పాలిష్‌ వేస్తానని మస్కా- మహిళ అరెస్ట్‌ | police arrest fraud woman in hosur | Sakshi
Sakshi News home page

పాలిష్‌ వేస్తానని మస్కా- మహిళ అరెస్ట్‌

Feb 7 2018 7:32 PM | Updated on Aug 21 2018 6:02 PM

police arrest fraud woman in hosur - Sakshi

సాక్షి, హొసూరు: కాలిగొలుసుకు పాలిష్‌ వేస్తానని మోసం చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి.. కిష్టగిరి సమీపంలోని నాగర్‌కట్ట గ్రామానికి చెందిన వనిత(30) బుధవారం వీధిలో తిరుగుతూ పాలిస్‌ వేస్తానని చెబుతూ వెళ్లింది. ఆ సమయంలో  అదే ప్రాంతానికి చెందిన దీపిక తన కొడుకు కాలులోని గొలుసులకు పాలిష్‌ వేయమని ఇచ్చింది. అయితే పాలిష్‌ వేసిన తర్వాత గొలుసులు తక్కువ బరువు రావడంతో వనితను నిలదీసింది.

దీనికి సమాధానంగా ఆ మహిళ అంతే పాలిష్‌ వేస్తే బరువు తక్కువగానే వస్తుందని ఆమె బదులిచ్చింది. దీంతో దీపిక స్థానికుల సాయంతో వనితను బంధించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వనితను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement