వర్షిత కేసు : నిందితుడి ఊహాచిత్రం విడుదల | B Kothakota Molestation Case Police Arrest Suspected | Sakshi
Sakshi News home page

వర్షిత కేసు : నిందితుడి ఊహాచిత్రం విడుదల

Published Sun, Nov 10 2019 1:47 PM | Last Updated on Sun, Nov 10 2019 2:13 PM

B Kothakota Molestation Case Police Arrest Suspected - Sakshi

నిందితుడి ఊహాచిత్రం

చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించిన ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. 

సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈకేసులో అనుమానితుడిగా భావిస్తూ ఓ వ్యక్తిని పెద్దతిప్ప సముద్రంలో అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాంతోపాటు చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించిన ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. 
(చదవండి : లైంగికదాడి.. హత్య!)

ఫంక్షన్‌ హాల్‌లోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. దారుణానికి పాల్పడిన వ్యక్తులు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితున్ని పట్టుకునేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు. ఇక ఈ ఘటనకు పాల్పడినవారిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని, కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement