ప్రణయ్‌ హత్య కేసులో.. సుపారీ కిల్లర్‌ అరెస్ట్‌ | MIRYALAGUDA Pranay Murderer arrested in Bihar | Sakshi
Sakshi News home page

ప్రణయ్‌ హత్య కేసులో.. సుపారీ కిల్లర్‌ అరెస్ట్‌

Published Tue, Sep 18 2018 1:11 PM | Last Updated on Tue, Sep 18 2018 5:00 PM

MIRYALAGUDA Pranay Murderer arrested in Bihar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో సుపారీ తీసుకొని హత్య చేసిన బిహార్‌ వాసి శర్మను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్‌ పక్కన మాటువేసిన శర్మ, ప్రణయ్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ను రియల్టర్‌ తిరునగరు మారుతీరావు హత్య చేయించాడు. ఈ హత్యకు మాజీ ఉగ్రవాది మహ్మద్‌ అబ్దుల్‌ బారీతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదిలా ఉండగా బారీ తన గురువు అస్గర్‌ అలీతో ప్లాన్‌ చేసి బిహార్‌లోని సంస్థాన్‌ పూర్‌ జిల్లాకు చెందిన శర్మను ఈ ఆపరేషన్‌కు వినియోగించాడు. బిహార్‌లో అదుపులోకి తీసుకున్న శర్మను పోలీసులు నల్గొండ తరలిస్తున్నారు.

హత్య జరిగిన రోజు శర్మతో పాటే అస్గర్‌ ఆసుపత్రికి వచ్చినట్టుతెలుస్తోంది. తన కూతురు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అస్గర్‌ డబ్బు కోసం ఈ డీల్‌ ఒప్పుకున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement