఇస్తున్నాం. వ్యాపారంలో ఎవరికైనా అసాధారణ రీతిలో భారీగా ఆదాయం పెరిగినట్టు చూపినా మూలాలను పరిశీలిస్తాం. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే విత్డ్రా చేసినా పరిశీలన జరుపుతాం. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాల్లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. ఇతర చిన్న విమానాశ్రయాల్లో విమానాల తనిఖీల బాధ్యత జిల్లా కలెక్టర్లదే’అని ఆయన చెప్పారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) అనే యాప్ ద్వారా స్వా«దీనం చేసుకున్న నగదుకు సంబంధించిన లెక్కలను పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. -
ఐటీ దాడులు: 22 బాక్సుల్లో రూ.42 కోట్లు
బనశంకరి(బెంగళూరు): బెంగళూరులో ఆదాయపన్ను(ఐటీ) శాఖ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా సొత్తు బయటపడింది. కాంగ్రెస్కు చెందిన మాజీ కార్పొరేటర్ అశ్వత్తమ్మ, ఆమె భర్త ఆర్.అంబికాపతి, కూతురు, వారి బంధువుకు సంబంధించిన 10 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. అంబికాపతి ఇంట్లో మంచం కింద దాచిన 22 పెట్టెల్లో రూ.42 కోట్ల రూ.500 నోట్ల కట్టలు బయటపడినట్లు ఐటీ శాఖ తెలిపింది. త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి బెంగళూరు మీదుగా భారీగా డబ్బును హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు బెంగళూరులోని అశ్వత్తమ్మ కుటుంబీకులకు చెందినలో ఆర్టీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలో గురువారం రాత్రి వరకు జరిపిన సోదాల్లో రూ.42 కోట్ల లభ్యమైనట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. కాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ్ శ్రీనివాసమూర్తికి అశ్వత్తమ స్వయానా సోదరి. అశ్వత్తమ భర్త ఆర్.అంబికాపతి బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయనే గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి పనికీ 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపణలు చేశారు. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ దర్యాప్తు జరపాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలే బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్కు ఎన్నికల అస్త్రంగా మారాయి. మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలుకాగా , కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ ఆరోపణలు.. తెలంగాణ ట్యాక్స్ పేరుతో బిల్డర్లు, బంగారం వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.1,500 కోట్లను కాంగ్రెస్ పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు పంపుతోందని తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ ఇటీవల ఆరోపించింది. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ డబ్బును భారీగా వెదజల్లుతోంది. టిక్కెట్లు సైతం అమ్ముకుంటోంది’అని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ కోట్ల రూపాయలను పంపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సైతం ఆరోపణలు చేశారు. -
లోకేష్ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు
-
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు.. పట్టుబడ్డ రూ. 2 కోట్ల 47 లక్షలు..
సాక్షి నెట్ వర్క్: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వివిధ ప్రాంతాల్లో సరిగ్గా లెక్క చూపని, సరైన పత్రాల్లేని రూ. 2,47,30,500 నగదు, కేజీ 600 గ్రాముల బంగారం పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆయా నగదును, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్స్టేషన్ పరిధిలోని ఆగాపల్లి వద్ద మంచాల మండలం లోయపల్లికి చెందిన కె.శ్రీనివాస్ కారులో రూ.20 లక్షలు, కూకట్పల్లికి చెందిన సీహెచ్ రాజశేఖర్రెడ్డి కారులో రూ.2లక్షలు పట్టుబడ్డాయి. చిక్కడపల్లి: నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతానికి చెందిన శ్రీధర్ తన కియా కారులో కేజీ బంగారం తీసుకువెళ్తుండగా గాం«దీనగర్ స్టేషన్ పరిధిలో పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రూ.58 లక్షల విలువైన ఆ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే అందజేస్తామని లేకపోతే ఇన్కమ్ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో దోమలగూడ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో వెంకటరమణ అనే ద్విచక్రవాహనదారుడు నుంచి రూ.1,75,000 స్వాదీనం చేసుకున్నారు. చైతన్యపురి: బైక్లపై వెళ్తున్న దిల్సుఖ్నగర్ వీవీనగర్కు చెందిన బిరాదార్ సిద్ధేశ్వర్, సరూర్నగర్ ఇంద్రహిల్స్కు చెందిన బి.శంకర్రెడ్డి నుంచి రూ.60 లక్షల నగదును చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చెక్పోస్టు వద్ద స్వా«దీనం చేసుకున్నారు. చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరులో బ్యాంక్ ఉద్యోగి చీర్యాల సాయికుమార్ కారులో రూ. 45 లక్షలు ఉండటంతో ఆ డబ్బును సీజ్ చేశారు. అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలెం వద్ద ధాన్యం వ్యాపారి చింతకుంట్ల కోటేశ్వరరావుకు చెందిన కారులో రూ.7లక్షల 30వేలు లభ్యమయ్యాయి. రామగిరి: నల్లగొండ జిల్లా తిప్పర్తి వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన కుంచాల సుధాకర్ కారులో పోలీసులు రూ.8 లక్షల 50 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ చెక్పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.18,39,500, అంతారం స్టేజీ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.7.40 లక్షలు , కొత్తూరు బైపాస్ (వై జంక్షన్)వద్ద రూ.8.85 లక్షల నగదు, అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో రూ. 5.11 లక్షల నగదును పోలీసులుస్వాదీనం చేసుకున్నారు. చైతన్యపురి: సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపేట చౌరస్తాలో గోషామహల్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సునీల్ జహంగీర్ నుంచి రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విజయనగర్కాలనీ: గోల్కొండ టోలిచౌకీలోని అప్సర్ కాలనీకి చెందిన మహ్మద్ అశ్వాక్ ద్విచక్రవాహనంలో రూ.6 లక్షలు ఉన్నట్లు ఆసిఫ్నగర్ పోలీసులు గుర్తించారు. జియాగూడ: కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలోని పురానాపూల్ చౌరస్తాలో నార్సింగికు చెందిన ఆనంద్ నుంచి సుమారు 30 లక్షల విలువచేసే 600 గ్రాముల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద కామారెడ్డి నుంచి నిజామాబాద్కు కారులో వస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 50 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. -
లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్టాప్లూ తనిఖీ
భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులు చైనాకు చెందిన పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో (Lenovo) ఫ్యాక్టరీ, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని లెనోవా ఫ్యాక్టరీ, బెంగళూరులోని ఆఫీసులోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది. సోదాల్లో భాగంగా ఐటీ శాఖ అధికారులు లెనోవో ఉద్యోగుల ల్యాప్టాప్లను సైతం తనిఖీ చేసినట్లు తెలిసింది. సోదాల సమయంలోనూ, ముగిసిన తరువాత అధికారులు లెనోవా సీనియర్ మేనేజ్మెంట్ను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. (అమెరికా నుంచి ఐఫోన్ తెప్పించుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..) అంతకుముందు రోజు, తమిళనాడు రాష్ట్రంలోని లెనోవో కాంట్రాక్ట్ తయారీదారు ఫ్లెక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలలోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని రాయిటర్స్ నివేదించింది. కంపెనీ, దాని అనుబంధ సంస్థలపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కాగా దీనిపై లెనోవా స్పందిస్తూ ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు పేర్కొంది. “బాధ్యతగల కార్పొరేట్ పౌరులుగా మేము వ్యాపారం చేసే ప్రతి అధికార పరిధిలో వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలు, రిపోర్టింగ్ అవసరాలకు కచ్చితంగా కట్టుబడి ఉంటాం. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం” అని లెనోవా ప్రతినిధి తెలిపారు. లెనోవో కంపెనీ భారత దేశంలో 17 శాతం మార్కెట్ వాటాతో 2022-23లో 1.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. -
స్టార్టప్లకు 5 వేల్యుయేషన్ విధానాలు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు అన్లిస్టెడ్ అంకుర సంస్థలు జారీ చేసే షేర్ల విలువను మదింపు చేసే విధానాలకు సంబంధించి కొత్త ఏంజెల్ ట్యాక్స్ నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని 11యూఏ నిబంధనలో ఈ మేరకు సవరణలు చేసింది. దీని ప్రకారం అన్లిస్టెడ్ స్టార్టప్లు జారీ చేసే ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (సీసీపీఎస్) వేల్యుయేషన్ను సముచిత మార్కెట్ విలువ (ఎఫ్ఎంవీ)కి పది శాతం అటూ ఇటూగా లెక్క కట్టవచ్చు. ప్రవాస ఇన్వెస్టర్లు అయిదు రకాల వేల్యుయేషన్ విధానాలను ఉపయోగించవచ్చు. ఆప్షన్ ప్రైసింగ్ విధానం, మైల్స్టోన్ అనాలిసిస్ విధానం మొదలైనవి వీటిలో ఉంటాయి. దేశీ ఇన్వెస్టర్లకు ఈ అయిదు విధానాలు వర్తించవు. రూల్ 11 యూఏ ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతమున్న డీసీఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో), ఎన్ఏవీ (అసెట్ నికర విలువ) విధానాలు వర్తిస్తాయి. ఎఫ్ఎంవీకి మించిన ధరకు షేర్లను విక్రయించడం ద్వారా స్టార్టప్లు సమీకరించిన నిధులపై వేసే పన్నును ఏంజెల్ ట్యాక్స్గా వ్యవహరిస్తున్నారు. ఇది తొలుత దేశీ ఇన్వెస్టర్లకే పరిమితమైనప్పటికీ 2023–24 బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చే దిశగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. అయిదు రకాల వేల్యుయేషన్స్ విధానాలను అందుబాటులోకి తేవడం వల్ల ఇన్వెస్టర్లకు పన్నులపరంగా కొంత వెసులుబాటు పొందే వీలు లభించగలదని డెలాయిట్ ఇండియా, నాంగియా అండ్ కో తదితర సంస్థలు తెలిపాయి. -
ట్యాక్స్ ఆడిట్ చేయించారా? లేదా? లేదంటే..!
టాక్స్ ఆడిట్ అంటే? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొందరికి ఆడిట్ వర్తిస్తుంది. అలా చేయించే ఆడిట్నే ట్యాక్స్ ఆడిట్ అంటారు. ఎవరికి వర్తిస్తుంది? ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం మీ టర్నోవరు/బిజినెస్ వసూళ్లు/బ్యాంకులో రశీదులు అక్షరాలా ఒక కోటి రూపాయలు దాటితే కంపల్సరీగా ఆడిట్ చేయించాలి. వ్యాపారస్తులకు ఈ పరిమితి రూ. 1 కోటి. వృత్తి నిపుణులకు అయితే రూ. 50,00,000 పరిమితిగా ఉంటుంది. ఎవరు చేస్తారు? ఈ ఆడిట్ని డిపార్టుమెంట్ వారు చేయరు. చట్టప్రకారం మనమే.. అంటే అస్సెస్సీలే తమ టర్నోవరు రూ. 1 కోటి దాటితే ప్రాక్టీసులో ఉన్న సీఏ చేత చేయించాలి. ఈ ఆడిట్ను మనంతట మనమే స్వయంగా చేయించాలి. అంటే వాలంటరీగా చేయాలి. అలా చేయించినందుకు సీఏకి ఫీజు మనమే ఇవ్వాలి. సకాలంలో చేయించకపోయినా, చేసి ఆడిటర్ రిపోర్ట్ను సమరి్పంచకపోయినా, చాలా పెద్ద మొత్తంలో పెనాల్టీలు వేస్తారు. ఆడిట్ వెనుక లక్ష్యం ఏమిటంటే.. ♦ సరైన, తగిన విధంగా, కరెక్టుగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ను నిర్వహించేలా చూడటం. ♦ అలా నిర్వహించిన అకౌంటు మొదలైన వాటిని సీఏ సర్టిఫై చేయాలి లేదా ధృవీకరించాలి. ♦ ఆడిటింగ్ చేస్తున్నప్పుడు దొరికిన తప్పులు, దొర్లిన తప్పొప్పులు, తేడాలు, మిస్ అయిన అంశాలు, తప్పుడు సమాచారాలు, డబుల్ అకౌంటింగ్, ఆదాయంలో హెచ్చుతగ్గులు, ఖర్చుల్లో హెచ్చుతగ్గులు, వ్యక్తిగత ఖర్చులు, సమంజసం కాని ఖర్చులు, సంబంధం లేని ఖర్చులు, కేవలం ఆ సంవత్సరానికి సంబంధించినవే రాశారా లేదా వేరే సంవత్సరానివి రాశారా, ఆ వ్యాపారానివేనా లేక వేరే వ్యాపారానికి సంబంధించినవా, ఆ వ్యక్తి ఖర్చేనా లేక వేరే వ్యక్తికి సంబంధించినదా? క్యాపిటల్ ఖర్చెంత, రెవెన్యూ ఖర్చెంత? ఒకదానికొకటి సర్దుబాటు చేయలేదు కదా? స్థిరాస్తి కొని మామూలు ఖర్చుగా రాశారా? ఇలా వందలాది ప్రశ్నలకు జవాబులు ఈ రిపోర్టులో రాయాలి. ♦ అంతే కాకుండా అస్సెస్సీ కేవలం చట్టప్రకారం తనకు అర్హత ఉన్న, ఎలిజిబిలిటీ ఉన్న ప్రయోజనాల తగ్గింపులు, మినహాయింపులు మాత్రమే పొందారా లేక అదనంగా ఏదైనా లబ్ధి పొందారా? ♦ అంతే కాకుండా, ఇతర చట్టాల ప్రకారం, అంటే ఈఎస్ఐ, పీఎఫ్, జీఎస్టీ, కంపెనీ లా మొదలైన వాటి ప్రకారం చెల్లింపులు, అవి సక్రమమేనా, సకాలంలో చెల్లించారా .. ఇలా ఎన్నో విషయాలు బయపడతాయి. మీకు నిబంధనలు వర్తించే పక్షంలో ట్యాక్స్ ఆడిట్ తప్పక చేయించండి. అదే మీకు శ్రీరామరక్ష. -కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి ( ట్యాక్సేషన్ నిపుణులు) -కె.వి.ఎన్ లావణ్య( ట్యాక్సేషన్ నిపుణులు ) -
Income Tax: బకాయిలుంటే ట్యాక్స్ రీఫండ్లో కటింగ్!
ఆదాయపు పన్ను బకాయిలను వసూలు చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (Income Tax Department) సరికొత్త ప్రణాళిక రచించింది. బకాయిలున్న పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ (Tax refund) తో బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్న్ల (ITR) ప్రాసెసింగ్ను వేగవంతంగా పూర్తి చేసేందుకు, రీఫండ్ల జారీని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. (New Rules: అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..) పన్ను బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉన్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెండింగ్లో ఉన్న బకాయిలను సర్దుబాటు చేసి ట్యాక్స్ రీఫండ్లను సకాలంలో జారీ చేయడానికి సహకరించాలని కోరింది. బకాయిల సర్దుబాటుపై తమ సమ్మతిని తెలియజేయడానికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 245(1) ట్యాక్స్ పేయర్లకు అవకాశం కల్పిస్తుంది. దీని ప్రకారం.. బకాయిల సర్దుబాటుపై తమ అంగీకరిస్తున్నారో.. లేదో అని తెలియజేయాల్సి ఉంటుంది. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) 2023-24 అసెస్మెంట్ ఇయర్ కోసం 7.09 కోట్ల రిటర్న్లు దాఖలుకాగా 6.96 కోట్ల ఐటీఆర్లను ఆదాయపు పన్ను శాఖ వెరిఫై చేసింది. ఇక ఇప్పటివరకు వీటిలో 2.75 కోట్ల రిటర్న్స్కు ట్యాక్స్ రీఫండ్ను చెల్లించగా 6.46 కోట్ల రిటర్న్లను ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. -
డివిడెండ్ పంపిణీ పన్ను కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: షేర్ల బైబ్యాక్కు సంబంధించి డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసిందిగా ఆదాయపన్ను శాఖ అపిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) తాజాగా ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియాకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కాగ్నిజెంట్ చేసిన అపీల్ను ఐటీఏటీ చెన్నై బెంచ్ కొట్టివేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు అనుమతిమేరకు చేపట్టిన రూ. 19,080 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ పథకంలో భాగంగా కాగ్నిజెంట్ డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉంటుంది. 2017–18 అసెస్మెంట్ ఏడాదిలో కంపెనీ యూఎస్, మారిషస్లోని తమ వాటాదారుల నుంచి 94,00,534 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 20,297 చొప్పున వీటిని సొంతం చేసుకుంది. కంపెనీ దాఖలు చేసిన రిటర్నులను పరిశీలించిన తదుపరి ఐటీ శాఖ రూ. 4,853 కోట్లకుపైగా డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉన్నట్లు డిమాండ్ చేసింది. ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం మూలధన వినియోగం కారణంగా పన్ను చెల్లించవలసి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై కాగ్నిజెంట్ అపీల్కు వెళ్లింది. -
కదిలిన అవినీతి పునాది!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధానిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో సాగించిన ముడుపుల దందా స్పష్టంగా బయటపడింది. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి రూ.వందల కోట్ల ముడుపులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ఎలా కాజేశారో ఐటీ శాఖ సాక్ష్యాధారాలతో సహా బహిర్గతం చేసింది. డొల్ల కంపెనీల ద్వారా తరలించిన రూ.118.98 కోట్లను లెక్క చూపని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ ఐటీ శాఖ చంద్రబాబుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. 46 పేజీల ఆ సుదీర్ఘ లేఖలో నగదును ఏ విధంగా తరలించారు? బ్యాంకు ఖాతాల లావాదేవీలు, మెసేజ్లు, ఎక్సెల్ షీట్లు, కోడ్ భాషలో రాసుకున్న సంకేతాలను విశదీకరిస్తూ అన్ని సాక్ష్యాధారాలతో మరీ నోటీసులిచ్చింది. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అత్యధిక కాంట్రాక్టులు పొందిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ను చంద్రబాబు స్వయంగా పరిచయం చేశారు. పీఎస్ శ్రీనివాస్ ఎప్పటికప్పుడు అన్ని వివరాలను తనకు చేరవేస్తుంటారని, అతడి ద్వారా తాను సూచనలు చేస్తుంటానని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ముడుపులపై మనోజ్ వాసుదేవ్ పార్థసానికి దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబుకు ముడుపులు ఏ రూపంలో, ఎలా ఇవ్వాలో ఆయన పీఏ శ్రీనివాస్ చెప్పేవారని, లేదంటే తమ బిల్లులు పాస్ కాకుండా పెండింగ్లో పెట్టేవారని పార్థసాని వాంగ్మూలంలో వెల్లడించాడు. చంద్రబాబుకు రూ.వందల కోట్లను ముడుపులుగా చెల్లించినట్లు మనోజ్ పార్థసాని తన వాంగ్మూలంలో ఐటీ శాఖకు తెలియచేశాడు. వితండ వాదనతో మళ్లీ నోటీసులు.. మనోజ్ పార్థసానికి చెందిన కార్యాలయాలపై 2019లో సోదాలు జరిపిన ఐటీ శాఖ అదే ఏడాది నవంబరు 1, 5వ తేదీల్లో అతడిని విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 2020లో చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. అందులో చంద్రబాబు పాత్రను నిర్ధారించే పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. దీంతో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ చంద్రబాబు వితండ వాదన చేయడంతో ఐటీ శాఖ తాజాగా వివిధ చట్టాలను ఉటంకిస్తూ ఆయనకు మళ్లీ నోటీసులిచ్చింది. ఆ నోటీసులతో పాటు మనోజ్ పార్థసాని ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా జత చేయటంతో చంద్రబాబు ముడుపుల దందా కళ్లకు కట్టినట్లు వెల్లడైంది. అక్రమంగా రూ.118.98 కోట్లు చంద్రబాబుకు ఎలా చేరాయన్న విషయాన్ని ఐటీ శాఖ స్పష్టంగా ఓ పట్టిక రూపంలో వివరించింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నందున దీన్ని అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది. పేదల ఇళ్లలోనూ.. తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన చంద్రబాబు పేదల ఇళ్లను సైతం వదల్లేదు. రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ దోపిడీకి వేసిన పథకం ఐటీ నోటీసుల్లో బయటపడింది. ‘ఈడబ్ల్యూఎస్’ పథకం కింద పేదలకు ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 నవంబర్ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్తో టచ్లో ఉండాలని చెప్పారని, పార్టీ ఫండ్ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని సూచించినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది. లోకేశ్కూ అవినీతి సొమ్ము ముడుపులు పిండుకోవడంలో ‘చినబాబు’ కూడా చేతివాటం చూపారు. ఈమేరకు చంద్రబాబుకు జారీ చేసిన సుదీర్ఘ నోటీసుల్లో నారా లోకేశ్ పేరును కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రస్తావించింది. లోకేశ్కు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేష్ అక్రమ నగదు తరలింపులో కీలకపాత్ర పోషించినట్లు ఐటీ శాఖ స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెల్లడించింది. ‘మీ కుమారుడు నారా లోకేశ్ సన్నిహితులు నగదు తీసుకున్నారనేందుకు పక్కా ఆధారాలున్నాయి. వీటిపై మీరు ఏం సమాధానం చెబుతారు?’ అని ప్రశ్నిస్తూ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఎక్సెల్ షీట్లు, నగదు తరలింపు సమయంలో జరిపిన వాట్సాప్ మెసేజ్లను స్క్రీన్షాట్ల రూపంలో జత చేసి మరీ నోటీసులను జారీ చేసింది. విశాఖకు చెందిన ఆర్వీఆర్ నిర్మాణ రంగ సంస్థకు చెందిన రఘు రేలా ఆయన సన్నిహితుల ద్వారా కూడా భారీ మొత్తాలను తరలించినట్లు సాక్ష్యాలతో స్పష్టం చేసింది. ఈ చాటింగ్లన్నీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో 2020 ఫిబ్రవరిలో సోదాలు జరిపినప్పుడు స్వా«దీనం చేసుకున్న శ్యాంసంగ్ ఫోన్ నుంచి సేకరించినవి కావడం గమనార్హం. వీటిని శ్రీనివాస్ ధృవీకరించినట్లు ఐటీ శాఖ చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. లోకేశ్కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజే‹Ùకు రూ.4.5 కోట్లను నగదు రూపంలో ఎలా చేరవేశారో ఐటీ శాఖ పూర్తి సాక్ష్యాధారాలతో నోటీసుల్లో వివరించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీరు ముడుపుల వ్యవహారాన్ని యధేచ్ఛగా కొనసాగించారు. 2019 మే 22న చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ డబ్బుల పంపిణీ గురించి ప్రస్తావించగా కిలారు రాజేష్కు రూ.4.5 కోట్లను టీడీపీ ఆఫీసులో అందించినట్లు పార్థసాని పేర్కొన్నాడు. అంకిత్ బలదూత ద్వారా రూ.2.2 కోట్లు పంపగా, రఘు రేలాకు సన్నిహితుడైన శ్రీకాంత్ ద్వారా మిగిలిన మొత్తాన్ని పంపినట్లు చెప్పడంతో ‘‘అయితే ఓకే..’’ అంటూ చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ బదులిచ్చాడు. ఈమేరకు నగదు తరలింపులకు సంబంధించి శ్రీకాంత్ ఫోన్ నుంచి జరిగిన వాట్సాప్ సంభాషణలను కూడా ఐటీ అధికారులు జత చేశారు. వాంగ్మూలం నమోదు సమయంలో ఈ సంభాషణలను మనోజ్ వాసుదేవ్కు చూపగా అది నిజమేనని అంగీకరించినట్లు ఐటీశాఖ పేర్కొంది. డేటా చౌర్యం ఐటీ గ్రిడ్ కేసులో కూడా కిలారు రాజేష్ కీలక పాత్రధారిగా వ్యవహరించిన విషయం విదితమే. -
తనను అరెస్టు చేస్తారని చంద్రబాబు భయపడుతున్నాడు: మంత్రి మేరుగు నాగార్జున
-
చంద్రబాబు ఐటీ స్కాం కేసులో కీలక పరిణామం
-
చంద్రబాబుకు మ్యూజిక్ స్టార్ట్.. దిమ్మతిరిగే షాక్..
-
చంద్రబాబు విదేశాలకు పారిపోయే అవకాశం!
-
ఎక్కడి దొంగలు.. అక్కడే!
సాక్షి, అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబునాయుడు తన ఖాతాల్లోకి నేరుగా రప్పించుకున్న రూ.118 కోట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చినట్లు జాతీయ ఇంగ్లిష్ డైలీ ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రచురించి దాదాపు వారం దాటింది. నాటి నుంచీ ఈ నోటీసులతో పాటు బాబు హయాంలో కాంట్రాక్టు సంస్థల నుంచి ముడుపులు ఎలా అందుకున్నారో, ఖజానాను ఎలా కొల్లగొట్టారో వివరాలతో సహా వివిధ పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఊరూరూ వెళుతున్న బాబుగానీ... పాదయాత్రంటూ తిరుగుతున్న ఆయన తనయుడు లోకేశ్ గానీ.. షూటింగ్ గ్యాప్ తీసుకున్న పవన్ గానీ ఎవ్వరూ దీనిపై మాట్లాడటం లేదు. ఇక అందరిపైనా ఉన్నవీ లేనివీ రాసే ‘ఈనాడు’, దాని తోకపత్రిక, తోక చానెళ్లు... ఏవీ ఈ అంశాన్నే ప్రస్తావించటం లేదు. ఆఖరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చిన పురంధేశ్వరి కూడా దీన్నో సాధారణ అంశంగా తేల్చేశారు తప్ప బాబు అవినీతికి నిదర్శనంగా చూడటం లేదు. ఏమయింది వీళ్లకి? ఇక చంద్రబాబు విషయానికొస్తే అటు ఐటీ విభాగానికేమో.. ‘నాకు నోటీసులిచ్చే అధికారం మీకెక్కడిది?’ ‘నాకు సాక్ష్యాధారాలు చూపించండి’ ‘ఫలానా సంవత్సరానికి ఇది వర్తించదు’ అనే డొంకతిరుగుడు జవాబులిస్తున్నారు. ఇటు ప్రజల ముందేమో... ‘నాపై కుట్ర చేస్తున్నారు’ ‘నన్ను అరెస్టు చేస్తారేమో’ ‘నన్ను ఏ క్షణాన్నైనా అరెస్టు చేయొచ్చు’ అని నానా నంగనాచి కబుర్లు చెబుతున్నారు. అంతే తప్ప... ఆ నోటీసులు ఎందుకొచ్చాయి? తాను నిజంగా అవినీతి చేశాడా... లేదా? ఆ 118 కోట్లూ నిజంగా ముట్టాయా? కాంట్రాక్టు సంస్థలను బెదిరించటం అబద్ధమా? మనోజ్ పార్థసానితో తనకు సంబంధాలున్నాయా... లేవా? దుబాయ్లో డబ్బులు తీసుకున్నాడా.. లేదా? అనే ఏ విషయమూ చెప్పటం లేదు. పైపెచ్చు ఐటీ శాఖకే సమాధానాలిస్తారంటూ ఆయన తరఫున కొందరు బీరాలు పోవటమూ మొదలయ్యింది. కేంద్రం ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఆదాయపు పన్ను శాఖ... రిటర్నుల్లో చూపించని మొత్తం ఎవరి లావాదేవీల్లోనైనా కనిపించినపుడు నోటీసులివ్వటం మామూలే. కాకపోతే చంద్రబాబుది రిటర్నుల్లో చూపించని మొత్తం మాత్రమే కాదు. అది అక్రమంగా ఆర్జించిన అవినీతి సొమ్ము. ప్రభుత్వ ప్రాజెక్టుల్ని కట్టబెట్టి.. లంచాల రూపంలో తన ఖాతాలోకి నేరుగా రప్పించుకున్న అక్రమార్జన. పైపెచ్చు ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ!!. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు. మరి ప్రజలకు జవాబుదారీయే కదా? బయట అన్ని సభల్లో మాట్లాడుతున్న చంద్రబాబుకు... తనపై వచ్చిన నోటీసులపై స్పందించాల్సిన ఆవశ్యకత లేదా? ఇలాంటి రాజకీయం ఎక్కడైనా ఉంటుందా? దొంగలంతా కలిసి... ఎక్కడి వారక్కడే గప్చుప్... అన్న తరహాలో నోరు మూసుకున్నంత మాత్రాన విషయం అందరికీ తెలియకుండా ఉంటుందా? జబాబు చెప్పాల్సిన బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోగలరా? ఇదీ అసలు కథ... అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా సాగించిన అవినీతి బండారం బట్టబయలవుతున్న కొద్దీ బాబులో ఆందోళన రెట్టింపు అవుతోంది. ఇన్నాళ్లూ ప్రతి వ్యవస్థలో తన మనుషుల్ని పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా ‘నిప్పు’లా చెలామణి అయిన బాబుకు... రోజులన్నీ ఒకేలా ఉండవని ఇప్పుడు అర్థమవుతోంది. రూ.8వేల కోట్ల కాంట్రాక్టుల కేటాయింపులో షెల్ కంపెనీలు, బోగస్ ఇన్వాయిస్లతో సాగించిన అవినీతిని ఐటీ శాఖ నిగ్గు తేల్చింది. నోటీసులిచ్చింది. ఆధారాలూ చూపించింది. తప్పించుకునేందుకు బాబు వేసిన ఎత్తుల్ని తిప్పికొట్టింది. దీంతో బాబుకు దారులు మూసుకుపోయాయి. మరోవైపు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో చంద్రబాబు అవినీతిని సీఐడీకి చెందిన సిట్ బృందం ఆధారాలతో సహా వెలికి తీసింది. ఆ రెండు వ్యవహారాల్లోనూ షెల్ కంపెనీలు, బోగస్ ఇన్వాయిస్ల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనం హైదరాబాద్లోని చంద్రబాబు బంగ్లాకే చేరిందన్నది బట్టబయలైంది. ఈ స్కిల్ స్కామ్లో హవాలా దందా నిగ్గు తేల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దిగింది. అదే కుతంత్రం...మళ్లీ మళ్లీ పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన చంద్రబాబు... తన అవినీతి బాగోతం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మళ్లీ పాత దారే ఎంచుకున్నారు. తనను రెండు రోజుల్లో అరెస్టు చేయవచ్చంటూ వ్యాఖ్యానించారు. దానిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు స్పందించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పరోక్షంగా ఆదేశించారు. తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలన్నది బాబు పన్నాగం. తాను ఇబ్బందుల్లో పడిన ప్రతిసారీ చంద్రబాబు అనుసరించే దిగజారుడు రాజకీయ ఎత్తుగడ ఇదే. 2015లో హైదరాబాద్లో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినపుడూ ఇదే చేశారు. తెలంగాణ పోలీసులు తనను అరెస్టు చేస్తారేమో అని చెబుతూ రాత్రికి రాత్రి హైదరాబాద్ విడిచిపెట్టి అమరావతి వచ్చేశారు. పైపెచ్చు రాష్ట్రం నుంచే పరిపాలన చేసేందుకే వచ్చేశానని చెప్పుకొచ్చారు. పైగా తనపై కేసు పెట్టడాన్ని ఆంధ్రపై తెలంగాణ ప్రభుత్వం చేసిన దాడిగా వక్రీకరించారు. అంతేతప్ప తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలించేందుకు కోట్ల రూపాయలు లంచంగా ఇస్తూ పట్టుబడ్డానన్న వాస్తవాన్ని మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడూ అదే సూత్రం అమలు చేస్తున్నారు. ఇటీవల అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పర్యటనల్లో పోలీసులపై దాడులకు పాల్పడేలా టీడీపీ నేతలు, కార్యకర్తలను ప్రేరేపించారు. తాజాగా భీమవరంలోనూ అదే రీతిలో ఘర్షణలు సృష్టించారు. ఇపుడు తనను అరెస్టు చేస్తారని వ్యాఖ్యానిస్తూ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. ఇదీ చంద్రబాబు అవినీతి నెట్వర్క్ అటు అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాలు, టిడ్కో గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఇటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రెండింట్లోనూ చంద్రబాబు ఒకే అవినీతి నెట్వర్క్ను ఉపయోగించారు. రెండుచోట్లా తానే సూత్రధారిగా ఉంటూ... నిధులను చేర్చడంలో పాత్రధారులుగా యోగేశ్ గుప్తా, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్లను పెట్టారు. అదెలాగంటే... ► జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా దాని సహ భాగస్వామిగా డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి దింపి ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం చేశారు చంద్రబాబు. రూ.3,300 కోట్ల మేర కాగితాలపై ప్రాజెక్టును చూపించి డిజైన్ టెక్ సంస్థ తన వాటా 90 శాతంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 శాతం కింద జీఎస్టీతో సహా రూ.371 కోట్లు విడుదల చేశారు. అందులో సాఫ్ట్వేర్ కొనుగోలుకు రూ.56 కోట్లు చెల్లించి... మిగిలిన రూ.315కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి తమ ఖాతాల్లోకి తరలించేసుకున్నారు. దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు నికంగా రూ.241 కోట్లు చేరాయని సిట్ నిర్ధారించింది. అక్రమ నిధుల ఎలా తరలించారంటే... ► రాష్ట్ర ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐకి రూ.2.71కోట్లు అంటే మొత్తం మీద రూ.241కోట్లు తరలించారు. ► పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్లలో ఉన్న వివిధ షెల్ కంపెనీలతో పాటు దుబాయి, సింగపూర్లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13కోట్లు ఇన్వెబ్: రూ.1.56కోట్లు పోలారీస్: రూ.2.2కోట్లు కెడెన్స్ పార్టనర్స్: రూ.12కోట్లు ► మొత్తం రూ. 140.53కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసి యోగేశ్ గుప్తా మనోజ్ వాసేదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదును చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో అందించారు. అంటే ఆ రూ.140.53కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఇక మిగిలిన రూ.100.47కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులు మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్కు తరలించారు. మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. అక్కడ నుంచి చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► అంటే ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. -
దొంగతనం చేసి దబాయింపా?
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబు తీరు దొంగతనం చేసి దబాయిస్తున్నట్లుగా ఉందని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అవినీతి బండారం బయటపడటంతో ఆయనకు భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోందని, అడ్డంగా దొరికిపోయినట్లు ఆయనకే అర్థమవుతోందని చెప్పారు. అందుకే గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను రేపో ఎల్లుండో అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు సానుభూతి కోసం నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిప్పు కాదని.. తప్పులకు మానవ రూపమని, తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి అని మండిపడ్డారు. బాబు చట్టానికి అతీతుడు కాదన్నారు. నోటీసులకు స్పందించకుండా, విచారణకు సహకరించకుంటే ఐటీ శాఖ అరెస్టు కూడా చేయవచ్చన్నారు. ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులను పరిశీలిస్తే చంద్రబాబు, లోకేష్ హవాలా, మనీలాండరింగ్కు పాల్పడినట్లు స్పష్టమవుతోందని, ఈ వ్యవహారంపై ఇన్నాళ్లూ ఈడీ జోక్యం చేసుకోకపోవడంపై సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. అప్పట్లోనే కుంభకోణాన్ని ఎండగట్టాం.. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని చదరపు అడుగుకు రూ.పది వేల చొప్పున షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు చంద్రబాబు అప్పగించారు. హైదరాబాద్లోని జుబ్లీహిల్స్లో అత్యాధునిక సదుపాయాలు, ఫర్నిచర్తో సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేలు మాత్రమే బిల్డర్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూమిలో తాత్కాలిక నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలకు మించి వ్యయం కాదు. ఇందులో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని అప్పట్లోనే మేం అభ్యంతరం తెలిపాం. కాంట్రాక్టర్లకు చదరపు అడుగుకు అదనంగా రూ.7–8 వేలు దోచిపెట్టిన చంద్రబాబు అందులో 60 నుంచి 70 శాతం వరకూ కమీషన్ తీసుకున్నారు. పేదల నోళ్లు కొట్టి.. టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.వెయ్యికి మించి వ్యయం కాదు. కానీ ఆ పనులను రూ.2,200 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. పేదల కష్టార్జితాన్ని చదరపు అడుగుకు అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన చంద్రబాబు వారి నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని, ఇది పాపమని అప్పట్లోనే మేం చెప్పాం. ఐటీ నోటీసులతో అది రుజువైంది. షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, విక్కీజైన్, కిలారు రాజేష్ ద్వారా చంద్రబాబు, ఆయన పీఎస్ శ్రీనివాస్, లోకేష్ వసూలు చేసిన విధానాన్ని ఆధారాలతోసహా ఐటీ శాఖ బహిర్గతం చేసింది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్ చేతిలో అడ్డంగా దొరికిపోయిన సమయంలోనూ తనను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చునని, ప్రజలంతా తనకు రక్షణ కవచంలా నిలబడి రక్షించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐటీ శాఖ నోటీసులతో ఇప్పుడూ అలాగే కోరడం విడ్డూరం. కుంభకోణాల దారులన్నీ బాబు వైపే.. అమరావతి భూకుంభకోణం, ఫైబర్నెట్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ల్లో సీఐడీ దర్యాప్తుతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైంది. ఐటీ నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులనే ఆ కుంభకోణాల్లో నిందితులుగా సీఐడీ గతంలోనే తేల్చింది. 1995–2004 మధ్య ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో విచారణను ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టే తెచ్చుకున్నారు. రాజకీయంగా కక్ష సాధించాలనుకుంటే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెట్టించేవారు. చంద్రబాబు కుంభకోణాలన్నీ ఆధారాలతోసహా ఇప్పుడు బయటపడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడం ఆయన తరం కాదు. ఖజానాను లూటీ చేయడం సాధారణమా? చంద్రబాబుకు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులు సాధారణమైనవని, వాటిపై తాను స్పందించబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొనడం విడ్డూరం. ప్రభుత్వ ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ముడుపులు తీసుకున్నందుకే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని ఆమెకు తెలియదా? లేదంటే మరిదిని రక్షించుకోవడానికి అలా మాట్లాడారా? చీటికిమాటికీ ట్వీట్లతో రెచ్చిపోయే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడంలో ఆంతర్యమేంటి? ఎల్లో మీడియా ఐటీ నోటీసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి శతవిధాలా ప్రయతి్నస్తోంది. శాంతి భద్రతల సమస్య సృష్టించే కుట్ర.. చంద్రబాబు శాంతి భద్రతల సమస్య సృష్టించి లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారు. పుంగనూరులో పోలీసులపైకి టీడీపీ గూండాలను ఉసిగొల్పారు. అదే కుట్రను లోకేశ్ భీమవరంలో అమలు చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ప్రయత్ని స్తే చూస్తూ ఊరుకోం. -
ఐటీ ఎటాక్తో వణికిపోతున్న చంద్రబాబుకు..
-
దర్యాప్తు చేపడితే..బాబు, చినబాబు జైలుకే!
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులపై దర్యాప్తు సంస్థలు విచారణకు స్వీకరించి నేరం రుజువైతే బాబుతో పాటు ఆయన తనయుడు చిన్నబాబు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రముఖ న్యాయవాది, కార్పొరేట్ న్యాయ నిపుణుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఐటీ నోటీసులపై ఈడీ సుమోటోగా దర్యాప్తు చేపట్టవచ్చన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా, ఆర్బీఐ, కంపెనీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేయొచ్చని వెల్లడించారు. పూర్తి ఆధారాలు, సాక్ష్యాలను ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొందని.. ఇవి నిజమేనని తేలితే చంద్రబాబు, లోకేశ్ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్ను, అందులోని అవినీతిని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. డొల్ల కంపెనీల ద్వారా రూ.వందల కోట్లు స్వాహా చేసినట్లు, బాబుకు ఎవరి ద్వారా, ఏ కంపెనీ ద్వారా ఎంతెంత అందింది.. తదితర వివరాలను ఆధారాలతో సహా ఐటీ శాఖ వెల్లడించింది. దీనిపై వెంకటరామిరెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. తప్పించుకునే యత్నమెందుకు? ఓ రాజకీయ పారీ్టకి అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా చంద్రబాబు ఐటీ శాఖ నోటీసులకు బాధ్యతగా వివరణ ఇవ్వాలి. నేరమేమీ చేయనప్పుడు ఐటీ శాఖ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే యత్నం ఎందుకో చెప్పాలి. వారడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా.. అసలు తనకు నోటీసులిచ్చే అధికారమే లేదని బాబు పలుమార్లు లేఖ రాయడం చూస్తుంటే నేరం చేసినట్లు భావించాల్సి వస్తోంది. సెక్షన్–127 ప్రకారం నోటీసులిచ్చే అధికారం ఉందని ఐటీ అధికారులు స్పష్టంచేశారు. నేరుగానైనా కావొచ్చు.. తన అనుచరుల ద్వారానైనా కావొచ్చు.. రూ.118.98 కోట్లు బాబుకే అందాయని ఐటీ వివరాలతో సహా కుండబద్దలు కొట్టింది. 2023, ఆగస్టు 4న చంద్రబాబుకు ఐటీ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులో అదే నెల 11న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలన్నారు. దీనిని నేరుగా బాబు నివాసమైన ప్లాట్ నంబర్ 1310, రోడ్ నంబర్ 65, జూబ్లీహిల్స్ ఇంటికి పంపారు. ఆయన వద్ద సరైన వివరణ ఉండి ఆ రోజున హాజరై చెప్పి ఉంటే.. ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేదికాదు. కనీసం ఎప్పుడు హాజరై వివరణ ఇస్తారో కూడా చెప్పడంలేదని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొనడం చూస్తుంటే అందులోని అంశాలు పూర్తి వాస్తవమేనని స్పష్టమవుతోంది. బోగస్ కంపెనీలు సృష్టించి.. మనోజ్ వాసుదేవ్ పార్థసాని, ఐదు కంపెనీల వాళ్లు ఇచ్చిన మెటీరియల్ పేపర్లు, బాబు పీఏ శ్రీనివాస్ను పరిచయం చేసిన ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్లు ఐటీ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది. ఆ ముగ్గురు భారత్, దుబాయ్, ఇతర చోట్ల నుంచి నగదు తెచ్చి ఎవరెవరికి ఇచ్చారో కూడా ఉంది. తాము కాంట్రాక్టులు తీసుకుని.. ఎన్నికల నిధుల కోసం ఖర్చుపెట్టేందుకు టీడీపీకి ఇచ్చినట్లు స్టేట్మెంట్లో వెల్లడించారు. నోటీసుల్లో కూడా నగదంతా షాపూర్జీ పల్లోంజీ నుంచి చంద్రబాబుకే అందినట్లు ఉంది. షలక, అన్నై (ఎక్సెల్ ఫ్రమ్ వినయ్ నంగాలియా) నుంచి రూ.33,76,18,207, ఎవరెట్ అండ్ నయోలిన్ (షీట్ ఫ్రమ్ విక్కీ మొబైల్) నుంచి రూ.50,43,00,000, పోర్ ట్రేడింగ్ నుంచి రూ.9,42,00,000, హార్డ్రిటన్ షీట్ (లక్స్టోన్ అండ్ కో) నుంచి రూ.10,23,00,000, దుబాయ్ నుంచి రూ.15,13,95,000లు చంద్రబాబుకు అందాయని.. ఇందులో రూ.118.98 కోట్లను మాత్రం ఆదాయంలో చూపలేదని కంపెనీల వారీగా వివరాలు వెల్లడించింది. షాపూర్జీ పల్లోంజీ నుంచి నగదును తీసుకునేందుకు ప్రైవేట్ డొల్ల కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు సృష్టించారు. బోగస్ కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు, బోగస్ నామినేషన్లు అంటూ.. ‘బోగస్’ అనే పదాన్ని ఐటీ శాఖ తన నోటీసుల్లో స్పష్టంగా పలుమార్లు పేర్కొంది. సెక్షన్ 132(4), 5(బీ) కింద మనోజ్ స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆయన కూడా అదంతా వాస్తవమేనని సంతకం పెట్టారు. స్టేట్మెంట్లు ఇచ్చిన వారు చంద్రబాబు, అతని పీఎస్ పేరుతో పాటు లోకేశ్ పేరును వెల్లడించారు. విక్కీ అనే వ్యక్తి ద్వారా లావాదేవీలన్నీ జరిగినట్లు, నేరుగా చంద్రబాబు కూడా కొన్ని చెప్పినట్లు ఐటీ తన నోటీసుల్లో పేర్కొంది. అరెస్టు చేసి.. దర్యాప్తు చేపట్టవచ్చు.. ఇప్పటికే ఐటీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసినా చంద్రబాబు నుంచి సరైన సమాధానం రాలేదు. ఒకవేళ సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందని పక్షంలో పెద్దఎత్తున జరిమానాలు విధించవచ్చు. 25 శాతం అదనపు పన్నుతో పాటు వడ్డీ కూడా విధించవచ్చు. నేరం జరిగినట్లు తేలితే.. రూ.118.98 కోట్లకు 300 శాతం అంటే రూ.356.94 కోట్లు వసూలుచేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు.. అరెస్టుచేసే అధికారం కూడా ఉంటుంది. దుబాయ్ నుంచి కూడా నగదు అందడం.. పలు కంపెనీల నుంచి డబ్బు స్వీకరించడం.. క్విడ్ ప్రో కోతో పాటు మనీలాండరింగ్ కిందికి వస్తుంది. దీంతో ఈడీ కూడా సుమోటోగా దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఈడీనే కాదు.. పీఎంఎల్ఏ, ఫెమా, ఆర్బీఐ, కంపెనీ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా కేసు నమోదు చేయవచ్చు. అంతేకాక.. సీబీసీఐడీ కూడా దర్యాప్తు చేపట్టవచ్చు. 2019 తర్వాతవే ఆ రూ.118.98 కోట్లు.. ఇక 2019 తర్వాత వచ్చినవే ఆ రూ.118.98 కోట్లు అయితే.. మరి 2014 నుంచి ఎన్ని డొల్ల కంపెనీలు నెలకొల్పారు.. ఎన్ని వేల కోట్లు ప్రజా ధనం కొల్లగొట్టారు.. పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితే కానీ ఈ కుంభకోణం వివరాలన్నీ బహిర్గతం కావు. ఇదంతా ప్రజల డబ్బు. దీనిపై ప్రజలెవరైనా కోర్టు ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు కోరవచ్చు. -
చంద్రబాబుకు ఎంపీ విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్.. మైండ్ బ్లాంక్!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీరియస్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధాని పేరుతో అమరావతిలో షెడ్ల వంటి రెండు తాత్కాలిక భవనాలు కట్టి వందలకోట్లు కొట్టేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. ఇది కూడా పెద్ద స్కామేనా అని అంటరాని ఎద్దేవా చేశారు. కాగా, చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు. ‘ఏముంది..బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది..కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2G స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’ అని ఎదురు దాడికి దిగుతాడు. వేచి చూడండి!’ అని కామెంట్స్ చేశారు. అమరావతిలో షెడ్లలాంటి రెండు టెంపరరీ బిల్డింగ్స్ కట్టి వందల కోట్లు కొట్టేశావంటే చంద్రబాబు గారూ...ఇక శాశ్వత సచివాలయ భవనాలు అయివుంటే లక్షల కోట్లు ముడుపులు తీసుకునేవారేమో. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే మరి! — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 అలాగే, ‘అమరావతిలో షెడ్లలాంటి రెండు టెంపరరీ బిల్డింగ్స్ కట్టి వందల కోట్లు కొట్టేశావంటే చంద్రబాబు గారూ.. ఇక శాశ్వత సచివాలయ భవనాలు అయివుంటే లక్షల కోట్లు ముడుపులు తీసుకునేవారేమో. అమరావతిపై మీ ప్రేమకు అసలు గుట్టు ఇదే మరి!’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు గారు 118 కోట్ల కమీషన్ సొత్తుపై రేపోమాపో ఇలా వాదనకు దిగుతాడు. ‘ఏముంది..బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది..కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2G స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత? ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు’… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 ఆయన మానసికస్థితి ఇంకా దిగజారింది. QR కోడ్ సృష్టికర్త తానేనట! 1994లో Denso Wave అనే టోయోటో విడిభాగాల సంస్థ కోసం ఇంజనీర్ Masahiro Hara QR (Quick Response) కోడ్ను కనిపెట్టారు. దాన్నీ తన ఖాతాలో వేసేసుకున్నాడు చంద్రబాబు గారు. మీరు కనుక్కోనిది ఏదైనా ఉంటే చెప్పండి బాబు గారూ, మాకూ తేలికవుతుంది. ఆయన మానసికస్థితి ఇంకా దిగజారింది. QR కోడ్ సృష్టికర్త తానేనట! 1994లో Denso Wave అనే టోయోటో విడిభాగాల సంస్థ కోసం ఇంజనీర్ Masahiro Hara QR (Quick Response) కోడ్ ను కనిపెట్టారు. దాన్నీ తన ఖాతాలో వేసేసుకున్నాడు చంద్రబాబు గారు. మీరు కనుక్కోనిది ఏదైనా ఉంటే చెప్పండి బాబు గారూ, మాకూ… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 దీన్ని తీసుకొచ్చా.. దాన్ని కనిపెట్టా, అది నేనే-ఇది నేనే అనే గొప్పలు చెప్పుకోవడం కాదు. పేదలు కడుపునిండా తిని నిశ్చింతగా ఉండేలా ఏం చేశారో చెప్పండి చంద్రబాబు గారు. 'ఇదిగో ఈ సంక్షేమ పథకం నేను ప్రవేశపెట్టిందే. ఈ ప్రాజెక్టుకు నేనే పునాదివేసి పూర్తిచేశా' అని చూపించండి? నయా పెత్తందారీ వర్గాన్ని సృష్టించి మీ వాళ్లను ఉద్దరించడం కాదు. దీన్ని తీసుకొచ్చా...దాన్ని కనిపెట్టా, అది నేనే - ఇది నేనే అనే గొప్పలు చెప్పుకోవడం కాదు. పేదలు కడుపునిండా తిని నిశ్చింతగా ఉండేలా ఏం చేశారో చెప్పండి చంద్రబాబు గారు. 'ఇదిగో ఈ సంక్షేమ పథకం నేను ప్రవేశపెట్టిందే. ఈ ప్రాజెక్టుకు నేనే పునాదివేసి పూర్తిచేశా' అని చూపించండి? నయా పెత్తందారీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2023 అధికారం ఉంటే ప్రజలకు సేవచేసి మంచి పనులతో చరిత్రలో నాలుగు కాలాలు నిలిచిపోవచ్చని రాజకీయాల్లో ఉన్నవారు ఆశపడతారు. చంద్రబాబు అండ్ కంపెనీకి మాత్రం అధికారం ఉంటే యధేచ్ఛగా దోచుకోవడమే తెలుసు. అక్రమ సంపాదనను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పవర్ చేతిలో ఉండాలి. బాబుగారి ఆలోచన దీని చుట్టే తిరుగుతుంది. అంటూ కౌంటరిచ్చారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ -
చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఐటీ స్కాంపై ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఐటీ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మూలాలు ఒకే చోట ఉన్నాయన్న దానిపై విచారణకు సన్నద్ధమైంది. రెండు స్కాంలో ఒకే వ్యక్తులు ఉండటంపై విచారణకు సిద్ధమైంది. ఐటీ స్కాంలో కీలక వ్యక్తి మనోజ్ వాసుదేశ్ పార్ధసాని, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాకు ఏపీ సీఐడీ నోటీసులుజారీ చేసింది. వీరిద్దరిని సీఐడీ అధికారులు విచారించనున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి.. కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ వ్యహహారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీశాఖ విచారణ జరుపుతోంది. స్కిల్ స్కామ్లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది. రెండు స్కాంలో భారీగా డబ్బు అందుకున్నట్లు చంద్రబాబు పీఏ శ్రీనివాస్పై అభియోగాలు మోపింది. రెండు స్కాంల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. దీంతో ఈ స్కాంలో ఉన్నవారి మధ్య సంబంధాలపై సీఐడీ దృష్టి సారించింది. దుబాయిలోనూ చంద్రబాబు డబ్బు అందుకున్నట్లుగా అభియోగాలు ఉండటంతో దీనిపై కూడా దృష్టి పెట్టనుంది. త్వరలో దుబాయికి విచారణ బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’ -
దొరికిపోయిన బాబు
-
ఐటీకి 4 లేఖలు రాసి.. చంద్రబాబు అడ్డంగా ఇరుక్కున్నాడు
-
చిట్టాలో చినబాబు!
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో తాత్కాలిక భవన నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు పిండుకోవడంలో ‘చినబాబు’ కూడా చేతివాటం చూపిన విషయం ఐటీ నోటీసులతో వెలుగులోకి వచ్చింది. ఈమేరకు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు జారీ చేసిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో నారాలోకేశ్ పేరును కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రస్తావించింది. లోకేశ్కు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేశ్ అక్రమ నగదు తరలింపులో కీలకపాత్ర పోషించినట్లు ఐటీ శాఖ స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెల్లడించింది. ‘మీ కుమారుడు నారా లోకేష్ సన్నిహితులు నగదు తీసుకున్నారనేందుకు పక్కా అధారాలివీ.. వీటిపై మీరు ఏం సమాధానం చెబుతారు?’ అంటూ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఎక్సెల్ షీట్లు, నగదు తరలింపు సమయంలో జరిపిన వాట్సాప్ మెసేజ్లను స్క్రీన్షాట్ల రూపంలో అందించి మరీ నోటీసులను జారీ చేసింది. విశాఖకు చెందిన ఆర్వీఆర్ నిర్మాణ రంగ సంస్థకు చెందిన రఘు రేలా ఆయన సన్నిహితుల ద్వారా కూడా భారీ మొత్తాలను తరలించినట్లు సాక్ష్యాలతో స్పష్టం చేసింది. ఈ చాటింగ్లన్నీ మీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో 2020 ఫిబ్రవరిలో సోదాలు జరిపినప్పుడు స్వాధీనం చేసుకున్న శ్యాంసంగ్ ఫోన్ నుంచి సేకరించినవని, వీటిని శ్రీనివాస్ కూడా ధృవీకరించినట్లు ఐటీ శాఖ చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. కిలారుకు రూ.4.5 కోట్లు.. అయితే ఓకే! లోకేష్కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్కు రూ.4.5 కోట్లను నగదు రూపంలో ఎలా చేరవేశారో ఐటీ శాఖ పూర్తి సాక్ష్యాధారాలతో నోటీసుల్లో వివరించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీరు ముడుపుల వ్యవహారాన్ని యధేచ్ఛగా కొనసాగించారు. 2019 మే 22న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ డబ్బుల పంపిణీ గురించి అడగ్గా కిలారు రాజేష్కు రూ.4.5 కోట్లను పార్టీ ఆఫీసులో అందించినట్లు పార్థసాని పేర్కొన్నాడు. అంకిత్ బలదూత ద్వారా రూ.2.2 కోట్లు పంపగా, రఘు రేలాకు సన్నిహితుడైన శ్రీకాంత్ ద్వారా మిగిలిన మొత్తాన్ని పంపినట్లు చెప్పడంతో ‘‘అయితే ఓకే..’’ అంటూ చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బదులిచ్చాడు. ఈమేరకు నగదు తరలింపులకు సంబంధించి శ్రీకాంత్ ఫోన్ నుంచి జరిగిన వాట్సాప్ సంభాషణలను కూడా ఐటీ అధికారులు జత చేశారు. వాంగ్మూలం నమోదు సమయంలో ఈ సంభాషణలను మనోజ్ వాసుదేవ్కు చూపగా అది నిజమేనని అంగీకరించినట్లు ఐటీశాఖ పేర్కొంది. డేటా చౌర్యం ఐటీ గ్రిడ్ కేసులో కూడా కిలారు రాజేష్ కీలక పాత్రధారిగా వ్యవహరించిన విషయం విదితమే. రఘు ద్వారా రూ.20.18 కోట్లు తరలింపు.. విశాఖకు చెందిన రఘు రేలా ఆర్వీఆర్ పేరుతో రియల్ ఎస్టేట్తో పాటు 18కిపైగా కంపెనీలను ఏర్పాటు చేసి వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. షాపూర్జీ పల్లోంజీ నుంచి అక్రమంగా నగదు తరలింపులో రఘు రేలా కీలకప్రాత పోషించినట్లు గుర్తించిన ఐటీ అధికారులు ఆర్వీఆర్ గ్రూపులో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న సాక్ష్యాల ఆధారంగా మనోజ్ వాసుదేవన్ను విచారించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రఘు రేలా ద్వారా మొత్తం రూ.20.18 కోట్లను తరలించినట్లు మనోజ్ పార్ధసాని అంగీకరించాడు. ఈ నగదు తరలింపులో రఘుకు సన్నిహితులైన కృష్ణ, నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని, అయితే వారి గురించి తనకు ఎటువంటి వివరాలు తెలియవని పేర్కొన్నాడు. విశాఖ, విజయవాడ, హైదరాబాద్కు ఈ మొత్తాన్ని తరలించారని, ఇందుకు ఎక్సెల్ షీట్ స్పష్టమైన ఆధారమని ఐటీ శాఖ వెల్లడించింది. ఆ బంధం ఎంత బలమైనదంటే.. నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించిన మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. టీడీపీ ఘోరంగా ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన పీఏ శ్రీనివాస్కు మనోజ్ వాసుదేవ్ ఒక మెసేజ్ పంపారు. తన జీవితంలో ఇటువంటి దారుణమైన రాజీనామా లేఖను చూడలేదని అందులో పేర్కొన్నారు. వీరి మధ్య బంధం ఎంత బలంగా ఉందనేందుకు ఆ మెసేజ్ నిదర్శనమని ఐటీ శాఖ తన నోటీసులో పేర్కొంది. నిర్మాణ రంగ సంస్థల నుంచి నగదును అక్రమంగా తరలించారనేందుకు ఇవి తిరుగులేని సాక్ష్యాలని, నగదు తరలింపులో మీ తనయుడు లోకేశ్ సన్నిహితులు కీలక పాత్ర పోషించారనేందుకు ఇవన్నీ నిదర్శనమని చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో ఐటీ శాఖ స్పష్టంగా పేర్కొంది. -
పేదల ఇళ్లు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేదల ఇళ్ల నిర్మాణాన్ని సైతం వదల్లేదు! రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి వేసిన పథకం ఆదాయపు పన్ను శాఖ తాజాగా జారీ చేసిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో బయటపడింది. తాత్కాలిక భవన నిర్మాణాల్లో డొల్ల కంపెనీల పేరుతో రూ.వందల కోట్లు స్వాహా చేసి పక్కా ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు ‘ఈడబ్ల్యూఎస్’ పథకం కింద పేదల ఇంటి నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 నవంబర్ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్తో టచ్లో ఉండాలని చెప్పారని, అంతేకాకుండా పార్టీ ఫండ్ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని కోరినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది. నగదు బదిలీలో ఆ ముగ్గురు.. కోడ్ భాషలో సబ్ కాంట్రాక్టుల ముసుగులో డొల్ల కంపెనీలు హయగ్రీవా, అన్నై, షలఖ కంపెనీల ద్వారా అక్రమంగా నగదును చంద్రబాబు నాయుడుకు తరలించడంలో వినయ్ నంగాలియా, విక్కీ జైన్, అంకిత్ బలదూత కీలకపాత్ర పోషించినట్లు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు ఐటీశాఖ నోటీసుల్లో పేర్కొంది. వీరంతా బోగస్ కాంట్రాక్టుల ద్వారా నగదును చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్కు చేరవేసినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్లో దినార్ల రూపంలో చెల్లించినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించాడు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో నగదు బదిలీకి కోడ్ భాషలో హెచ్వైడీ అని అందులో ఉంది. విజయవాడకు విజయ్ అని, విశాఖపట్నంకు విష్ అని, బెంగళూరుకు బాంగ్ అని కోడ్ భాషల్లో నమోదు చేసుకున్న వివరాలను, ఎక్సెల్ షీటును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడ్డగోలు వాదన ఆపి జవాబు చెప్పు!! చంద్రబాబు అసంబద్ధ వాదనలను కట్టిపెట్టి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పి తీరాల్సిందేనని ఐటీ శాఖ తేల్చి చెప్పింది! సబ్ కాంట్రాక్టుల ముసుగులో దొంగ ఇన్వాయిస్లు సృష్టించి నగదును అక్రమంగా తరలించినట్లు తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలున్నాయని, చట్ట ప్రకారం విచారించే అధికారం తమకు ఉన్నందున లెక్కల్లో చూపని రూ.118 కోట్లకు సమాధానం చెప్పాల్సిందేనని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ తన రాజగురువు రామోజీ తరహాలో ఏదో ఒక అభ్యంతరాన్ని తెరపైకి తీసుకొస్తూ దర్యాప్తు ముందుకు కదలకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్కు అసలు విచారణ పరిధి లేదని ఒకసారి, జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ అధికారి ఈ కేసును సెంట్రల్ ఆఫీసుకు బదిలీ చేయకుండానే నోటీసులు ఇచ్చారని మరోసారి, అసలు ఐటీ దాడుల్లో సీజ్ చేసిన వివరాలను తనకు తెలియచేయలేదని, అందులో తన పేరు ఎక్కడా లేదంటూ.. ఇలా వరుసగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు అడుగు ముందుకు పడకుండా కేసును సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. 2022 అక్టోబర్ నుంచి లేఖల మీద లేఖలు రాస్తూ నాలుగుసార్లు దర్యాప్తును అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రతిసారి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చుతూ సహనంగా సమాధానాలిస్తోంది. ముందుగా రూ.118 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ పూర్తి సాక్ష్యాధారాలతో మరోసారి సెక్షన్ 153 సీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులతో పాటు మనోజ్ వాసుదేవ్ పార్థసాని (ఎంవీపీ), చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్లపై ఐటీ దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎక్సెల్ షీట్లు, వాట్సాప్ మెస్సేజ్లు, ఈ మెయిల్స్, బ్యాంకు లావాదేవీల వివరాలతో పాటు వారు విచారణ సందర్భంగా ఆ నగదును చంద్రబాబుకు ఏ విధంగా చేర్చారో వెల్లడిస్తూ వివరాలను పొందుపరిచింది. తప్పించుకుని తిరుగుతూ.. చంద్రబాబు స్క్రూటినీ కేసును హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్–4 ప్రిన్సిపల్ కమిషనర్ గతేడాది సెక్షన్ 127 కింద హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్–2(4)కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి సెక్షన్ 153 సీ, 143(2)/142(1) కింద విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2022 అక్టోబర్ 10, అక్టోబర్ 27, ఈ ఏడాది జనవరి 31, జూన్ 20న చంద్రబాబు నాలుగు లేఖలు రాశారు. అసలు సెంట్రల్ సర్కిల్ కార్యాలయానికి సెక్షన్ 153 సీ కింద తనకు నోటీసులిచ్చే అధికారం లేదని వాదించగా దీన్ని తోసిపుచ్చింది. జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ ఆఫీసర్ సెక్షన్ 127 కింద ఈ కేసును తమకు బదిలీ చేయడంతో చట్ట ప్రకారం తక్షణం దర్యాప్తు మొదలు పెట్టినట్లు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు వెంటనే సెక్షన్ 127 కింద కేసు బదిలీ కాకుండానే సెంట్రల్ సర్కిల్ ఆఫీసు తనకు నోటీసులు ఇచ్చిదంటూ వాదించగా దానికి కూడా స్పష్టమైన ఆధారాలతో వివరణ ఇచ్చింది. దర్యాప్తులో సీజ్ చేసిన వివరాలను తనకు పూర్తిగా తెలియచేయలేదని ఒకసారి పేర్కొనగా అందులో తన పేరు ఎక్కడా లేదు కాబట్టి తనకు నోటీసులు వర్తించవంటూ మరోసారి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఐటీ శాఖ స్పందిస్తూ మనోజ్ వాసుదేవ్ పార్థసాని వద్ద సోదాల్లో సీజ్ చేసిన వస్తువుల వివరాలన్నీ మీకు (చంద్రబాబుకు) తెలియచేశామని, ముఖ్యమంత్రి హోదాలో కేటాయించిన కాంట్రాక్టుల నుంచి సబ్ కాంట్రాక్టుల రూపంలో ఎటువంటి పనులు చేయకుండానే నగదు చంద్రబాబుకు చేరినట్లు బలమైన ఆధారాలను సేకరించడంతో మీ అభ్యంతరాలను కొట్టి వేస్తున్నామని, పూర్తి వివరాలను మరోసారి అందచేస్తున్నామని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తునకు సహకరించాల్సిందేనంటూ తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది. 46 పేజీల సుదీర్ఘ నోటీసులో మొత్తం ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందో పూసగుచ్చినట్లు బ్యాంకు లావాదేవీలు, కోడ్ భాషలను క్రోడీకరించి రుజువులతో మరీ వెల్లడించింది. -
‘బాబుకు ముట్టిన 118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి’
సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక, ఐటీ నోటీసులపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు అక్రమాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి..‘అమరావతి అనేది అతిపెద్ద స్కాం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు గారికి ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి. ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడు. CRDA ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు బయటకు రావాల్సి ఉంది’ అని స్పష్టం చేశారు. ‘అమరావతి’ అనేది అతిపెద్ద స్కాం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు గారికి ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి. ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడు. CRDA ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 2, 2023 ఇది కూడా చదవండి: చంద్రబాబు గురించి ఢిల్లీ పెద్దలకు అంతా తెలుసు: కారుమూరి వ్యాఖ్యలు -
‘చంద్రబాబు గురించి ఢిల్లీ పెద్దలకు అంతా తెలుసు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడినా రామోజీరావుకు చాలా బాగుంటుంది. కానీ, మేము చేసి ఏ మంచి పనిచేసినా రామోజీకి వినపడదు, కనపడదు. గత ప్రభుత్వం ఏం చేసింది.. మేము ఏం చేస్తున్నది ఒక లిస్టు పెట్టుకుని రామోజీ చూడాలని చురకలు అంటించారు. కేంద్రం ఓకే చెప్పింది.. కాగా, మంత్రి కారుమూరి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ప్రజలకు కందిపప్పు కూడా ఇవ్వలేదు. ఆ సంగతి రామోజీకి కనపడుదు, వినపడదు. మా ప్రభుత్వంలో కంది పప్పు ధర రూ.150 మార్కెట్లో ఉంటే మేము రూ.80కే సబ్సిడీ ఇచ్చాం. నాలుగేళ్లలో మూడు లక్షల టన్నుల కందిపప్పు అందించాం. కేంద్రం పుచ్చిపోయిన కందులు ఇస్తామంటే మేము వద్దన్నాం. దానికి బదులుగా శనగలు ఇస్తామని చెప్పింది. అవి కూడా వద్దని, కంది పప్పు మాత్రమే కావాలని అడిగాం. దానికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. త్వరలో అవి రాగానే ప్రజలకు పంపిణీ చేస్తాం. ఐటీ నోటీసులు రామోజీకి కనిపించవా? ఇలా అసలు సంగతి రాయకుండా రామోజీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఏం మాట్లాడినా రామోజీకి చాలా బాగుంటుంది. కానీ, మేము ఏం చేసినా రామోజీకి కనిపించదు. చంద్రబాబు పాలనలో ఇసుక దోచుకున్నారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచేసినప్పుడు రామోజీకి ఎందుకు కనపడలేదు. వనజాక్షి ఇసుక రావాణ అడ్డుకుంటే ఆమెకు దారుణంగా కొట్టారు. పైగా చింతమనేనితో రాజీ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు. మా ప్రభుత్వం పారదర్శకంగా అందరికీ ఒకే రేటుతో ఇసుక అందిస్తోంది. రామోజీ చేసిన అక్రమాల గురించి ఆయన తోడల్లుడే వివరించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వస్తే ఎందుకు నోరు విప్పలేదు?. నీతి, నిజాయితీ అని చెప్పే చంద్రబాబు రూ.118కోట్లు దోచేసినట్టు ఐటీ శాఖ తేల్చింది. దీనిపై చంద్రబాబు, లోకేశ్ ఎందుకు మాట్లాడటం లేదు?. ప్రతీ కేసులో స్టే తెచ్చుకుని బ్రతకడం చంద్రబాబు పని. ఆయన వ్యవహారం ఢిల్లీ పెద్దలకు తెలుసు కాబట్టే వారు దరిచేరనీయడం లేదు. చంద్రబాబు అంతటి నయవంచకుడు, దుర్మార్గుడు మరెవరూ లేరు. ఈ మాట ఎన్టీఆర్ అనేకసార్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేదలు కూడా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. చంద్రబాబు ఎవరో ఒకరి సపోర్టుతో ఎన్నికలకు వెళ్లడం తప్ప సొంతంగా వెళ్లలేరు అని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: జమీలి ఎన్నికలపై సీఎం జగన్దే తుది నిర్ణయం: మంత్రి అమర్నాథ్ -
‘లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్పై దావా వేసే దమ్ముందా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అడ్డదారిలో బోగస్ కాంట్రాక్ట్ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతం బట్టబయలైంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర ఆరోపణలు చేశారు. పీఏ ద్వారానే చంద్రబాబుకు ముడుపులు.. కాగా, పేరి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హిందూస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసింది. హిందుస్తాన్ టైమ్స్ కథనంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా?. చంద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టింది. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైంది. 2016 నుంచీ చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్లతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారు. తన పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగింది. ఈ ముడుపుల బాగోతంపై ఐటీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు మనోజ్ పార్థసాని ముడుపులు ఇచ్చినట్టు తేలింది. ఈ ముడుపులను దాచి ఉంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదు?. లోకేశ్.. ముందు నీ తండ్రి అవినీతిపై స్పందించు.. ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదు?. ప్రధానులు, రాష్ట్రపతులను మార్చిన చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే రాయాలిగా?. హిందుస్తాన్ టైమ్స్లో వచ్చిన కథనం వీరెవ్వరికీ కనిపించదు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలి. ఎమ్మెల్సీ పోతుల సునీతపై నారా లోకేశ్ ఇష్టానుసారం మాట్లాడారు. మాటల జాగ్రత్తగా మాట్లాడండి. లోకేశ్ ముందు పాదయాత్ర ఆపి తన తండ్రి అవినీతిపై మాట్లాడాలి. లోకేశ్ ముందు నీ తండ్రి అవినీతి బాగోతంపై స్పందించు. లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్పై దావా వేసే దమ్ముందా? ఐటీ నోటీసులపై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకుంటాడు. అవసరం కోసం అరచేతిలో వైకుంఠం చంద్రబాబు, లోకేశ్ ప్రజల సొమ్మును అడ్డంగా తినేశారు. మళ్లీ ప్రజల సొమ్మును తినేసేందుకు అధికారం ఇవ్వాలా?. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే. మళ్లీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కొత్త మోసం మొదలుపెట్టారు. తప్పుడు సంతకంతో మళ్లీ ప్రజల వద్దకు బయలుదేరాడు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు. ఎవరినైనా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట. అవసరం తీరే వరకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు’ అంటూ సెటైరికల్ పంచ్ వేశారు. ఇది కూడా చదవండి: ఐటీ నోటీసులు.. అడ్డంగా బుక్కైనా నోరు విప్పని చంద్రబాబు -
ఐటీఆర్ వెరిఫికేషన్! ఐటీ డిపార్ట్మెంట్ ఈ మెసేజ్చూశారా? లేదంటే?
డిపార్ట్మెంటు వారు జ్ఞాపకం చేస్తున్నారా లేదా భయపెడుతున్నారా? కాదు కాదు ఎందరో మరిచిపోయేవారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ ఒక సందేశం.. రిమైండర్ పంపుతున్నారు. దాని సారాంశం ఏమిటంటే రిటర్ను దాఖలు చేసి ఊరుకోవద్దు. మరచిపోవద్దు. ఈ-ఫైలింగ్ ప్రాసెస్ని పూర్తి చేయండి. మీరు ఐటీఆర్ని 30 రోజుల్లోపల వెరిఫై చేయండి. గతంలో ఈ గడువు 120 రోజులు ఉండేది. అంటే నాలుగు నెలలు. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువుని 30 రోజులకు కుదించారు. గడువు తేదీలోగా వెరిఫై చేయకపోతే మీరు సకాలంలో రిటర్ను వేసినట్లు కాదు. మీరు దాఖలు చేసిన రిటర్ను ఇన్వాలిడ్ అయిపోతుంది. రద్దయిపోతుంది. వేసినట్లు కాదు. ఆలస్యమయింది కాబట్టి లేటు ఫీజు పడుతుంది. ఇది రూ. 5,00,000లోపు ఆదాయం ఉంటే రూ. 1,000; రూ. 5,00,000 దాటితే రూ. 5,000 ఉంటుంది. ఈ-వెరిఫై చేయడం చాలా సులభం. త్వరగా కూడా పూర్తవుతుంది. ఈ-వెరిఫై వద్దనుకుంటే ఫారం-Vని 30 రోజుల్లోపల అందేలా స్పీడ్పోస్ట్లో పంపండి. పోర్టల్ ద్వారా చేయండి. ఆధార్ కార్డు ద్వారా ఓటీపీ వస్తుంది. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా డీమ్యాట్ అకౌంటు, బ్యాంకు ఏటీఎం ద్వారానైనా చేయొచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా చేస్తే కొంచెం ఖర్చవుతుంది. ఈ–ఫైలింగ్కి సంబంధించిన ప్రశ్నల్లో, తరచుగా మీకు సందేహాలొచ్చే వివిధ అంశాలు, పరిస్థితులు అన్నింటినీ పొందుపర్చారు. లేటయితే కూడా వెరిఫై చేయొచ్చు. కానీ, తగిన కారణం ఉండాలి. ఒప్పుకుంటే లేటుగా వేయవచ్చు. మీ తరఫున మీ ఆథరైజ్డ్ వ్యక్తి వేయొచ్చు. మొబైల్ నంబర్ను వెంటనే ఆధార్తో అప్డేట్ చేయడం తప్పనిసరి. మరిచిపోకండి. మీరు స్పీడ్పోస్ట్లో పంపించిన డాక్యుమెంట్ల వివరాలు భద్రపర్చుకోండి. రుజువులు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు అందలేదని డిపార్టుమెంటు వారు అంటే ఇవి రుజువులుగా పనికొస్తాయి. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారయితే, వెరిఫై చేసిన తర్వాతే రిఫండును ఆశించాలి. జులై మొదటి వారంలో కొంత మందికి 48 గంటల్లో రిఫండు వచ్చింది. ఇప్పుడు రెండు వారాలు దాటిన తర్వాత రిఫండు ఇస్తున్నారు. గతంలో నెలరోజులు దాటేది. ఇప్పుడు ఇంకా త్వరితగతిన ఇద్దామని గట్టి ప్రయత్నం చేస్తూ, సమాయత్తం అవుతున్నారు .. డిపార్ట్మెంట్ వారు. Dear Taxpayers, Complete the e-filing process today! Please find below the modes of e-verification of return. Remember to verify your ITR within 30 days of filing. Delayed verification may lead to levy of late fee in accordance with provisions of the Income-tax Act, 1961.… pic.twitter.com/bu7jrXLFNH — Income Tax India (@IncomeTaxIndia) August 26, 2023 -
టాక్స్ రిఫండ్స్: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
Income tax refund: ఆదాయపు పన్ను రిటర్న్లు (ITRలు) దాఖలు చేసిన తర్వాత టాక్స్ రిఫండ్స్ విషయంలో ఆదాయపన్ను కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన యావరేజ్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని ఆదాయపు పన్ను శాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నుంచి 10 రోజులకు తగ్గింపుపై పన్ను శాఖ ఆలోచిస్తోంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త టైమ్లైన్ను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువుజూలై 31, 2023తో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం చాలామంది ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు టాక్స్ రిఫండ్స్ దాదాపు అందుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం టాక్స్ రిఫండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.వార్షిక ITRను ఫైల్ చేసేటప్పుడు అసెస్సీ ఉపయోగించే ఎంపికపై ఆధారపడి, రీఫండ్ ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఖాతాకు నేరుగా క్రెడిట్ లేదా రీఫండ్ చెక్ ద్వారా గానీ చెల్లిస్తారు. ఈ రీఫండ్ ప్రాసెస్ను సంబంధిత పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి? ప్రతిస్పందన కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నుండి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చిందా లేదా అని ఈమెయిల్లో చెక్ చేసుకోవాలి ఒక వేళా అలాంటి ఇమెయిల్ ఎదైనా వస్తే వీలైనంత త్వరగా ప్రతిస్పందించడం చాలా ముఖ్యం. ఒకవేళ ITR స్టేటస్ రీఫండ్ గడువు ముగిసినట్లు చూపితే, 90 రోజుల చెల్లుబాటు వ్యవధిలోపు చెల్లింపు కోసం వాపసు సమర్పించబడలేదని అర్థం.ఈ సందర్బంగా టాక్స్పేయర్ రీఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్ పంపవచ్చు. రీఫండ్ స్టేటస్పై చాలా క్వెరీలువస్తున్నాయని, ఇ-ఫైలింగ్ తర్వాత తిరిగి చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారులకు చెల్లింపును వేగవంతం లోకి ఇది మంచి చర్య అని క్లియర్ ఫౌండర్సీఈవో అర్చిత్ గుప్తా అన్నారు. ఈఏడాది పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు సకాలంలో దాఖలు చేశారని (31 జూలై 2023 వరకు 6.77 కోట్ల ఐటీఆర్లు) అందువల్ల వాపసులను త్వరగా ప్రాసెస్ చేస్తారనే అంచనా ఉందన్నారు. -
ఇన్కమ్ ట్యాక్స్ అలర్ట్: ‘లక్ష’లో మీరున్నారా? కోరి కొరివితో పెట్టుకోకండి
ఆదాయపు పన్ను శాఖ వారు లక్ష మందికి నోటీసులు పంపారు. సాక్షాత్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్గారే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎవరికి పంపించారంటే.. ప్రధానంగా మూడు రకాల వారికి.. 1. రిటర్నులు వేయని వారికి 2. ఆదాయం తక్కువ చూపించి రిటర్ను వేసిన వారికి 3.తప్పుడు సమాచారంతో రిటర్ను వేసిన వారికి పైన పేర్కొన్న వారందరికీ లక్ష నోటీసులు ఇచ్చారు. ఈ లక్షలో మీరున్నారా అనే ప్రశ్నకు జవాబుగా ‘మాయాబజార్’లో శర్మ–శాస్త్రిలాగా తాన–తందానలాగా ‘మేమా..మేమేం చేశాం’ ని కుదుటపడకండి. డిపార్ట్మెంట్ వారికున్న అధికారం ప్రకారం అవసరమైతే ఆరేళ్లు వెనక్కి వెళ్లి అసెస్మెంటుని ‘రీ–ఓపెన్’ చేయొచ్చు. ఇలా ఇప్పటికే 55,000 మంది విషయంలో అసెస్మెంట్ చేశారు. ఇప్పటికి 2023 మార్చి ఆఖరు నాటికి సంబంధించి అత్యధిక సంఖ్యలో రిటర్నులు వేసినప్పటికీ, వేసిన వాటిలో 70 శాతం రిటర్నులలో ట్యాక్సబుల్ ఇన్కం లేదు. ఏదో మొక్కుబడిగా వేసిన రిటర్నులు లేదా ‘ఈ సంవత్సరానికి అయిపోయింది’ అని చేతులు దులుపుకున్న బాపతు అన్నమాట. ముందుగా, వాళ్లు సేకరించిన సమాచారాన్ని బట్టి రూ. 50,00,000 ఆదాయం ఉన్న వారికి ... ఇలా ఉన్న వారిలో వేయని వారు, తక్కువ చూపించిన వారు, తప్పుగా చూపించిన వారిని ఎంచుకున్నారు. ఇవి ఏదో యధాలాపంగా, అనాలోచితంగా ఇవ్వలేదని, పస ఉన్న కేసులేనని ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఘంటాపథంగా చెప్పారు. ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఇవి కాకుండా 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాని వేతన జీవులకు నోటీసులు పంపుతున్నారు. ఇవి ఎటువంటివి అంటే.. 1. ఇంటద్దె అలవెన్సు 2. లీవ్ ట్రావెల్ అలవెన్సు 3. ఇంటి రుణంపై వడ్డీ 4. మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులు 5. సెక్షన్ 80 కింద చెల్లింపులు 6. పెట్టుబడులు 7. సేవింగ్స్ 8. పిల్లల స్కూలు ఫీజులు చాలా మంది ‘‘ఏమీ అడగరులే’’ అని దొంగ క్లెయిమ్లు చేస్తున్నారు. కొంత మంది దొంగ రశీదులు, బిల్లులు పెడుతున్నారు. కుటుంబ సభ్యుల మీద ఇల్లు ఉంటే అద్దె చెల్లించకుండా అద్దె చెల్లించినట్లు క్లెయిమ్ చేస్తున్నారు. దయచేసి తప్పుగా/లేనిదాన్ని క్లెయిమ్ చేయకండి. అన్ని చెల్లింపులు బ్యాంకు ద్వారా చేయండి. ప్రతి దానికి కాగితం, డాక్యుమెంటు, రుజువులు, బిల్లులు, వోచర్లు, బ్యాంకు స్టేట్మెంట్లు, బ్యాంకు సర్టిఫికెట్లు, ధృవీకరణ పత్రాలు.. ఇవన్నీ మూడో వ్యక్తి నుంచి.. అంటే ఎక్స్టర్నల్ నుండి పొందండి. దీన్నే ‘‘ఎవిడెన్స్’’ అంటారు. జాగ్రత్తపడండి. కోరి కొరివితో పెట్టుకోకండి. -
ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు 17 శాతం అప్
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–2024 మార్చి) ఆగస్టు 10వ తేదీ వరకూ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం పెరిగి రూ.5.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో ఇది 32 శాతానికి సమానం. ఆదాయపు పన్ను శాఖ ప్రకటన ప్రకారం, స్థూల వసూళ్లు 15.73 శాతం పురోగతితో రూ.6.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటిలో రిఫండ్స్ రూ.69,000 కోట్లు. ఒక్క రిఫండ్స్ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 3.73 శాతం అధికం. 2023–24లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లు. 2022–23తో పోల్చితే (రూ.16.61 లక్షల కోట్లు) ఈ పరిమాణం 9.75 శాతం అధికం. -
IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!
IT Refund Scam: ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు ఒక ఎత్తయితే.. రిఫండ్ రావడం మరో ఎత్తు. రిటర్న్స్ దాఖలు యుగియడంతో రీఫండ్ ప్రక్రియ కూడా షురూ అయింది. దీంతో తమ ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తయిన రీఫండ్ ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. దీన్నే అవకాశంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతారు. ఫేక్ మెసేజ్లతో పన్ను చెల్లింపుదారులు మభ్యపెట్టి, వారి ఖాతాలను ఖాళీ చేస్తున్న కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీ రీఫండ్ మెసేజ్లపై అప్రమత్తంగా ఉండాలని పీఐబీ హెచ్చరించింది. ఏమిటీ మెసేజ్ దీనిక థ కమామిష్ష ఏమిటో ఒకసారి చూద్దాం. ఇదీ స్కాం ఇటీవల కాలంలో చాలా మందికి ఈ తరహా మెసేజ్ లు వచ్చాయి “Dear Sir, You have been approved for an income tax refund of ₹15,490/-, the amount will be credited to your account shortly. Please verify your account number 5XXXXX6755. If this is not correct, please update your bank account information by visiting the link below’’ ఇలాంటి మెసేజ్ వచ్చిందా? ఐటీ విభాగం నుంచి వచ్చిందని బావించి వెంటనే తప్పులో కాలేసారో, భారీ నష్టాల్ని మూటగట్టుకోవాల్సి ఉంది. (లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?) ఆదాయ పన్ను రీఫండ్ కు అనుమతి లభించింది. ఈ రీఫండ్ డైరెక్టుగా రావాలంటే.. బ్యాంక్ ఖాతాను అప్ డేట్ చేసుకోవాలి అంటే మనల్ని బురిడీ కొట్టిస్తారు. ఆ మెసేజ్ ను నమ్మి, వారు అడిగిన వివరాలను ఇవ్వకండి.ఎందుకంటే ఇది సైబర్ నేరస్తులకొత్త ఎత్తుగడ.వాస్తవానికి ఇలాంటి సందేశాలేవీ ఐటీ విభాగం పంపదు. ఇది నకిలీ మెసేజ్ అని, సైబర్ నేరస్తుల కొత్త తరహా మోసమని గుర్తించాలని పీఐబీ ఫాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. (గుడ్ న్యూస్: అమెరికా షాక్, దిగొస్తున్న పసిడి) A viral message claims that the recipient has been approved for an income tax refund of ₹ 15,490.#PIBFactCheck ✔️ This claim is 𝐅𝐚𝐤𝐞. ✔️ @IncomeTaxIndia has 𝐧𝐨𝐭 sent this message. ✔️𝐁𝐞𝐰𝐚𝐫𝐞 of such scams & 𝐫𝐞𝐟𝐫𝐚𝐢𝐧 from sharing your personal information. pic.twitter.com/dsRPkhO3gg — PIB Fact Check (@PIBFactCheck) August 2, 2023 రీఫండ్ ఎలా వస్తుంది? ఐటీ రీఫండ్ అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులకు, సంబంధిత (వాలిడేషన్ సమయంలో ఇచ్చిన) బ్యాంక్ ఖాతాకు ఆ రీఫండ్ మొత్తం జమ అవుతుంది. బ్యాంక్ వివరాలను అప్ డేట్ చేయమని కానీ, బ్యాంక్ ఖాతా వివరాలను తెలపమని కానీ, ఓటీపీ, పిన్, పాస్ వర్డ్ వంటి రహస్య, వ్యక్తిగత వివరాలను వెల్లడించమని కానీ కోరుతూ ఐటీ విభాగం ఎలాంటి సందేశాలను పంపించదు అనేది గమనించాలి. రీఫండ్ ఎపుడు వస్తుంది? ఆదాయపు పన్ను వాపసు స్వీకరించడానికి పట్టే సమయం పూర్తిగా ఆదాయపు పన్ను శాఖ అంతర్గత ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, మీరు మీ రిటర్న్ను ఇ-ధృవీకరించిన తర్వాత 90 రోజులు. కానీ 7 నుండి 120 రోజులు పడుతుంది. రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసేలి ఆదాయపు పన్ను శాఖ ఫిబ్రవరి 2021న కొత్త రీఫండ్ ప్రాసెసింగ్ సిస్టమ్ను అమలు చేసింది. ఎలా చెక్ చేసుకోవాలి? యూజర్ ID, పాస్వర్డ్, పుట్టిన తేదీ / ఇన్కార్పొరేషన్ తేదీ , క్యాప్చాతో ఇ-ఫైలింగ్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి, రీఫండ్ స్టాటస్ను చెక్ చేసుకోవచ్చు. -
రెట్టింపు స్థాయిలో రిటర్నుల దాఖలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ రిటర్నులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో దాఖలయ్యాయి. ఆడిటింగ్ అవసరం లేని రిటర్నుల దాఖలుకు (వ్యక్తులు) గడువు జూలై 31తో ముగిసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొత్తం 1.36 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఇక రిటర్నుల దాఖలుకు చివరి నెల జూలైలో మొత్తం 5.41 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ నుంచి జూలై 31 నాటికి 6.77 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. 2022లో ఏప్రిల్–జూన్ మధ్య ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్లో 70.34 లక్షల రిటర్నులు దాఖలు కాగా, 2023 ఏప్రిల్–జూన్ మధ్య 1.36 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. ఈ ఏడాది అధిక సంఖ్యలో రిటర్నులు దాఖలు కావడానికి సోషల్ మీడియా ప్రచారం, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా రిటర్నులు దాఖలు చేసేలా ప్రోత్సహించడమేనని ఆదాయపన్ను శాఖ తెలిపింది. పెరిగిన కోటీశ్వరులు రూ.కోటికి పైన ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2022 మార్చితో ముగిసిన రెండేళ్ల కాలంలో రెట్టింపై 1.69 లక్షలకు చేరింది. 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో మొత్తం 1,69,890 మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం చూపించారు. 2021–22 అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం పేర్కొన్న వారు 1,14,446 మంది ఉన్నారు. 2020–21 అసెస్మెంట్ సంవత్సరంలో వీరి సంఖ్య 81,653గానే ఉంది. 2022–23 ఏవైలో వ్యక్తులు, కంపెనీలు, ట్రస్ట్లు, సంస్థలు ఇలా అన్ని వర్గాలూ కలసి రూ.కోటికి పైన ఆదాయం వెల్లడించిన వారి సంఖ్య 2.69 లక్షలుగా ఉంది. 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. 2021–22లో ఏవైలో 7.14 కోట్లు, 2020–21 ఏవైలో 7.39 కోట్ల చొప్పున రిటర్నులు వచ్చాయి. -
6.50 కోట్ల ఐటీఆర్లు దాఖలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు చివరి రోజు అయిన సోమవారం పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చారు. సోమవారం ఒక్కరోజే 36.91 లక్షల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి దాఖలైన మొత్తం రిటర్నుల సంఖ్య 6.50 కోట్లకు చేరింది. వేతన జీవులు, ఆడిటింగ్ అవసరం లేని వారు రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ కావడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి దాఖలైన 5.83 కోట్ల ఐటీఆర్లతో పోలిస్తే 15 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ‘‘ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఇందులో 36.91 లక్షల ఐటీఆర్లు 31వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు నమోదయ్యాయి’’అంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది.పన్ను ఎగవేతకు రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు, నిబంధనలను అనుసరించే వారు పెరగడంతో పన్ను చెల్లింపుదారుల బేస్ విస్తృతం అవుతున్నట్టు పన్ను నిపుణులు అభిప్రా యపడుతున్నారు. డేటా అనలైటిక్స్, ఇతర సమాచారం ఆధారంగా అధిక రిస్క్ కేసులను ఆదాయపన్ను శాఖ గుర్తించి, వారికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపడుతుండడాన్ని ప్రస్తావిస్తున్నారు. నగదు డిపాజిట్లు, క్రెడిట్ కార్డు చెల్లింపులు, ప్రాపర్టీల కొనుగోలు, విక్రయాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్లో లావాదేవీల సమాచారాన్ని ఆదాయపన్ను శాఖ సమీకరించి, విశ్లేíÙస్తున్నట్టు చెప్పారు. -
గడువు లోపు ‘ITR’ ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది?
2023- 24 సంవత్సరానికి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ దాఖలు చేసేందుకు గడువు ఈ రోజుతో ముగియనుంది. పలు నివేదికల ప్రకారం.. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఐటీఆర్ ఫైలింగ్ చేసే సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై పన్ను చెల్లింపు దారులు ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. ఫైలింగ్ చేస్తున్నా కావడం లేదని, జులై 31, 2023 వరకు ఉన్న ఫైలింగ్ గడువు తేదీని పొడిగించాలని కోరారు. అందుకు ఐటీ శాఖ ఈ- ఫైలింగ్ పోర్టల్ పనితీరు బాగుంది. ఫైలింగ్ సమయంలో మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మమ్మల్ని సంప్రదించొచ్చు’ అని ట్వీట్ చేసింది. ఒక వేళ ఐటీ శాఖ ఇచ్చిన డెడ్లైన్ జులై 31లోపు ఐటీఆర్ ఫైలింగ్ చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. లేట్ ఫీ పన్నులు చెల్లింపు దారులు ఐటీ శాఖ ఇచ్చిన గడువులోపు ట్యాక్స్ ఫైలింగ్ చేయకపోతే లేట్ ఫీ రూ.5,000 చెల్లించాలి. అనతరం డిసెంబర్ 31లో మరో సారి ఐటీఆర్లు దాఖలు చేసుకోవచ్చు. ఒకవేళ, పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ. 5,00,000 మించకపోతే రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి (రూ.3లక్షల) కంటే తక్కువగా ఉంటే పన్ను చెల్లింపుదారులకు లేట్ ఫీ ఛార్జీలు వర్తించవు. . వడ్డీ ఒకవేళ, రిటర్న్ దాఖలు చేయడంలో జాప్యం జరిగితే ట్యాక్స్ పేయర్స్ చెల్లించే పన్నులో నెలకు 1 శాతం చొప్పున ఆదాయపు పన్ను శాఖ వడ్డీని వసూలు చేస్తుంది. ఒక కొనుగోలుదారుడికి ఏదైనా వస్తువును అమ్మేటప్పుడు అమ్మకందారు వసూలు చేసే ట్యాక్స్ టీసీఎస్, జీతాలు, కమీషన్, వడ్డీలు, డివిడెంట్లు ఇలా వివిధ రకాల ఆదాయ వనరులపై విధించే ట్యాక్స్ టీడీఎస్, ముందస్తు పన్ను, చట్టం క్రింద లభించే ఇతర ట్యాక్స్ రిలీఫ్/ట్యాక్స్ క్రెడిట్ల తగ్గింపు తర్వాత నికర ఆదాయంపై విధించే పన్నుపై వడ్డీ వర్తిస్తుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ఒక రోజు ఆలస్యానికి కూడా ఒక నెల వడ్డీ వసూలు చేస్తారు. ట్యాక్స్ మినహాయింపు ఉండదు నిర్ణీత గడువులోగా పన్ను రిటర్న్ను దాఖలు చేయకపోవడం వల్ల భవిష్యత్ సంవత్సరాల్లో ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. వీటితో పాటు హౌస్ ప్రాపర్టీ, ఇతర విభాగాల్లో ట్యాక్స్ను ఆదా చేసుకోలేము. జరిమానా, జైలు శిక్ష జరిమానాలతో పాటు, పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. చెల్లించాల్సిన పన్ను లేదా, ఎగవేత రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్న రిటర్న్లను ఆలస్యంగా దాఖలు చేస్తే , 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. ట్యాక్స్ రిఫండ్ లేనట్లే టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ .. ఈ మూడింటిని కలిపితే మీరు చెల్లించిన మొత్తం పన్ను అవుతుంది. మదింపు చేసిన తర్వాత చెల్లించాల్సిన పన్ను భారం కన్నా మీరు కట్టిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే రిఫండు ఇస్తారు. అదీ సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడే. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం వల్ల ట్యాక్స్ రిఫండ్ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్ ఇదే.. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచండి.. ఐటీ శాఖ రెస్పాన్స్ ఇదే..
ఐటీఆర్ ఫైలింగ్కు గడువు తేదీ సమీపించడంతో పన్ను చెల్లింపుదారులు రిటర్న్ ఫైలింగ్ హడావుడిలో ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం గడువు తేదీ పొడిగింపు ఉండబోదని ఐటీ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే ఐటీఆర్ ఫైలింగ్ సందర్భంగా ఈ-ఫైలింగ్ పోర్టల్లో సమస్యలు ఎదురైనట్లు కొంతమంది పన్ను చెల్లింపుదారులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి ➤ Income Tax Refund: ట్యాక్స్ రీఫండ్ 12 గంటల్లోనే.. నమ్మబుద్ధి కావడం లేదా? ఈ-ఫైలింగ్ పోర్టల్ గత ఐదు రోజులుగా సరిగా పనిచేయడం లేదంటూ ఓ ట్యాక్స్ పేయర్ ట్విటర్లో ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ఈ-ఫైలింగ్ పోర్టల్లో సమస్యల కారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును మారో 30 రోజుల పాటు పొడిగించాలని కోరారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందిస్తూ.. “ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది. మీకు ఎదురైన నిర్దిష్ట సమస్యను వివరిస్తూ పాన్, మొబైల్ నంబర్, సమస్యకు సంబంధించిన స్క్రీన్షాట్తో సహా orm@cpc.incometax.gov.inలో మాకు పంపించండి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది” అని పేర్కొంది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ఈ-ఫైలింగ్ పోర్టల్లోని డేటా ప్రకారం జులై 29 వరకు 5.73 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయి. వీటిలో 4.9 కోట్లకు పైగా రిటర్న్లను వాటిని దాఖలు చేసిన ట్యాక్స్ పేయర్లు వెరిఫై చేశారు. అలాగే 3.18 కోట్ల ఐటీఆర్లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లందరూ జులై 31లోపు తమ రిటర్న్లను ఫైల్ చేయడం చాలా ముఖ్యం. గడువు తేదీ తర్వాత కూడా ఆలస్యంగా ఐటీఆర్ను ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ కింద రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికైతే రూ. 1000. దీంతోపాటు గడువు తేదీలోపు ఐటీఆర్ను ఫైల్ చేయకపోతే అనేక ఇతర పరిణామాలు ఉంటాయి. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు Dear @NeeleshTax, The e-filing portal is working fine. May we request you to write to us at orm@cpc.incometax.gov.in detailing the specific issue you've encountered (along with PAN, your mobile no. & a screenshot of the error). Our team will get in touch with you. — Income Tax India (@IncomeTaxIndia) July 30, 2023 -
ట్యాక్స్ రీఫండ్ 12 గంటల్లోనే.. నమ్మబుద్ధి కావడం లేదా?
ఆదాయపు పన్ను రీఫండ్ ప్రాసెసింగ్ ఇప్పుడు వేగంగా మారింది. ట్యాక్స్ రీఫండ్ల కోసం వారాల పాటు వేచి ఉండాల్సి పని లేదు. 2023-24 అసెస్మెంట్ ఇయర్కు గానూ ఇటీవల తమ ఐటీ రిటర్న్లను దాఖలు చేసిన చాలా మందికి కొన్ని రోజుల్లోనే ట్యాక్స్ రీఫండ్ వచ్చింది. తాను ఐటీఆర్ ఫైల్ చేసిన 12 గంటల్లోనే ట్యాక్స్ రీఫండ్ పొందినట్లు ఓ పన్ను చెల్లింపుదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన నిర్ణయ్ కపూర్ అనే ట్విటర్ యూజర్ తన ఐటీఆర్ ఫైలింగ్, ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ మెసేజ్ స్క్రీన్షాట్లను షేర్ చేశారు. ట్యాక్స్ రీఫండ్ను ఇంత వేగంగా ప్రాసెస్ చేయడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాసుకొచ్చారు. నిర్ణయ్ కపూర్ జూలై 27 ఉదయం తన ఐటీ రిటర్న్ను దాఖలు చేయగా అదే రోజు సాయంత్రంలోగా ట్యాక్స్ రీఫండ్ డిపాజిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ట్యాక్స్ ఫైలింగ్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఐటీఆర్ ఫైలింగ్, రీఫండ్ ప్రాసెసింగ్లో వేగం పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఐటీఆర్లు దాఖలు చేసిన ఒక్కరోజులోనే ప్రాసెస్ చేయడం గతేడాదితో పోలిస్తే వంద శాతం పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేవారు రిఫండ్ ప్రాసెసింగ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్యాక్స్ నిపుణలు చెబుతున్నారు. మునుపటితో పోలిస్తే ఐటీఆర్ ప్రాసెసింగ్ వ్యవస్థ ఇప్పుడు చాలా వేగంగా మారిందని, పన్ను చెల్లింపుదారులు ముందస్తు రీఫండ్కు అర్హులు కావాలంటే వీలైనంత త్వరగా తమ రిటర్న్లను ఫైల్ చేయాలని సూచిస్తున్నారు. ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా మందికి తెలియని మరో ప్రయోజనం కూడా ఉంది. సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ రీఫండ్పై నెలకు 0.5 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తుందని తెలిసిందే. అయితే మీరు ఐటీఆర్ దాఖలు చేసినప్పటి నుంచి ఇది లెక్కలోకి వస్తుంది. కాబట్టి ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఆ ప్రయోజనం పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్లను ఫైల్ చేయడానికి గడువు తేదీ జూలై 31. కాగా జూలై 27 వరకు, 5 కోట్లకు పైగా రిటర్న్లు దాఖలయ్యాయి. అలాగే ఇప్పటికే 2.69 కోట్ల వెరిఫైడ్ ఐటీఆర్లను ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది. -
ఐటీ రిటర్న్స్..తెలంగాణ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐటీ రిటర్నులు అదరగొడుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ వర్గాలు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య (ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు)లో 25 శాతం వృద్ధి నమోదు అయ్యింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారు 21,58,703 మంది కాగా, 2022–23లో ఈ సంఖ్య 26,92,185కు చేరింది. అంటే నాలుగేళ్లలో 5.34 లక్షల మంది ఐటీ రిటర్నీలు పెరిగారన్న మాట. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్, హరియాణాలో 20 శాతానికి కొంచెం అటూ ఇటుగా పన్ను చెల్లింపుదారులు పెరిగారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు కలిపినా 15 శాతమే. కానీ మన రాష్ట్రంలో మాత్రం గత నాలుగేళ్లలో 25 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. అయితే తెలంగాణ కంటే ఎక్కువమంది పన్ను చెల్లింపుదారులున్న రాష్ట్రాలు కూడా పదికి పైగానే ఉన్నాయి. ఇందులో దక్షిణాదికి చెందిన కర్ణాటక, తమిళనాడు ఉన్నా..జనాభాతో పోలిస్తే అవి తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కలిపితే ఐటీ రిటర్నీల సంఖ్య దక్షిణాదిలోనే ఎక్కువగా 48.5 లక్షలు దాటడం గమనార్హం. కాగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మహారాష్ట్రలో 1.13 కోట్ల మంది రిటర్నీలు ఉన్నారు. పన్ను చెల్లింపుదారులు కోటి దాటిన ఏకైక రాష్ట్రం కూడా ఇదే. ఆ తర్వాత గుజరాత్, యూపీ, రాజస్తాన్ రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా 7,40,09,046 మంది రిటర్నీలు దేశంలోనే రిటర్నీలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ కేవలం 7,371 మంది మాత్రమే ఏటా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ 3,808 మంది మాత్రమే పన్నులు చెల్లిస్తుండగా, నాలుగేళ్లలో 3,500 మంది పెరిగారు. కేంద్ర పాలిత రాష్ట్రమైన లక్షద్వీప్లో గత నాలుగేళ్లతో పోల్చుకుంటే రిటర్నీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2019–20లో 4,760 మంది రిటర్నులు దాఖలు చేయగా, 2022–23లో 4,454 మంది మాత్రమే తమ ఆదాయ వివరాలను సమర్పించారు. కనీసం లక్ష మంది కూడా రిటర్నులు దాఖలు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, డామన్ డయ్యూ, దాద్రా నాగర్హవేలి, అరుణాచల్ప్రదేశ్, అండమాన్ దీవులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 2022–23లో 7,40,09,046గా నమోదయింది. (నోట్: ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారందరూ పన్ను చెల్లింపుదారులు కాదు. ఇక చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే పన్ను చెల్లించని వారు కూడా రిటర్నులు దాఖలు చేస్తారు. మరోవైపు దాదాపుగా అదే సంఖ్యలో పన్ను చెల్లిస్తున్నా కొందరు రిటర్నులు దాఖలు చేయలేరు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే రిటర్నీల వివరాలనే పన్ను చెల్లింపు దారుల వివరాలుగా పరిగణించవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు) -
ఇన్కమ్ ట్యాక్స్ ఎలా వచ్చిందో తెలిస్తే అవాక్కవుతారు!
History Of Income Tax: 'ఇన్కమ్ ట్యాక్స్' (Income Tax).. ఈ పదం గురించి పరిచయమే అవసరం లేదు. లెక్కకు మించిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ చరిత్ర.. నివేదికల ప్రకారం, మొదటి సారి 1860 జులై 24న సర్ జేమ్స్ విల్సన్ అనే బ్రిటీష్ అధికారి మనదేశంలో 'ఇన్కమ్ ట్యాక్స్' విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. దీనికి ఒక ప్రధాన కారణం ఉన్నట్లు కూడా చెబుతారు. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ పాలనకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు ఈ పథకం అమలులోకి వచ్చింది. ఆ తరువాత 1922లో భారతీయులు సంపాదించే ఆదాయానికి పన్ను చెలించడం మొదలుపెట్టారు. ఇది క్రమంగా 1939 నాటికి ఇందులో కొంత మార్పు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ దినోత్సవం.. 2010లో దేశ ఆర్థిక శాఖ జులై 24ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారిక దినోత్సవంగా ప్రకటించి ఈ ఉత్సవాలను అప్పటి ఆర్థిక మంత్రి ప్రారంభించారు. తరువాత ప్రతి ఏటా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇందులో భాగంగానే దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ విధానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నట్లు స్పష్టమైంది. కాగా ఈ ఆదాయ పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాక్స్ చెల్లింపులను ప్రోత్సహించడం, భవిష్యత్తులో ట్యాక్స్ సక్రమంగా చెల్లించేలా చేయడం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. పౌరులందరూ సకాలంలో ట్యాక్స్ కట్టినట్లయితే దేశం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు మసలుకోవాల్సి ఉంటుంది. -
పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్
ఆధార్ కార్డ్తో లింక్ చేయని కారణంగా పనిచేయకుండా పోయిన (ఇనాపరేటివ్) పాన్ కార్డులు, ఇతర కారణాలతో ఇన్యాక్టివ్గా మారిన పాన్ కార్డులు రెండూ ఒకటి కావు. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సందర్భంగా ఇనాపరేటివ్, ఇనాక్టివ్ పాన్ కార్డుల మధ్య తేడా తెలియక తికమక పడుతున్న ప్రజలకు ఆదాయపు పన్ను శాఖ క్లారిఫికేషన్ ఇచ్చింది. ‘పనిచేయని (ఇనాపరేటివ్) పాన్ కార్డు, ఇన్యాక్టివ్ పాన్ కార్డు రెండూ వేరు వేరు. పాన్ కార్డు పనిచేయక పోయినా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు’ అని ఐటీ శాఖ ట్విటర్లో పోస్టు ద్వారా తెలియజేసింది. అయితే పనిచేయని పాన్లకు పెండింగ్లో ఉన్న రీఫండ్లు, వాటి మీద వడ్డీలు చెల్లింపులు సాధ్యం కావని స్పష్టం చేసింది. ఇదీ చదవండి ➤ Inoperative PAN: పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు! అలాగే ఇనాపరేటివ్ పాన్ ఉన్నవారికి టీడీస్ (ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్) లను అధిక రేటుతో విధించనున్నట్లు పేర్కొంది. కాగా ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగిసింది. ఎన్ఆర్ఐ పాన్లపై స్పష్టత ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు తమ పాన్ ఇన్ఆపరేటివ్గా (పనిచేయకపోతే) మారిపోతే, నివాస ధ్రువీకరణ పత్రాలతో అసెసింగ్ అధికారులను సంప్రదించాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. తమ పాన్లు పనిచేయకుండా పోవడం పట్ల కొందరు ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల (ఓసీఐలు) నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు తెలిపింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీఆర్ దాఖలు చేసిన వారి స్టేటస్ వివరాలను తామే జురిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్లకు పంపించినట్టు స్పష్టం చేసింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటర్నులు దాఖలు చేయని లేదా తమ నివాస హోదాను అప్డేట్ చేయని వారి పాన్లు పనిచేయకుండా పోయినట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. Dear Taxpayers, Concerns have been raised by certain NRIs/ OCIs regarding their PANs becoming inoperative, although they are exempted from linking their PAN with Aadhaar. Further, PAN holders, whose PANs have been rendered inoperative due to non-linking of PAN with Aadhaar,… — Income Tax India (@IncomeTaxIndia) July 18, 2023 -
దెబ్బకు 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ - ఐటీ శాఖ రిప్లై ఇలా..!
Aadhaar Pan Link: గత కొన్ని రోజులుగా ఆధార్-పాన్ లింకింగ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 2023 జూన్ 30 లింకింగ్ చివరి గడువు అంటూ పలుమార్లు సంబంధిత శాఖలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఆధార్ & పాన్ లింకింగ్ గడువు ముగిసింది. అయినప్పటికీ ఆదాయపన్ను శాఖ వినియోగదారుల నుంచి ప్రశ్నలను స్వీకరిస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా దాదాపు 10 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ పాన్ కార్డులు పనిచేయడం లేదని, భారతదేశంలో వారి పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి ఫ్రీజ్ అయినట్లు వెల్లడించాడు. ఎన్ఆర్ఐ అందించిన పిర్యాదు మేరకు ఆదాయ పన్ను శాఖ స్పందిస్తూ.. గతంలో వెల్లడించిన విధంగానే పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయకుండా పోతే.. పాన్ పనిచేసే అవకాశం లేదని, ఈ కారణంగా తప్పకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ అయ్యాయా? లేదా? అనే దానిపైన ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. (ఇదీ చూడండి: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం - ధరలు తగ్గేవి & పెరిగేవి ఇవేనా?) నిబంధనల ప్రకారం.. ఎవరైతే ఎన్ఆర్ఐ లేదా ప్రవాస భారతీయులు ఉంటారో వారు ముందుగా వారి స్టేటస్ ఆదాయ పన్ను శాఖకు తెలియజేసినట్లయితే వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు లభిస్తుంది. కావున వారికి ఎటువంటి సమస్య ఉండదని ఆదాయపన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. Dear @secureyoursites, It may be noted that non-linking of PAN with Aadhaar makes a PAN inoperative and not inactive, consequences of which have already been specified vide Press Release in https://t.co/N1IRieLOfr The NRIs who had intimated their NRI status to the Department are… — Income Tax India (@IncomeTaxIndia) July 10, 2023 అంతే కాకుండా ఇప్పటి వరకు ఎవరైనా ప్రవాస భారతీయులు తమ ఎన్ఆర్ఐ స్టేటస్ చెప్పకుండా.. పాన్ కార్డు పని చేయలేదని నిర్దారించుకుంటారో, అలాంటి వారు ఆన్లైన్ ద్వారా జ్యూరిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ (JAO)ని సంప్రదించవలసిందిగా వెల్లడించింది. ఇందులో భాగంగా వారి పాస్పోర్ట్ కాఫీ వంటివి వారికి అందించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపింది. ఆలా కాకుంటే పాన్ కాఫీ, సంబంధిత డాక్యుమెంట్స్ adg1.systems@incometax.gov.in లేదా jd.systems1.1@incometax.gov.in అనే ఇమెయిల్కి కూడా పంపవచ్చని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. -
ఐటీఆర్ ఫైలింగ్లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్
ఐటీ రిటర్నులకు తుది గడువు సమీపిస్తున్న తరుణంలో ఆదాయ పన్ను శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ('చట్టం') కింద ఆదాయాన్ని తప్పుగా నివేదించడం , తప్పుడు తగ్గింపులను క్లెయిమ్ చేస్తే కఠినమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఇందులో నేరం రుజువైతే ఏడాదికి 12 శాతం వడ్డీ, పన్ను మీద 200 శాతంజరిమానా ఉంటుందని ప్రకటించింది. జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని పీఐబీ తెలంగాణా ట్విటర్ హ్యాండిల్ ఒక ట్వీట్ షేర్ చేసింది. ఇదీ చదవండి: ITR Filing: గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు ప్రక్రియ గడువు జులై 31తో గడువు ముగియనుంది. పన్ను చెల్లింపు దారులంతా ఐటీఆర్ ఫారంలో కచ్చితంగా సరైన వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో తప్పుడు వివారాలు సమర్పించినా, డిడక్షన్లు తప్పుగా చూపించినా, ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ, ఏపీ ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత పన్ను చెల్లింపుదారులను హెచ్చరించారు. తప్పుడు వివారాలు ఇచ్చినట్లు రుజువైతే ఏడాదికి 12 శాతం వడ్డీ, 200 శాతం పెనాల్టీ చెల్లించాలని పేర్కొన్నారు. అంతేకాదు న్యాయపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. (Foxconn: ఫాక్స్కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి) కాగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు పాత లేదా కొత్త విధానంలో ఒక దాన్ని ఎంపిక చేసుకుని ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్, ప్యాన్, ఫాం-16, బ్యాంకు స్టేట్ మెంట్లు, ఫారం 26 ఏఎస్, పెట్టుబడి ధ్రువపత్రాలు, రెంట్ అగ్రిమెంట్, సేల్ డీడ్, డివిడెండ్ వారంట్స్ వంటి పత్రాలు అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. Under the Income-tax Act,1961 (the 'Act') there are stringent consequences of misreporting of income and claiming wrongful deductions Those include interest @ 12% /yr, penalty @ 200% of taxes, prosecution which may entail imprisonment -Pr Chief Commissioner, @IncomeTax_APTS pic.twitter.com/2qGQwSG6op — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) July 10, 2023 -
పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు!
దేశంలో ప్రతి ఆర్థిక లావాదేవీకీ పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డ్ తప్పనిసరి. బ్యాంకుల్లో ఖాతాలు తెరవవాలన్నా.. లోన్లు పొందాలన్నా.. చెల్లింపులు చేయాలన్నా.. ఆదాయపు పన్ను చెల్లించాలన్నా ఈ పాన్ కార్డ్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం, 2023 జూన్ 30లోపు ఆధార్ నంబర్ను పాన్తో లింక్ చేయడం తప్పనిసరి. ఆ గడువు కూడా ఇప్పుడు పూర్తయింది. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డలు 2023 జూలై 1 నుంచి పనిచేయకుండా (ఇన్ఆపరేటివ్) పోయాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పేర్కొన్నదాని ప్రకారం.. పనిచేయని పాన్ కార్డు ఉన్న వారు కింది ఆర్థిక లావాదేవీలను నిర్వహించలేరు. ఆ లావాదేవీలు ఇవే.. బ్యాంకులు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఖాతా తెరవడం (టైమ్ డిపాజిట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు మినహా). డిపాజిటరీ, పార్టిసిపెంట్, సెక్యూరిటీస్ కస్టోడియన్ లేదా సెబీ నియంత్రణలోని సంస్థల్లో డీమ్యాట్ అకౌంట్ తెరవడం. హోటల్ లేదా రెస్టారెంట్కి ఒకేసారి రూ. 50,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం. విదేశీ ప్రయాణానికి లేదా విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడానికి రూ. 50,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి రూ. 50,000 కంటే ఎక్కువ చెల్లింపులు చేయడం. డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి రూ. 50,000లకు మించి చెల్లింపులు ఆర్బీఐ బాండ్లను పొందడం కోసం రూ. 50,000 మించి చెల్లింపులు బ్యాంకింగ్ కంపెనీ లేదా కో-ఆపరేటివ్ బ్యాంక్లో ఒకే రోజులో రూ.50,000 లకు మించి నగదు జమ బ్యాంక్ డ్రాఫ్ట్లు, పే ఆర్డర్లు, బ్యాంకర్ చెక్కులను కొనుగోలు చేసేందుకు ఒకే రోజులో రూ. 50,000 లకు మించి నగదు చెల్లింపులు టైమ్ డిపాజిట్కు సంబంధించి ఒక సారికి 50,000 లేదా సంవత్సరంలో మొత్తంగా రూ. 5 లక్షలకు మించి డిపాజిట్ చేయడం ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు, బ్యాంక్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ లేదా బ్యాంకర్ చెక్ ద్వారా రూ. 50,000లకు మించిన పేమెంట్లు బీమా సంస్థకు జీవిత బీమా ప్రీమియంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000లకు మించి చెల్లించడం. రూ. లక్షకు మించిన సెక్యూరిటీల (షేర్లు మినహా) అమ్మకం లేదా కొనుగోలు కోసం ఒప్పందంలోకి ప్రవేశించడం. రూ. లక్షకు మించిన అన్లిస్టెడ్ కంపెనీ షేర్ల విక్రయం లేదా కొనుగోలులో పాల్గొనడం. ఇదీ చదవండి: ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి? -
ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన
ఆధార్ కార్డ్-పాన్ లింకింగ్కు గడువు నిన్నటి(జూన్ 30)తో ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్-పాన్ లింకింగ్ కోసం పెనాల్టీ చెల్లించిన తరువాత చలాన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో సమాచారాన్ని పోస్ట్ చేసింది. అంతేకాదు మరోసారి గడువు పెంపు ఉంటుందనే ఊహాగానాలకు ఆదాయపు పన్ను శాఖ చెక్ పెట్టింది. ప్యాన్-ఆధార్లో లింకింగ్లో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆధార్-పాన్ లింకింగ్ కోసం రుసుము చెల్లించిన తర్వాత చలాన్ డౌన్లోడ్ చేయడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రసీదు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అయితే ఇ-పే ట్యాక్స్ ట్యాబ్లో చలాన్ చెల్లింపు వివరాలను చెక్ చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇ-పే ట్యాక్స్లో ఇబ్బందులున్నాయని కొంతమంది యూజర్లు ట్విటర్లో ఫిర్యాదు చేశారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) పాన్ను ఆధార్తో లింక్ చేయడడం 2017 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆధార్తో పాన్ను లింక్ చేయడానికి గడువును కేంద్రం చాలాసార్లు పొడిగించింది.జూన్ 30వ తేదీ లోపు పాన్ను ఆధార్ కార్డ్తో లింక్ చేయకపోతే, లింక్ కాని పాన్ కార్డులు చెల్లుబాటు కావడం ఆదాయపన్ను శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. Kind Attention PAN holders! Instances have come to notice where PAN holders have faced difficulty in downloading the challan after payment of fee for Aadhaar-PAN linking. In this regard, it is to be informed that status of challan payment may be checked in ‘e-pay tax’ tab of… — Income Tax India (@IncomeTaxIndia) June 30, 2023 -
బ్యాంకుల ఎస్ఎఫ్టీ నివేదికల్లో వైరుధ్యాలు
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించి కొన్ని బ్యాంకులు సమరి్పంచిన ‘స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్టీ)’ విషయంలో వైరుధ్యాలు ఉన్నట్టు ఆదాయన్ను శాఖ గుర్తించింది. ఆదాయపన్ను శాఖ నిర్ధేశించిన లావాదేవీల వివరాలను ఎస్ఎఫ్టీ కింద ఏటా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, వివిధ సంస్థలు ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్టీని మే 31 నాటికి దాఖలు చేయాలి. ఫారెక్స్ డీలర్లు, బ్యాంక్లు, సబ్ రిజి్రస్టార్, ఎన్బీఎఫ్సీ, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసిన సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు, షేర్ల బైబ్యాక్ చేసిన కంపెనీలు, డివిడెండ్ చెల్లించిన కంపెనీలు ఎస్ఎఫ్టీ పరిధిలోకి వస్తాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ బ్యాంక్ నివేదించిన ఎఫ్ఎఫ్టీలో వ్యత్యాసాలను గుర్తించినట్టు ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగం సీబీడీటీ ప్రకటించింది. కొన్ని లావాదేవీలను అసలుకే వెల్లడించకపోగా, కొన్ని లావాదేవీల సమాచారం కచి్చతంగా పేర్కొనలేదని వెల్లడించింది. ఉత్తరాఖండ్లో రెండు కోపరేటివ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించగా, వేలాది కోట్ల రూపాయల లావాదేవీలను రిపోర్ట్ చేయాలేదని బయటపడినట్టు తెలిపింది. వివిధ సంస్థలు ఎస్ఎఫ్టీ ద్వారా ఆదాయపన్ను శాఖకు వివరాలు తెలియజేస్తే.. ఆయా సమాచారాన్ని పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో చేరుస్తారు. దీంతో పన్ను చెల్లింపుదారులు తమ ఏఐఎస్ను పరిశీలించుకుని రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్ఎఫ్టీల్లో వ్యత్యాసాలు గుర్తించినట్టు ప్రకటించిన సీబీడీటీ, తీసుకున్న చర్యలపై సమాచారం తెలియజేయలేదు. -
కోటికి పైగా ఐటీఆర్లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా..
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు జూన్ 26 నాటికి కోటికిపైగా దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గతేడాది కంటే చాలా వేగంగా కోటి రిటర్నులు దాఖలైనట్టు వివరించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు జూలై 31 ఆఖరు తేదీగా ఉంది. ఆడిట్ అవసరం లేని వేతన జీవులు అందరికీ ఈ గడువు అమలవుతుంది. గతేడాదితో పోలిస్తే కోటి రిటర్నులు 12 రోజులు ముందే దాఖలయ్యాయంటూ ఆదాయపన్ను శాఖ ట్వీట్ చేసింది. చివరి నిమిషంలో రద్దీ లేకుండా ఉండేందుకు వీలైనంత ముందుగా రిటర్నులు దాఖలు చేయాలంటూ పన్ను చెల్లింపుదారులను కోరింది. Over one crore ITRs have been filed till 26th June 2023 compared to one crore ITRs filed till 8th of July last year. One crore milestone reached 12 days early this year compared to corresponding period in the preceding year: Income Tax Department @IncomeTaxIndia — All India Radio News (@airnewsalerts) June 27, 2023 -
విరాళం రూ.2 లక్షలకు మించితే తెలియజేయాలి..
న్యూఢిల్లీ: సామాజిక సేవా సంస్థలు వెల్లడించాల్సిన వివరాల నిబంధనలను ఆదాయపన్ను శాఖ సవరించింది. ఈ మార్పులు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక మీదట చారిటబుల్ సంస్థలు తమ కార్యకలాపాలు ధార్మికమైనవా లేదా మతపరమైనవా లేక మతపరమైన సేవా కార్యక్రమాల కిందకు వస్తాయా? అన్నది వెల్లడించాల్సి ఉంటుంది. ఒకరోజులో రూ.2 లక్షలకు మించి ఎవరైనా విరాళం ఇస్తే ఆ వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలి. చెల్లించిన వ్యక్తి, చిరునామా, పాన్ నంబర్ ఇవ్వాలి. ఆదాయపన్ను చట్టంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన ట్రస్టులు, వైద్య, విద్యా సంస్థల ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఈ సంస్థలు ఐటీ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. -
గడువు ముగుస్తోంది.. పాన్-ఆధార్ లింక్ చేశారా?
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్తో లింక్ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ విధించిన గడువు ముగుస్తోంది. మినహాయింపు కేటగిరీకి చెందినవారు తప్ప మిగిలిన వారందరూ వెంటనే తమ పాన్ను ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ట్విటర్లో రిమైండర్ను షేర్ చేసింది. చివరి తేదీ సమీపిస్తున్న క్రమంలో ట్యాక్స్ పేయర్లు, పాన్ కార్డ్ హోల్డర్లు తమ పాన్ను ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలంటూ ఐటీ శాఖ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. పాన్- ఆధార్ లింకింగ్ ప్రక్రియ కోసం అనుసరించాల్సిన సూచనలతోపాటు గడువులోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే జరిగే పరిణామాల గురించి కూడా హెచ్చరించింది. చివరి తేదీ ఎప్పుడు? పాన్-ఆధార్ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30. ఈలోపు పాన్ను ఆధార్తో అనుసంధానించకపోతే, 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆ పాన్ కార్డ్ పని చేయకుండా పోతుంది. పాన్-ఆధార్ లింక్ చేయడమెలా? ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ కోసం సెర్చ్ చేసి అందుబాటులో ఉన్న పాన్-ఆధార్ లింక్పై క్లిక్ చేయాలి అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి లేకుంటే కొత్తది క్రియేట్ చేసుకోవాలి యూజర్ ఐడీ, పాస్వర్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి (యూజర్ ఐడీగా పాన్ నంబర్ నమోదు చేయాలి) వెంటనే ఆధార్-పాన్ లింక్ను తెలియజేసే పాపప్ కనిపిస్తుంది. (ఒకవేళ కనిపించకపోతే వెబ్సైట్ ఎడమ వైపు విభాగాన్ని సందర్శించండి) అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి వివరాలను నిర్ధారించి, క్యాప్చాను ఎంటర్ చేయాలి ఇది పూర్తయిన తర్వాత పాన్ ఆధార్ కార్డ్కి విజయవంతంగా లింక్ చేసినట్లు నోటిఫికేషన్ వస్తుంది. లింక్ చేయకపోతే ఏమౌతుంది? ఆదాయపు పన్ను శాఖ షేర్ చేసిన వీడియో ప్రకారం.. పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ పనికిరాకుండా పోతుంది. అలాగే ఈ కింది పరిణామాలను పాన్ హోల్డర్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెల్లింపులు నిలిచిపోతాయి. పాన్ పని చేయని కాలానికి నిలిచిపోయిన నగదుపై ఎటువంటి వడ్డీ రాదు అధిక టీడీఎస్, టీసీఎస్లు భరించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలు, కొన్ని నిర్దిష్ట రాష్ట్రాల వాసులు, భారతీయ పౌరులు కానివారు, 80 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి, జరిమానాల నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2023 మార్చి 28న ఆర్థిక శాఖ ఇచ్చిన ప్రకటనలో పాన్-ఆధార్ లింకింగ్కు చివరి తేదీని జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపింది. 2023 మార్చి 28 నాటికి 51 కోట్లకుపైగా పాన్లు ఆధార్తో లింక్ అయినట్లు పేర్కొంది. पैन धारक कृपया ध्यान दें! आयकर अधिनियम, 1961 के अनुसार, पैन धारक, जो छूट की श्रेणी में नहीं आते हैं, उन्हें 30.06.2023 तक अपने पैन को आधार से जोड़ना अनिवार्य है। कृपया अपना पैन और आधार आज ही लिंक करें! Kind attention PAN holders! As per Income-tax Act, 1961, it is mandatory… pic.twitter.com/VyliEJ75Gy — Income Tax India (@IncomeTaxIndia) June 21, 2023 ఇదీ చదవండి: Bank Holidays July 2023: నెలలో దాదాపు సగం రోజులు సెలవులే! -
ఐటీ విచారణకు హాజరైన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి గురువారం ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇటీవల సోదాల అనంతరం ఈరోజు విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో పైళ్ల శేఖర్రెడ్డి విచారణకు హాజరయ్యారు. కాగా, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సహా మర్రి జనార్దన్ రెడ్డిలకు ఐటీ అధికారులు నోటీసలు ఇచ్చారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి సైతం నోటీసులు అందాయి. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నివాసల్లో సైతం సోదాలు జరగ్గా, ఐటీ అధికారులు అడిగిన వివరాలతో హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. వ్యాపార లావాదేవీలు, ఐటీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్లతో హాజరు కావాలని ఆదేశించారు. చదవండి: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది.. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు: పైళ్ల శేఖర్రెడ్డి -
బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు
-
తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో
Updates ►తెలంగాణలో పలువురు బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం 60 ప్రాంతాల్లో ఐటీ సోదాలు అవుతున్నాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పై ఏకకాలంలో ఐటీ సోదాలు జరుపుతోంది. జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది ఐటీ. ►వైష్ణవి గ్రూప్స్, తీర్ధా గ్రూప్స్తో పాటు కొత్తపేటలో హీలింథ్ టెక్నాలజీస్ పైన ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు ఇన్ఫ్రా, మైనింగ్, ట్రావెల్స్ కంపెనీల నుంచి చెల్లించిన పన్ను వివరాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. పన్ను చెల్లింపులో వ్యత్యాసాలను ఐటీ గుర్తించింది. ►పైళ్ల శేఖర్ రెడ్డికి చెందిన తీర్థ ప్రాజెక్ట్స్తో పాటు లార్వేన్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితను అధికారులు బ్యాంక్కు తరలించారు. ►మర్రి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను సైతం బ్యాంకుకు తరలించారు. ఖాతాలు, లాకర్స్ వివరాలు సేకరిస్తున్నారు. పలువురు బ్యాంకు అధికారుల సమక్షంలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు చేపట్టింది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో బుధవారం ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు.70 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పైళ్ల శేఖర్ రెడ్డి చేస్తున్న రియల్ ఎస్టేట్, వ్యాపారాలపై ఐటీ సోదాలు జరుపుతున్నారు. 15 కంపెనీల్లో ఎమ్మెల్యే పెట్టుబడులు ఉన్నాయని ఐటీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, భువనగిరిలోని ఇళ్లు, కార్యాలయాలు సహా ఎమ్మెల్యే వ్యక్తిగత నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టింది. మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్, హిల్ల్యాండ్ టెక్నాలజీస్ సహా మరికొన్ని కంపెనీల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. చదవండి: పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? మొత్తం 12 ప్రాంతాల్లో.. 70 బృందాలతో ఏక కాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తీర్థ గ్రూప్ పేరిట రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్, ఎనర్జీ..లిథియం బ్యాటరీ వ్యాపారాలు చేస్తున్నారు పైళ్ల శేఖర్ రెడ్డి.. ఈ సంస్థ హైదరాబాద్తోపాటు కర్ణాటకలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. దకక్షిణాఫ్రికాలోనూ మైనింగ్ వ్యాపారం చేస్తోంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుపుతోంది. ప్రభాకర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద నివాసంలో అధికారుల సోదాలు చేపట్టారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి షాపింగ్ మాల్పై.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. కేపీహెచ్బీ కాలనీలోని జనార్ధన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్లోనూ ఐటీశాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. జేసీ బ్రదర్స్లో జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా మర్రి జనార్ధన్ రెడ్డి జేసీ బ్రదర్స్ డైరెక్టర్గా ఉన్నారు. -
ఈ-అప్పీళ్ల పథకం నోటిఫై
న్యూఢిల్లీ: ఈ-అప్పీల్స్ పథకాన్ని ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. దీంతో అప్పీళ్లను ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేసుకోవడం, వాటిని ప్రాసెస్ చేయడం వీలు పడుతుంది. ‘ఈ–అప్పీల్స్ స్కీమ్, 2023’ కింద ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ (అప్పీల్స్) తన ముందు దాఖలైన అప్పీళ్లను ప్రాసెస్ చేయనున్నారు. దీని కింద బాధిత మదింపుదారులు JCIT (అప్పీల్స్) JCIT కంటే తక్కువ ర్యాంక్లో ఉన్న అసెస్సింగ్ అధికారి ఆమోదించే ముందు కొన్ని ఆర్డర్లను అప్పీల్ చేయవచ్చు. "జాయింట్ కమీషనర్ (అప్పీల్స్) ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా దాని ముందు దాఖలు చేసిన లేదా కేటాయించిన లేదా బదిలీ చేయబడిన అప్పీళ్లను పరిష్కరించాలి" అని నోటిఫికేషన్ పేర్కొంది. JCIT (A)కి ఇన్కమ్ టాక్స్ అథారిటీ, మినిస్టీరియల్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ లేదా కన్సల్టెంట్లు బోర్డు ద్వారా అవసరమని భావించే విధంగా అప్పీళ్లను పరిష్కరించడంలో సహాయపడతారు.అప్పీళ్ల కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పన్ను చెల్లింపుదారుల వివరణ సైతం విననున్నారు. ఇదీ చదవండి: CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా? Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ డిఫరెంట్ లుక్స్లో టాప్ లీడర్స్: దిమ్మదిరిగే ఫోటోలు -
IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్లు.. గడువు తేదీ గుర్తుందిగా!
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఈ ఫైలింగ్ పోర్టల్పై ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు (ఐటీఆర్) 1, 4 లను ఆదాయపు పన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తులు, చిన్న వ్యాపారులు, వృత్తి నిపుణులు వీటిని దాఖలు చేస్తుంటారు. ఇతర ఐటీఆర్ పత్రాలను సైతం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ల దాఖలు గడువు జూలై 31గా ఉంది. ఐటీఆర్ 1ను వ్యక్తులు, వేతన జీవులు, వృద్ధులు దాఖలు చేస్తుంటారు. ఐటీఆర్4ను వ్యాపారులు, వృత్తి నిపుణులు దాఖలు చేస్తుంటారు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో ఐటీఆర్ ఫారమ్లతోపాటు ఫారమ్-16 జీతం వివరాలు, పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ ఆదాయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన ఎక్సెల్ యుటిలిటీ షీట్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత తిరిగి ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
ఐటీ దెబ్బకు కదులుతున్న బాబు స్కామ్ తేనెతుట్టె
సాక్షి, విశాఖపట్నం: ఐటీ విభాగం దెబ్బకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి తేనెతుట్టె కదులుతోంది. 2019 ఎన్నికల్లో జరిగిన 100కోట్ల ఆర్థిక లావాదేవీలు.. వాటికి సంబంధించిన కేసులో ఆదాయపన్నుల శాఖ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. గుట్టు బయటపడుతోంది. తాజాగా.. విశాఖలోని హయగ్రీవ సంస్థలో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ సంస్థ నుంచే తెలుగుదేశం పార్టీకి 52.5 కోట్లు ఎన్నికల నిధులు మల్లినట్టు అభియోగాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. ఈ స్కాంలో హయగ్రీవ నిర్వహకుడు జగదీశ్వరుడి పాత్రపై బలంగా ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ హయాంలో అడ్డుగోలుగా కాంట్రాక్టులు సంపాదించి.. నిధులు సమకూర్చిన జాబితాలో హయగ్రీవ కంపెనీ కూడా ఉంది. ఈ తరుణంలో.. ఎంవీపీ కాలనీలోని హయగ్రీవ కార్యాలయంలో ఐటీ వర్గాలు తనిఖీలు చేపట్టాయి. అలాగే హయగ్రీవ మేనేజింగ్ డైరక్టర్ జగదీశ్వరుడుతో పాటు పున్నం నారాయణ రావు, రాధరాణి చిలుకూరీ, అడిషనల్ డెరైక్టర్ నారాయణ శ్రీనివాస్ మూర్తీ, ఇంద్ర కుమార్ చితూరి , నారాయణ రావు గున్నం ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. జగదీశ్వరుడు గతకొంతకాలంగా అండర్గ్రౌండ్కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: టిడ్కో ఇళ్లపై ఎందుకంత కుళ్లుబోతుతనం -
జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల వేతనం నుంచి టీడీఎస్ మినహాయించే ముందు పాత, కొత్త పన్ను విధానాల్లో వారికి ఏది సమ్మతమో సంస్థలు తెలుసుకోవాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. ఉద్యోగులు ఎంపిక చేసుకున్న పన్ను విధానం పరిధిలోనే టీడీఎస్ వసూలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉద్యోగులు ఏ ఆప్షన్ చెప్పకపోతే, అప్పుడు నూతన పన్ను విధానం కింద టీడీఎస్ మినహాయించాలని కోరింది. ఇదీ చదవండి: త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్కుక్! -
ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?
దేశంలో ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ డబ్బును బ్యాంకుల్లో కాకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఇంట్లో ఎంత డబ్బు నిల్వ ఉంచవచ్చనే దానిపై పరిమితులు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఇంట్లో నిల్వ చేసే డబ్బుపై ఎలాంటి పరిమితి లేదు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క చెప్పాలి. దానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి. ఆ డబ్బు లెక్కలోకి రానిదై ఉండకూడదు. ఇంట్లో ఉంచిన డబ్బుకు పత్రాలు సరిపోలకపోతే ఆదాయపు పన్ను అధికారులు మొత్తం డబ్బుపై 137 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లెక్కలోకిరాని ఆ డబ్బును స్వాధీనం చేసుకోవచ్చు కూడా. ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు! నిబంధనలు ఏం చెబుతున్నాయి? అటువంటి జరిమానాలు పడకూడదంటే నగదుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ వ్యక్తి అయినా ఏదైనా రుణం లేదా డిపాజిట్ రూ. 20,000లకు మించి నగదు రూపంలో తీసుకునేందుకు వీలు లేదు.ఈ నిబంధన ఆస్తి లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరిగితే దానికి సంబంధించి లెక్కా పత్రాలు గనుక లేకపోతే ఐటీ అధికారులు జరిమానా విధిస్తారు. ఒకేసారి రూ. 50,000లకు మించి డిపాజిట్ లేదా విత్డ్రా చేసేటప్పుడు పాన్ నంబర్లు, ఆధార్, ఇతర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! ఇక ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించి రూ. 30 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో చెల్లించినా, తీసుకున్నా విచారణకు లోబడి ఉండాల్సి ఉంటుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ని ఉపయోగించి ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసినా విచారణ ఉంటుంది. -
ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్!
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. మార్చి 31 సమీపిస్తుండటంతో పన్ను చెల్లింపుదారులు హడావుడి పడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 41,104 రీఫండ్ చేస్తున్నట్లు కొందరికి ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ రీఫండ్ పొందడానికి వ్యక్తిగత వివరాలను సమర్పించాలని ఆ మెయిల్ ద్వారా కోరారు. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! ‘ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ఖాతా-ఆడిట్ను పూర్తి చేసింది. మీకు రూ. 41,101.22 రీఫండ్కు అర్హత ఉంది.. కానీ మీ వివరాలు కొన్ని తప్పుగా ఉన్నాయి. పరిశీలించి సరిచేసుకోండి’ అంటూ ఓ లింక్ ట్యాబ్ను అందులో ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, బెంగళూరు నుంచి ఆ ఈమెయిల్ను పంపుతున్నట్లు పేర్కొన్నారు. అది పూర్తిగా ఫేక్.. ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చిన ఆ ఈమెయిల్ పూర్తిగా ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( పీఐబీ) నిర్ధారించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నేతృత్వంలోని ఆదాయపు పన్ను శాఖ నుంచి అటువంటి ఈమెయిల్లను పంపలేదని తేల్చింది. An E-mail claims that the recipient is entitled to a refund of ₹41, 104, and is seeking his/her personal details in the name of @IncomeTaxIndia#PIBFactCheck ✔️This claim is fake ✔️Report such suspicious emails at 'webmanager@incometax.gov.in' pic.twitter.com/bWgJT7iNbo — PIB Fact Check (@PIBFactCheck) March 20, 2023 ఆదాయపు పన్నుకు సంబంధించిన ఇలాంటి అనుమానాస్పద ఈమెయిల్స్ వచ్చినప్పుడు webmanager@incometax.gov.in లో తెలియజేయవచ్చు. ఐటీ శాఖ ఇలా ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగదు. అలాగే క్రెడిట్ కార్డ్లు, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక ఖాతాల కోసం పిన్ నంబర్లు, పాస్వర్డ్లు వంటివి కోరుతూ మెయిల్ పంపదు. ఇలాంటి ఈమెయిల్ వచ్చినప్పుడు ఏమి చేయాలి? వాటికి స్పందించవద్దు. అటాచ్మెంట్లు మీ కంప్యూటర్కు హాని కలిగించే హానికరమైన కోడ్ని కలిగి ఉండవచ్చు కాబట్టి వాటిని తెరవవద్దు. ఎలాంటి లింక్లపైనా క్లిక్ చేయవద్దు. ఒక వేళ మీరు లింక్లపై అనుకోకుండా క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్కు సంబంధించిన వివరాలను షేర్ చేయవద్దు. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ -
ఈడీ దృష్టికి మార్గదర్శి అక్రమాలు!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంసీఎఫ్ఎల్) అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. నిధులను దారి మళ్లించి చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న మార్గదర్శిపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతోపాటు ఇతర రాష్ట్రాల సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖలు కూడా విచారణ జరపాలని నివేదించింది. ఈమేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపన్ను శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలోని ‘తీవ్రమైన ఆర్థిక నేరాల పరిశోధన విభాగం’(ఎస్ఎఫ్ఐవో)తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల సీఐడీ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల విభాగాలకు ఫిర్యాదు చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్ పలు రాష్ట్రాల్లో వ్యాపారం నిర్వహిస్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతుండటంతో చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సీఐడీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో తాము గుర్తించిన అక్రమాలు, అవకతవకలను వివరిస్తూ రూపొందించిన నివేదికను సీఐడీ అధికారులు జత చేశారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఈడీ, ఆదాయపన్ను, కార్పొరేట్ వ్యవహారాల శాఖలు, ఇతర రాష్ట్రాల సీఐడీ విభాగాలు దర్యాప్తు జరపాల్సినంత తీవ్రమైన నేరాలకు మార్గదర్శి చిట్ఫండ్స్ పాల్పడిందని అందులో స్పష్టం చేశారు. సీఐడీ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦ మార్గదర్శి చిట్స్ నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ మనీలాండరింగ్కు పాల్పడుతోంది. ♦ చందాదారులకు చెల్లించాల్సిన డబ్బులను మార్గదర్శి చిట్ఫండ్స్ ఇవ్వకుండా రూ.కోట్లలో బకాయిలు పెడుతోంది. ♦ చిట్ఫండ్స్ చట్టం ప్రకారం బ్యాంకు ఖాతాలు, ఇతర రికార్డుల నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ♦ చందాదారులకు చిట్ మొత్తం చెల్లించకుండా అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. ఇది రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ♦ చందాదారుల సొమ్మును అక్రమంగా బదిలీ చేస్తూ ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది. ♦ ఆదాయపన్ను చట్టాలను ఉల్లంఘిస్తూ చందాదారుల నుంచి పరిమితికి మించి భారీ మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడుతోంది. ♦ చెల్లింపులపై టీడీఎస్ చెల్లించడం లేదు. -
ఏ ప్రభుత్వమైనా ఇదే తంతు!
నిష్పక్షపాతంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థలు పాలకుల చేతి చిలకలుగా ఉంటున్నాయన్న ఆరోపణలు కొత్తవి కాదు. ఈ సంస్కృతికి ఏ ఒక్క పార్టీనో నిందించి ప్రయోజనం లేదు. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారుల చేతులు మెలిపెట్టి వారిని వాడుకోవడంలోనూ; రాజనీతికి, దేశ విశిష్ట రాజ్యాంగ చట్ట నిబంధనలకు యథేచ్ఛగా తిలోదకాలివ్వడంలోనూ పాలకుల మధ్య ఎత్తుగడలలో తేడాలే తప్ప వ్యవహారం మొత్తం ఒకే రకం. అలాగే ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని, పాత్రికేయుల్ని, ప్రజా సమస్యలకు న్యాయమైన పరిష్కారాన్ని కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న పౌర హక్కుల ఉద్యమకారులపై పోలీసు జులుం వినియోగించే సంస్కృతికి కూడా పాలక పార్టీలు సమాన స్థాయిలో మూల విరాట్టులేనని మరచిపోరాదు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందన్న రొడ్డ కొట్టుడు ప్రకటనలను ప్రజలు వినలేక చస్తున్నారు. ఎందుకంటే,‘అందరూ శాకాహారులే అయితే రొయ్యల బుట్ట కాస్తా ఎలా ఖాళీ అయిపోయిం’దన్న ప్రశ్నకు సమాధానం వారికి ఇంతవరకూ దొరక లేదు కాబట్టి! దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న ముహూర్త కాలంలో కూడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఎందుకని? నాయకులకన్నా స్వాతంత్య్రం కోసం ఆస్తులు, ప్రాణాలు సహా దేశ ప్రజా బాహుళ్యం అనంతమైన త్యాగాలు చేసి ఉన్నారు గనుక. ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని, వారి అనుయాయుల్ని, పాత్రికే యుల్ని, పౌర సమాజాన్ని, ప్రజా సమస్యలకు న్యాయమైన పరిష్కా రాన్ని కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న పౌర హక్కుల ఉద్యమ కారులను హింసిస్తూ, వారిపై పోలీసు జులుం వినియోగించే పాలక సంస్కృతికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాన స్థాయిలో మూల విరాట్టులేనని మరచిపోరాదు. అంతేగాదు, కోర్టుల్ని ధిక్కరించి, వాటి చేతుల్ని మెలిపెట్టి పనులు నిర్వహించుకునే సంస్కృతికి తెరలేపినవీ కూడా ఈ రెండు పార్టీలేనని నిద్రలోనూ మరవరాదు. అలహాబాద్ హైకోర్టు సాహసించి ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ రాకెట్’ బాగోతాన్ని బట్టబయలు చేస్తూ శఠిస్తూ చెప్పిన చరిత్రాత్మక తీర్పును ఆమోదిస్తూనే సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయమూర్తి కృష్ణయ్యర్ ఉదార దృక్పథంతో ఇందిరా గాంధీ ‘విషయాన్ని చక్కబెట్టుకోవడానికి’ వెసులుబాటు కల్పించబట్టి తక్షణం ఆమె రాజీనామా వాయిదాపడింది. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారుల చేతులు మెలిపెట్టి వారిని వాడుకోవడంలోనూ; రాజనీతికి, దేశ విశిష్ట రాజ్యాంగ చట్ట నిబంధనలకు యథేచ్ఛగా తిలోదకాలివ్వడంలోనూ కాంగ్రెస్, బీజేపీ పాలకుల మధ్య ఎత్తుగడలలో తేడాపాడాలే తప్ప వ్యవహారం మొత్తం ఒకే రకం. ప్రజాబాహుళ్యాన్ని, వారి సంక్షేమాన్ని ప్రజాస్వామిక పద్ధతుల్లో తీర్చిదిద్దుతూ వచ్చిన ఉదాహరణలు తక్కువ. స్వతంత్ర సంస్థలుగా ఉండవలసిన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను గతంలో ‘చేతివాటు’ పనిముట్లుగా వాడుకున్న తీరు చివరికి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడమూ, కోర్టు సీబీఐ, ఈడీ అధికారు లను చీవాట్లు పెడుతూ, ఇకమీదట ‘మీరు కేంద్ర ప్రభుత్వానికే కాదు, సుప్రీం న్యాయస్థానానికి బాధ్యులై ఉండాల’ని కఠినంగా ఆదేశించడమూ జరిగింది. బహుశా ఈ పరిణామాలను గమనించిన తరువాతనే కేంద్ర సీబీఐ మాజీ ఉన్నతాధికారి, గూఢచార శాఖ మాజీ అధిపతి రామేశ్వర్ నాథ్ కావ్ కూడా పాలకుల ప్రలోభాల ఫలితంగా గూఢచార శాఖ అధికారులు చూచి రమ్మంటే కాల్చి వచ్చే బాపతులుగా తయారు కావడం విచారకరమని ఒక పుస్తకమే రాసి విడుదల చేశారు. ఈ బాగోతం ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలాంటి ఉదాహరణలను పెక్కింటిని ‘హిందూ’ దినపత్రిక మేటి పక్ష పత్రిక అయిన ‘ఫ్రంట్ లైన్’ ప్రత్యేక ప్రతినిధి, విశిష్ట విశ్లేషకుడైన ఆశుతోష్ శర్మ పేర్కొన్నారు: ‘‘రూ. 300 కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణం కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి నారాయణ్ రానే, అధికార పక్షంలో చేరడంతోనే అతనిపై అంతకుముందున్న కేసు కాస్తా మాఫీ అయిపోయింది. అదే తరహాలో పశ్చిమ బెంగాల్లో ‘నారదా’ కుంభ కోణంలో నిందితుడైన సువేందు అధికారిపై విచారణ కాస్తా రద్దయిపోయింది. మధ్యప్రదేశ్ షిండే సేనకు చెందిన భావనా గవ్లీకి ‘ఈడీ’ జారీ చేసిన అయిదు సమన్లను ఖాతరు చేయకపోయినా ప్రస్తుత లోక్సభలో ‘షిండే సేన’కు ఛీఫ్ విప్గా ఉన్నారు. అలాగే, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్ట (ఫెమా) ఉల్లంఘన కేసులో ఈడీ విచారణలో ఉన్న యశ్వంత్ యాదవ్, ఎమ్మెల్యే యామినీ యాదవ్ దంపతులిద్దరూ ఇప్పుడు ‘షిండే సేన’లో సభ్యులుగా ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో శివ సేన సభ్యుడుగా ఉన్న ప్రతాప్ సర్ నాయిక్పై ‘ఈడీ’ సోదా నిర్వహించితే ఇప్పుడతను షిండే సేనలోకి చేరడంతోనే కేసు కాస్తా మాఫీ అయిపోయింది. ఈ సందర్భంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ జాతీయ నాయకు డైన అరవింద కేజ్రీవాల్ (మార్చి 1న) ఒక ప్రశ్న సంధిస్తూ ‘ఈ రోజున ఆప్ మంత్రి మనీష్ సిసోడియా బీజేపీలో చేరితే, రేపంటే రేపే విడుదలైపోడా?’ అని ఓ జోక్ వదిలారు. అంతేగాదు, సుప్రీంకోర్టు న్యాయవాది కాళీశ్వరం రాజ్ – ‘భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందంటే, కోర్టు నిర్ణయించిన న్యాయమూర్తుల నియా మకాల్ని కూడా తిమ్మినిబమ్మిని చేసి తారుమారు చేయగల శక్తి పాలక వర్గానికి ఉందని అర్థమవుతోంది’ అని చురక వేశారు. అయితే, ఎప్పు డయితే సుప్రీం కోర్టుకు ప్రగతిశీల ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పదవీ స్వీకారం చేశారో అప్పటినుంచీ సుప్రీంకోర్టు నుంచి వెలువడుతున్న ప్రజాహిత నిర్ణయాలు దేశ ప్రజలకు మంగళకర సూచనగా భావించాలి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనా కాలంలో సుప్రీం న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఖన్నా దేశవ్యాప్తంగా పౌర హక్కుల వినాశానికి, పాలక నియంతృత్వ ధోరణులకు ‘ఫుల్ స్టాప్’ పెట్టించి రాజకీయ ఖైదీల విడుదలకు ఉత్తర్వులు జరూరుగా జారీ చేసి, దేశంలోనూ, విదేశాలలోనూ ఖ్యాతి గడించారు. తాను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కానున్న సమయంలో ఆ పదవిని త్యాగం చేసిన జస్టిస్ ఖన్నాను విదేశాలు మరచిపోలేదుగానీ, మన దేశంలో అలాంటి న్యాయమూర్తికి ఏటా నివాళులర్పించగల కనీస సంస్కారం కూడా మనలో కరువై పోయింది. ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు అన్న ధోరణి రాజ్యాంగం నిర్దేశించి, గ్యారంటీ చేసిన ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థకు చేటు కల్గి స్తుందని దేశ ప్రజలు స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఈ సందర్భంగా కవయిత్రి మాయా ఏంజెలో (శివలక్ష్మి అనువాదం) స్వేచ్ఛా పక్షికీ, ‘పంజరంలోని పక్షి’కీ గల తేడాను వర్ణిస్తూ చెప్పిన మాటల్ని విందాం: ‘‘స్వేచ్ఛా పక్షి తన శక్తి మేరకు ఆకాశాన్ని సైతం శుభ్రం చేయడానికి ధైర్యం చేస్తుంది... పంజరంలో పక్షి భయంకరంగా వణికే గొంతుతో పాడుతుంది కానీ, చాలాకాలంగా సుదూరపు కొండలనుంచి శ్రుతి తప్పిన రాగం అస్పష్టంగా పంజరం నుంచి విముక్తి కోసం పక్షి స్వర రాగం విషాదంగా వినపడుతూనే ఉంటుంది స్వేచ్ఛా పక్షులు ఆహ్లాదకరమైన ఇతర పక్షుల గురించి ఆలోచిస్తాయి చెట్లు వదిలే వాణిజ్య వాయువుల్ని మృదువుగా ఆస్వాదిస్తాయి ఆ పక్షులు ఆకాశానికి తమ పేరు పెట్టుకుంటాయి! కానీ పంజరంలోని పక్షి తన కలల సమాధిపై నిలబడి ఉంటుంది ఆ పక్షి రెక్కలు కత్తిరించబడ్డాయి, పాదాలు కట్టివేయబడ్డాయి కాబట్టి పంజరంలో పక్షి పాడటానికి తన గొంతు సవరించుకుంటుంది పంజరంలో పక్షి పాడుతుంది భయకంపితమైన స్వరంతో తన స్వేచ్ఛను ఎలుగెత్తి చాటే పక్షి స్వర రాగం విషాదంగా వినబడుతూనే ఉంది!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చికోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు
-
బీబీసీలో ఆర్థిక అవకతవకలు జరిగాయ్
న్యూఢిల్లీ: బీబీసీ గ్రూప్లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సర్వేలో కీలకమైన ఆధారాలు లభించాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కొన్ని సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్లో వారి కార్యకలాపాలకు అనుగుణంగా లేవని, దాని విదేశీ సంస్థల చెల్లింపులపై కట్టాల్సిన పన్నుల్ని ఎగవేసిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులిచ్చిన వాంగ్మూలాలు, డిజిటల్ ప్రూఫ్లు, సేకరించిన డాక్యుమెంట్ల ద్వారా ఆ గ్రూప్లో భారీగా ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలు చేసినట్టుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారని తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి ఎన్నో వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్టుగా ఐటీ సర్వేలో తేలిందని ఆ ప్రకటన వివరించింది. పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఐటీ శాఖ సర్వే సమయంలో మందకొడిగా వ్యవహరిస్తూ ప్రతీది ఆలస్యం చేసే వ్యూహాలు రచించిందని ఆరోపించింది. ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు దాదాపు 60 గంటలు ఐటీ శాఖ సర్వే నిర్వహించింది. 2002 గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బాధ్యుడిగా ఆరోపిస్తూ ‘‘ఇండియా ది మోదీ క్వశ్చన్’’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల్లోనే ఐటీ శాఖ సర్వే జరపడం చర్చనీయాంశంగా మారింది. -
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులపై స్పందించిన కేటీఆర్
-
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులు
-
ఐటీ అధికారులకూ ‘సైబర్’ స్ట్రోక్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సైబర్ నేరగాళ్లు ఎవర్నీ వదలటం లేదు. ఆదాయ పన్ను శాఖ అధికారులకు రూ.1.10 లక్షలకు టోకరా వేశారు. విశాఖపట్నానికి చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఉన్నతాధికారి పేరిట అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపాలంటూ మెసేజ్ పంపిన సైబర్ నేరగాళ్లు.. వచ్చిన గిఫ్ట్కార్డు నుంచి ఆ మొత్తాన్ని వెంటనే తమ ఖాతాలోకి జమ చేసుకున్నారు. రాజస్థాన్లోని జోథ్పూర్ నుంచి నడిపిన ఈ వ్యవహారంపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాట్సాప్ డీపీతో బోల్తా ఢిల్లీ కేంద్రంగా విధులు నిర్వర్తించే ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పంపినట్టుగా విశాఖలోని ఐటీ శాఖ అధికారికి ఇటీవల వాట్సాప్లో ఓ మెసేజ్ వచ్చింది. సదరు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఫొటో డీపీగా ఉన్న ఫోన్ నంబరు నుంచి.. అమెజాన్ గిఫ్ట్ కూపన్ల రూపంలో రూ.1.10 లక్షలను తనకు అత్యవసరంగా పంపాలని ఆ మెసేజ్లో ఉంది. ఆ మొత్తాన్ని త్వరలో తిరిగి ఇస్తానని కూడా మెసేజ్ చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న అసిస్టెంట్ కమిషనర్.. వెంటనే ఆ మొత్తాన్ని ఉన్నతాధికారికి పంపాలంటూ డిప్యూటీ కమిషనర్ను కోరారు. ఈ మేరకు సదరు అధికారి రూ.1.10 లక్షల విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ కూపన్లు కొనుగోలు చేసి ఆ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ఆ నంబర్కు పంపారు. సదరు సైబర్ నేరగాడు వెంటనే ఆ కూపన్లను రెడీమ్ చేసుకున్నారు. తాము మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు విచారణ చేపట్టారు. సమాచారం పంపిన ఫోన్ నంబరు రాజస్థాన్లోని జోథ్పూర్ ప్రాంతం నుంచి వచ్చిందని ప్రాథమికంగా తేల్చారు. ప్రత్యేక టీమ్తో విచారణ సైబర్ నేరగాళ్లు అందరినీ లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకీ ఈ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. దీనిని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇలాంటి నేరాలపై విచారణ కూడా వేగవంతం చేస్తున్నాం. విశాఖ ఆదాయ పన్ను శాఖ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. ఒక టీమ్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నాం. – శ్రీకాంత్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ -
‘ఎక్సెల్ రబ్బర్’పై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఎక్సెల్ రబ్బర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై బుధవారం ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు నిర్వహించింది. హైదరాబాద్లోని మాదాపూర్, సంగారెడ్డి జిల్లా బొల్లారం సహా ఎనిమిది ప్రాంతాల్లో, చెన్నై, బెంగళూర్, ఏపీ సహా దేశవ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. హైదరాబాద్లో బుధవారం తెల్లవారుజాము నుంచి సుమారు 12 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. సీఆర్పీఎఫ్ పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు తనిఖీలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ బ్రాంచ్ ఆఫీస్, కోకాపేట్లో ఆరుగురు డైరెక్టర్లు, సీఈఓల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా బాచుపల్లి, పాశమైలారంలోని ఎక్సెల్ రబ్బర్ యూనిట్ 5, విలాస్ పాలిమర్స్ ప్రైవేట్, ఎస్ టైర్స్ లిమిటెడ్ కంపెనీల్లో సోదాలు చేశారు. సెర్చ్ వారెంట్తో సోదాల్లో పాల్గొన్న అధికారులు రబ్బర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ కంపెనీలోకి బ్రిటన్ నుంచి రూ.500 కోట్ల పెట్టుబడులు రావడం, దానికి సంబంధించిన పన్నుల వివరాలను పొందుపర్చకపోవడం వంటి ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నట్లు సమాచారం. టాక్స్ చెల్లింపులోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గత ఐదేళ్లకు సంబంధించిన ఆదాయ వ్యయాలు, ఐటీ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్ను ఐటీ అధికారులు పరిశీలించారు. ఎక్సెల్ దాని అనుబంధ సంస్థలపై విలాస్ పాలిమార్సహా మరో రెండు కంపెనీలకు చెందిన హార్డ్ డిస్క్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలిసింది. సోదాలు గురువారం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐతే ఈ సోదాలకు సంబంధించిన వివరాలను ఐటీశాఖ అధికారులు వెల్లడించాల్సి ఉంది. -
ఆధార్తో లింకేజీ లేకుంటే పాన్కార్డు నిష్ఫలమే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 31వ తేదీనాటికి ఆధార్తో అనుసంధానంకాని పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) కార్డులు క్రియాశీలకంగా ఉండబోవని ఆదాయ పన్ను శాఖ ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొంది. ‘ఆదాయపన్ను చట్టం–1961 ప్రకారం ఎలాంటి మినహాయింపుల పరిధిలోకిరాని పాన్ కార్డు వినియోగదారులు తమ కార్డును ఆధార్తో వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆధార్తో అనుసంధానించని పాన్ కార్డులు ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి మనుగడలో ఉండవు. వాటిని ఇన్ఆపరేటివ్గా భావించాలి’ అని ఐటీ శాఖ ఆ బహిరంగ ప్రకటనలో స్పష్టంచేసింది. పాన్ కార్డు మనుగడలో లేకపోతే ఐటీ చట్టం ప్రకారం సంబంధిత కార్డు హోల్డర్ చట్టపరంగా పలు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మార్చి 30న ఒక సర్క్యులర్లో పేర్కొనడం తెల్సిందే. క్రియాశీలకంగాలేని పాన్ కార్డుతో ఐటీ రిటర్న్లు దాఖలుచేయడం వీలుకాదు. పెండింగ్లో ఉన్న రీఫండ్లు తిరిగిరావు. కట్టాల్సిన పన్నులకు మించి అధికంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. నో యువర్ కస్టమర్(కేవైసీ) తప్పనిసరి అయిన బ్యాంక్లు, ఆర్థిక సంబంధ వెబ్సైట్లలో పాన్కార్డు ఖచ్చితం చేసిన నేపథ్యంలో ఇకపై వారు వాటి ద్వారా నగదు బదిలీ, ఆర్థిక లావాదేవీలు జరపడం దాదాపు అసాధ్యం. సాధారణంగా ఐటీ శాఖకు సంబంధించిన విధానపర నిర్ణయాలను సీబీడీటీనే నిర్ణయిస్తుంది. 2017 మే నెలలో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఒక నోటిఫికేషన్లో ఆ ‘మినహాయింపు కేటగి రీ’ని పేర్కొంది. అస్సాం, జమ్మూకశ్మీర్, మేఘాల యలో ఉండేవారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఐటీ చట్టం–1961 ప్రకారం స్థానికే తరులు, 80 ఏళ్లు దాటిన వారు, భారతపౌరులు కాని వారికి ఈ మినహాయింపు ఉంది. -
త్వరగా చెల్లించు. కాదు.. కూడదు అంటే ఈడీ దాడులు చేయాల్సివస్తుంది! జాగ్రత్త!!
త్వరగా చెల్లించు. కాదు.. కూడదు అంటే ఈడీ దాడులు చేయాల్సివస్తుంది! జాగ్రత్త!! -
దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్! ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించమన్న ఐటీ శాఖ
దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ చెల్లించాలంటూ ఆ కూలీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐతే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు సైతం అతడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన బిహార్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బిహార్లోని రోహ్తాస్ జిల్లాలోని యాదవ్ అనే దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న అతడి కుటుంబం ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. తాను దినసరి కూలీనని, తన ఆస్తి మొత్తాన్ని పలుమార్లు విక్రయించిన కూడా అంత మొత్తం చెల్లించలేనని అధికారులకు తెలియజేశాడు. యాదవ్కి నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన అధికారులు సైతం అతడి స్థితిని చూసి ఆశ్చర్యపోయారు. ఐతే యాదవ్ గతంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్లలో వివిధ ప్రదేశాల్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసినట్లు అధికారులకు తెలిపాడు. ఆ తర్వాత 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా బిహార్లోని తన ఇంటికి తిరిగి వచ్చేసినట్లు తెలిపాడు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడ అధికారులు తన ఆధార్, పాన్కార్డుల కాపీలను తీసుకున్నట్లు వెల్లడించాడు. బహుశా వారే ఆదాయపు పన్ను నుంచి తప్పించుకునేందుకు ఇలా తన పేరిట నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపి ఉండవచ్చని ఐటీ అధికారులకు వివరించాడు. ఆ దినసరి కూలీ యదవ్కి ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయం నుంచే నేరుగా నోటీసులు పంపినట్లు ఐటీ అధికారి సత్యభూషణ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా, యాదవ్ సోమవారం తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో ఎక్కడికో వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. (చదవండి: షాకింగ్ ఘటన:రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు) -
10ఎఫ్ దాఖలుకు మార్చి వరకు గడువు
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ (భారత్లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్ పత్రాన్ని మాన్యువల్గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. తక్కువ టీడీఎస్ అమలు చేసేందుకు వీలుగా నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఫామ్ 10ఎఫ్ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్ నంబర్లు లేని వారు ఫామ్ 10ఎఫ్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్10 ఎఫ్ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. -
ముగిసిన మైత్రీ మూవీ మేకర్స్ ఐటీ రైడ్స్, కీలక పత్రాలు, హార్డ్డిస్క్లు స్వాధీనం
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై నిన్న(డిసెంబర్ 12న) ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), జీఎస్టీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి జరగగా రాత్రి 12 గంటలకు ఈ తనిఖీలు ముగిసినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ డైరెక్టర్స్ అయిన యలమంచిలి రవిశంకర, ఎర్నేనీ నవీన్కు సంబంధించిన ఇల్లు, కార్యాలయలపైన కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లతో పాటు పలు హార్డ్డిస్క్లను స్వాధినం చేసుకున్నట్లు సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హై బడ్జెట్ చిత్రాలకు నిర్మాణ వ్యయం, పెట్టుబడులను ఎలా సమకుర్చుతున్నారనే దానిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాదు హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్, లాభాల గురించి కూడా సంస్థ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలను ఈ సందర్భంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఇది రెగ్యులర్ చెకింగ్లో భాగంగానే సోదాలు నిర్వహించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ మీడియాతో పేర్కొన్నారు. కాగా పుష్ప, శ్రీమంతుడు, డియర్ కామ్రేడ్,సర్కారు వారి పాట, ఉప్పెన, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఈ సంస్థలోనే నిర్మించబడ్డాయి. చదవండి: నన్ను నమ్మిన మొదటి వ్యక్తి నువ్వే డార్లింగ్: ప్రభాస్పై జక్కన్న కామెంట్స్ అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటిస్తా: రణ్బీర్ కపూర్ -
‘మైత్రీ’పై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిన్నటివరకు రియల్ ఎస్టేట్ సంస్థలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో దాడులు నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ తాజాగా సినీ నిర్మాతలపై దృష్టి సారించింది. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలపై సోమవారం జీఎస్టీ అధికారులతో కలిసి దాడులకు దిగింది. ఏకకాలంలో ప్రారంభమైన సోదాలు మొత్తం 15 చోట్ల కొనసాగుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థలో యలమంచిలి రవిశంకర్, ఎర్నేనీ నవీన్ భాగస్వాములుగా ఉన్నారు. ప్రముఖ సినీ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్.. భారీ లాభాలు ఆర్జించినా ఆ మేరకు పన్నులు చెల్లించకుండా ఎగవేసిందనే అనుమానాలతో ఐటీ తనిఖీ లకు దిగినట్లు తెలిసింది. ఈ సంస్థకు చెందిన తాజా చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్నాయి. మంచి లాభాలు ఆర్జించిన పుష్ప సినిమా సీక్వెల్గా వస్తు న్న పుష్ప–2, వస్తాద్ భగత్సింగ్తో పాటు, మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నట్టు సమాచారం. ఫైనాన్షియర్ల ఇళ్లల్లోనూ.. నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఉద్యోగులు, వీరికి ఫైనాన్స్ చేస్తున్నారన్న అనుమానం ఉన్న వారి ఇళ్లల్లోనూ ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ప్రస్తుతం లైన్లో ఉన్న సినిమాల బడ్జెట్ ఆరేడు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఇందుకు అవసరమైన భారీ మొత్తం నిధులు ఏ విధంగా సమకూరాయి? ఎక్కడ నుంచి ఫైనాన్స్ తీసుకున్నారు? అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సక్రమంగానే ఉన్నాయా.? పన్నుల చెల్లింపులు ఎలా ఉన్నాయి? చిత్రాల నిర్మాణానికి ఎంతెంత ఖర్చు చేస్తున్నారు.? అందుకు సంబంధించి జీఎస్టీ చెల్లింపులు చేశారా? లేదా? అన్న అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే వారికి పారితోషికాలు ఏ విధంగా చెల్లిస్తున్నారు? పూర్తి పారదర్శకంగా ఉన్నాయా? లేదా? హవాలా లావాదేవీలు ఏమైనా ఉన్నాయా.? అన్న కోణంలోనూ కూలంకషంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ నిర్మాణ సంస్థకు వచ్చిన లాభాలకు, చెల్లించిన పన్నుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లుగా వచ్చిన సమాచారం ఆధారంగానే అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు వ్యత్యాసాలు బయటపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఐటీ శాఖ నుంచి అధికారిక సమాచారం ఏదీ విడుదల కాలేదు. తలసాని శ్రీనివాస్యాదవ్ పీఏ విచారణ కేసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతూనే ఉంది. సోమవారంమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వ్యక్తిగత సహాయకుడు అశోక్ను విచారించారు. కేసినో ఆడించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానాల్లో నేపాల్, శ్రీలంకతో పాటు గోవాలకు తీసుకెళ్లిన చీకోటి ప్రవీణ్పై ఇదివరకే కేసులు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులోనే అశోక్ను కూడా విచారణకు పిలిచారు. అయితే ఇప్పటివరకు ఈడీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. -
పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదంటే భారీ షాక్ తప్పదు! డెడ్లైన్ ఎపుడో తెలుసా?
సాక్షి, ముంబై: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్తో లింక్ చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మీరు లింక్ చేయకపోతే వెంటనే పాన్తో ఆధార్ లింక్ చేయాలి. లేని పక్షంలో ఆదాయపు పన్ను రిటర్న్ ప్రాసెస్ కావు.అంతేకాదు ప్యాన్ చెల్లుబాటుకాదు. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు వర్గం కిందకు రాని పాన్ కార్డు హోల్డర్లందరూ వచ్చే ఏడాది మార్చి కి ( 31.3.2023) లోపు తమ పాన్ను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి. తరువాత నుంచి అంట 1.4.2023 నుండి లింక్ చేయని ప్యాన్ కార్డుపనిచేయదు. కనుక ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత తొందరగా లింక్ చేసుకోవడం బెటర్. (మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే..!) పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం పలుమార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డెడ్లైన్ను 2023 మార్చి 31గా ప్రకటించింది. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో హెచ్చరికను జారీ చేసింది. పాన్ను ఆధార్ తో అనుసంధానానికి విధించిన సాధారణ గడువు ముగిసిందని, అయితే గడువు పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది. As per Income-tax Act, 1961, it is mandatory for all PAN holders, who do not fall under the exempt category, to link their PAN with Aadhaar before 31.3.2023. From 1.4.2023, the unlinked PAN shall become inoperative. The last date is approaching soon. Don’t delay, link it today! pic.twitter.com/OcvtJfewH2 — Income Tax India (@IncomeTaxIndia) December 10, 2022 (లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!) ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరులు..ఏకంగా 165 మందికి జాక్పాట్! ఎలా ? -
సాధారణ తనిఖీల్లో భాగంగానే ఐటీ అధికారులు వచ్చారు : దేవినేని అవినాష్
-
వంశీరామ్ బిల్డర్స్ పై కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
మంత్రి మల్లారెడ్డి కేసులో ఈడీకి ఐటీ అధికారుల లేక
-
అనాథాశ్రమంలో పెళ్లి బాజా.. యువతికి తాళి కట్టిన ఐటీ ఉద్యోగి
సాక్షి, హుబ్లీ: హుబ్లీ కేశ్వాపురలోని అనాథ శరణాలయంలో గురుసిద్దమ్మ అనే యువతికి అందరూ పెద్దలై పెళ్లి చేశారు. బెంగళూరులో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో ఉద్యోగం చేస్తున్న హేమంత్కుమార్ అనే వరుణ్ని వెతికి వైభవంగా మూడుముళ్ల వేడుక పూర్తి చేశారు.వివరాలు.. కేశ్వపుర సేవా భారతీ ట్రస్ట్లో తల్లీతండ్రీ లేని బాలిక గురుసిద్దమ్మను చిన్నప్పుడే ఎవరో చేర్పించారు. ఇటీవలే 18 ఏళ్లు నిండడంతో ఆశ్రమ నిర్వాహకులు పెళ్లి ప్రయత్నాలను ప్రారంభించారు. బెంగళూరులో సరస్వతి–నంజుండరావ్ అనే దంపతుల కుమారుడు హేమంత్తో ఖరారు చేశారు. అతడు మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ గురుసిద్దమ్మ కులగోత్రాలతో హోదాతో సంబంధం లేకుండా పెళ్లికి అంగీకరించడం విశేషం. ఆర్ఎస్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, గతంలో పెళ్లయి జీవితంలో స్థిరపడిన అనాథాశ్రమ యువతులు ఎంతో మంది మధ్య ఘనంగా వివాహ వేడుక జరిగింది. చదవండి: (రెండేళ్లుగా సహజీవనం.. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని..!) -
Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు?
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు మంగళవారం రెండోరోజు కూడా విచారణ కొనసాగించారు. మల్లారెడ్డి ఆడిటర్తోపాటు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునే సమయంలో ఫీజులు, డొనేషన్లను ఏ రూపంలో తీసుకుంటున్నారు? ఎంత తీసుకుంటున్నారు? ఎన్నిరకాల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన కీలక పత్రాలు, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాల ఆధారంగా ఆడిటర్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కళాశాలలకు మొత్తం ఎన్ని ఖాతాలున్నాయని, ఏ కళాశాలకు ఏయే బ్యాంకుల్లో ఖాతా లున్నాయని కూడా ప్రశ్నించారు. డొనేషన్ల రూపంలో వసూలు చేసిన వందకోట్ల నిధులను ఎక్కడ డిపాజిట్ చేశారన్న దానిపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు కట్టించుకుని తక్కువ ఫీజుకు రశీదులు ఇస్తున్నట్లు అధికారుల దృష్టికి వచి్చన నేపథ్యంలో దానిపైనా ఆరా తీశారు. చదవండి: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య -
పంచనామాపై బలవంతంగా సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీఎండీ రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసుస్టేషన్కు బదిలీ చేశారు. నా అన్నను బెదిరించారు.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు «భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్పై ఐపీసీలోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ల్యాప్టాప్, హార్డ్డ్రైవ్లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసివచి్చన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్టాప్, హార్డ్ డ్రైవ్స్తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు. ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్టాప్! ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్టాప్ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్టాప్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్కు చూపించగా.. ఆ ల్యాప్టాప్ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. వెలుగులోకి రఘురామ కృష్ణరాజు పేరు -
Hyderabad: ఈడీ, ఐటీ దాడులపై స్పందించిన మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి. బుధవారం పలు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈడీ, ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, దుబాయ్ పర్యటనకు వెళ్లిన మంత్రి గంగుల ఈడీ దాడులపై సమాచారం అందుకుని వెళ్లిన 17 గంటల్లోనే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ ఈడీ, ఐటీ దాడులపై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఇంట్లోని లాకర్లను తానే వీడియో కాల్లో ఉండి ఓపెన్ చేయించినట్లు చెప్పారు. 'ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ సోదాలు నిర్వహించారు. 31 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాం. మాపై చాలామంది చాలా సార్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు మేము ఎక్కడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తాం' అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: (మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే) -
Gangula Kamalakar: దుబాయ్ నుంచి గంగుల రిటర్న్.!
సాక్షి, హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్ హుటాహుటిన దుబాయ్ నుంచి హైదరాబాద్కు బయల్దేరుతున్నట్టు తెలిసింది. మంగళవారమే కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన మంత్రి గంగులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ టాక్స్ అధికారులు షాకిచ్చారు. తాళం వేసి ఉన్న ఆయన ఇంటి తలుపులను గ్యాస్ కట్టర్తో కట్ చేయించి మరీ లోనికి వెళ్లారు. అధికారుల సోదాల విషయం ఫోన్లో తెలుసుకున్న గంగుల హుటాహుటిన హైదరాబాద్కు టికెట్లు బుక్ చేసుకున్నట్టు తెలిసింది. కరీంనగర్ లోని గంగుల ఇంటితో పాటు మరో నాలుగు చోట్ల, అలాగే బావుపేటలోని గ్రానైట్ పరిశ్రమల కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు శ్వేతా గ్రానైట్ వ్యవహారాలు చూసుకుంటున్న మంత్రి గంగుల సోదరుడు గంగుల వెంకన్న ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: (మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు) ('గంగుల ఇంటిపై ఈడీ దాడులు: మంత్రి రూ.749 కోట్ల పెనాల్టీ కట్టాలి') -
మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇన్కమ్టాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ఫిర్యాదు చేసింది తానేనని బీజేపీ లాయర్ మహేందర్రెడ్డి చెప్పారు. గతంలో బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం జిల్లా కోర్టులో లాయర్గా పనిచేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ దాడులపై మహేందర్ రెడ్డి స్పందిస్తూ.. 'మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయని నేనే ఫిర్యాదు చేశా. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి 2020లో కంప్లైంట్ ఇచ్చాను. 2021లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని షిప్పింగ్ కార్పోరేషన్ చెన్నైని ఈడీ సూచించింది. పది రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని సూచించినా.. ఇంతవరకు ఇవ్వలేదు. మీడియా ద్వారా ఈడీ దర్యాప్తు జరుగుతోందని తెలిసింది. దాదాపు రూ.749 కోట్ల పెనాల్టీ (వడ్డీతో కలిపి) మైనింగ్ చేస్తున్న వారు కట్టాల్సి ఉంది' అని తెలిపారు. చదవండి: (మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు) -
జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లలో... ఐటీ శాఖ సోదాలు
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కుమార్ జైమంగళ్, ప్రదీప్ యాదవ్ల నివాసాలు, కార్యాలయాల్లో అదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేసినట్లు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో భాగంగానే రాంచీ, బెర్మో, పట్నాలో ఈ సోదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. చైబాసాలో ముడి ఇనుప ఖనిజ వ్యాపారితోపాటు మరికొందరి ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఐటీ సోదాలపై ఎమ్మెల్యే జైమంగళ్ అలియాస్ అనూప్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ ఒత్తిళ్లతోనే ఈ సోదాలు నిర్వహించారని ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకిస్తే వేధిస్తారా? అని ప్రశ్నించారు. తనను ఎవరూ భయపెట్టలేరని అన్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే కుట్రల్లో భాగంగానే తమ ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయని జార్ఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ విమర్శించారు. అయితే, ఐటీ శాఖ ఆపరేషన్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ శాసనసభా పక్షనేత బాబూలాల్ మరాండీ తేల్చిచెప్పారు. పన్నుల ఎగవేత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐటీ శాఖపై బురద చల్లుతున్నారని జార్ఖండ్ బీజేపీ నేత ప్రతుల్ షాదియో దుయ్యబట్టారు. జార్ఖండ్లో అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్ సైతం భాగస్వామిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
మూన్లైటింగ్ ఆదాయాన్ని దాచిపెడితే: లేటెస్ట్ వార్నింగ్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లో ప్రకంపనలు రేపిన మూన్లైటింగ్పై తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగులకు అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చే అసైన్మెంట్లు లేదా ఉద్యోగాలపై ఆదాయపు పన్ను అధికారులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఆదాయంపై కూడా నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుందని మూన్లైట్ ఉద్యోగులను హెచ్చరించినట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రూ. 30 వేలు దాటితే టీడీఎస్ తాజాగా, ఈ ‘మూన్ లైటింగ్’ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ కూడా దృష్టిసారించింది. రెండో ఉద్యోగంలో సంపాదించే దానికి కూడా పన్ను చెల్లించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. పన్ను నిబంధనలు రెండో ఉద్యోగానికి కూడా వర్తిస్తాయని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గానీ, ప్రొఫెషనల్ ఉద్యోగులకు కానీ ఏ కంపెనీ అయినా ఇచ్చే వ్యక్తిగత చెల్లింపులుసహా రూ. 30 వేలు దాటితే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుందని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రిన్సిపల్ చీఫ్ ఐటీ కమిషనర్ ఆర్.రవిచంద్రన్ స్పష్టం చేశారు. (Apple సత్తా: ఆ మూడు దిగ్గజాలకు దిమ్మతిరిగింది అంతే!) మూన్లైటింగ్ ఉద్యోగులు తమ ఆదాయ పన్ను రిటర్న్లలో ఏదైనా అదనపు ఆదాయాన్ని ప్రకటించి, వర్తించే పన్ను చెల్లించాలని ఉద్యోగులను కోరారు. అలా చేయకపోతే జరిమానా లాంటి చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది. విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరించిందిఏదైనా కంపెనీ లేదా వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగం ద్వారా సంపాదించే రూ 30వేల రూపాయల లోపు ఆదాయానికి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుందని పరిమితి దాటితే టీడీఎస్ చెల్లించాలని రవిచంద్రన్ స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194C ప్రకారం కాంట్రాక్ట్ పని కోసం చేసే చెల్లింపుల నుంచి టీడీఎస్ను మినహాయించాలి. ఏదైనా సంస్థ, ట్రస్ట్ కానీ, కంపెనీ, స్థానిక యంత్రాంగం వంటివి దీని కిందికి వస్తాయి. నగదు చెల్లింపులు, చెక్, డ్రాఫ్ట్ ఎలా చెల్లించినా సరే టీడీఎస్ మినహాయింపు తప్పనిసరి. ఐటీ చట్టంలోని సెక్షన్ 194జె ప్రకారం రూ. 30 వేలు దాటిన తర్వాత 10 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించాలి. అంతేకాదు, ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపు లక్ష రూపాయలు దాటినప్పుడు కూడా టీడీఎస్ను మినహాయించాల్సి ఉంటుంది. -
ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ? అయితే ఇది మీకోసమే.. ఇదొక రాచమార్గం
దసరా, దీపావళి పండగలు వెళ్లిపోయాయి. ఇక పెద్ద ఖర్చులు ఉండవు. అయితే, పన్ను కూడా ఒక ఖర్చులాంటిదే కాబట్టి ఇక నుంచి ట్యాక్స్ ప్లానింగ్ వైపు ఒక లుక్ వేద్దాం. పన్నుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇదొక రాచమార్గం. చట్టబద్ధంగా, సగౌరవంగా, సక్రమంగా, సరైన దారిలో నడుస్తూ మనం మన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అవకాశం ఉంటే పన్ను భారమే లేకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. తప్పనిసరి అయితే సకాలంలో చెల్లించి, సకాలంలో రిటర్ను వేసి సజ్జనులమని సంబరపడొచ్చు. ట్యాక్స్ ప్లానింగ్ అవసరమా? దైనందిన జీవితంలో ముందుచూపు ఎలా ఉండాలో ట్యాక్స్ విషయంలోనూ ముందు చూపు అవసరం. దీన్నే ప్లానింగ్ అంటారు. చట్టప్రకారం ఎటువంటి తప్పులు చేయకుండా, పొరపాట్లు దొర్లకుండా, ఎటువంటి అడ్డదార్లు తొక్కకుండా, గోల్మాల్ గోవిందం గారిలాగా కాకుండా .. రాముడు మంచి బాలుడిలాగా పన్ను భారాన్ని తగ్గించుకోవడం అవసరమే. ప్రయోజనాలు ఉన్నాయా? ఎందుకు లేవు మాస్టారూ! ట్యాక్స్ ప్లానింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ►పన్ను తగ్గుతుంది. ఆ మేరకు మిగిలినట్లే. ► సరైన మొత్తం సకాలంలో చెల్లించేస్తే .. అధిక మొత్తం చెల్లించి ఆ తర్వాత రిఫండు కోసం చకోర పక్షుల్లాగా ఎదురు చూడాల్సిన బాధ తప్పుతుంది. ► తక్కువ చెల్లించి, ఆ తర్వాత విషయం తెలిసి అనవసరంగా వడ్డీలు కట్టక్కర్లేదు. పన్ను భారమే తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు వడ్డీలు చెల్లించాల్సిన అవసరమే లేదు. ► ఆలోచించి ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ఇల్లు జాయింట్ ఓనర్షిప్ అయితే ఇంటద్దెను ఆదాయంగా భావించినప్పుడు అద్దెను ఇద్దరికి విడగొట్టి ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే జాయింటు బ్యాంకు అకౌంటులోని వడ్డీలు, జాయింటుగా ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్ల మీద వడ్డీ విషయంలో కూడా ఇలా చేయొచ్చు. ► మీరు ఏ శ్లాబులో ఉన్నారో ఆ శ్లాబు దాటకుండా .. తక్కువ శ్లాబులోనే ఉండేలా ఆదాయాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు లేదా సర్దుబాటు చేసుకోవచ్చు. ►సెక్షన్ 80సిలో ఎన్నో తగ్గింపులు ఉన్నాయి. ఇందులో 20 అంశాలు ఉన్నాయి. అన్నింటికీ కలిపి పరిమితి రూ. 1,50,000. వీటిలో ఏది కంపల్సరీనో అది చేసి మిగతాది ఇతర కుటుంబ సభ్యులకు చేయవచ్చు. ► పిల్లలకు చదువుల ఫీజు విషయంలో కేవలం ఇద్దరు పిల్లలకే ఇస్తారు. ఇద్దరి ఫీజు ఒకరి ఆదాయంలో నుంచి, మిగతావారివి వేరే కుటుంబ సభ్యుల ఆదాయంలో నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ► ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ద్వారా వచ్చే వడ్డీని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ► వ్యాపారస్తులు కొన్ని ఖర్చులను అదుపులో ఉంచుకుని ఏ ఖర్చు మీద మినహాయింపు ఉందో వాటి మీదే ఖర్చు పెట్టవచ్చు. ► అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు, ఇల్లు కట్టడం లాంటి లాంగ్టర్మ్ ప్రాజెక్టులు, షార్ట్ టర్మ్లో మెడిక్లెయిమ్, డొనేషన్లు వంటివి పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. -
వాట్సాప్ సేవల అంతరాయంపై రంగంలోకి ఐటీశాఖ
-
దీపావళికి గిఫ్ట్స్, బోనస్లు వచ్చాయా? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?
సాక్షి,ముంబై: దీపావళి పర్వదినం సందర్భంగా ఎవరినుంచైనా గిఫ్ట్స్ తీసుకున్నారా? లేదంటే మీరు పని చేస్తున్న కంపెనీ నుంచి బోనస్ స్వీకరించారా? అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బహుమతులు వాటి స్వభావాన్ని బట్టి ఈ పన్ను వివిధ వర్గాలుగా వర్గీకరించారు. ఈ నేపథ్యంలో పండుగ బహుమతులు, బోనస్పై ఎంత ట్యాక్స్ చెల్లించాలో ఒక సారి చూద్దాం. పండుగ సీజన్ వచ్చిందంటే గిఫ్ట్స్, సాలరీ బోనస్ ఇవన్నీ సర్వ సాధారణం. ఉద్యోగులందుకునే బోనస్ను కూడా వేతనంగా భావించే ఆదాయ పన్ను శాఖ వాటిపై పన్ను విధిస్తుంది. వేతనాల ఆధారంగా చెల్లించే బోనస్కు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, కొన్ని బహుమతుల విలువను బట్టి , ఎవరి నుండి స్వీకరించారో బట్టి వాటిపై పన్ను విధించే అవకాశం ఉంది. ఈ బహుమతి మినహాయించిన కేటగిరీ కిందకు రాకపోతే, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేసేటప్పుడు దానిని కచ్చితంగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది. శ్లాబ్ రేటును బట్టి సంబంధిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా వార్షిక వేతనంతో బోనస్ కూడా కలిపి మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించాలి. ► ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో స్వీకరించే బహుమతుల మొత్తం విలువ రూ. 50,000 కంటే ఎక్కువగా ఉంటే, అది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం పన్ను వడ్డింపు ఉంటుంది. ► ఈ బహుమతులు నగదు లేదా రకమైన రూపంలో ఉండవచ్చు. అయితే, దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఇచ్చే బహుమతులకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అంటే సోదరుడు, సోదరి, తల్లిదండ్రులు జీవిత భాగస్వామి ఇచ్చే బహుమతులపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ► భూమి లేదా భవనం రూపంలో బహుమతులు వచ్చినట్లయితే, వాటిని స్థిరమైన ఆస్తిగా పరిగణిస్తారు. ఒకవేళ ఈ ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ 50వేల రూపాయలు దాటితే బహుమతిపై పన్ను విధించబడుతుంది. ► అదే సమయంలో గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్, ఆభరణాలు, పెయింటింగ్లు, డ్రాయింగ్లు, షేర్లు/సెక్యూరిటీలు వంటి బహుమతులు, ఇతర వాటితో పాటుగా, చరాస్తుల మార్కెట్ విలువ రూ. 50వేల కంటే ఎక్కువ ఉంటే పన్ను చెల్లించాల్సిందే. -
ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్లా..
న్యూఢిల్లీ: పోలీసులే క్రిమనల్స్లా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఇద్దరు డిల్లీ పోలీసులు సేల్స్ ట్యాక్స్ ఏజెంట్ని శనివారం షహదారాలోని జీటీబీ ఎనక్లేవ్ వద్ద కిడ్నాప్ చేసి తప్పుడు కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడు తన కుటుంబంతో జీటీబీ ఎనక్లేవ్ వద్ద నివశిస్తున్నాడు. అతడు ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెట్లో సేల్స్ ట్యాక్స్ ఏజేంట్గా పనిచేస్తున్నడు. అక్టోబర్ 11న రాత్రి అతను తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా... షహదారాలోని ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక తెల్లటి రంగులోని కారు తన కారుని ఓవర్టెక్ చేసుకుని ముందుకు వచ్చి ఆగింది. ఆ కారులోంచి ముగ్గురు వ్యక్తులు దిగి సదరు ట్యాక్స్ ఏజెంట్ని చితకబాది, బలవంతంగా అతని కారులోని వెనుకసీటులో కూర్చొబెట్టారు. బాధితుడితో ఆ వ్యక్తులు తాము క్రైం బ్రాంచ్కి చెందిన వ్యక్తులమని చెప్పారు. ఒక వ్యక్తి తుపాకిని గుండెకి గురిపెట్టి బాధితుడి జేబులో ఉన్న రూ. 35 వేలు తీసుకున్నాడు. మరో వ్యక్తి సుమారు రూ. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లోపెడతామంటూ బెదిరించారు. ఆ తర్వాత అతనిని షహదారాలోని స్పెషల్ స్టాఫ్ ఆఫీస్కి తీసుకువెళ్లారు. నిందితులు అక్కడ ఒక ఆఫీసర్తో మాట్లాడి తదనంతరం అతడిని మళ్లీ కారు వెనుక కూర్చొబెట్టి బాధితుడి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ నిందితులు అతడ వద్ద నుంచి సుమారు రూ. 50 వేలు తీసుకున్నారని, పైగా అతను తన స్నేహితుడి నుంచి దాదాపు రూ. 70 వేలు అప్పుగా తీసుకుని నిందితుడు గౌరవ్ అలియాస్ అన్నా భార్య అకౌంట్కి ట్రాన్సఫర్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత తనను విడుదల చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు బాధితుడు పిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు విచారణలో... ఢిల్లీలోని సీమపురీ పోలీస్స్టేషన్కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు సందీప్, రాబిన్ తోపాటు మరోవ్యక్తి వహీద్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అలాగే ఈ కేసుకి సంబంధించి మరో ఇద్దరు నిందితులు ఢిల్లీ పోలీసు అమిత్, సీమపురికి చెందిన గౌరవ్ అలియాస్ అన్నా అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఐతే విచారణలో.. కానిస్టేబుల్ అమిత్ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. నిందితుడు వహిద్ కారుని ఉపయోగించి ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పారు. గౌరవ్ కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఓ సబ్ఇన్స్పెక్టర్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బాధితుడి నుంచి సుమారు రూ.1.5 లక్షలు తీసుకున్నట్లు తేలింది. (చదవండి: ఇదేం విడ్డూరం...పెంపుడు కుక్కే యజమానులపై ఘోరంగా దాడి...) -
రెండోరోజూ ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం ఆర్ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్స్తోపాటు లాట్ మొబైల్స్, బిగ్సీ సంస్థల్లో ప్రారంభించిన సోదాలు శనివారం కూడా కొనసాగించారు. ఈ సంస్థల యజమానులు పెద్దఎత్తున నిధులను రియల్ ఎస్టేట్ సంస్థలోకి మళ్లించినట్లు ఐటీ అధికారుల దాడుల్లో బయటపడ్డట్లు సమాచారం. దాడుల గురించి ఐటీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకున్నా రెండోరోజు కూడా ఈ సోదాలు కొనసాగించారు. ఇక్కడ నుంచి వచ్చిన లాభాలను హానర్ రియల్ ఎస్టేట్ సంస్థలోకి నిధులు మళ్లించినట్లు చెబుతున్నారు. ఆదాయానికి సంబంధించి పన్నులు చెల్లించకుండా తప్పించుకోవడానికి ఈ విధంగా ఒకదానిలో నుంచి మరో సంస్థకు నిధులు మళ్లించినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల సమయంలో పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకోవడమేకాక నిధుల మళ్లింపుపై అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. -
హైదరాబాద్లో ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్/సనత్నగర్: రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాల పరంపర కొనసాగుతోంది. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు వరుసగా రియల్ ఎస్టేట్ సంస్థలపైనా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనూ దాడులు జరుపు తూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రెండు వస్త్ర దుకాణాలతోపాటు సెల్ఫోన్ విక్రయ సంస్థలపైనా ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపింది. ఐటీ అధికారులు డజ నుకు పైగా బృందాలుగా విడిపోయి ఏక కాలంలో సోదాలు చేశారు. ఈసారి కేంద్ర బలగాల బలగాల పహారాలో దాడులు నిర్వ హించడం గమనార్హం. అమీర్పేట, కూకట్ పల్లి, దిల్సుక్నగర్తోపాటు పలు ప్రాంతాల్లో ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ఇండియా షాపింగ్మాల్స్పైనా.. ఈ సంస్థలకు అనుబంధంగా ఉన్న లాట్ మొబైల్స్, బిగ్ సీ దుకాణాలపైనా దాడులు చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున డాక్యుమెంట్స్, కంప్యూటర్ హార్డ్డిస్క్లు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసు కున్నట్లు సమాచారం. ఉదయం నుంచి ఈ మాల్స్లోకి వినియోగదారులను రానీయకుండా సోదాలు నిర్వహించారు. హానర్లో పెట్టుబడులు పెట్టినందుకేనా... ఆర్ఎస్ బ్రదర్స్ ఈమధ్య పెద్దఎత్తున రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దాడులకు దిగినట్లు తెలిసింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో హానర్ రిచ్మండ్ పేరుతో చేపట్టిన భారీ ప్రాజెక్టులో ఈ వస్త్ర దుకా ణాలు, మొబైల్ విక్రయాల సంస్థల యజ మానులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హానర్ గ్రూపు 28.4 ఎకరాల్లో 142 ప్లాట్లలో విల్లాల నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్సీకి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హానర్ గ్రూపు జూబ్లీహిల్స్, గచ్చి బౌలి, హైటెక్సిటీ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టింది.