26 నిమిషాల్లో 200 బైక్‌ల విక్రయం | Royal Enfield is credited with dispatch riders | Sakshi
Sakshi News home page

26 నిమిషాల్లో 200 బైక్‌ల విక్రయం

Jul 16 2015 12:15 AM | Updated on Sep 3 2017 5:33 AM

రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘డిస్పాచ్ రైడర్స్’ లిమిటెడ్ ఎడిషన్ 200 బైక్‌లు 26 నిమిషాల్లో అమ్ముడయ్యాయి...

రాయల్ ఎన్‌ఫీల్డ్ డిస్పాచ్ రైడర్స్ ఘనత
న్యూఢిల్లీ:
రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘డిస్పాచ్ రైడర్స్’ లిమిటెడ్ ఎడిషన్ 200 బైక్‌లు 26 నిమిషాల్లో అమ్ముడయ్యాయి. మేలో ఆవిష్కరించిన ఈ డిస్పాచ్ రైడర్స్ బైక్‌లను ఆన్‌లైన్‌లోనే విక్రయానికి పెట్టామని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ చెప్పారు. ఈ బైక్‌ల ధర రూ.2.16 లక్షల(ఆన్ రోడ్, ఢిల్లీ)ని పేర్కొన్నారు. ఐషర్ గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం బుల్లెట్, థండర్‌బర్డ్, క్లాసిక్, కాంటినెంటల్ జీటీ బైక్‌లను విక్రయిస్తోంది.
 
హీరో టూవీలర్ విక్రయాలు @ 66 లక్షలు
జంషెడ్పూర్:
గత ఆర్థిక సంవత్సరంలో 66 లక్షల టూవీలర్లను విక్రయించామని హీరో మోటొకార్ప్ బుధవారం తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం అమ్మకాలతో పోల్చితే ఆరు శాతం వృద్ధి సాధించామని కంపెనీ సీనియర్ ఏరియా మేనేజర్(సేల్స్), జార్ఖండ్ విక్రమ్ కులకర్ణి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement