
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని తానావడ్డెపల్లి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఇన్నోవా కారును లారీ ఢీకొట్టి జాతరకు వెళ్తున్న కళాకారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.
క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. మృతులు నిమ్మనపల్లె మండలం కొండసానివారిపల్లె వాసులుగా గుర్తించారు. కళాకారులు డప్పు వాయిస్తూ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment