కూతుర్ని ప్రేమిస్తున్నాడని.. | Photographer, 23, Killed By Girlfriend's Family On Delhi Road, Say Police | Sakshi
Sakshi News home page

కూతుర్ని ప్రేమిస్తున్నాడని..

Feb 2 2018 8:00 PM | Updated on Jul 12 2019 3:07 PM

అంకిత్‌ (ఫైల్‌ ఫోటో) - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో  మరో పరువు హత్య కలకలం రేపింది. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడనే  ఆగ్రహంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు అమ్మాయి తరపు బంధువులు.  ఈ ఘటనలో వృత్తి రీత్యా ఫోటో గ్రాఫరైన అంకిత్‌(23) దారుణ హత్యకు గుర​య్యాడు. పశ్చిమ ఢిల్లీలోని రఘువీర్ నగర్‌లో గత రాత్రి చోటు చేసుకుంది.  పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  అంకిత్,  తన ఇంటి పక్కన ఉండే ముస్లిం యువతితో(20) గత  కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు.  ఇరు కుటుంబాల మతాలు వేరుకావడంతో దీన్న వ్యతిరేకించిన అమ్మాయి తల్లిదండ్రులు అంకిత్‌ను  దూరంగా ఉండమంటూ తీవ్రంగా హెచ్చరించారు. అక్కడినుంచి మకాం  కూడా మార్చారు. అయినా ఇద్దరి మద్య సంబంధం కొనసాగుతూనే ఉంది.  దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి  తల్లిదండ్రులు, మామయ్య, ఆమె సోదరుడు  కలిసి గత రాత్రి 9 గంటలకు అంకిత్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం పదునైన  ఆయుధంతో పొడిచి పారిపోయారు. అయితే ఈ ఘటనను కళ్లారా  చూసిన అంకిత్‌ తల్లి చుట్టుపక్కల వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనలో  అమ‍్మాయి తల్లిదండ్రులు, మామయ్యను అదుపులోకి తీసుకొన్నామని,  మరో నిందితుడు, యువతి సోదరుడు పరారీలో ఉన్నాడని సీనియర్ పోలీసు అధికారి విజయ్‌ కుమార్  వెల్లడించారు.
 
 

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement