WPI
-
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2023–24 ఆర్థిక సంవత్సరంలో (2022–23తో పోల్చి) 5.8 శాతం పురోగమించింది. మార్చిలో 4.9 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరి (5.6 శాతం) కన్నా మార్చితో స్పీడ్ తగ్గినప్పటికీ, 2023 మార్చి కన్నా (1.9 శాతం) పురోగమించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే వృద్ధి స్వల్పంగా 5.2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70 శాతం. రంగాల వారీగా..(శాతాల్లో) విభాగం 2024 2023 మార్చి మార్చి తయారీ 5.2 1.5 మైనింగ్ 1.2 6.8 విద్యుత్ ఉత్పత్తి 8.6 – 1.6 క్యాపిటల్ గూడ్స్ 6.1 10 కన్జూమర్ డ్యూరబుల్స్ 9.5 – 8.0 కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 4.9 –1.9 ఇన్ఫ్రా/నిర్మాణం 6.9 7.2 ప్రైమరీ గూడ్స్ 2.5 3.3 ఇంటరీ్మడియట్ గూడ్స్ 5.1 1.8 -
టోకు ధరలు కూల్.. కూల్!
న్యూఢిల్లీ: దేశ ఎకానమీకి ధరల తగ్గుదల ఊరటనిస్తోంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంకెల దిగువ బాటలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా నడిచాయి. డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం కేవలం 4.95 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 22 నెలల కాలంలో (2021 ఫిబ్రవరిలో 4.83 శాతం) ఇంత తక్కువ స్థాయి గణాంకాల నమోదు ఇదే తొలిసారి. ఫుడ్ ఆర్టికల్స్ ప్రత్యేకించి కూరగాయలు, ఆయిల్సీడ్స్ ధరలు తగ్గడం మొత్తం టోకు ద్రవ్యోల్బణం గణాంకల తగ్గుదలకు కారణం. 2022 సెప్టెంబర్ వరకు వరుసగా 18 నెలలు టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైన కొనసాగింది. అక్టోబర్ నుంచి గడచిన మూడు నెలల్లో రెండంకెల దిగువకు చేరింది. డిసెంబర్లో ఫుడ్ బాస్కెట్ ధర తగ్గడం మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. నవంబర్లో 5.88 శాతంగా నమోదుకాగా, డిసెంబర్లో మరింత తగ్గి 5.72%కి (2021 డిసెంబర్తో పోల్చి) చేరడం ఎకానమీకి ఊరటనిచ్చింది. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
చుక్కలు చూపిస్తున్న హోల్ సేల్ ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో 11.39 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే ఈ బాస్కెట్ ఉత్పత్తుల ధర 11.39 శాతం పెరిగిందన్నమాట. సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ధరలుసహా అన్ని విభాగాల్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఒక్క ఆహార ఉత్పత్తుల విభాగం మాత్రం ఊరటనిస్తోంది. వరుసగా ఐదు నెలల నుంచీ టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో కొనసాగుతోంది. ముఖ్య విభాగాలు ఇలా... ♦ఆహార ఉత్పత్తుల ధరలు వరుసగా నాల్గవ నెలా తగ్గాయి. ఆగస్టులో అసలు పెరక్కపోగా 1.29 శాతం దిగివచ్చాయి. అయితే ఉల్లి (62.78 శాతం), పప్పు దినుసుల (9.41 శాతం) ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కూరగాయల ధరలు 13.30 శాతం తగ్గాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీ రేటు రెపోకు (ప్రస్తుతం 4 శాతం) ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో పూర్తి అదుపులోకి (5.3 శాతం) వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం ఈ శ్రేణి 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. ♦క్రూడ్, పెట్రోలియం, సహజవాయువుల ధరలు 40.03 శాతం ఎగశాయి. ఫ్యూయల్, పవర్ విషయంలో ద్రవ్యోల్బణం 26.1 శాతంగా ఉంది. ఎల్పీజీ (48.1 శాతం), పెట్రోల్ (61.5 శాతం), డీజిల్ (50.7 శాతం) ధరలు భారీగా ఎగశాయి. ♦తయారీ ఉత్పత్తుల ధరలు 11.39% పెరిగాయి. జూలైలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 11.20%గా ఉంది. వరుసగా నాలుగు నెలల నుంచీ తయారీలో ధరల స్పీడ్ రెండు అంకెలపైన కొనసాగుతోంది. -
హోల్సేల్ మార్కెట్ కుదేలు
న్యూఢిల్లీ: దేశం మొత్తం లాక్డౌన్లో ఉండడం, కొన్ని ఆహార ఉత్పత్తులు మినహా దాదాపు అన్ని విభాగాల్లో అసలు వినియోగ డిమాండ్ లేకపోవడం వంటి అంశాలతో మేలో హోల్సేల్ మార్కెట్ క్షీణతలోకి జారింది. ఇందుకు సంబంధించిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 3.21% క్షీణించింది (2019 మే నెలలో ఈ బాస్కెట్ ధర మొత్తంతో పోల్చి). దీన్ని ప్రతి ద్రవ్యోల్బణం అంటారు. వ్యవస్థలో అసలు వినియోగ డిమాండ్లేని పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. నాలుగున్నర సంవత్సరాల్లో ఇలాంటి స్థితి ఆర్థిక వ్యవస్థలో ఎన్నడూ నెలకొనలేదు. సూచీలోని మూడు ప్రధాన విభాగాలకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాలను చూస్తే.. ► ప్రైమరీ ఆర్టికల్స్: ఆహార, ఆహారేతర విభాగాలతో కూడిన ఈ సెక్టార్లో –2.92 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. అయితే ఇందులో 1.13% ఆహార ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆహారేతర విభాగం విషయంలో మా త్రం మైనస్ 3.53% ప్రతి ద్రవ్యోల్బణం ఉంది. ► ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ విభాగంలో ఏకంగా ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 19.83%గా ఉంది. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న ఈ తయారీ రంగంలో మైనస్ 0.42 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే... మొత్తం సూచీలో 1.13% ద్రవ్యోల్బణం నమోదయితే, పప్పు దినుసుల ధరలు 11.91% (2019 మేతో పోల్చి) ఎగశాయి. ఆలూ ధరలు 52.25 శాతం ఎగశాయి. అయితే కూరగాయలు మొత్తంగా ధరల రేటు మైనస్12.48% తగ్గింది. -
ఉల్లి, ఆలూ ధరలు ప్రియం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి గణాంకాలు ఒకవైపు ఆహార ధరల తీవ్రతను, మరోవైపు కీలక తయారీ రంగంలో మందగమనాన్ని సూచించాయి. 2020 జనవరిలో సూచీ రేటు మొత్తంగా 3.1 శాతంగా నమోదయితే, ఒక్క తయారీ రంగంలో ధరల పెరుగుదల రేటు 0.34 శాతంగా ఉంది. కాగా 2019 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.76 శాతం. ఇక 2019 ఏప్రిల్లో 3.18 శాతం టోకు ద్రవ్యోల్బణం నమోదయిన తర్వాత, మళ్లీ ఆ స్థాయి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. శుక్రవారం విడుదలైన ఈ గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 10.01 శాతంగా ఉంది. అంటే 2019 జనవరితో (అప్పట్లో 3 శాతం) పోల్చితే ఈ బాస్కెట్ మొత్తం ధర 10.01 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇందులో ఒకటైన ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధర 2.41 శాతం (2019 జనవరిలో) నుంచి 11.51 శాతానికి పెరిగింది. సామాన్యునిపై నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని ఈ రేటు సూచిస్తోంది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 2.32% నుంచి 7.05 శాతానికి ఎగసింది. ♦ ఫ్యూయల్ అండ్ పవర్: మొత్తం సూచీలో దాదాపు 13 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 1.85 శాతం నుంచి 3.42 శాతానికి పెరిగింది. ♦ తయారీ ఉత్పత్తులు: ఐఐపీలో దాదాపు 64 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగ ఉత్పత్తుల్లో ద్రవ్యోల్బణం రేటు 2.79 శాతం నుంచి 0.34 శాతానికి దిగింది. ఆర్థిక వ్యవస్థలో మందగమన ధోరణిని సూచిస్తున్న అంశమిది. కూరగాయల ధరలు 53 శాతం అప్... కూరగాయల ధరలు భారీగా 52.72 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 293 శాతం ఎగశాయి. ఆలూ ధరలు 87.84 శాతం ఎగశాయి. ఈ వారం మొదట్లో వెలువడిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణ 6 సంవత్సరాల గరిష్టస్థాయిలో 7.59 శాతంగా నమోదవడం తెలిసిందే. -
టోకు ద్రవ్యోల్బణానికి ఉల్లి సెగ
న్యూఢిల్లీ: ఉల్లి, బంగాళదుంప తదితర కూరగాయల ధరలు భారీగా పెరగడంతో డిసెంబర్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసింది. 2.59 శాతంగా నమోదైంది. నవంబర్లో ఇది 0.58 శాతంగా ఉండగా, 2018 డిసెంబర్లో 3.46 శాతంగా నమోదైంది. 2019 ఏప్రిల్లో 3.24 శాతం తర్వాత మళ్లీ ఆ స్థాయి నమోదు కావడం డిసెంబర్లోనే కావడం గమనార్హం. డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం అయిదున్నరేళ్ల గరిష్టమైన 7.35 శాతంగా ఉన్న నేపథ్యంలో తాజాగా డబ్ల్యూపీఐ కూడా ఎగియడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక సలహాదారు కార్యాలయం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. ఆహారపదార్థాల విభాగంలో కూరగాయల ధరలు అత్యధికంగా 69.69 శాతం ఎగిశాయి. ఉల్లి, బంగాళదుంప రేట్లే ఇందుకు కారణం. ఉల్లి రేటు 456 శాతం పెరగ్గా, బంగాళదుంప ధర 45 శాతం పెరిగింది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని ఇటీవలి దాకా ఉల్లి రేటు చాలా ప్రాంతాల్లో రూ. 100 పైగా పలికిన సంగతి తెలిసిందే. తాజాగా దిగుమతులతో పాటు కొత్త పంట కూడా చేతికి రావడంతో క్రమంగా ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆహార పదార్థాల ధరల పెరుగుదల నవంబర్లో 11 శాతంగా ఉండగా, డిసెంబర్లో 13.12 శాతంగా ఉంది. ఆహారేతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం నవంబర్లో నమోదైన 1.93 శాతంతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు పెరిగి 7.72 శాతంగా నమోదయ్యాయి. -
అన్నీ మంచి శకునాలే..!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారిన రెండు కీలక అంశాలకు సంబంధించి గతవారంలో ఒకేసారి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా–చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదరడం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేందుకు మార్గం సుగమం కావడం వంటి అనుకూల అంశాలతో గత వారాంతాన దేశీ స్టాక్ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తుల విషయంలో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. వాణిజ్య, ఆర్థిక అంశాల పరంగా మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఈ సానుకూల అంశం నేపథ్యంలో దేశీ మార్కెట్ మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. ట్రేడ్ డీల్ ఒక కొలిక్కి రావడం, బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం వంటి మార్కెట్ ప్రభావిత అంశాలు బుల్స్కు అనుకూలంగా ఉన్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ తెలిపారు. నిఫ్టీకి 12,200 – 12,250 స్థాయిలో ప్రధాన నిరోధం ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఇక తాజా పరిణామాలు మార్కెట్కు సానుకూలంగా ఉన్నందున ర్యాలీకి ఆస్కారం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈవారంలోనే.. పరోక్ష పన్నుల విధానంలో ఆదాయాన్ని పెంచేందుకు ఈవారంలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం కానుంది. బుధవారం జరిగే 38వ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాల నష్టపరిహారం అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మినహాయింపు అంశాలపై సమీక్ష, రేట్లలో మార్పులు ఉండేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. వీటికి ప్రభావితం అయ్యే రంగాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఆర్బీఐ మినిట్స్ వెల్లడి..: ఈ నెల మొదటి వారంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశ మినిట్స్ను ఆర్బీఐ బుధవారం విడుదల చేయనుంది. ఇక నవంబర్ నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సోమవారం వెల్లడికానుంది. -
టోకు ధరలు దిగొచ్చాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో కేవలం 1.08 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూలైతో పోల్చితే 2019 జూలైలో సూచీలోని వస్తువుల బాస్కెట్ మొత్తం ధర కేవలం 1.08 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 25 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో (2017జూన్లో 0.9 శాతం) టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార వస్తువుల ధరలు అదుపులోఉండడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది జూన్లో టోకు ద్రవ్యోల్బణం 5.27 శాతం అయితే, ఈ ఏడాది జూన్లో ఈ రేటు 2.02 శాతంగా ఉంది. -
టోకు ధరలూ దిగి వచ్చాయ్!
న్యూఢిల్లీ: రిటైల్ ధరల తరహాలోనే టోకు ధరల స్పీడ్ కూడా జనవరిలో తగ్గింది. గురువారం కేంద్రం విడుదల చేసిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.76 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో (ఆ నెల్లో 3.02 శాతం) పోలిస్తే టోకు వస్తువుల బాస్కెట్ ధర 2019 జనవరిలో కేవలం 2.76 శాతమే పెరిగింది. పది నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఇప్పటికే విడుదలైన గణాంకాల ప్రకారం, జనవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్ట స్థాయిని నమోదుచేసి, కేవలం 2.05 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజా గణాంకాలను విశ్లేషిస్తే ఆహారం, ఇంధనం, విద్యుత్ రంగాల్లో ధరల స్పీడ్ తగ్గడం మొత్తం సూచీపై ప్రభావం చూపింది. ముఖ్యాంశాలు చూస్తే... ∙ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 2.96 శాతం (2018 జనవరి) నుంచి 2.61 శాతానికి తగ్గింది. ఫుడ్ ఆర్టికల్స్లో రేటు 4.73 శాతం నుంచి 1.85 శాతానికి తగ్గింది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్లో మాత్రం జనవరి 2019లో ధరల పెరుగుదల రేటు 4.06 శాతంగా ఉంది. 2018 జనవరిలో – 1.31 శాతంగా ఉంది. కాగా డిసెంబర్లో టోకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8.38 శాతంగా ఉంది. ∙ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ రంగంలో రేటు 3.15 శాతం నుంచి 2.34 శాతానికి తగ్గింది. ∙తయారీ: సూచీలో దాదాపు 60 శాతంగా ఉన్న ఈ విభాగంలో మాత్రం ద్రవ్యోల్బణం 2.53 శాతం నుంచి 3.54 శాతానికి పెరిగింది. -
టోకు ధరల మంట
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 5.28 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 అక్టోబర్తో పోల్చితే 2018 అక్టోబర్లో టోకున ధరలు 5.28 శాతం పెరిగాయన్నమాట. టోకు ధరలు ఈ స్థాయిలో నమోదుకావడం వరుసగా ఇది నాల్గవనెల. 2017 సెప్టెంబర్లో టోకు ద్రవ్యోల్బణం 5.13 శాతంకాగా, గత ఏడాది అక్టోబర్లో 3.68 శాతంగా ఉంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాలను చూస్తే.... ►టోకున ఆహార ఉత్పత్తుల ధరలు అక్టోబర్లో అసలు పెరక్కపోగా 1.49 శాతం తగ్గాయి. కూరగాయల ధరలు 18.65 శాతం తగ్గాయి. సెప్టెంబర్ నెలలో ఈ తగ్గుదల 3.83 శాతం. అయితే ఆలూ ధరలు భారీగా 93.65 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 31.69 శాతం తగ్గగా, పప్పు దినుసుల ధరలూ 13.92 శాతం తగ్గాయి. ►ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ధరల పెరుగుదల రేటు 18.44 శాతంగా ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 19.85 శాతం, 23.91 శాతం చొప్పున పెరిగాయి. -
టోకు ధరలూ దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణంతోపాటు ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణమూ ఊరట నిచ్చింది. ఈ రేటు ఫిబ్రవరిలో 2.48 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 ఫిబ్రవరితో పోల్చితే 2018 ఫిబ్రవరిలో టోకు వస్తువుల బాస్కెట్ ధర 2.48 శాతమే పెరిగిందన్నమాట. (2017లో టోకు ద్రవ్యోల్బణం 5.51 శాతం) ఏడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. కూరగాయలుసహా ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ ధరలు ఫిబ్రవరిలో తగ్గడం సానుకూలం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.44 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టోకు ద్రవ్యోల్బణ సూచీలో ప్రధాన మూడు విభాగాలనూ చూస్తే... ►ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.01 శాతం నుంచి 0.79 శాతానికి తగ్గింది. ►ఇందులో ఫుడ్ ఆర్టికల్స్ రేటు 2.55 శాతం నుంచి 0.88 శాతానికి తగ్గింది. జనవరిలో ఈ రేటు 3 శాతంగా ఉంది. ఒక్క కూరగాయలు ధరలు చూస్తే, జనవరిలో ధరల పెరుగుదల రేటు 40.77 శాతం ఉంటే, ఫిబ్రవరిలో ఈ రేటు 15.26 శాతానికి పడింది. పప్పు దినుసుల ధరలు పెరక్కపోగా 24.51 శాతం తగ్గాయి. ►ఇక నాన్–ఫుడ్ ఆర్టికల్స్ రేటు అసలు పెరక్కపోగా –2.66 శాతం తగ్గింది. 2017 ఫిబ్రవరిలో ఈ రేటు 4.65 శాతం. ►ఫ్యూయెల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం రేటు 25.17 శాతం నుంచి 3.81 శాతానికి తగ్గింది. ► తయారీ: ఈ విభాగంలో రేటు 3.23 శాతం నుంచి 3.04 శాతానికి తగ్గింది. -
జనవరిలో టోకు ధరల ఉపశమనం!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 జనవరిలో 2.84 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 జనవరితో పోల్చితే 2018 జనవరిలో టోకు ధరలు 2.84 శాతం పెరిగాయన్నమాట. గడచిన ఆరు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే కూరగాయల ధరలు మాత్రం టోకున సామాన్యునికి భారంగానే ఉన్నాయి. కాగా 2017 డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం 3.58 శాతం అయితే, జనవరిలో ఈ రేటు 4.26 శాతంగా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మూడు ప్రధాన విభాగాలూ వేర్వేరుగా... ♦ ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 2.37 శాతంగా ఉంది. ఇందులో ఫుడ్ ఆర్టికల్స్కు సంబంధించి ఈ రేటు 3 శాతంగా ఉంటే, నాన్–ఫుడ్ ఆర్టికల్స్లో మాత్రం ధరలు అసలు పెరక్కపోగా –1.23 శాతం తగ్గాయి. ♦ ఫ్యూయెల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 4.08 శాతంగా ఉంది. ♦ తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం ఉన్న ఈ విభాగంలో రేటు 2.78 శాతంగా ఉంది. ఉల్లి ధర... కన్నీరు! డిసెంబర్ 2017లో 4.72 శాతంగా ఉన్న ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు జనవరిలో 3 శాతానికి తగ్గింది. కూరగాయల ధరలు 56.46 శాతం (డిసెంబర్) నుంచి 40.77 శాతానికి తగ్గినా, ఇదీ సామాన్యునికి భారంగానే ఉంటుందన్నది గమనార్హం. ఇక ఉల్లి ధర జనవరిలో ఏకంగా 194 శాతం పెరిగింది. పప్పు దినుసుల ధరలు 30.43 శాతం తగ్గాయి. గోధుమల ధరలు 6.94 శాతం తగ్గగా, తృణ ధాన్యాల ధరలు 1.98 శాతం తగ్గాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 0.37 శాతం తగ్గితే, పండ్ల ధరలు 8 శాతం పైగా పెరిగాయి. ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వం విడుదల చేసిన జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. -
ఆందోళనకరంగా టోకు ధరల సూచి
సాక్షి, ముంబై: ఆగస్ట్ నెల ద్రవ్యోల్బణం మరోసారి ఆందోళనకరస్థాయిలో రికార్డయింది. గురువారం వెల్లడైన గణాంకాలు ప్రకారం ఆగస్టు నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ)3. 24 శాతం నమోదైంది. జూలైతో పోల్చితే భారీగా పెరిగి 3.24 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం, ఇంధన ఉత్పత్తుల ధరలు పెరగడంతో నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. ఆహార ద్రవ్యోల్బణం 5.75గా నమోదైంది. మరోవైపు టోకుధరల సూచి (డబ్ల్యుపీఐ) గణాంకాలు, చమురు ద్రవ్యోల్బణం.. ఆహార ద్రవ్యోల్బణం గణాంకాలు నిరుత్సాహకరంగా వెలువడటంతో బెంచ్ మార్క్ ఇండెక్స్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో లాభాలతో జోష్గా ఉన్న మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ తదితర ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 32,218 దగ్గర ఉండగా.. నిఫ్టీ 3పాయింట్ల నష్టంతో 10076 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడవుతోంది. -
టమాటా దెబ్బ: డబ్ల్యుపీఐ 1.88శాతం
న్యూఢిల్లీ: జూలై నెలకు సంబంధించి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) ఆందోళనకరంగా నమోదైంది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఇది 1.88శాతంగా నిలిచింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2011-12 సంవత్సరానికి సవరించిన బేస్ ఇయర్తో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) జులై 2017 నాటికి 0.88 శాతం నుంచి 1.88 శాతానికి పెరిగింది.ఆహార ధరలు బాగా ప్రియంకావడంతో టోకు ధరల సూచీ కూడా భారీగా పెరిగింది. జూన్ నెలలో ఇది. 0.9శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 2.15 శాతానికి ఎగిసింది. గత నెలలో-3.4 శాతంగా ఉంది. ఫుడ్ ఇండెక్స్ మంత్ ఆన్మంత్ 6.2 శాతానికి ఎగిసింది. ఆ హారేతర వస్తువుల ద్రవ్బోల్బణం-6.32శాతంగా. గత నెలలో ఇది 5.15 శాతం. కూరగాయల ద్రవ్యోల్బణం భారీగా ఎగిసింది. 21.95 శాతంతో ఆందోళనకర నెంబర్స్ను రికార్డ్ చేసింది. గత నెల ఇది 21.16 శాతంగా నమోదైంది. ప్రధానంగా టమాటా ధరలు దీన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టుల అంచనా. ఫ్యూయల్ అండ్ పవర్ 4.37 శాతంగా నిలిచింది. ఫుడ్ ఇండెక్స్ ఆధారంగా ప్రైమరీ ఆర్టికల్ గ్రూపు , ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణ రేటు జూలై నెలలో 1.25 శాతం నుంచి 2.12 శాతానికి పెరిగింది. దీంతో వచ్చే ఆర్బీఐ రివ్యూలో వడ్డీ రేట్లకోత తప్పదనే అంచనాలను మార్కెట్ వర్గాలు వ్యక్తం చేశాయి. -
తగ్గిన డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం
♦ జూన్లో 0.90 శాతానికి డౌన్ ♦ ఇది ఎనిమిది నెలల కనిష్టం న్యూఢిల్లీ: కూరగాయలు సహా ఇతర ఆహారపదార్థాల రేట్ల తగ్గుదలతో జూన్లో టోకు ధరల ద్రవ్యోల్బణం 0.90 శాతానికి క్షీణించింది. బేస్ ఇయర్ను 2011–12కి మార్చిన తర్వాత నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇది 8 నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2016 నవంబర్లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 1.82 శాతంగా నమోదైంది. ఇది ఈ ఏడాది మే లో 2.17 శాతంగాను, గతేడాది జూన్లో మైనస్ 0.09 శాతంగానూ నమోదైంది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రికార్డు కనిష్ట స్థాయి 1.54 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గుదలతో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం .. ♦ ఆహారపదార్థాల ధరలు వార్షిక ప్రాతిపదికన 3.47 శాతం క్షీణించాయి. కూరగాయల ధరల ద్రవ్యోల్బ ణం మైనస్ 21.16 శాతంగా నమోదైంది. ♦ బంగాళదుంప రేట్లు గణనీయంగా 47.32 శాతం మేర క్షీణించాయి. పప్పు ధాన్యాల ధరలు తర్వాత స్థాయిలో 25.47 శాతం మేర క్షీణించాయి. ఇక ఉల్లి రేట్లు 9.47 శాతం తగ్గాయి. ♦ తృణధాన్యాల ధరలు 1.93 శాతం, గుడ్లు.. మాంసం.. చేపలు మొదలైన వాటి రేట్లు 1.92 శాతం మేర పెరిగాయి. -
టోకు ధరలూ శాంతించాయ్!
♦ మే నెలలో తగ్గిన పెరుగుదల స్పీడ్ ♦ కేవలం 2.17 శాతంగా నమోదు ♦ ఐదు నెలల కనిష్టస్థాయి ♦ రేటు తగ్గింపునకు ఆర్బీఐపై ఒత్తిడి! న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణమూ మే నెలలో శాంతించింది. సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర మొత్తంగా 2.17 శాతమే (2016 ఇదే నెలతో పోల్చిచూస్తే) పెరిగింది. ఇంత తక్కువ స్థాయిలో రేటు పెరుగుదల ఐదు నెలల్లో ఇదే తొలిసారి. రెండు రోజుల క్రితం వెలువడిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా దశాబ్దపు కనిష్ట స్థాయిలో 2.18 శాతంగా నమోదయ్యింది. అయితే ఇదే సమయంలో వెలువడిన ఏప్రిల్ నెల పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు మాత్రం కేవలం 3.1 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, పారిశ్రామిక వృద్ధి కుంటుపడడం నేపథ్యంలో ఇది రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గింపునకు అవకాశమని పారిశ్రామిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా క్రితం ఏడాది ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదలలేకపోగా –0.90 శాతం క్షీణతలో ఉన్న విషయం గమనార్హం. ఫ్యూయెల్ అండ్ పవర్సహా సూచీలో అధిక వెయిటేజ్ కలిగిన తయారీ రంగాలు అప్పట్లో క్షీణతలో ఉండడం దీనికి కారణం. 2017 ఏప్రిల్లో మాత్రం టోకు సూచీ 3.85 శాతంగా ఉంది. కీలక మూడు విభాగాలూ ఇలా... ♦ ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్లో రేటు అసలు పెరక్కపోగా –1.79 శాతం క్షీణించింది. ఇందులో ఒక్క ఫుడ్ ఆర్టికల్స్ను చూస్తే 6.82 శాతం పెరుగుదల రేటు తాజా సమీక్షా నెలలో –2.27 శాతానికి జారింది. నాన్–ఫుడ్ ఆర్టికల్స్ రేటు కూడా 4.04 శాతం నుంచి – 0.91 శాతానికి క్షీణించింది. ♦ ఇక ఫ్యూయెల్ అండ్ పవర్ విభాగంలో మాత్రం –14.87 శాతం క్షీణత నుంచి 11.69 శాతానికి చేరింది. ♦ తయారీ విభాగంలో కూడా –0.63 శాతం నుంచి 2.55 శాతానికి చేరింది. ♦ సూచీలో 697 వస్తువులు ఉంటే, 117 ప్రైమరీ ఆర్టికల్స్లో ఉన్నాయి. 16 ఫ్యూయల్, పవర్ విభాగంలో 564 తయారీ విభాగంలో ఉన్నాయి. ఆహార విభాగాన్ని చూస్తే... ఫుడ్ ఆర్టికల్స్లో ద్రవ్యోల్బణం రేటు 2.27 శాతం ఉంటే, కూరగాయల ధరలు పెరక్కపోగా –18.51 శాతం క్షీణించాయి. ఆలూ ధరలు కూడా 44.36 శాతం క్షీణించాయి. ఉల్లి పాయల ధరలు 12.86 శాతం తగ్గాయి. తృణధాన్యాల ధరలు 4.15 శాతం పెరిగితే, పప్పు దినుసుల ధరలు 20 శాతం తగ్గాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 1.02 శాతం క్షీణించాయి. పండ్ల ధరలు సైతం –0.73 శాతం క్షీణించాయి. పరిశ్రమల నుంచి పెరిగిన డిమాండ్.. రిటైల్తో పాటు టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా ఆర్బీఐ లక్ష్యం (2 శాతం ప్లస్ లేదా మైనస్తో 4 శాతం) తక్కువగా ఉండడంతో పారిశ్రామిక వర్గాల నుంచి మళ్లీ రెపో రేటు కోత డిమాండ్ పెరిగింది. ఉపాధి కల్పనకు పెట్టుబడులు అవసరమని, రేటు కోతతోనే పెట్టుబడులకు ఊతం ఇవ్వగలమని పారి శ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. వృద్ధికి ఊతం ఇచ్చేలా ఆగస్టు 2 నాటి పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రేటు తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మున్ముందు కూడా మరింత తగ్గుతుందన్న అభిప్రాయాన్ని అసోచామ్, ఇక్రాలు అభిప్రాయపడ్డాయి. -
ఆహార ధరలు క్రాష్: ద్రవ్యోల్బణం మరింత కిందకి
న్యూఢిల్లీ : టోకుధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) కూడా ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఆహార ధరలు భారీగా పడిపోవడంతో మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.17 శాతంగా నమోదైంది. గత నెలలో ఈ ద్రవ్యోల్బణం 3.85 శాతంగా ఉంది. పప్పులు, తృణధాన్యాల ధరల్లో వృద్ధి కూడా చాలా తక్కువగా నమోదైందని నేడు ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) కూడా ఇటీవల రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అది కూడా 2.18 శాతానికి పడిపోయింది. ఈ రెండు సూచీలు దిగిరావడంతో ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు పెరుగుతున్నాయి. ఆగస్టులో కచ్చితంగా ఆర్బీఐ రేట్లలో కోత పెట్టవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటాలో ఆహార ధరల ముఖ్యంగా బంగాళదుంపలు, పప్పులు, ఉల్లిపాయల ధరలు వరుసగా మూడో నెలలో కూడా కిందకి పడిపోయినట్టు తెలిసింది. ఈ సూచీలో ఇవి ప్రైమరీ ఆర్టికల్స్ గా ఉంటాయి. మే నెలలో ఆహారోత్పత్తుల దరలు 2.27 శాతానికి పడిపోయాయి. కూరగాయలు ధరలు -18.51 శాతంగా నమోదయ్యాయి. బంగాళదుంపలు ధరలు కూడా 44.36 శాతం డీప్లేషన్ లో ఉన్నాయి. ఉల్లిపాయల రేట్లు 12.86 శాతం కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. అయితే గతేడాది -14.78శాతంగా ఉన్న ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 11.69 శాతం పైకి ఎగిసింది. కొత్త బేస్ ఇయర్ 2011-12 ఆధారితంగా ఈ ద్రవ్యోల్బణాన్ని గణించారు. -
మే 9న ఐఐపీ కొత్త బేస్ ఇయర్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)కి బేస్ ఇయర్ మారనుంది. 2011–12 బేస్ ఇయర్తో మే 9వ తేదీన కొత్త ఐఐపీ సిరీస్ ప్రారంభం కానుందని ఒక ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. ప్రస్తుతం ఐఐపీకి 2004–05 బేస్ ఇయర్గా ఉంది. తాజా సిరీస్ను చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ ప్రారంభిస్తారని సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలకు మరింత పారదర్శకత చేకూరుతుందని కూడా ఆయన తెలిపారు. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) బేస్ ఇయర్ కూడా 2011–12గా మార్చేందుకు మదింపు జరుగుతోందని ఉన్నతాధికారి వెల్లడించారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) బేస్ ఇయర్ ఇప్పటికే మారిన సంగతి తెలిసిందే. దీనితోపాటు వినియోగ సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలకూ బేస్ ఇయర్గా 2011–12ను అమలు చేస్తున్నారు. -
మార్చిలో తగ్గిన ధరల వేగం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో ఫిబ్రవరితో పోలిస్తే తగ్గింది. 2017 ఫిబ్రవరిలో 6.55 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం (2016 ఫిబ్రవరి టోకు ధరల బాస్కెట్తో పోల్చితే) 2017 మార్చిలో 5.7 శాతానికి తగ్గింది. 2016 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం అసలు పెరక్కపోగా –0.45 క్షీణతలో ఉంది. ప్రధాన విభాగాలను వేర్వేరుగా చూస్తే... పైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 4.63 శాతంగా ఉంది. ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 3.12 శాతంగా ఉంది. నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం 4.91 శాతంగా ఉంది. సూచీలో ఈ విభాగం వెయిటేజ్ దాదాపు 20 శాతం. ఆహార విభాగంలో కూరగాయల ధరలు 5.70 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 7.62 శాతం ఎగశాయి. గుడ్లు, మాంసం, చేపలు 3.12 శాతం పెరిగాయి. ► ఫ్యూయెల్ అండ్ పవర్: మార్చిలో ద్రవ్యోల్బణం 18.16 శాతంగా ఉంది. సూచీలో ఈ విభాగం వెయిటేజ్ 20 శాతం. ఫిబ్రవరిలో ఈ రేటు 21.02 శాతం. ► తయారీ: సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 2.99 శాతంగా ఉంది. మార్చిలో ఈ రేటు 3.66 శాతంగా ఉంది. -
మూడేళ్ల గరిష్టంలో టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశీయ టోకు ధరల ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్టానికి ఎగిసింది. అంచనావేసిన దానికంటే పెరిగి ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం ఏడాది ఏడాదికి 6.55 శాతంగా నమోదైంది. జనవరి నెలలో ఈ ద్రవ్యోల్బణం 5.25 శాతంగా ఉంది. మినరల్స్, ప్యూయల్ ధరలు పెరగడంతో పాటు ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో ఈ టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగినట్టు ప్రభుత్వ డేటా పేర్కొంది. మంగళవారం ప్రభుత్వం ఈ డేటాను విడుదల చేసింది. రాయిటర్స్ పోల్స్ అంచనాల ప్రకారం ఈ డేటా 5.90 శాతంగా నమోదవుతుందని అంచనావేసింది. ఈ రెండున్నర ఏళ్లలో టోకు ధరలు భారీగా పెరిగినట్టు తెలిసింది. గత నెల టోకు విక్రయాల ఆహార ధరలు యేటికేటికి 2.69 శాతం పెరిగాయి. జనవరిలో ఇవి 0.56 శాతం పడిపోయాయి. మినరల్ ధరలు కూడా 31 శాతం పెరిగాయి. అంతేకాక సమీక్షించిన పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగియడంతో ప్యూయల్ 21 శాతం కాస్ట్ లీగా మారిందని ప్రభుత్వ డేటా వెల్లడించింది. -
30 నెలల గరిష్టానికి టోకు ధరలు
• జనవరి ద్రవ్యోల్బణం 5.25 శాతం • ఇంధన ధరల మంట ప్రధాన కారణం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 జనవరిలో 30 నెలల గరిష్ట స్థాయికి చేరింది. 5.25 శాతానికి పెరిగింది. అంటే 2016 జనవరితో పోల్చితే, 2017 జనవరిలో పలు కీలక వస్తు ఉత్పత్తుల బాస్కెట్ ధర టోకున 5.25 శాతం పెరిగిందన్నమాట. ఇంధన ధరల పెరుగుదల టోకు ధరలపై ప్రధానంగా ప్రభావం చూపింది. 2016 ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా (2015 జనవరి నెలతో పోల్చి) –1.07 శాతం క్షీణత నమోదయ్యింది. కాగా నవంబర్, డిసెంబర్లలో వరుసగా ద్రవ్యోల్బణం రేట్లు 3.38 శాతం, 3.39 శాతాలుగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు, అంతర్జాతీయంగా ఫెడ్ రేట్లు పెంచే అంచనాల నేపథ్యంలో గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపో 6.25 శాతం)ను పెంచకపోగా, ఇందుకు ఇకముందూ అవకాశాలు తక్కువేనని సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా టోకు ద్రవ్యోల్బణం తీవ్రత నమోదయ్యింది. మూడు ప్రధాన విభాగాలు ఇలా ... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్లతో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు జనవరిలో 4.30% నుంచి 1.27 శాతానికి తగ్గింది. ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణంలో అసలు పెరగలేదు. 6.46% నుంచి ఈ ద్రవ్యోల్బణం –0.56 క్షీణతలోకి జారిపోవడం గమనార్హం. ఇక నాన్ ఫుడ్ ఆర్టికల్స్లో ద్రవ్యోల్బణం రేటు 9.35% నుంచి 1.98%కి తగ్గింది. కూరగాయల ధరలు జనవరిలో పెరగకపోగా –32.32% క్షీణించాయి. ప్రధానంగా ఉల్లిపాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా –28.86% క్షీణించాయి. ఇంధనం: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం –9.89 శాతం క్షీణత నుంచి భారీగా 18.14 శాతానికి పెరిగింది. తయారీ: తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం –1.17 శాతం నుంచి 3.99 శాతానికి పెరిగింది. -
పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: 2016 డిసెంబర్ నెల టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) లేదా టోకు ద్రవ్యోల్బణం 3.39గా నమోదైంది. మునుపటి నెలలో 3.15 శాతంతో పోలిస్తే ఇది 1.06 శాతం ఎక్కువ. ఆహార ద్రవ్యోల్బణం రేటు (ఇయర్ ఆన్ ఇయర్ ) -0.70 శాతంగా నమోదైంది. గత నెల 1.54తో పోలిస్తే క్షీణించి 2015 ఆగస్టు తరువాత మొదటి సారి నెగిటివ్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఈ వివరాలను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ నెలలో 'ఆల్ కమోడిటీస్' టోకు ధర సూచిక 182.8 (తాత్కాలిక) గా నమోదైంది. గత నెలలో (తాత్కాలిక) 183.1 తో పోలిస్తే 0.2 శాతం తగ్గింది. కాగా డిసెంబర్ 31, 2016తో ముగిసిన డీమానిటైజేషన్ నేపథ్యంలో డబ్ల్యుపిఐ గణాంకాలు కీలకంగా మారనున్నాయి. -
టోకు ధరలు ‘కూల్’...
• అక్టోబర్లో 3.39 శాతం • రేటు తగ్గింపునకు పరిశ్రమల డిమాండ్ న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్లో కొంత శాంతించింది. సెప్టెంబర్లో 3.57%గా ఉన్న ఈ రేటు అక్టోబర్లో 3.39%కి దిగివచ్చింది. అంటే సెప్టెంబర్లో ఉన్న ఆహార ధరల పెరుగుదల వేగం (గత ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) అక్టోబర్లో తగ్గిందన్నమాట. ఆహార ధరలు అదుపులో ఉండడం దీనికి ఒక కారణం. గత ఏడాది ఇదే నెలలో ఆహార ద్రవ్యోల్బణం అసలు పెరుగుదలలో లేకపోగా -3.70% క్షీణతలో ఉంది. తాజాగా ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 7 ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటును ఆర్బీఐ తగ్గించాలని పరిశ్రమలు డిమాండ్ చేస్తున్నారుు. ముఖ్య విభాగాలను వార్షికంగా చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్ ఆర్టికల్స్తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 0.04% నుంచి 3.31 %కి పెరిగింది. ఇందులో ఒక భాగమైన ఫుడ్ ఆర్టికల్స్లో రేటు 3.33% నుంచి 4.34%కి చేరింది. సెప్టెంబర్లో ఈ బాస్కెట్లో ధరల పెరుగుదల వేగం 5.75%. ఇక నాన్-ఫుడ్ ఆర్టికల్స్లో రేటు 5.10% నుంచి 1.13%కి తగ్గింది. ఫ్యూయెల్ అండ్ పవర్: -16.32% క్షీణత నుంచి 6.18%కి ఎగసింది. తయారీ: మొత్తం సూచీలో 60% ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం -1.67% క్షీణత నుంచి 2.67%కి పెరిగింది. పరిశ్రమలు ఏమంటున్నాయంటే... ప్రస్తుత పరిస్థితుల్లో రెపో కోత 0.50% అవసరమని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్థన్ నోతియా పేర్కొన్నారు. హౌసింగ్, ఆటోమోబైల్, వినియోగ వస్తువుల విభాగాల్లో పెరుగుదలకు తక్షణం ఈ చర్య తీసుకోవాలని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు వచ్చే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత తగ్గుదలకు దోహదపడుతుందని ఐసీఆర్ఏ సీనియర్ ఎకనమిస్ట్ అదితినయ్యర్ అన్నారు. -
దిగి వస్తున్న టోకు ధరల సూచీ
న్యూఢిల్లీ: టోకు ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో దిగి వచ్చింది. వార్షిక ధరల పెరుగుదల రేటు ప్రతిబింబించే టోకు ధరల సూచీ 3.57 శాతం తగ్గింది. ఫుడ్ఆర్టికల్స్, కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇది స్వల్పంగా తగ్గుముఖంపట్టింది. టోకు ధరల సూచీ గత ఆగస్టు నెలలో రెండేళ్ల గరిష్టాన్ని తాకింది. ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. 2015 సెప్టెంబర్ లో ఇది 4.59 శాతంగా నమోదైంది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రకారం తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 64.97, ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 4.76, ఇంధన ద్రవ్యోల్బణం 5.58 ఆహార ద్రవ్యోల్బణం 10.91 వద్ద సెప్టెంబర్ డబ్ల్యుపిఐ ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 5.75 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 8.23శాతంగా నమోదైంది. కాగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ గతవారం 25 బేసిస్ పాయింట్లకు వడ్డీరేట్లలో కోత పెట్టిన సంగతి తెలిసిందే. -
సరఫరాల సమస్యలతో ధరలకు రెక్కలు!
• జూలై టోకు ధరల పెరుగుదల 3.55% • 23 నెలల గరిష్ట స్థాయి - నిత్యావసరాల ధరల తీవ్రత • 12 శాతం పైకి... కూరగాయల ధర 28 శాతం రయ్ ! న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు జూలైలో భారీగా పెరిగింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చిచూస్తే.. ఈ బాస్కెట్లో వస్తువుల మొత్తం ధర 3.55 శాతం ఎగసింది. ఇది 23 నెలల గరిష్ట స్థాయి. అంటే 2014 ఆగస్టు (3.74 శాతం) తరువాత మళ్లీ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. టోకు ధరల సూచీలో ఒక భాగమైన నిత్యావసర ధరలు భారీగా పెరగడం మొత్తం సూచీ పెరుగుదలకు ఒక కారణం. సరఫరాల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. జూన్లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ట స్థాయిలో 6.07 శాతంగా నమోదయిన నేపథ్యంలోనే తాజా గణాంకాలు వెలువడ్డాయి. కాగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం జూన్లో 1.62 శాతం నమోదవగా, గత ఏడాది జూలైలో అసలు పెరుగుదల లేకపోగా -4% క్షీణతలో ఉంది. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కీలక విభాగాలను పరిశీలిస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఆహార, ఆహారేతర వస్తువుల బాస్కెట్ మొత్తంగా ద్రవ్యోల్బణం రేటు 9.38 శాతంగా ఉంది. గత ఏడాది జూలైలో ఈ రేటు -3.98 శాతంగా ఉంది. ఇక ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు -1.2 శాతం క్షీణత నుంచి 12 శాతానికి పెరిగింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్ రేటు -1 శాతం నుంచి 9.5 శాతానికి చేరింది. ఇంధనం, విద్యుత్: -12 శాతం క్షీణత -1 శాతం క్షీణతకు చేరింది. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో రేటు -1.54 శాతం క్షీణత నుంచి 1.82 పైకి మళ్లింది. కొన్ని నిత్యావసరాలను చూస్తే... వార్షికంగా టోకున పప్పుల ధరలు 37% పెరిగాయి. బంగాళాదుంపలు ఏకంగా 59% పెరిగాయి. కూరగాయలు 28 శాతం ఎగశాయి. టోకునే ధరల పెరుగుదల ఈ తీరున ఉంటే.. ఇక రిటైల్ స్థాయికి చేరే సరికి ఏ స్థాయిలో పెరుగుదల ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విమర్శ. -
టోకు ధరలూ పెరిగాయ్
♦ కూరగాయల ధరలు పెరిగిన ఎఫెక్ట్ ♦ మేలో టోకు ద్రవ్యోల్బణం 0.79% ♦ ఆహార ద్రవ్యోల్బణం రేటు 7.88% న్యూఢిల్లీ: కూరగాయల ధరలు మండిపోవడంతో మే నెల టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 0.79 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 2.20గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో మైనస్ 0.45గా ఉన్న డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్లో 0.34 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో 2.21 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మేలో 12.94 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 4.23 శాతం నుంచి 7.88 శాతానికి, తయారీ ధరల ద్రవ్యోల్బణం 0.71 శాతం నుంచి 0.91 శాతానికి పెరిగాయి. ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం మేలో మైనస్ 6.14 శాతంగా, పప్పుల ద్రవ్యోల్బణం 35.56 శాతంగా ఉండగా, గుడ్లు, మాంసం, చేపల ధరల ద్రవ్యోల్బణం 9.75 శాతం పెరిగింది. ధాన్యాల ధరలు 4.6 శాతం,పండ్ల ధరలు 3.8 శాతం చొప్పున పెరిగాయి. ఉల్లిగడ్డల ధరలు 21.7 శాతం తగ్గాయి. సరఫరా సమస్యలు సరఫరా సమస్యల పరిష్కారానికి విధాన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాన్ని ఈ పెరిగిన ద్రవ్యోల్బణం సూచిస్తోందని నిపుణులంటున్నారు. పప్పులు, ధాన్యాలు, ఆహార పదార్ధాలు గోధుమ, ఇతర పదార్ధాల ధరలు పెరగడం కొనసాగుతోందని, దీనిని నివారించాలంటే సరఫరా సంబంధిత సమస్యలపై విధాన నిర్ణేతలు దృష్టి సారించాల్సిన అవసరముందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి. ఎస్. రావత్ చెప్పారు. సరఫరాల్లో కోత కారణంగా ధరలు పెరుగుతున్నాయని వివరించారు. పారిశ్రామికోత్పత్తి తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తగ్గవచ్చు... వర్షాలు విస్తారంగా కురిస్తే సమీప కాలంలో టోకు ధరల ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం .. అంతర్జాతీయ కమోడి ధరలపై ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. ముడి చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే, ఈ ఆర్థిక సంవత్సరంలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3 శాతానికి మించవచ్చని ఇక్రా సీనియర్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ద్రవ్యోల్బణం 2-3 శాతం స్థాయిలో ఉండడం ఆందోళన కలిగించే అంశం కాదని, కేర్రేటింగ్స్ పేర్కొంది. రేట్ల కోత మరింత జాప్యం టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడం, సోమవారం వెలువడిన వినియోగదారుల ద్రవ్యోల్బణం కూడా ఎగియడంతో, పారిశ్రామికోత్పత్తి తగ్గినప్పటికీ, రేట్ల కోతను ఆర్బీఐ మరింత జాప్యం చేయవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆహార పదార్ధాల ధరలు పెరగడంతో మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 21 నెలల గరిష్ట స్థాయి, 5.76 శాతానికి పెరిగింది. ద్రవ్య విధాన నిర్ణయంలో ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్నే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో పారిశ్రామికోత్పత్తి 0.8 శాతానికి తగ్గింది. మూడు నెలల కాలంలో ఇదే తొలి క్షీణత. -
టోకున ఆహార ధరలు భగ్గు..
♦ డిసెంబర్లో 8 శాతంపైకి.. ♦ మొత్తం టోకు సూచీ మాత్రం ♦ ‘క్షీణత’లోనే; మైనస్ 0.73 శాతం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 14వ నెలలోనూ అసలు పెరక్కపోగా... క్షీణత (మైనస్)లో కొనసాగింది. డిసెంబర్లో -0.73 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 డిసెంబర్తో పోల్చితే 2015 డిసెంబర్లో టోకు బాస్కెట్ రేటు మొత్తంగా అసలు పెరక్కపోగా... క్షీణించిందన్నమాట. నవంబర్లో ఈ రేటు -1.99 శాతం. అయితే మొత్తం టోకు ధరల సూచీలో ఒక భాగమైన ఆహార ధరల విభాగం మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వైనాన్ని గణాంకాలు ప్రతిబింబించాయి. ఈ ధరల స్పీడ్ డిసెంబర్లో ఏకంగా 8.17 శాతంగా నమోదయ్యింది. గడచిన ఏడాది కాలంలో పెరుగుదల ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడం దీనికి కారణం. ఆహార ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే... రానున్న కొద్ది నెలల్లో సూచీ మొత్తం క్షీణతలోంచి బయటకు వస్తుందని అంచనా. 2014 నవంబర్ నుంచి క్షీణతలో కొనసాగుతున్న టోకు ద్రవ్యోల్బణం... ఆహార ధరల తీవ్రత దృష్ట్యా గడచిన నాలుగు నెలల నుంచి కొంచెంకొంచెంగా పైకి వస్తోంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ఈ విభాగంలో రేటు 5.48% పెరిగింది. ఇందులో ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే ఈ రేటు 8.17 శాతంగా ఉంది. నవంబర్లో ఈ రేటు 5.2%. పప్పు దినుసుల ధరలు వార్షికంగా చూస్తే... భారీగా 56% ఎగశాయి. ఉల్లి ధరలు 26% అధికంగా ఉన్నాయి. కూరగాయల ధరలు 21 శాతం ఎగశాయి. -
క్షీణతలోనే... టోకు ద్రవ్యోల్బణం
అక్టోబర్లో మైనస్ 3.81 శాతం * 12 నెలల నుంచీ ఇదే ధోరణి * అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల ఎఫెక్ట్ * నిత్యావసరాల్లో... పప్పులు, ఉల్లి ధరలు భారం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెలలోనూ అసలు పెరక్కపోగా... మైనస్లోనే కొనసాగింది. అక్టోబర్లో -3.81%గా నమోదయ్యింది. సెప్టెంబర్లో ఈ రేటు -4.54%. 2014 ఇదే నెలలో ఈ రేటు 1.66%గా ఉంది. దేశంలో టోకు ధరల సూచీ అసలు పెరక్కపోడానికి కారణాల్లో అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం ఒకటి. అయితే టోకున చూస్తే... నిత్యావసరాల్లో పప్పులు, ఉల్లి ధరలు తీవ్రంగా ఉన్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మూడు ప్రధాన విభాగాల వార్షిక రీతిన వివరాలు... మూడు విభాగాలూ మైనస్లోనే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్, మినరల్స్ విభాగాలతో కూడిన ఈ కేటగిరీలో ద్రవ్యోల్బణం -0.36% క్షీణతలో ఉంది. అయితే ప్రధానంగా ఫుడ్ ఆర్టికల్స్ను ఇందులో చూస్తే పెరుగుదల రేటు 2.44%. ఫ్యూయల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం క్షీణతలో -16.32%గా ఉంది. తయారీ: సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న ఈ రంగంలో కూడా ద్రవ్యోల్బణం -1.67 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తులు...: ఫుడ్ కేటగిరీలో టోకు ద్రవ్యోల్బణం మొత్తంగా 2.44% పెరిగితే... ప్రధానంగా పప్పులు, ఉల్లి ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పప్పు దినుసుల ధరలు వార్షికంగా 52.98% పెరిగాయి. ఉల్లి ధరలు 85.66% అధికంగా ఉన్నాయి. కూరగాయల ధరలు 2.56% పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో పాలు (1.75%), గోధుమలు (4.68%) ఉన్నాయి. ధరలు తగ్గిన ఉత్పత్తుల్లో ఆలుగడ్డ (-59%) ఉంది. పాలసీ సమీక్షపై దృష్టి... డిసెంబర్ 1న ఆర్బీఐ పాలసీ సమీక్షను నిర్వహించనుంది. ఈ సందర్భంగా నిర్ణయానికి అక్టోబర్ టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. అక్టోబర్లో వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఈ రేటు నాలుగు నెలలుగా పెరుగుతూ వస్తోంది. పప్పులు, ఇతర ఆహార ఉత్పత్తుల రిటైల్ ధరల పెరుగుదలే దీనికి కారణం. -
టోకు ధరలు మరింత తగ్గాయ్
ఏప్రిల్లో ద్రవ్యోల్బణం -2.65 శాతం క్షీణత - వరుసగా 4 నెలలుగా ఇదే ధోరణి - ఆహారోత్పత్తుల ధరలు మాత్రం పెరిగాయ్... న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్లో అసలు పెరక్కపోగా 2.65 శాతం (మైనస్) క్షీణించింది. అంటే 2014 ఏప్రిల్తో పోల్చితే మొత్తం టోకు వస్తువుల బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా, అప్పటి నెలతో పోల్చితే 2015 ఏప్రిల్లో -2.65 శాతం తగ్గాయన్నమాట. 2014 నవంబర్ నుంచీ ‘జీరో’ స్థాయిలో కదులుతున్న ద్రవ్యోల్బణం రేటు జనవరి నుంచి ఏకంగా మైనస్లోకి జారిపోయింది. ఇది వ్యవస్థలో డిమాండ్ లేకపోవడానికి ప్రతిబింబమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూడు విభాగాలూ చూస్తే... 2014 ఏప్రిల్ ధరలతో పోల్చి 2015 ఏప్రిల్లో ధర ల స్పీడ్కు సంబంధించి టోకు ధరల సూచీలోని ప్రధాన మూడు విభాగాల తీరునూ పరిశీలిస్తే.. ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్కు సంబంధించి ప్రాథమిక వస్తువుల (దాదాపు 20% వెయిటేజ్) తీరు- ఈ బాస్కెట్ వార్షిక ధరల పెరుగుదల రేటు కేవలం 0.25%గా నమోదయ్యింది. ఫుడ్ ఆర్టికల్స్ (14% వెయిటేజ్) ధరలు మాత్రం 5.73% ఎగశాయి. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు (వెయిటేజ్ 4%) అసలు పెరక్కపోగా -6.18% క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఇక దాదాపు 15% వాటావున్న ఇంధనం- విద్యుత్ విభాగంలో ధరలు సైతం వార్షికంగా అసలు పెరక్కపోగా -13.03% క్షీణించాయి. సూచీలో 65 % వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు (కోర్ విభాగం) సైతం అసలు పెరక్కపోగా క్షీణతలో -0.52 శాతంగా ఉన్నాయి. ముఖ్య ఆహార ఉత్పత్తుల ధరలు.. వార్షికంగా చూస్తే... 2015 ఏప్రిల్లో బంగాళ దుంప ధరలు 41.14% తగ్గాయి. కూరగాయల టోకు బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా స్వల్పంగా 1.32% తగ్గాయి. బియ్యం ధరలు స్వల్పంగా 0.04% ఎగశాయి. ఉల్లి ధర 29.97% పెరిగింది. పప్పు దినుసులు (15.38%), పండ్లు (14.22%), పాలు (7.42%) వంటి ఆహార ఉత్పత్తుల సైతం ధరలు పెరిగిన వస్తువుల జాబితాలో ఉన్నాయి. వ్యవస్థలో డిమాండ్ వృద్ధికి బ్యాంకింగ్ రుణ రేటు కోత మరింత తప్పదని పరిశ్రమ చాంబర్లు డిమాం డ్ చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రానున్న సమీక్షలో(జూన్ 2న) మరోదఫా రెపో రేటును తగ్గించాలని కోరాయి. -
టోకు ధరలు ఐదేళ్ల కనిష్ట స్థాయికి
న్యూఢిల్లీ: టోకు ధరలు 2014 అక్టోబర్లో ఐదేళ్ల కనిష్ట స్థాయిని నమోదుచేసుకున్నాయి. ఈ నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు కేవలం 1.77 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 అక్టోబర్తో పోల్చితే 2014 అక్టోబర్ నెలలో టోకు ధరలు కేవలం 1.77 శాతం మాత్రమే పెరిగాయన్నమాట. వార్షికంగా నిర్దిష్ట నెలను పరిగణనలోకి తీసుకుంటే... ఈ స్థాయిలో మాత్రమే టోకు ధరల పెరుగుదల రేటు నమోదుకావడం ఐదేళ్లలో ఇదే తొలిసారి. గత ఏడాది ఇదే నెలలో(అక్టోబర్) టోకు ధరల స్పీడ్ 7.24 శాతంగా ఉంది. 2014 సెప్టెంబర్లో రేటు 2.38 శాతం. ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల స్పీడ్ నమోదుకు ఒకపక్క ఇంధన ధరలు, మరోపక్క ఆహార ఉత్పత్తుల ధరల తగ్గుదల కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక బేస్ రేటు ప్రభావం కూడా ఉందని పేర్కొన్నాయి. ఈ సూచీ వరుసగా ఐదు నెలల నుంచీ తగ్గుతూ వస్తోంది. శుక్రవారం ఈ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కార్పొరేట్ల ఆశలు... ధరలు ఈ స్థాయికి తగ్గడంతో ఇక వడ్డీరేట్ల కోత ద్వారా ఆర్బీఐ వృద్ధికి ఊతం ఇవ్వాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. డిసెంబర్ 2వ తేదీ న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షపై ఆయా వర్గాలు ఆశలు పెట్టుకుంటున్నాయి. అయితే, క్రూడ్ ధరకు సంబంధించి భవిష్యత్ అనిశ్చితి, ద్రవ్యోల్బణం తగ్గుదల అంతిమంగా వినియోగదారుకు అందుబాటులోకి తీసుకురావడం వంటి కారణాల ప్రాతిపదికన రానున్న రెండు పాలసీ సమీక్షా కాలాల్లో సైతం ఆర్బీఐ వడ్డీరేటు తగ్గించక పోవచ్చునని ఐసీఆర్ఏ సీనియర్ ఎకనమిస్ట్ ఆదితి నాయర్ విశ్లేషించారు. ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే... ఆహార ఉత్పత్తుల ధరలు టోకున వార్షికంగా అక్టోబర్ నెలలో 2.7 శాతం మాత్రమే పెరిగాయి. సెప్టెంబర్తో పోల్చితే ఈ రేటు 0.82 శాతం (3.52 శాతం నుంచి ) తగ్గింది. వార్షికంగా చూస్తే (నిర్దిష్టంగా అక్టోబర్ నెలలో) ఉల్లిపాయలు (-59.77 శాతం), కూరగాయలు (-19.61 శాతం), ప్రొటీన్ ఆధారిత నాన్ వెజ్- గుడ్లు, మాంసం, చేపలు (-2.58 శాతం), గోధుమలు (-1.92 శాతం) ధరలు అసలు పెరక్కపోగా తగ్గాయి. ఇక పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో బంగాళా దుంపలు (82.11 శాతం), పళ్లు (19.35 శాతం), పాలు (11.39 శాతం), బియ్యం (6.47 శాతం), పప్పు దినుసులు (4.02%), తృణధాన్యాలు (3.29%) ఉన్నాయి. మరింత తగ్గుతుంది: జైట్లీ అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినందున, ధరల పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పేర్కొన్నారు. అయితే క్రూడ్ ధరల భవిష్యత్ పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంలో కొంత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశంపై అధిక ఆశావహంతో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
టోకు ధరలు ఐదేళ్ల కనిష్టం
సెప్టెంబర్లో 2.38 శాతం ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గిన ఫలితం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 2.38 శాతానికి పడిపోయింది. అంటే 2013 సెప్టెంబర్తో పోల్చితే పలు ఉత్పత్తుల టోకు ధరల మొత్తం 2014 సెప్టెంబర్లో కేవలం 2.38 శాతమే పెరిగాయన్నమాట. ఇంతే స్థాయిలో ధరలు పెరుగుదల రేటు నమోదు కావడం ఐదేళ్లలో ఇదే మొదటిసారి. టోకున ఆహార ఉత్పత్తులు ధరల స్పీడ్ తగ్గడం మొత్తం సూచీపై సానుకూల ప్రభావం చూపిందని గణాంకాలు పేర్కొన్నాయి. నాలుగు నెలల నుంచీ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. ఆగస్టు నెలలో ఈ రేటు 3.74 శాతం. 2013 సెప్టెంబర్లో ఈ స్పీడ్ 7.05 శాతం. మంగళవారం నాడు విడుదల చేసిన సెప్టెంబర్ డబ్ల్యూపీఐ గణాంకాల ముఖ్యాంశాలు... విభాగాల వారీగా... మొత్తం డబ్ల్యూపీఐలో 14 శాతం వాటా ఉన్న ఆహార ఉత్పత్తుల ధరల విభాగంలో ద్రవ్యోల్బణం సెప్టెం బర్లో 33 నెలల కనిష్ట స్థాయిలో 3.52 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు 5.15 శాతం. 2013 ఆగస్టులో ఉన్న ధరతో పోల్చి 2014 ఆగస్టులో ఉల్లిపాయల ధరలు 44.7 శాతం తగ్గితే(వార్షిక ప్రాతిపదికన), 2014లో సెప్టెంబర్లో ఈ కమోడిటీ ధర ఏకంగా 58.12 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 14.98 శాతం తగ్గాయి. అయితే ఆలూ ధర మాత్రం ఆగస్టులో 61.61 శాతం పెరిగితే, సెప్టెంబర్లో 90.23 శాతం ఎగసింది. గుడ్లు, మాంసం, చేపల ధరలు ఆగస్టులో 5.87 శాతం పెరిగితే సెప్టెంబర్లో ఈ పెరుగుదల రేటు 4.12 శాతమే ఉంది.మొత్తం సూచీలో దాదాపు 66 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో ఆగస్టుతో పోల్చితే 3.45% నుంచి 2.84 శాతానికి దిగివచ్చింది. రేట్ల కోతకు అవకాశం: పరిశ్రమలు రిటైల్, టోకు ధరలు దిగిరావడంతో ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్లు తగ్గించడానికి ఇది సరైన అవకాశమని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ చర్యలు ఫలించినట్లు ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ వ్యాఖ్యానించారు. -
ఫెడ్ పాలసీ సమీక్షపై దృష్టి
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టనున్న పాలసీ సమీక్షపై ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు దృష్టిపెట్టాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక దేశీయంగా ఆగస్ట్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. కాగా, గత వారం చివర్లో మార్కెట్లు ముగిశాక ఆగస్ట్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ)తోపాటు, జూలై నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెలువడ్డాయి. ఈ వారం స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ నిర్ణయంపై వీటి ప్రభావం ఉంటుందని ఎక్కువమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం డబ్ల్యూపీఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం వెలువడ్డ ఐఐపీ నిరాశపరచగా, సీపీఐ కాస్త ఫరవాలేదనిపించింది. వెరసి సోమవారం ఈ అంశాల ఆధారంగా మార్కెట్లు ఎలా స్పందించేదీ వేచిచూడాల్సి ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు: పరపతి విధానాల సమీక్షపై ఫెడరల్ రిజర్వ్ నిర్వహించనున్న రెండు రోజుల సమావేశాలు బుధవారం ముగియనున్నాయి. ప్రధానంగా సహాయక ప్యాకేజీ నిలిపివేత, వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమెరికా వడ్డీ పెంపు అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చె ప్పారు. అంచనాలకంటే ముందుగానే పెంపునకు అవకాశాలు కనిపిస్తే వర్థమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతాయన్న ఆందోళనలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ముందస్తు పన్ను చెల్లింపులు సోమవారం వెల్లడికానున్న లిస్టెడ్ దిగ్గజాల ముందస్తు పన్ను చెల్లింపులపైనా ఇన్వెస్టర్లు కన్నేస్తారని విశ్లేషకులు తెలిపారు. వీటి ఆధారంగా కార్పొరేట్ల జూలై-సెప్టెంబర్(క్యూ2) ఫలితాలను అంచనా వేస్తారని తెలిపారు. ఇక మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు వంటి అంశాలు కూడా కీలకంగా నిలుస్తాయని వివరించారు. ప్రభుత్వం సంస్కరణల అజెండాను కొనసాగిస్తుందన్న అంచనాలతో ఎఫ్ఐఐలు ఈ నెలలోనూ రూ. 17,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారని, దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను అందుకుంటున్నాయని సియాన్స్ అనలిటిక్స్ సహవ్యవస్థాపకుడు, సీఈవో అమన్ చౌదరి చెప్పారు. మార్కెట్లు సానుకూలంగానే ఉన్నప్పటికీ సిరియా, ఇరాక్, అమెరికాల మధ్య ఏర్పడ్డ ఉద్రేక పరిస్థితుల కారణంగా సెంటిమెంట్ బలహీనపడవచ్చునని బొనాంజా పోర్ట్ఫోలియో సీనియర్ వైస్ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అభిప్రాయపడ్డారు. -
ఆరు వారాల కనిష్టం
వరుసగా ఐదో రోజూ నష్టాలు సెన్సెక్స్ 17 పాయింట్లు డౌన్ 25,007 వద్ద ముగింపు రోజు మొత్తం ఒడిదుడుకులు వరుసగా ఐదో రోజు నష్టాలు కొనసాగాయ్. తొలి నుంచీ స్వల్ప స్థాయిలో లాభనష్టాల మధ్య కదలిన సెన్సెక్స్ కనిష్టంగా 24,892, గరిష్టంగా 25,096ను తాకింది. చివరికి 17 పాయింట్ల క్షీణతతో 25,007 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 7,472- 7,422 మధ్య కదిలి చివరికి 5 పాయింట్లు తక్కువగా 7,454 వద్ద ముగిసింది. ఇది దాదాపు ఆరు వారాల కనిష్టం! జూన్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 6% నుంచి 5.4%కు తగ్గినప్పటికీ సెంటిమెంట్ మెరుగుపడలేదని నిపుణులు పేర్కొన్నారు. ఇదే విధంగా మే నెలలో పారిశ్రామికోత్పత్తి 19 నెలల గరిష్టం 4.7%కు పుంజుకున్న అంశాన్నీ ఇన్వెస్టర్లు పెడచెవిన పెట్టారని తెలిపారు. ఈ గణాంకాలు గడిచిన శుక్రవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి. కాగా, జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) 8.3% నుంచి 7.3%కు బలహీనపడినట్లు సోమవారం(14న) మార్కెట్లు ముగిశాక వెల్లడైంది. * శుక్రవారం అంచనాలకు తగ్గ ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్ తాజాగా 3% పతనమైంది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో హెచ్యూఎల్, విప్రో 2.5% స్థాయిలో తిరోగమించాయి. * కేజీ డీ6 బ్లాకునుంచి లక్ష్యానికంటే తక్కువగా గ్యాస్ను ఉత్పత్తి చేస్తున్నందున ఆర్ఐఎల్పై ప్రభుత్వం 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానాను విధించడంతో షేరు 0.5% నష్టపోయింది. * మరోవైపు హిందాల్కో 4% జంప్చేయగా, టాటా పవర్, టాటా స్టీల్, టాటా మోటార్స్ 2.5% స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో యాక్సిస్, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, భెల్ 1.5% చొప్పున లాభపడ్డాయి. * ఎఫ్పీఐలు రూ. 558 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీ సంస్థలు రూ. 332 కోట్లను ఇన్వెస్ట్చేశాయి. ట్రేడైన షేర్లలో 1,690 నష్టపోతే, 1,126 లాభపడ్డాయి. -
తగ్గిన ధరల సెగ..!
జూన్లో టోకు ద్రవ్యోల్బణం 6.01% నుంచి 5.43%కి డౌన్ 8.28 శాతం నుంచి 7.31 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం కొన్ని నిత్యావసరాల ధరలు తగ్గిన ప్రభావం రుతుపవనాల ప్రభావంపై వీడని ఆందోళన న్యూఢిల్లీ: అటు టోకు ధరలు, ఇటు రిటైల్ ధరల వేగం జూన్లో కొంత తగ్గింది. వేర్వేరుగా చూస్తే- టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 6.01% ఉండగా, ఇది జూన్లో 5.43 శాతానికి దిగింది. ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 8.28 శాతం నుంచి 7.31%కి దిగింది. అంటే గత ఏడాది ఇదే నెలలతో (2013 మే, జూన్) పోల్చితే 2014 మే, జూన్ నెలలో ధరలు ఆ రేట్ల (శాతాల) మేరకు పెరిగాయన్నమాట. టోకు ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టంకాగా, రిటైల్ ద్రవ్యోల్బణం 30 నెలల కనిష్టం. కూరగాయలుసహా కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం ధరల స్పీడ్ తగ్గడానికి కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఎల్నినో, రుతుపవనాల ప్రభావం ఇంకా ఆందోళన కలిగించే అంశమేనని అంటున్నాయి. డబ్ల్యూపీఐ తీరు ఇదీ... టోకు ధరలకు సంబంధించి మొత్తం మూడు విభాగాల్లో ఒకటైన ప్రైమరీ ఆర్టికల్స్ ధరల పెరుగుదల రేటు 6.84 శాతంగా ఉంది. ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 8.14 శాతంగా ఉంది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 3.49 శాతంగా నమోదయ్యింది. ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 9.04 శాతంగా నమోదయ్యింది.మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం ద్రవ్యోల్బణం రేటు 3.61 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా... ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 7.9 శాతంగా ఉంది. వేర్వేరుగా కొన్ని ముఖ్య ఆహార ఉత్పత్తుల ధరల స్పీడ్ చూస్తే- పప్పు దినుసుల ధరలు 5.17 శాతం , ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం ధరలు 8.27 శాతం, పాలు, పాల ఉత్పత్తుల ధరలు 11.06 శాతం, కూరగాయల ధరలు 8.73 శాతం, పండ్ల ధరలు 20.64%, ఆల్కాహాలేతర పానీ యాల ధరలు 6.31%, ప్రెపేర్డ్ మీల్స్ ధరలు 7.75 శాతం పెరిగాయి. 2013 జూన్తో పోల్చిచూస్తే 2014 జూన్లో చక్కెర ధరలు పెరగలేదు. స్వల్పంగా 0.27 శాతం (మైనస్) తగ్గాయి. పారిశ్రామిక వర్గాల హర్షం... అటు టోకు, ఇటు రిటైల్ ధరల స్పీడ్ మే నెలతో పోల్చితే జూన్ నెలలో తగ్గడం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం చేశాయి. ధరలకు సంబంధించి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశమేనని అసోచామ్ పేర్కొంది. ఏపీఎంసీ చట్టం రద్దు, గిడ్డంగి సదుపాయాల వంటి బ్యాక్-ఎండ్ ఇన్ఫ్రా వంటి చర్యల ద్వారా మున్ముందు ధరల పెరుగుదలను అడ్డుకోవాలని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ సూచించారు. మే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, జూన్ ద్రవ్యోల్బణం గణాంకాలు మెరుగుపడ్డం వృద్ధి రికవరీకి సంకేతంగా కనిపిస్తున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. -
సామాన్యుడికి మళ్లీ ధరాఘాతం..
ఎగబాకిన టోకు ధరలు... మే నెలలో 6.01% పెరుగుదల నిత్యావసరాలు ప్రియం ఆహార ద్రవ్యోల్బణం 9.5 శాతానికి... న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 2014 మే నెలలో 6.01 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 మే నెలతో పోల్చితే 2014 మేనెలలో ఈ ధరలు 6.01 శాతం పెరిగాయన్నమాట. అంతకుముందు అంటే ఏప్రిల్ నెలలో ఈ పెరుగుదల రేటు 5.20 శాతం. నెలలో ఈ రేటు పెరుగుదల 86 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1 శాతం) నిత్యావసర ఉత్పత్తుల ధరల పెరుగుదల మొత్తం టోకు ధరల రేటుపై ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం ఈ గణాంకాలు విడుదలయ్యాయి. నిత్యావసరాల ధరల తీరు... టోకు ధరల సూచీలోని మొత్తం మూడు విభాగాల్లో ఒకటైన ఆహార ధరల రేటు (సూచీ మొత్తంలో వెయిటేజ్ దాదాపు 14 శాతం) మే నెలలో 9.5 శాతానికి పెరిగిపోయింది. ఇది ఏప్రిల్లో 8.64 శాతం. వార్షికంగా వేర్వేరుగా చూస్తే కూరగాయల ధరలు 2013 మే నెలతో పోల్చితే 2014 మేలో స్వల్పంగా 0.97 శాతం తగ్గాయి. ఉల్లిపాయల ధరలు కూడా 2.83 శాతం తగ్గాయి. వీటిని మినహాయిస్తే, ఆలూ ధరలు 31.44 శాతం, పండ్ల ధరలు 19.40 శాతం, బియ్యం ధరలు 12.75 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 12.47శాతం, పాల ధరలు 9.57శాతం, తృణధాన్యాల ధరలు 7.67 శాతం, గోధుమల ధరలు 3.64 శాతం, పప్పు దినుసుల ధరలు 0.78 శాతం పెరిగాయి. 3 విభాగాల విషయంలో... మొత్తం మూడు విభాగాల్లో ఆహార, ఆహారేతర వస్తువులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ కేటగిరీలో ధరల పెరుగుదల రేటు మొత్తంగా 8.58 శాతంగా ఉంది. ఇందులో ఆహార ద్రవ్యోల్బణం 9.5 శాతంకాగా (పైన వివరించిన విధంగా), ఆహారేతర వస్తువుల రేటు 4.94 శాతంగా ఉంది. ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 10.53 శాతంగా ఉంది.కీలక విభాగంగా మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన తయారీ రంగం ద్రవ్యోల్బణం 3.55 శాతంగా ఉంది. 2012 మే నెలతో పోల్చి 2013 మే నెలలో ఉన్న ధరల పెరుగుదల రేటు (శాతం) కన్నా, 2013 మే నెలతో పోల్చి 2014 మే నెలలో అన్ని విభాగాల ద్రవ్యోల్బణం పెరుగుదల రేట్లు అధికంగా ఉన్నాయి. అధిక ద్రవ్యోల్బణానికి అక్రమ నిల్వలూ కారణమే: జైట్లీ న్యూఢిల్లీ: ఆహారోత్పత్తులు మార్కెట్లోకి రాకుండా వ్యాపారస్థులు అక్రమంగా నిల్వ చేస్తుండటమూ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అయితే, ఈ సరఫరా తరఫు సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పెక్యులేషన్ని కట్టడి చేసే దిశగా అక్రమ నిల్వలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న ఆందోళనల వల్ల కూడా ఆహార వస్తువులను మార్కెట్లోకి రాకుండా దాచిపెట్టడం జరుగుతోందని జైట్లీ పేర్కొన్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గొచ్చని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. రూపాయి మారకం విలువ క్షీణతపై స్పందిస్తూ.. ప్రభుత్వం దేశీ కరెన్సీ కదలికలను నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఇరాక్ పరిణామాలు, అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల తదితర అంశాలు రూపాయి స్వల్ప అనిశ్చితి కారణమని జైట్లీ పేర్కొన్నారు. ఆహార ధరలు మరింత పైకి: పరిశ్రమలు ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గితే ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆహార, ఇంధన ధరలు తగ్గకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉండదన్న ఆందోళనను పారిశ్రామిక ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే... ధరలు పెరుగుదల రేటు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ బిర్లా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళనకరమైన అంశమని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. కాగా. తగిన వర్షపాతం నమోదుకాని పక్షంలో ఉత్పన్నమైన ప్రతికూలతలను అధిగమించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
ధరల ప్రతాపం...
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు అక్టోబర్లో భారీగా 7 శాతానికి ఎగసింది. అంటే ఈ సూచీ 2012 అక్టోబర్తో పోల్చితే 2013 అక్టోబర్లో 7 శాతం పెరిగిందన్నమాట. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. సెప్టెంబర్లో ఈ రేటు 6.46 శాతం. ఉల్లిఘాటు, కూరగాయల పోటు టోకు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల తీరు... వార్షిక ప్రాతిపదికన టోకున అక్టోబర్లో ఆహార ఉత్పత్తుల ధరలు ఏకంగా 18.19 శాతం పెరిగాయి. ఉల్లి ధరల తీవ్రత కొనసాగుతోంది. ఈ నిత్యావసర ఉత్పత్తి పెరుగుదల రేటు 278 శాతంగా ఉంది. ఇక కూరగాయలను తీసుకుంటే వీటి రేటు ఏకంగా 78.38 శాతం ఎగసింది. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 17.47 శాతం ఎగశాయి. సెప్టెంబర్లో ఈ రేటు 13.37 శాతమే. గోధుమల ధరలు 7.88 శాతం ఎగశాయి. సెప్టెంబర్లో ఈ పెరుగుదల రేటు 5.9 శాతం. మరిన్ని అంశాలు మొత్తం సూచీలో ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ (వెయిటేజ్ 21 శాతం) విభాగంలో రేటు 14.68 శాతం ఎగసింది. ఇక ఆహారేతర ఉత్పత్తుల (4 శాతం వెయిటేజ్) ద్రవ్యోల్బణం రేటు 6.79 శాతంగా నమోదయ్యింది. ఇంధనం, విద్యుత్ విభాగం (15% వెయిటేజ్) ద్రవ్యోల్బణం రేటు 10.33%. మొత్తం సూచీలో దాదాపు 64 శాతం వెయిటేజ్ వాటా ఉన్న కోర్ గ్రూప్ (తయారీ రంగం) ద్రవ్యోల్బణం 2.5 శాతంగా ఉంది. ధరల అదుపు అంత ఈజీ కాదు: చిదంబరం ధరలను అదుపు చేయడం అంతసులభంకాదని ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ పలు చర్యలను తీసుకుంటున్నాయని వివరించారు. తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణం 10%ను మించిపోగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 7%ను తాకిన నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి సరఫరాల పరమైన అడ్డంకులు తొలగిపోవాల్సి ఉందని పారిశ్రామిక ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు...: ద్రవ్యోల్బణం తీవ్రత దృష్ట్యా ఆర్బీఐ డిసెంబర్ 18న చేపట్టనున్న పాలసీ సమీక్ష లో వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కీలక కోర్ ద్రవ్యోల్బణం తగిన స్థాయిలోనే ఉన్నప్పటికీ, నిత్యావసర వస్తువుల ధరల తీవ్రత వల్ల గడచిన రెండు పాలసీ సమీక్షల సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రెపో రేటు పెంపునకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. -
సామాన్యుడికి నిత్యావసరాల భారం
న్యూఢిల్లీ: అటు టోకుగా చూసినా, ఇటు రిటైల్గా చూసినా ధరల భారం తీవ్రంగా ఉంది. సెప్టెంబర్లో సామాన్యునికి నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపించాయి. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం... ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ సెప్టెంబర్లో 6.46 శాతంగా నమోదయ్యింది. అంటే 2012 సెప్టెంబర్తో పోల్చితే 2013 సెప్టెంబర్లో వార్షికంగా టోకు ధరలు 6.46 శాతం పెరిగాయన్నమాట. ఆగస్టులో ఈ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రేటు 6.10 శాతం. మొత్తం సూచీలో ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలను టోకుగా చూస్తే సెప్టెంబర్లో (వెయిటేజ్ 14.34 శాతం) వార్షిక ప్రాతిపదికన 18.18 శాతం పెరిగాయి. ఆగస్టులో పెరుగుదల రేటు 11.91 శాతం. వార్షిక ప్రాతిపదికన ఆహార ఉత్పత్తులను వేర్వేరుగా చూస్తే- ఉల్లిపాయల ధరలు భారీగా 323 శాతం ఎగశాయి. కూరగాయలు 89.37 శాతం పెరిగాయి. బియ్యం ధరలు 18.06 శాతం ప్రియమయ్యాయి. పండ్ల ధరలు 13.54 శాతం ఎగిశాయి. ప్రోటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 13.37 శాతం ఎగశాయి. తృణ ధాన్యాల ధరలు 13.05 శాతం పైకి లేచాయి. గోధుమల ధరలు 5.90 శాతం పెరిగాయి. పాల ధరలు 5.77 శాతం ఎగశాయి. కాగా పప్పు దినుసులు (13.42 శాతం), బంగాళా దుంపల ధరలు (13.10 శాతం) మాత్రం తగ్గాయి. కీలక కోర్ గ్రూప్ (తయారీ) ద్రవ్యోల్బణం 2.03 శాతం పెరిగింది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం సూచీ 13.54 శాతం ఎగిసింది. ఆహారేతర ఉత్పత్తుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 5.17 శాతం ఎగసింది. ఇక ఇంధనం అండ్ లైట్ విభాగం ద్రవ్యోల్బణం స్పీడ్ 10.08 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా... ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ధరల విషయానికి వస్తే- ఆగస్టులో 9.52 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్లో 9.84 శాతానికి చేరింది. ఇందులో మూడు ప్రధాన విభాగాలను తీసుకుంటే- ఆహారం, పానియాల విభాగం ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్లో 11.44 శాతం పెరిగింది. ఇంధనం, లైట్ విభాగం ద్రవ్యోల్బణం 7.67 శాతం ఎగసింది. క్లాతింగ్, బెడ్డింగ్, పాదరక్షల ధరలు 9.28 శాతం ఎగిశాయి. వార్షిక ప్రాతిపదికన ఒక్క చక్కెర (-4.46 శాతం) ధర మాత్రం తగ్గింది. రెపో రేటు మరింత పెరగొచ్చు...! ఆహార ద్రవ్యోల్బణం సామాన్యునికి భారంగా ఉన్న నేపథ్యంలో- అక్టోబర్ 29 పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చిన రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు)ను మరో పావు శాతం పెంచే అవకాశం ఉందని నిపుణులు కొందరు భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం 7.5 శాతంగా ఉన్న ఈ రేటు 7.75 శాతానికి చేరుతుంది. అయితే వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యతా (లిక్విడిటీ) సమస్యా తలెత్తకుండా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు పావు శాతం తగ్గించే (9 శాతం నుంచి 8.75 శాతానికి) అవకాశం ఉందని కూడా నిపుణుల అంచనా. రెపో మార్గం ద్వారా రుణ పరిమితి దాటితే- ఎంఎస్ఎఫ్ రూట్ను బ్యాంకులు (ఆర్బీఐ నుంచి రుణాలకు) ఆశ్రయిస్తాయి. కాగా వ్యవస్థలో డిమాండ్ పెంపునకు రెపో రేటు తగ్గించాల్సిందేనని పారిశ్రామిక సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కోర్ గ్రూప్ ద్రవ్యోల్బణం రేటు కేవలం 2.03 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని ఆయా సంస్థలు ప్రస్తావిస్తున్నాయి. ఖరీఫ్ పంట దిగుబడులు, రూపాయి మారకపు విలువల స్థిరీకరణ ధోరణి రానున్న కాలంలో ద్రవ్యోల్బణాన్ని గాడికి తెస్తాయని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ విశ్లేషించారు. -
బాబోయ్ ధరలు..
న్యూఢిల్లీ: సామాన్యుడి బతుకుబండిని ధరలు అతలాకుతలం చేస్తున్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు జూలైలో బెంబేలెత్తించింది. వార్షిక ప్రాతిపదికన ఈ నెలలో ద్రవ్యోల్బణం స్పీడ్ 5.79 శాతంగా నమోదయ్యింది. అంటే గత ఏడాది జూలై నెలతో పోల్చితే 2013 జూలై నెలలో ధరలు టోకుగా 5.79 శాతం పెరిగాయన్నమాట. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. జూన్లో ఈ పెరుగుదల రేటు 4.86 శాతం. ఉల్లిపాయలు, కూరగాయలు అలాగే ఇంధన ధరలు జూలైలో టోకు ద్రవ్యోల్బణం రేటు స్పీడ్ను భారీగా పెంచాయి. 4-5 శాతం శ్రేణిలో ఈ రేటు ఉండాలని ఆర్బీఐ భావిస్తుండగా, ఈ లక్ష్యాన్ని మించి ద్రవ్యోల్బణం పైకి దూసుకుపోవడం విశేషం. మే వరకూ వరుసగా నాలుగు నెలలు టోకు ద్రవ్యోల్బణం రేటు తగ్గుతూ వచ్చింది. జూన్ నుంచి తిరిగి పైచూపు చూడడం ప్రారంభించింది. సరఫరాలవైపు సమస్యలను పరిష్కరించి ద్రవ్యోల్బణం అదుపునకు కృషి చేయాలని ఫిక్కీ సహా పలు పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఆహార ఉత్పత్తుల మంట... సూచీలోని ప్రధాన మూడు విభాగాల్లో ఒకటైన ఆహార ఉత్పత్తుల ధరల స్పీడ్ (మొత్తం సూచీలో 14.34 శాతం వాటా) అటు వార్షికంగా చూసినా, ఇటు నెలవారీగా చూసినా సామాన్యునికి ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. 2012 జూన్తో పోల్చితే 2013 జూన్లో నిత్యావసరాల ధరలు 9.74 శాతమే పెరిగితే, జూలైలో మాత్రం ఈ ధరల పెరుగుదల రేటు (2012 జూలైతో పోల్చి) భారీగా 11.91 శాతంగా నమోదయ్యింది. జూలైలో వార్షిక ప్రాతిపదికన వేర్వేరుగా చూస్తే- ఉల్లిపాయల ధరలు 145% పెరిగాయి. జూన్లో వార్షిక ప్రాతిపదికన ఈ పెరుగుదల రేటు 114%. కూరగాయల ధరలు జూలైలో 46.59 శాతం పెరిగాయి. జూన్లో వార్షికంగా ఈ పెరుగుదల రేటు 16.47 శాతమే. అంటే జూన్కన్నా జూలైలో ధరలు వార్షిక ప్రాతిపదికన మరింత తీవ్రమయ్యాయి. మిగిలిన నిత్యావసరాల విషయానికి వస్తే- బియ్యం ధరలు 21.15 శాతం దూసుకుపోయాయి. తృణధాన్యాల ధరలు 17.66 శాతం పెరిగాయి. గోధుమల రేట్లు 13.42 శాతం ఎగశాయి. పప్పు దినుసుల రేట్లు మాత్రం 7.39 శాతం తగ్గాయి. వరుసగా మూడు నెలల నుంచీ ఆహార ఉత్పత్తుల రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. మిగిలిన విభాగాలు ఇలా... ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగం మొత్తం ద్రవ్యోల్బణం రేటు 8.99 శాతంగా నమోదయ్యింది. జూన్లో ఈ పెరుగుదల రేటు 8.14 శాతం. ఒక్క ఆహారేతర వస్తువుల విభాగాన్ని చూస్తే- ద్రవ్యోల్బణం రేటు 5.51 శాతంగా ఉంది. జూన్ నెలతో పోల్చితే ఈ రేటు (7.57 శాతం) తగ్గింది. మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన తయారీ వస్తువుల విభాగం (కోర్) ద్రవ్యోల్బణం రేటు 2.81 శాతం. జూన్ నెలతో పోల్చితే (2.75 శాతం) ఈ రేటు స్వల్పంగా పెరిగింది. సూచీలో 15 శాతం వాటా కలిగిన ఇంధనం, విద్యుత్ సంబంధిత ద్రవ్యోల్బణం రేటు భారీగా 11.31 శాతానికి చేరింది. జూన్లో ఈ పెరుగుదల రేటు 7.12 శాతం మాత్రమే. రూపాయి క్షీణతే కారణం: మాంటెక్ డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం, దీనితో చమురు-ఇతర దిగుమతి చేసుకునే వస్తువులు భారంగా మారడం, ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద చూపడం ధరలు పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. అయితే తగిన వర్షపాతం నమోదై, దిగుబడులు పెరుగుతాయని, సరఫరాల వైపు సమస్యలు కూడా తొలగిపోయి ద్రవ్యోల్బణం అదుపులోనికి వస్తుందని ఆయన విశ్లేషించారు. ద్రవ్యోల్బణం అప్ట్రెండ్ కొనసాగదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రూపాయి విలువ స్థిరీకరణకు ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తగిన వర్షపాతం, రూపాయి స్థిరీకరణకు ప్రభుత్వ చర్యలు వంటి కారణాల వల్ల ఈ ఏడాది చివరకు ద్రవ్యోల్బణం 5-6 శాతం శ్రేణిలో ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.