భార్యపై అనుమానంతో కుటుంబమంతా.. | Ghaziabad Man Kills Wife over Suspicion of Having Affair | Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానంతో కుటుంబమంతా..

Published Fri, Jul 5 2019 2:22 PM | Last Updated on Fri, Jul 5 2019 2:22 PM

Ghaziabad Man Kills Wife over Suspicion of Having Affair - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తన ముగ్గురి పిల్లలకు విషం తాగించి.. అది బయటకు రాకుండా వారి నోటికి టేప్‌

లక్నో : అనుమానం ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త తన భార్య పిల్లలను అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన  ఉత్తరప్రదేశ్‌,ఘజియాబాద్‌లోని షాత్బాది నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. 

విషం తాగించి టేప్‌ వేసి..
స్థానికంగా నివాసం ఉంటున్న ప్రదీప్‌ (37)కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న ప్రదీప్‌ గురువారం ఫుల్‌గా మధ్యం సేవించి ఇంటికొచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరగింది. తాగిన మైకంలో ప్రదీప్‌ తొలుత భార్యను చంపాడు. అనంతరం తన ముగ్గురి పిల్లలకు విషం తాగించి.. అది బయటకు రాకుండా వారి నోటికి టేప్‌ వేసాడు. తర్వాత భార్య వివాహేతర సంబంధంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాము సంఘటనాస్థలికి చేరుకునే సరికి ప్రదీప్‌ భార్య, ముగ్గురు పిల్లల్లో ఒకరు కొనఊపిరితో ఉన్నారని వారిని ఆసుపత్రికి తరలించే లోపే మరణించారన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement