టోకు ధరల మంట  | WPI inflation rises to 5.28% in October | Sakshi
Sakshi News home page

టోకు ధరల మంట 

Published Thu, Nov 15 2018 1:00 AM | Last Updated on Thu, Nov 15 2018 1:00 AM

 WPI inflation rises to 5.28% in October - Sakshi

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5.28 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 అక్టోబర్‌తో పోల్చితే 2018 అక్టోబర్‌లో టోకున ధరలు 5.28 శాతం పెరిగాయన్నమాట. టోకు ధరలు ఈ స్థాయిలో నమోదుకావడం వరుసగా ఇది నాల్గవనెల. 2017 సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 5.13 శాతంకాగా, గత ఏడాది అక్టోబర్‌లో  3.68 శాతంగా ఉంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాలను చూస్తే.... 

►టోకున ఆహార ఉత్పత్తుల ధరలు అక్టోబర్‌లో అసలు పెరక్కపోగా 1.49 శాతం తగ్గాయి. కూరగాయల ధరలు 18.65 శాతం తగ్గాయి. సెప్టెంబర్‌ నెలలో ఈ తగ్గుదల 3.83 శాతం. అయితే ఆలూ ధరలు భారీగా 93.65 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 31.69 శాతం తగ్గగా, పప్పు దినుసుల ధరలూ 13.92 శాతం తగ్గాయి.  

►ఇంధనం, విద్యుత్‌ బాస్కెట్‌లో ధరల పెరుగుదల రేటు 18.44 శాతంగా ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్‌ ధరలు వరుసగా 19.85 శాతం, 23.91 శాతం చొప్పున పెరిగాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement