
ప్రతీకాత్మక చిత్రం
ధర్మశాల : ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్తున్న ఓ యువకుడు గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన హర్యానా రాష్ర్టంలోని ధర్మశాలకు 50 కి.మీ దూరంలో జరిగింది. స్థానికంగా నివాసముంటన్న ఓ యువకుడు బైక్పై వెళ్తుండగా పాప్రొలా గ్రామం వద్ద హర్యానా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం మాండి-పఠాన్కోట్ జాతీయరహదారిపై జరిగింది.
మృతుడు స్థానికంగా నివాసముంటున్న జుగల్(22)గా గుర్తించారు. పాలంపూర్లో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరవ్వడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో గ్రామస్తులు జాతీయ రహదారిని బ్లాక్ చేసి ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకు దిగిన వాళ్లని చెదరగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment