Fraud Case
-
సోనుసూద్ను అరెస్ట్ చేయండి.. కోర్టు ఆదేశాలు
పాటియాలా: ప్రముఖ నటుడు సోనుసూద్కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పంజాబ్లోని లూథియానా కోర్టు. ఈ మేరకు సోనుసూద్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో కోర్టు ఇలా ఆదేశించింది.వివరాల ప్రకారం.. నటుడు సోనుసూద్ (Sonu Sood)కు లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్ను సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్పై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు.. సోనుసూద్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.పిటిషన్పై విచారణ అనంతరం..‘సోనుసూద్కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. ఇక, సోనుసూద్కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోనుసూద్ తెలుగు సహా బాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.Ludhiana’s Judicial Magistrate Ramanpreet Kaur has issued an arrest warrant against Bollywood actor Sonu Sood.The warrant was issued after Sonu Sood failed to appear in court to testify in a ₹10 lakh fraud case involving the fake Rijika coin. The case was filed by… pic.twitter.com/yZ5R3gk32p— Gagandeep Singh (@Gagan4344) February 6, 2025 -
డొనాల్ట్ ట్రంప్ ఓడిపోయి ఉంటేనా..
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. ఈలోపు ఆయనకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్ గనుక ఓడిపోయే ఉంటే.. ఆయనకు కచ్చితంగా శిక్ష పడేదని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మంగళవారం ఓ నివేదిక రిలీజ్ చేసింది.స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్(Jack Smith) నివేదిక ప్రకారం.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఉద్దేశపూర్వకంగానే ఆయన అసత్య ప్రచారాలకు దిగారని, తద్వారా శాంతియుతంగా అధికార మార్పిడికి భంగం కలిగించారని అభియోగాలు నమోదయ్యాయి. దీనిని తీవ్ర నేరంగా స్పెషల్ కౌన్సల్ జాక్ స్మిత్ పరిగణించారు. అంతేకాదు.. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను తన అబద్ధాలతో ట్రంప్ భ్రష్టు పట్టించే యత్నమూ చేశారనే పేర్కొన్నారు. ట్రంప్పై అభియోన్నింటికి సరైన ఆధారాలున్నాయి. ఒకవేళ ట్రంప్ కిందటి ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో గనుక ఓడిపోయి ఉంటే.. ఈ నేరాలకుగానూ కచ్చితంగా శిక్ష పడేది అని ఆ నివేదిక స్పష్టం చేసింది.అయితే అర్ధరాత్రి విడుదలైన ఈ నివేదికను ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ తప్పుబట్టారు. జాక్ స్మిత్ను తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉంటే.. 2020 ఎన్నికల వ్యవహారంపై గతంలో ట్రంప్ మీద స్మిత్ అనేక ఆరోపణలను నమోదు చేశారు. ట్రంప్పై నమోదైన రెండు ఫెడరల్ క్రిమినల్ కేసులను ఆయనే పర్యవేక్షించారు.అయితే ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఆయన ట్రంప్పై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు.. తన నివేదిక బహిర్గతం అయ్యే సమయంలోనే తన పోస్టుకు సైతం రాజీనామా చేయడం గమనార్హం. -
బ్యాంకులో రూ.558 కోట్ల దొంగతనం!
ఖాతాదారులకు చెందిన సేఫ్ డిపాజిట్ బాక్స్ల నుంచి ఒక బిలియన్ యెన్ (సుమారు 6.6 మిలియన్ డాలర్లు-రూ.558 కోట్లు) సొమ్మును బ్యాంకు ఉద్యోగి దొంగలించినట్లు జపాన్లోని ప్రముఖ బ్యాంకు మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ తెలిపింది. అందుకుగాను అధికారికంగా కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. 60 మంది క్లయింట్ల్లో సుమారు 20 మంది ఖాతాల్లో నుంచే 300 మిలియన్ యెన్ (దాదాపు 2 మిలియన్ డాలర్లు-రూ.169 కోట్లు) వరకు దొంగతనాలు జరిగినట్లు ధృవీకరించింది. కస్టమర్లు కోల్పోయిన నగదు పరిహారం కోసం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త సార్ ముందున్న సవాళ్లు!ఎంయూఎఫ్జీ ప్రెసిడెంట్, సీఈఓ జునిచి హంజావా విలేకరులతో మాట్లాడుతూ..‘టోక్యోలోని మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ బ్యాంకు శాఖల్లో ఈ దొంగతనాలు జరిగాయి. ఏప్రిల్ 2020 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు ఈమేరకు ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించాం. సేఫ్ డిపాజిట్ బాక్స్లను ఓ మహిళా ఉద్యోగి నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన కీ తనవద్దే ఉంటుంది. ఆ ఉద్యోగి డబ్బు తీసుకున్నట్లు, ఇతర పెట్టుబడులు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు అంగీకరించింది. వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి విచారణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాం. జరిగిన దొంగతనానికి క్షమాపణలు కోరుతున్నాం. నగదు నష్టపోయిన కస్టమర్లకు పరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. -
బ్యాంకులో రూ.6.5 కోట్లు మోసం.. అధికారులు ఏమన్నారంటే..
హైదరాబాద్లోని బేగంపేట యాక్సిస్ బ్యాంకులో ఇటీవల రూ.6.5 కోట్ల ఘరానా మోసం జరిగినట్లు వచ్చిన కథనాలపై బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. ఎన్ఆర్ఐ బ్యాంకు కస్టమర్ పరితోష్ ఉపాధ్యాయ్ ఖాతా వివరాలు ఉపయోగించి బ్యాంకు సిబ్బంది అనధికారికంగా పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈమేరకు బ్యాంకు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.‘పరితోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు యాక్సిస్ బ్యాంక్ అధికారులపై క్రిమినల్ అభియోగాలు నమోదైనట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సదరు లావాదేవీలన్నీ పరితోష్కి పూర్తిగా తెలిసే జరిగాయి. యాక్సిస్ బ్యాంక్ సిబ్బందిపై ఆయన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ విషయం సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా బ్యాంకు విచారణకు పూర్తి సహకారం అందిస్తుంది. బ్యాంకుపై గానీ, అధికారులపై గానీ తప్పుడు లేదా తమ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రకటనలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు బ్యాంకునకు పూర్తి హక్కులు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్ ఎల్లప్పుడూ తమ కస్టమర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోంది’ అని ఉన్నతాధికారులు తెలిపారు.ఇదీ చదవండి: సహోద్యోగులతో పంచుకోకూడని అంశాలు..అసలేం జరిగిందంటే..ఆస్ట్రేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయ్కు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుంచి ప్రీమియం అకౌంట్ ఉంది. ఇటీవల అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీశారు. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు స్టేట్మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించినట్లు ఉపాధ్యాయ్ తెలిపారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బేగంపేట యాక్సిస్ బ్యాంకులోని కొంతమంది సిబ్బంది తన పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారని ఉపాధ్యాయ్ తెలిపారు. -
ఏ బుర్రలో ఎన్ని పాములుంటాయో?
ఇదేమిటబ్బా.. ‘ఏ పుట్టలో ఏ పాముంటుందో?’ అనేది కదా సామెత! ఇక్కడేదో తేడా కొడుతోందే అనుకుంటున్నారు కదా? సామెత అదే గానీ.. ఇప్పుడు రోజులు మారిపోయాయి. మోసకారి బతుకులు బతికే వారి బుర్రల్లో రకరకాల విషనాగులు, అనకొండలు, ర్యాటిల్ స్నేక్ లు రకరకాల పాములు.. అనేక రకాల టక్కుటమారాల మాయోపాయాల రూపంలో దాగి ఉంటున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. ఎవడితో ఫోటో దిగాలన్నా సరే.. కూసింత సెలబ్రిటీ స్టేటస్ ఉండే వాడు వణికి చచ్చిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంగారు పుడుతోంది. ఇక్కడ కట్ చేసి ఒక పాత ముచ్చట చెప్పుకుందాం..నాకు తెలిసి సినీ రంగంలో చాలా పెద్దాయన ఉండేవాడు. చాలా అంటే చాలా అన్నమాట. సొంత బ్యానర్ మీద సినిమాలు తీసినా కూడా.. ఎన్నడూ ఆ సినిమా కోసం బయటి కార్యక్రమాలకు రాలేనంత పెద్దాయన. ఆయన సినిమాలకు రాష్ట్రంలో ఏవైనా సంస్థలు అవార్డులు ప్రకటిస్తే.. ఆ సమాచారం పెద్దాయనకు వెళ్లిన వెంటనే.. ‘థాంక్యూ’ అనే పదం వచ్చేది కాదు. అసలు ఆ అవార్డు తాము తీసుకోవాలా వద్దా? అనే మేధోమధనం చేసేవాళ్లు.. తన అనుంగు సహచరులతో కలిసి! తన డికెష్టీలను పరిశోధన కోసం పంపేవాళ్లు. ఆ సంస్థ ఎలాంటిది? దాని సారధులు ఎలాంటి వాళ్లు? వారి పుట్టుపూర్వోత్తరాలు, పుట్టుమచ్చలు ఏమిటి? అన్నీ ఆరా తీసేవాళ్లు.అంతా తేలిన తర్వాత.. ఆ అవార్డు తీసుకోవాలా వద్దా? తీసుకోదలచుకుంటే.. తాను వెళ్లాలా? తన ప్రతినిధులు వెళ్లాలా? అనేది ఆ పెద్దాయన డిసైడ్ అయ్యేవాళ్లు! అవార్డు ఇస్తానన్నారు కదా అని ఎగబడి వెళ్లి తీసేసుకుంటే.. తనతో దిగిన ఫోటోలను అవతలి వాళ్లు మార్కెట్ చేసేసుకుని.. లాభపడిపోతారేమో అని ఆ పెద్దాయనకు భయం. అంత అతిజాగ్రత్త అన్నమాట. ఈ ముచ్చట మొత్తం కొన్ని దశాబ్దాల కిందటిది. ఇప్పుడు ఆయన లేరు. కానీ అప్పట్లో ఆయన పాటించిన జాగ్రత్తలు మాత్రం అందరికీ అవసరమేమో అనిపిస్తున్నది. ఇక్కడ కట్ చేసి అసలు సంగతిలోకి వద్దాం..విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్ అనే కుర్రాడున్నాడు. పదో తరగతి ఫెయిలయ్యాడు. సెలబ్రిటీలతో కార్యక్రమాలు నిర్వహించడం వారితో ఉన్న ఫోటోలు పరిచయాలను ప్రచారానికి వాడుకుని.. వారందరూ తనకు భాగస్వాములని, తన వ్యాపారాల్లో బినామీలుగా పెట్టుబడులు పెట్టారని చెప్పుకుంటూ.. ఇతరుల నుంచి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించడం.. అంతా అయిన కొన్నాళ్లకు ఆ వ్యాపారం బోర్డు తిప్పేయడం అనే టెక్నిక్ ను కనుగొన్నాడు.ఊళ్లమీదికొచ్చి చేయి చూసి జాతకం చెప్పే, సిగలో ఈకలు దూర్చుకున్న కొండదొర.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేషూ, నాగార్జునలతో దిగిన ఫోటోలని చూపించి డప్పు కొట్టుకున్నట్టే అన్నమాట! ఈ ప్రబుద్ధుడు ముందు విశాఖలో పింక్ థాన్ అనే కార్యక్రమం పేరుతో సెలబ్రిటీలు చాలా మంది అక్కడికొచ్చేలా ప్లాన్ చేశాడు. హైదరాబాదులో సస్టెయినబుల్ కార్ట్ అంటూ ఓ దుకాణం తెరిచాడు. ఓ సెలబ్రిటీతో రెండు కోట్లు పెట్టుబడి పెట్టించాడు. అందులో గందరగోళాలు గమనించి ఆమె త్వరగానే తప్పుకున్నారు.తర్వాత హైదరాబాదులో చైన్ ఆఫ్ హోటల్స్ ప్రారంభించి.. ఓ మాజీ మంత్రి, ఓ సినిమా ఫ్యామిలీ తన వాటాదారులని నమ్మించి ఇతరులతో కోట్లు పెట్టుబడి పెట్టించాడు. ఆ రెండు దుకాణాలను ఎత్తేసి.. తృతీయ జువెలర్స్ అంటూ కొత్త దందా మొదలెట్టాడు. సినీ నటి అందులో పార్టనర్ అని చెప్పుకుని.. ఇతరులతో మరికొన్ని కోట్లు పెట్టుబడి పెట్టించాడు. తీరా ఒకటి రెండు వ్యవహారాలు పోలీసు గడప తొక్కగానే ప్రస్తుతం కటకటాల్లో ఉన్నాడు.కట్ చేస్తే.. జనం ఇంత సులువుగా ఎలా మోసపోతున్నారనేది ఆలోచించాల్సిన సంగతి. అలాగే సెలబ్రిటీలు ఎవరికైనా తమకు పుట్టుపూర్వోత్తరాలతో సహా తెలియని వ్యక్తులు వచ్చి కార్యక్రమాలకు, అవార్డులకు పిలిస్తే వెళ్లడానికి భయపడాల్సిన పరిస్థితి. ఏ అవార్డు పుచ్చుకుంటే.. ఆ ఫోటోలతో ఎవరెలాంటి కొత్త మోసాలను ప్లాన్ చేస్తుంటారో ఎవ్వరికీ బోధపడని ఆధునిక రోజులు. సైబర్ మోసాల ద్వారా.. అమాయకులైన పేద ప్రజలు అకౌంట్లలో ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా మోసపోవడం చాలా చూస్తున్నాం. ఇప్పుడిలా సెల్రబిటీలు మోసపోయే వారు కొందరు.. మోసాల క్రీడలో తాము పావులుగా మారుతున్నవారు మరికొందరు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటివి మరికొన్ని జరిగితే.. ఎవరు ఏ అవార్డు ఆఫర్ చేసినా, గెస్టుగా పిలిచినా.. సెలబ్రిటీలు.. ముందు చెప్పుకున్న పెద్దాయన సిద్ధాంతాన్ని ఫాలో అయి.. వంద ఆలోచిస్తారేమో మరి!-ఎం. రాజేశ్వరి. -
అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?
అదానీ గ్రూప్తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃపరిశీలిస్తామని కెన్యా ప్రకటించింది. కెన్యాలో విమానాశ్రయ అభివృద్ధితోపాటు ఎనర్జీ ప్రాజెక్ట్ల విస్తరణ కోసం అదానీ గ్రూప్ గతంలో ఒప్పందం చేసుకుంది. ఇటీవల అదానీ సంస్థలపై చెలరేగుతున్న నేరాభియోగాల వల్ల కెన్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.హిండెన్బర్గ్ రీసెర్చ్ ఉదంతం నుంచి కోలుకుని, క్రమంగా పుంజుకున్న అదానీ గ్రూప్నకు మళ్లీ షాక్ తగిలింది. భారత్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్లు పొందేందుకు దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి.ఇదీ చదవండి: సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి: ఐఎస్ఏ నివేదికఈ నేపథ్యంలో కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ప్రకటన విడుదల చేశారు. కెన్యాలో విమానాశ్రయాలు, పవర్ ట్రాన్స్మిషన్లైన్ల విస్తరణకు అదానీ గ్రూప్తో గతంలో చేసుకున్న ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు చెప్పారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాక దీనిపై పునరాలోచిస్తామన్నారు. ఈ డీల్ విలువ 736 మిలియన్ డాలర్లు(రూ.6216 కోట్లు). ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు. -
తస్మాత్ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసం
ప్రీలాంచ్, సాఫ్ట్ లాంచ్ పేర్లతో స్థిరాస్తి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను మోసం చేస్తున్న రియల్టీ సంస్థలు..తాజాగా బై బ్యాక్ స్కీమ్కు తెరలేపాయి. ముందస్తుగా కొంత మేర కంపెనీలో డిపాజిట్ చేస్తే ప్రతీ నెలా అధికంగా వడ్డీ చెల్లించడంతో పాటు కొంత స్థలం లీజు డీడ్ చేసిస్తామని మోసం చేయడం ఈ స్కీమ్ స్కామ్. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 120 మంది బాధితుల నుంచి రూ.24 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేశారు. స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా, యాడ్ అవెన్యూస్ కంపెనీలకు చెందిన నలుగురు ప్రతినిధులను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. డీసీపీ కె.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన బైర చంద్రశేఖర్, విజయవాడకు చెందిన వేములపల్లి జాన్వీ, రెడ్డిపల్లి కృష్ణ చైతన్య, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన గరిమెల్ల వెంకట అఖిల్ నలుగురు కలిసి డైరెక్టర్లుగా పేర్కొంటూ కూకట్పల్లిలోని మంజీరా ట్రినిటీ మాల్లో స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా, యాడ్ అవెన్యూస్ పేర్లతో రెండు స్థిరాస్తి సంస్థలను ఏర్పాటు చేశారు. నెలకు అధిక వడ్డీ చెల్లిస్తామంటూ కస్టమర్లకు, పెట్టుబడిదారులకు ఆశ పెట్టారు. రూ.17 లక్షలు డిపాజిట్ చేస్తే వంద నెలల పాటు ప్రతీ నెలా రూ.20 వేల వడ్డీ చెల్లిస్తామని, అలాగే మహబూబ్నగర్ జిల్లాలోని తిరుమలగిరిలో 267 గజాల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ భూమిలో శాండల్వుడ్ చెట్లను పెంచుతామని, 13–15 ఏళ్ల తర్వాత ఈ చెట్లను విక్రయించగా వచ్చిన సొమ్ములో 50 శాతం లాభాలను కూడా అందిస్తామని ఆశ పెట్టారు.బాధితులను నమ్మించేందుకు లీజు డీడ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ), చెక్లను అందించారు. కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత చెల్లించడం మానేశారు. వడ్డీలు చెల్లించకపోవడంతో కస్టమర్లు ఆఫీసుకు రావడం మొదలుపెట్టారు. దీంతో నిందితులు కూకట్పల్లి నుంచి జూబ్లీహిల్స్కు కార్యాలయాన్ని మార్చి, తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు కార్యాలయ జాడను బాధితులు పట్టేయడం, చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేయడంతో నిందితులు రాత్రికి రాత్రే ఆఫీసుకు తాళం వేసి పరారయ్యారు. దీంతో కేపీహెచ్బీ కాలనీకి చెందిన అల్లం నాగరాజు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 కింద కేసులు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.ఇదీ చదవండి: ‘నా పెళ్లి కోసం అన్నయ్య పెళ్లి వాయిదా’కష్టపడి పొదుపు చేయాలకున్న సొమ్మును ఇలా ఎలాంటి నియంత్రణ ఆధ్వర్యంలోలేని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి మోసపోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే ఈక్విటీ మార్కెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఈటీఎఫ్..వంటివి ఎంచుకోవాలని చెబుతున్నారు. ప్రధానంగా ఎలాంటి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని లేని కంపెనీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. -
మరో స్టార్ కొరియోగ్రాఫర్పై చీటింగ్ కేసు
టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పటికే రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాపై చీటింగ్ కేసు నమోదైంది. ఇతడి భార్యతో పాటు మరో ఐదుగురి కలిసే తనని మోసం చేశారని 26 ఏళ్ల డ్యాన్సర్.. ముంబైలోని మీరారోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)ఫిర్యాదు ప్రకారం.. డ్యాన్సర్ టీమ్ 2018-24 మధ్యలో టీవీ షోలో విజేతగా నిలిచింది. వీళ్ల గెలుచుకున్న రూ.11.96 కోట్ల ప్రైజ్మనీని రెమో డిసౌజా తదితరులు తదమే అన్నట్లు బిల్డప్ ఇచ్చి మరీ లాక్కున్నారు. రెమో డిసౌజాతో పాటు అతడి భార్య లీజెల్ డిసౌజా, ఓం ప్రకాశ్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవన్, ఫ్రేమ్ ప్రొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, రమేశ్ గుప్తా ఉన్నారు.వీళ్లపై డ్యాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. రెమో డిసౌజాతో పాటు మరో ఆరు మందిపై 465 (ఫోర్జరీ), 420 (మోసం) సహా ఇతర సెక్షన్ల కింద కేసు మోదు చేశారు. ఇకపోతే రెమో డిసౌజా కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టాడు. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించాడు. ఫ్లయింగ్ జాట్, ఏబీసీడీ ఫ్రాంచైజీ, సల్మాన్ ఖాన్ 'రేస్ 3' సినిమాలతో దర్శకుడిగానూ అలరించాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'హ్యాపీ' త్వరలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఏదేమైనా స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యిండి ఇలా చీటింగ్ చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్) -
ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రాడ్.. రెండోరోజు విచారిస్తున్న సీఐడీ
సాక్షి,పల్నాడుజిల్లా: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు రెండోరోజు శుక్రవారం(అక్టోబర్11)విచారణ చేపట్టారు.ఇవాళ మరికొంత మంది ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదారులు చెప్పిన అంశాల ఆధారంగా బ్యాంకు శాఖల్లో సీఐడీ రికార్డులను పరిశీలిస్తోంది.ఫిక్స్డ్ డిపాజిట్లు,బంగారు ఆభరణాలపై రుణాలు,ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై విచారిస్తున్నారు.బ్యాంకు శాఖల్లో అక్రమాలకు ఇప్పటి వరకు 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.కాగా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసినట్లు అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.ఇదీ చదవండి: రూ.229 కోట్ల మోసం.. ఇద్దరి అరెస్టు -
హైదరాబాద్లో భారీ మోసం.. రూ. 700 కోట్లతో బోర్డు తిప్పేసిన కంపెనీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీ మోసం వెలుగుచూసింది. రూ.700 కోట్ల రూపాయలు కాజేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ.. DKZ టెక్నాలజీస్ సంస్థ ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించింది. అయితే లాభాలు పక్కన పెడితే అసలుకే టోపి పెట్టింది. మొత్తం 700 కోట్ల రూపాయలు దండుకొని చేతులెత్తేసింది.మూడు రాష్ట్రాల్లో 55 వేల మందికి పైగా బాధితులు ఉండగా.. హైదారాబాద్ వ్యాప్తంగా 18 వేల మంది బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. దీంతో మీడియాకు తమ గోడు వెల్లబుచ్చేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు వందలాది బాధితులు చేరుకుంటున్నారు.కాగా తమ కంపెనీపై నమ్మకం కలిగించేందుకు సంస్థ తొలుత ఇన్వెస్టర్లకు లాభాలు చూపించింది. ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల అకౌంట్లో డబ్బులు జమ చేశారు కేటుగాళ్లు.సోషల్ మీడియా ఇన్ల్ఫ్యూయెన్సర్లతో కూడా ప్రమోషన్లు చేయించారు. లాభాలు వస్తుండటంతో.. అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరీ బాధితులు పెట్టుబడులు పెట్టారు. చివరికి 700 కోట్ల రూపాయల వరకు దండుకుని మోసగాళ్లు పరారయ్యారు. అయితే బాధితుల్లో ఒకే వర్గానికి చెందిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. -
మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. .. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి.ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఏపీ వాదనలు: కేసు నడుస్తుండగా రూ,2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి మార్గదర్శి వాదనలు: 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము సుప్రీం కోర్టులో ఉండవల్లి.. ‘‘రామోజీ రావు అంటే అందరికీ భయం.. రామోజీ రావుకు నేనంటే భయం’’. ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది’ : రామోజీ తరఫు న్యాయవాదులు ‘‘అయితే ఎంటీ... ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేం’’: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సాక్షి టీవీతో ఉండవల్లి మాట్లాడుతూ.. తన 17 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నిజమే అని రుజువైంది. దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే చెల్లదు. 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు ప్రయత్నం విఫలమయ్యింది. ఆఖరికి.. నాపై గ్యాగ్ ఆర్డర్ తేవాలని ప్రయత్నం చేశారు. కానీ, నా పోరాటం వృథా కాలేదు’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. నేపథ్యం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్నది రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్పై ఉన్న ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 2006లో మార్గదర్శి రూ.2,300 కోట్ల డిపాజిట్లను సేకరించిదని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చర్యలకు సిద్ధమైన అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా.. దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31 మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని, ఆ తీర్పును సమీక్షించాలని 2019లో ఉండవల్లి సుప్రీం కోర్టులో ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు కూడా. అప్పటి నుంచి ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. గత విచారణే కీలకం మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. -
రూ.వేలల్లో ఇచ్చి రూ.కోట్లల్లో కొట్టేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ‘పిగ్ బుచ్చరింగ్’... తరహాకు చెందిన ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిపోయాయని నగర సంయుక్త పోలీసు కమిషనర్ (నేరాలు) ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ స్కామ్స్లో మోసపోతున్న వారిలో చార్టెడ్ అకౌంటెంట్లు, ఏళ్లుగా ట్రేడింగ్ చేస్తున్న నిపుణులతో పాటు విద్యాధికులు ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ప్రతి రోజూ కనిష్టంగా నాలుగు కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ జరుగుతున్న విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అదే పంథా ఇక్కడ అమలు... మాంసం వ్యాపారులు పంది బక్కపలుచగా ఉన్నప్పుడు దాన్ని వధించరు. కొన్నాళ్లపాటు దానిని మేపడం ద్వారా బలిష్టంగా చేసి ఆపై మాంసంగా మారుస్తారు. పిగ్ బుచ్చరింగ్గా పిలిచే ఈ విధానాన్నే ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ చేసే నేరగాళ్లు అనుసరిస్తున్నారు. ట్రేడింగ్ పేరుతో వివిధ రకాలైన సోషల్మీడియా ప్లాట్ఫామ్స్పై ప్రకటనలు గుప్పిస్తున్న నేరగాళ్లు పలువురిని ఆకర్షిస్తున్నారు. ఇలా తమ వల్లోపడిన వారికి పూర్తి నమ్మకం కలగడం కోసం కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. వీటి ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ తదితర గ్రూపుల్లో వారికి సభ్యులుగా చేస్తున్నారు. ఆపై ప్రత్యేక లింకుల ద్వారా తమ యాప్స్ టార్గెట్ చేసిన వారి ఫోన్లలో డౌన్లోడ్ చేయిస్తున్నారు. దీని డ్యాష్బోర్డ్లో సదరు వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత లాభం వచి్చంది? మొత్తం ఎంతకు పెరిగింది? తదితరాలు కనిపిస్తూ ఉంటాయి. తొలినాళ్లల్లో వాళ్లు పెట్టిన పెట్టుబడికి రూ.వేలల్లో లాభాలు ఇచ్చి పూర్తిగా నమ్మిస్తారు. ఆపై పెట్టుబడి మొత్తాన్ని రూ.లక్షలు, రూ.కోట్లకు పెంచేలా చేస్తారు. ఆ గ్రూపుల నిండా ‘లాభాలే’... ఈ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్కు సంబంధించిన యాప్ల్లో కొన్ని ప్రముఖ సంస్థల పేర్లతో, వాటి లోగోలతో ఉంటుండటంతో బాధితులు తేలిగ్గా మోసపోతున్నారు. వీరు సభ్యులుగా ఉండే గ్రూపులకు ప్రీమియం, వీఐపీ లాంటి పేర్లు పెడతారు. వీటిలో అత్యధికులు సైబర్ నేరగాళ్ల అనుచరులే సభ్యులుగా ఉంటారు. వారు ప్రతి రోజూ తనకు ఇంత మొత్తం లాభం వచి్చంది, అంత మొత్తం లాభం వచి్చంది అంటూ కామెంట్స్ పోస్టు చేస్తారు. దీంతో పాటు తమ యాప్స్కు సంబంధించి డ్యాష్బోర్డులు, నగదు తమ ఖాతాల్లో మళ్లినట్లు చూపించే కలి్పత సందేశాలను ఈ గ్రూపుల్లో పొందుపరుస్తారు. ఇవి చూసిన బాధితులు పూర్తిగా నమ్మేస్తారు. అప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు వీళ్లు పెట్టే పెట్టుబడులను తమ సొంత ఖాతాల్లో డిపాజిట్ చేయిస్తారు. ప్రతి దశలోనూ భారీ లాభాలు వచ్చాయంటూ సందేశాలు పంపడంతో పాటు యాప్ల డ్యాష్ బోర్డుల్లోనూ ఆ మొత్తాన్ని చూపిస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత వాటిలోని విత్డ్రా ఆప్షన్ డిజేబుల్ చేసేసి బాధితులు తమ నగదు వెనక్కు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తారు. అప్పటికే వీరి నుంచి భారీ మొత్తం పెట్టుబడిగా తీసేసుకుని ఉంటారు. దీంతో ఈ మొత్తం అది నష్టపోతామనే ఉద్దేశంతో బాధితులు నేరగాళ్లు చెప్పినట్లు చేయడానికి సిద్ధమవుతారు. అసలు కథ మొదలెట్టి వీలైనంత... దీనిని క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు డ్యాష్బోర్డులో కనిపిస్తున్న వర్చువల్ ఖాతాల్లో నగదు డ్రా చేసుకోవాలంటే నిరీ్ణత మొత్తం పెట్టుబడి పెట్టాలని మరికొంత డిపాజిట్ చేయించుకుంటారు. చివరకు ఆదాయపు పన్ను, జీఎస్టీ తదతర చెల్లింపుల పేరుతో మిగిలిన మొత్తం కాజేసి... ఆ యాప్, గ్రూపులు పని చేయకుండా చేస్తారు. ఇలా భారీ మొత్తాలు స్వాహా చేస్తున్న ఈ యాప్స్ వెనుక చైనీయులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తరహా కేసుల్లో బాధితుల నుంచి కాజేసిన మొత్తం క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో దేశం దాటిపోతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ మోసాల నేపథ్యంలో కేవలం సెబీ అనుమతి ఉన్న సంస్థలు, యాప్ల ద్వారానే ట్రేడింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. డీమ్యాట్ ఖాతాల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలని, బ్రోకర్ల సహా ఎవరి వ్యక్తిగత ఖాతాల్లోని నగదు బదిలీ చేయవద్దని స్పష్టం చేస్తున్నారు. అపరిచిత గ్రూపుల్లోని పోస్టులు నమ్మడం, లింకుల ద్వారా వచ్చే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడదని ఆయన పేర్కొన్నారు. -
బిగ్బాస్కి ఎంపిక చేయిస్తామని మోసం
హైదరాబాద్: తనను బిగ్ బాస్–7లోకి పంపిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ అమ్మినేని స్వప్న అనే యాంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్ స్వప్న యాంకర్గా, ఈవెంట్ ఆర్గనైజర్గా టాలీవుడ్లో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లోకి కంటెస్టెంట్గా పంపిస్తానని మా టీవీలో ప్రొడక్షన్ ఇన్చార్జిగా పనిచేస్తున్న సత్య బిగ్బాస్ ఇన్చార్జి తమిలి రాజును పరిచయం చేశారు. బిగ్ బాస్ లోకి వెళ్లడానికి అందులో ఉపయోగించే దుస్తులు ప్రచారం కోసం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని తమిలి రాజు ఆమెకు సూచించారు. ఈ మేరకు గత ఏడాది జూన్ నుంచి దాదాపు రెండున్నర లక్షలు ఆమె అతనికి చెల్లించింది. ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇస్తానంటూ తమిలి రాజు ఆమెను నమ్మించాడు. ఇందుకు సంబంధించి తమిలి రాజు ఆమెకు ఒక అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి నన్ను మోసం చేస్తూ వచ్చాడు. డబ్బుల గురించి ప్రశ్నించగా తాను ఇవ్వనని తేల్చి చెప్పడంతో కొద్దిరోజుల క్రిందట స్వప్న వీడియో రూపొందించి సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. ఇదే సంఘటనపై శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు సెక్షన్ 406, 420 కింద రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Anchor Swapna Chowdary: బిగ్ బాస్ కోసం రూ. 2.50 లక్షలు ఇస్తే మోసం చేశారు -
సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్.. రూ. 4 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్ జరిగింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్పై కేసు నమోదైంది. అయితే ఓ సాఫ్ట్వేర్ యువతి అకౌంట్లోనే సుమారు రూ. 48 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల నుంచి యువతి డబ్బులు అడుగుతున్నా మేనేజర్ పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాతాదారుల నగదు మాయం పట్ల బ్యాంక్ మేనేజర్ హస్తంపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. చదవండి: TS: కొత్త పాలసీ? ఉచిత విద్యుత్పై కీలక ఆదేశాలు -
ఉపన్యాసం వద్దు.. ట్రంప్పై న్యాయమూర్తి ఆగ్రహం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను న్యాయమూర్తి మందలించారు.కోర్టులో రాజకీయ ప్రసంగాలు ఇవ్వరాదని చివాట్లు పెట్టారు. విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని చెప్పారు. బ్యాంకులు, బీమా కంపెనీల నుంచి ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందడానికి ట్రంప్ తన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను ఎక్కువ చూపించారనే ఆరోపణల కేసులో విచారణ జరిగింది. "ఇది రాజకీయ ర్యాలీ కాదు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ప్రసంగాలు వద్దు.' అని ట్రంప్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోరోన్ హెచ్చరించారు. ట్రంప్ను ఎక్కువ మాట్లాడకుండా నియంత్రించాలని పిటిషనర్ తరుపు లాయర్పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కోర్టు హాల్లో ట్రంప్ అన్నారు. కోర్టుల్లో కాలయాపన చేస్తూ తన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. విచారణ అసంబద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో ట్రంప్ బ్రాండ్ విలువను కలపకుండానే ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం తన బ్రాండ్తోనే ఈ సారి ఎన్నికల్లో విజయం సాధిస్తానని అన్నారు. ట్రంప్ ప్రసంగంతో విసిగిన న్యాయమూర్తి మందలించారు. 2024 ఎన్నికల నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి తరుపున ట్రంప్ పోటీలో ఉన్నారు. ఇదీ చదవండి: 17 సార్లు పొడిచి భార్యపై కిరాతకం.. అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు -
మనీలాండరింగ్ కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్..
చండీగఢ్: పంజాబ్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. మలేర్కోట్లా జిల్లాలోని అమర్గఢ్లో సోమవారం ఉదయం ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా.. అక్కడకు వచ్చిన ఈడీ అధికారులు ఆయనను అదుపులోకీ తీసుకున్నారు. గతేడాది నమోదైన రూ. 40 కోట్ల బ్యాంక్ మోసం కేసులో ఈడీ ఈ చర్యకు పాల్పడింది. ఈ కేసులో పంజాబ్ శాసనసభ్యుడికి ఈడీ ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు జారీ చేసింది. అయితే వీటిని జశ్వంత్ సింగ్ పట్టించుకోకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ సాయంత్రం ఎమ్మెల్యేను మొహాలీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అసలేం జరిగిందంటే.. పంజాబ్ లూదియానాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ గతేడాది తారా కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీతోపాటు జశ్వంత్ సింగ్, మరికొందరిపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. వీరంతా తమ బ్యాంకును రూ.41కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ గతేడాది సెప్టెంబరులో.. జశ్వంత్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలుచోట్ల సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో లెక్కల్లో తేలని రూ.16.57లక్షల నగదు, విదేశీ కరెన్సీ, బ్యాంకు, ఆస్తి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఎమ్మెల్యే అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆప్.. తమను దెబ్బతీయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శలు గుప్పించింది. జశ్వందర్ సింగ్ ఆప్లో చేరే ముందు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇది తమ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన పన్నాగమని ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్ కాంగ్ ఆరోపించారు. బహిరంగ సభలో నుంచి ఎమ్మెల్యేను తీసుకెళ్లిన విధానం చూస్తుంటే ఆప్ను కించపరిచేందుకు బీజేపీ బలమైన వ్యూహాలను అనుసరిస్తుందనే విషయం అర్థమవుతుందని మండిపడ్డారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో సహా పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని నుంచి రూ. 508 కోట్లు లంచంగా తీసుకున్న ఆరోపణలపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ను కూడా ఈడీ విచారిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 2న తమ ఎదుట హాజరు కావాలని కోరగా.. ఇందుకు ఢిల్లీ సీఎం నిరాకరించారు. ఇక ఇటీవల డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ విచారణలో భాగంగా మరో ఆప్ ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్కు చెందిన పలు చోట్ల ఈడీ సోదాలు జరిపింది. చదవండి: బిల్లుల ఆమోదంలో జాప్యం.. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు -
'వీఓఏ' కదా అని అందరూ నమ్మారు.. తిరిగి చూస్తే షాక్!
సాక్షి, మహబూబాబాద్: మండలకేంద్రంలో ఐకేపీ వీఓఏగా పనిచేస్తున్న ఓ మహిళ రూ.మూడు కోట్ల మేర అప్పులు చేసి ఉడాయించినట్టు ప్రచారం జరుగుతోంది. పలువురు మహిళలతో ఏర్పడిన పరిచయం వల్ల డబ్బులను అప్పుగా ఇచ్చి, పుచ్చుకోవడాన్ని నమ్మకంగా చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పులిచ్చే వారికి నమ్మకం కలిగించిన సదరు వీఓఏ ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి రూ.లక్షల్లో అప్పులు తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు గ్రామసమాఖ్యల ద్వారా ఐకేపీ గ్రూపులకు ఇచ్చిన సీ్త్రనిధి డబ్బులను సైతం ఓ వీఓ దగ్గర నుంచి రికవరీ పేరుతో తీసుకున్నట్టు సమాచారం. నాలుగు రోజులుగా డబ్బులు తీసుకున్న వీఓఏ జాడలేకపోవడంతో అనుమానం వచ్చి మహిళలు విచారించగా ఉడాయించినట్టు గుర్తించారు. దీంతో అప్పులు ఇచ్చిన మహిళలు తమ నగదు ఎలా తిరిగి వస్తాయోననే ఆందోళనలో ఉన్నారు. ఇవి కూడా చదవండి: 'క్రెడిట్ కార్డు' కోసం.. ఫోన్కు మెసేజ్ వచ్చిందా.. జర జాగ్రత్త! లేదంటే.. -
రూ. 1,600 కోట్ల మోసం కేసు.. అశోకా యూనివర్సిటీ కో-ఫౌండర్స్ అరెస్ట్
పారాబొలిక్ డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తా రూ.1600 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడ్డారని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులని తమ విచారణలో తేలినట్టు తెలిపింది. దీనిపై అశోకా యూనివర్సిటీ స్పందిస్తూ ఈ కేసుకు, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మనీలాండరింగ్ కేసులో హర్యానాకు చెందిన అశోకా యూనివర్సిటీ సహా వ్యవస్థాపకులు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. వీరితోపాటు చార్టెట్ అకౌంటెంట్ ఎస్కే బన్సాల్ను సైతం అదుపులోకి తీసుకుంది. ఈ ముగ్గురిని ఈడీ చంఢీగడ్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అయిదు రోజుల కస్టడీకి అనుమతినినచ్చింది. కాగా పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాపై రూ. 1,627 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి మనీలాండరింగ్ కేసు నమోదైంది. వీరిద్దరిపై, సదరు ఫార్మా కంపెనీపై సీబీఐ 2021లో కేసు నమోదు చేసింది. దీంతో 2022లో వారు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పారాబోలిక్ కంపెనీలకు చెందిన మొత్తం 17 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీ, ముంబై, ఛండీగఢ్, పంచకుల, అంబాల తదితర ప్రాంతాల్లోని ఈ సోదాలు జరిగాయి. దీనిపై అశోకా యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈడీ విచారిస్తున్న పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీకి అశోకా యూనివర్సిటీక ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తమ యూనివర్సిటికి 200కుపైగా ఫౌండర్లు, డోనర్స్ ఉన్నారని, వారిలో వినీత్, ప్రణవ్ గుప్తా ఒకరని తెలిపారు. చదవండి: అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా -
ED Attachment: మూడు ఆండ్రాయిడ్ యాప్లు..రూ.150 కోట్ల మోసం!
అధిక రాబడి వస్తుందని ప్రజల్లో ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్న మొబైల్ యాప్ నిర్వాహకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. యాప్ నిర్వాహకులైన వైభవ్ దీపక్ షా, సాగర్ డైమండ్స్, ఆర్హెచ్సీ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్కు చెందిన రూ.59.44 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పవర్ బ్యాంక్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉత్తరాఖండ్, దిల్లీ పోలీసులు(స్పెషల్ సెల్), కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు చెప్పారు. భారత ప్రజలను మోసం చేసేందుకు చైనాకు చెందిన కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల సహాయంతో దేశంలో షెల్ కంపెనీలను సృష్టించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తమ పెట్టుబడులపై భారీ మొత్తంలో సంపాదించవచ్చని ప్రజల్లో ఆశ చూపించి మోసం చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్లోని పవర్ బ్యాంక్ యాప్, టెస్లా పవర్ బ్యాంక్ యాప్, ఈజీప్లాన్ అనే మూడు అప్లికేషన్ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించామన్నారు. ఈ యాప్ల ద్వారా ప్రజల నుంచి రూ.150 కోట్ల మేర మోసం చేసినందుకు దిల్లీ పోలీస్ సైబర్ సెల్ జూన్ 2021లో అనేక మందిని అరెస్టు చేసింది. ఈ యాప్లు కస్టమర్ల నుంచి చెల్లింపులను సురక్షితం చేసిన తర్వాత వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేసేవని ఈడీ తెలిపింది. ఇలా కూడగట్టిన డబ్బును నిందితులు, ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు బోగస్ దిగుమతుల సాకుతో విదేశాలకు భారీగా నిధులు మళ్లించారని వెల్లడైంది. అయితే రూ.10.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ రికవరీ చేసింది. రూ.14.81 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
'సాక్షి' ప్రచురిత కథనానికి.. రిమ్స్ అక్రమార్కులపై స్పందించిన కలెక్టర్!
ఆదిలాబాద్: రిమ్స్లో అవినీతి, అక్రమార్కులపై కలెక్టర్ రాహుల్రాజ్ సీరియస్ అ య్యారు. డైరెక్టర్ జైసింగ్ రా థోడ్ను మంగళవారం సాయంత్రం పిలిపించి తాజా ఘటనలపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని డైరెక్టర్ను ఆదేశించారు. ఈనెల 18న ‘సాక్షి’లో ‘అవుట్సోర్సింగ్ మోసాలు.. ’శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. నిరుద్యోగి నుంచి డబ్బులు వసూలు చేసిన సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ, విచారణ కమిటీ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
నటి మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్ట్
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. గత ఏడాది నటి మహాలక్ష్మి శంకర్ను ఆయన పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నిర్మాత రవీందర్ చిక్కుల్లో పడ్డాడు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) వారు రవీందర్ను అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్లో సంచలనంగా మారింది. ది హిందూ ప్రకారం, ఘన వ్యర్థాల నుంచి ఒక ప్రాజెక్ట్ (విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా) పెట్టుబడి పెట్టి గణనీయమైన లాభాలను పొందవచ్చని ఆయన నమ్మపలికాడు. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని ఈ ప్రాజెక్ట్లో భాగస్వామిని చేశాడు. అందుకు గాను అతని నుంచి రూ. 15.83 కోట్లు తీసుకున్నాడని సమాచారం. వారిద్దరి మధ్య ఈ ఒప్పందం సెప్టెంబర్ 17, 2020న జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ రవీందర్ మొదట చెప్పిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాడు. (ఇదీ చదవండి; సీరియల్స్లో జగతినే.. అక్కడ మాత్రం తన ఫోటోలు వైరల్) దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రశ్నంచగా రవీందర్ నుంచి సరైన సమాధానం లభించలేదని తెలుస్తోంది. దీంతో రవీందర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలాజీ భావించారు. రవీందర్ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్థిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లో బాలాజీ అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్ను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆయన పలు సినిమాలు నిర్మించి కోలీవుడ్లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. రవీందర్ చంద్రశేఖరన్ ఇప్పటికే పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో విజయ్ అనే తన స్నేహితుడి నుంచి రూ. 15 లక్షలు తీసుకుని, ఒక సినిమా నిర్మాణంలో భాగం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే కేసు కూడా రవీందర్పై ఉంది. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) -
జైలులో లొంగిపోతా: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేయడానికి సన్నాహాల్లో చేసుకుంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కేసుల భయం, అరెస్టు భయం వెంటాడుతోంది. 2020లో జార్జియా రాష్ట్ర ఎన్నికల ఫలితాలను మార్చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్ గురువారం ఫుల్టన్ కౌంటీ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అరెస్టు కావడానికి జార్జియాలోని అట్లాంటాకు వెళ్తున్నానని తెలియజేశారు. అక్కడ జిల్లా అటార్నీ ఫానీ విల్లీస్ తనను అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. తన అరెస్టు ప్రక్రియను అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్తోపాటు మరో 18 మంది ఆగస్టు 25లోగా లొంగిపోవాలని గతంలో జడ్జి ఆదేశించారు. అయితే ట్రంప్తో పాటు మరో 18 మంది కూడా సరెండర్ కావడానికి సిద్ధమైనట్లు సమాచారం. -
రామోజీ, శైలజకు మరోసారి నోటీసులు
సాక్షి, కృష్ణా: మార్గదర్శి అవకతవకల కేసులో ఆ సంస్థల అధినేత, ఎండీలకు మరోసారి ఏపీ సీఐడీ(Crime Investigation Department) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని చెరుకూరి రామోజీరావుకి నోటీసుల్లో స్పష్టం చేసింది. అలాగే.. ఎండీ శైలజా కిరణ్కు ఈ నెల 17వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది. విచారణ నిమిత్తం వీరిద్దరినీ సీఐడీ విజయవాడ రీజనల్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో సీఐడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గతంలో నోటీసులు ఇచ్చినా వీళ్లు హాజరు కాలేదు. దీంతో మరోసారి విచారణ కోసం 41(ఏ) కింద నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కుంభకోణం కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఆయన కోడలు చెరుకూరి శైలజా కిరణ్లను చేర్చింది ఏపీ సీఐడీ. ఇదీ చదవండి: ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు -
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!
ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే నటి మహాలక్ష్మి శంకర్ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. పెళ్లి విషయంలో చాలా మంది ట్రోల్స్ చేశారు కూడా. మహాలక్ష్మి డబ్బు కోసమే నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. దీనిపై స్వయంగా మహాలక్ష్మి క్లారిటీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. అయితే ట్రోల్స్ను ఈ జంట పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మరోసారి రవీందర్ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయారు. నిర్మాత రవీందర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. (ఇది చదవండి: ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఇదే! బాహుబలి, దంగల్ కాదు!) రవీందర్ చంద్రశేఖరన్ తమిళంలో చాలా సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం రవీందర్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చెన్నైలో రవీందర్పై కేసు నమోదైంది. దాదాపు రూ.15 లక్షలు తీసుకుని స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసుల సమాచారం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న విజయ్ అనే వ్యక్తి రవీందర్తో కలిసి సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుందని విజయ్కి రవీందర్ హామీ ఇచ్చారు. దీంతో విజయ్ తన వాటాగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా రవీందర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆన్లైన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రవీందర్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లో విచారణకు హాజరయ్యారు. (ఇది చదవండి: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?) -
Social Media Scams: ఫేక్ యాడ్స్తో జాగ్రత్త.. సైబర్ వలలో చిక్కుకోవద్దు
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో రకరకాల ప్రకటనలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, గూగుల్ ప్లాట్ఫారమ్స్లో ఇవి అధికంగా కనిపిస్తుంటాయి. వీటిలో ఏవి నిజమైనవి, ఏవి నకిలీవి అని తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. నిజమని నమ్మి మోసపోయే బాధితుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ప్రకటనల పేరుతో జరిగే ఈ ఆర్థిక మోసాల బారిన పడకుండా ఉండాలంటే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఫేస్బుక్ ద్వారా.. మోసగాళ్లు నకిలీ అకౌంట్స్ను ఓపెన్ చేస్తారు. వీటిని ఫేక్ లైక్స్, షేర్స్, ఫాలోవర్స్, పోస్ట్లను రూపొందించడానికి ఉపయోగిస్తారు. ఈ నకిలీ అకౌంట్స్ ద్వారా వచ్చే యాడ్స్కు ఎటువంటి వాస్తవిక ఆధారాలు ఉండవు. ఫేస్బుక్ ప్రకటనలపై క్లిక్ లను రూపొందించడానికి ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు. దీని ద్వారా కృత్రిమంగా క్లిక్ త్రూ రేట్లను పెంచి, ప్రకటనదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచుతారు. అలాగే, యాడ్ నెట్వర్క్ను మోసగించడానికి చట్టబద్ధమైన వెబ్సైట్లు లేదా యాప్స్ను అనుకరిస్తారు. దీంతో మోసపూరిత వెబ్సైట్లలో ఈ యాడ్స్ కనిపిస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్లో.. ♦ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఫేక్ ఫాలోవర్లను కొనుగోలు చేయడం ద్వారా మోసానికి పాల్పడవచ్చు. లేదా వారి ప్రజాదరణను పెంచుకోవడానికి ఒక ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, దీని ద్వారా ప్రకటనదారులు ఆశించిన ప్రయోజనాన్ని పొందలేరు. ♦మోసగాళ్లు ఫేక్ గ్రూప్లను క్రియేట్ చేస్తారు. ఒకరి పోస్ట్లను లైక్, షేర్, రివ్యూ చేయడానికి ఒప్పుకుంటారు. దీని ద్వారా వినియోగదారులు నమ్మకాన్ని పొందేందుకు ఒక భ్రమను సృష్టిస్తారు. తమ యాడ్స్ను ప్రచారం చేసే విధంగా మలుచుకుంటారు. ♦ ఫేక్ గ్రూప్స్ మాదిరిగానే పాడ్ నెట్వర్క్లను ఏర్పాటుచేస్తారు. దీని ద్వారా సభ్యులు ఒకరి పోస్ట్లపై మరొకరు కృత్రిమమైన ఎంగేజ్మెంట్ను పెంచుకుంటారు. ఎక్కుమంది వ్యూవర్స్ను చేరుకోవడానికి ఇదో తరహా ఎత్తుగడ. ట్విటర్ ► ఫేక్ ఫాలోవర్లు, రీ ట్వీట్లు, లైక్స్ క్రియేట్ చేయడానికి మోసగాళ్లు ఆటోమేటెడ్ బాట్లను అమలు చేస్తారు. వారు హ్యాష్ట్యాగ్స్ లేదా టాపిక్స్ను విస్తరించడానికి బాట్స్ను ఉపయోగిస్తారు. ఇది ట్రెండింగ్ భ్రమను సృష్టిస్తుంది. ► మోసగాళ్లు కొన్ని హ్యాష్ట్యాగ్లు లేదా టాపిక్స్తో జనాదరణ పొందేలా, ట్రెండింగ్లో ఉండేలా కృత్రిమ ప్రచారం చేస్తారు. ఎక్కువ మందిని చేరుకోవచ్చనే ఆశతో ప్రకటనదారులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ► హ్యాష్ట్యాగ్స్, రీ ట్వీట్స్ చేయడానికి, విస్తరించడానికి ఫేక్ అకౌంట్స్ను క్రియేట్ చేస్తారు. దీని ద్వారా కంటెంట్, విజిబిలిటీతో వ్యూవర్స్ను రీచ్ అవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ప్రచార మోసానికి మార్గాలు ♦ మోసగాళ్లు క్లిక్బైట్ మెసేజ్లను ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఇ–మెయిల్ లేదా సోషల్ మీడియా యా ద్వారా పంపుతారు. ♦ సోషల్ మీడియా ΄ఫ్లాట్ఫారమ్లలో, గూగుల్ ప్రకటనలలో ఫేక్ యాడ్స్ సృష్టిస్తారు. ముఖ్యంగా కొత్త ఐ ఫోన్ మోడల్ వంటి ట్రెండింగ్లో ఉన్న విషయాలను ప్రచారం చేస్తారు. ♦ ప్రకటనలకు ఆకర్షితుడై మోసగాడిని సంప్రదించినప్పుడు అతను బుకింగ్ లేదా అడ్వాన్స్ చెల్లించమని అడుగుతాడు. ♦ కోరుకున్న వస్తువు డిస్కౌంట్ రేట్లో లభిస్తుందనే ఆశతో మోసగాడు చెప్పిన మొత్తాన్ని బాధితుడు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తాడు. ఆ తర్వాత డెలివరీ, జీఎస్టీ, ఎక్స్ప్రెస్ డెలివరీ ఛార్జీలు మొదలైనవాటికి అదనపు మొత్తాన్ని చెల్లించమని బాధితుడిని కోరతాడు. ♦ మోసగాడు చెప్పింది నిజమని బాధితుడు నమ్మి డెలివరీ ట్రాకింగ్ వివరాలను పంపుతాడు. లేదంటే, అడిగినంత మొత్తాన్ని చెల్లిస్తాడు. ♦ బాధితుడు డబ్బును ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మోసగాడు కాల్స్ను, ఇతర కమ్యూనికేషన్ మార్గాలను బ్లాక్ చేస్తాడు. మోసాన్ని అధిగమించడానికి .. ► మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రముఖ వ్యాపార ప్రకటనల నెట్వర్క్లు, పబ్లిషర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఏవైనా అడ్వర్టైజింగ్, పార్టనర్షిప్లలోకి ప్రవేశించే ముందు క్షుణ్ణంగా పరిశీలించి, తగిన శ్రద్ధ తీసుకోవాలి. ► ప్రకటనల మోసాన్ని గుర్తించి, నిరోధించడంలో సహాయపడే ధ్రువీకరణ సాధనాలు, టెక్నాలజీని ఉపయోగించాలి. ఇవి, అనుమానాస్పద యాడ్స్ లోని లొసుగులను కనిపెట్టగలవు. క్లిక్ ఫ్రాడ్, ఇంప్రెషన్ ఫ్రాడ్ వంటి వివిధ రకాల మోసాలకు వ్యతిరేకంగా ఇవి రక్షణను అందిస్తాయి. ► ఏవైనా అనుమానాస్పద యాడ్స్ను గుర్తించడానికి ఇతర యూజర్ల క్రమాన్ని కూడా పర్యవేక్షించాలి. అంటే, అసహజంగా అనిపించే లైక్స్, షేర్స్ వేగంగా పెరగడం వంటివి ఉన్నాయేమో చెక్ చేయాలి. ► మోసాన్ని గుర్తించే లెర్నింగ్ టెక్నిక్స్ను ఉపయోగిస్తే ఇవి మోసపూరిత తేడాలను గుర్తించగలవు. ► మీ యాడ్స్... సంబంధిత ఫ్లాట్ఫారమ్లలో కనిపించేలా చూసుకోవడానికి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలి. అనుమానాస్పదమైన, క్వాలిటీ లేని వెబ్సైట్స్, మోసపూరిత కార్యకలాపాలకు గురయ్యే యాప్లలో ప్రకటనలను ఉంచడం మానుకోవాలి. ► ఈ తరహా తాజా మోసాలను మీ టీమ్ అంటే.. బంధుమిత్రుల సమూహాలకు అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేందుకు ఇండస్ట్రీ కాన్ఫరెన్స్లు, వెబినార్లు, వర్క్షాప్స్కు హాజరవ్వాలి. ► ప్రకటనల ప్రచారాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి. డేటాలో ఏవైనా తేడాలు ఉన్నాయేమో సరిచూసుకోవాలి. మీరు మోసపూరిత కార్యకలాపాలను అనుమానించినట్లయితే, వాటిని సంబంధిత యాడ్ ఫ్లాట్ఫారమ్స్ లేదా నెట్వర్క్లకు తెలియజేయాలి. మోసపూరిత ప్రకటనల విధానాలను పంచుకోవడం ద్వారా మిగతావారిని అలెర్ట్ చేయవచ్చు. ► ప్రకటనల మోసాన్ని ఎదుర్కోవడానికి నిజాయితీని ప్రోత్సహించే ఇండస్ట్రీ అసోసియేషన్స్తో కనెక్ట్ అయి ఉండటం శ్రేయస్కరం. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
23 మార్గదర్శి చిట్ గ్రూపులు రద్దు
సాక్షి, అమరావతి: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తాజాగా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్లు, ఆడిటర్లు పలు బ్రాంచిల్లో నిర్వహించిన తనిఖీల్లో.. మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు చందాదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆ కంపెనీకి చెందిన 23 చిట్ గ్రూపులను స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ రద్దుచేసింది. అనంతపురం బ్రాంచిలో రెండు, అరండల్పేటలో 1, నరసరావుపేటలో 3, రాజమహేంద్రవరంలో 2, తణుకులో 1, విశాఖ డాబా గార్డెన్స్, కూర్మన్నపాలేల్లో ఒక్కొక్కటి, విశాఖ ఎన్ఏడీ బ్రాంచిలో రెండు, విశాఖ సీతంపేట బ్రాంచిలో 10 చిట్ గ్రూపులు రద్దయ్యాయి. ఈ చిట్ గ్రూపులు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. తాజా అక్రమాలివే గ్రూపు ప్రారంభించినప్పుడు అన్ని టికెట్లు నిండకపోయినా నిండినట్లు చిట్ రిజిస్ట్రార్కి తప్పుడు డిక్లరేషన్లు సమర్పించినట్లు తాజా తనిఖీల్లో నిర్ధారణ అయింది. సాధారణంగా చిట్ గ్రూపు ప్రారంభమైనప్పుడు అన్ని టికెట్లు నిండవు. కొన్ని ఖాళీలు క్రమంగా తర్వాత నెలల్లో భర్తీ అవుతాయి. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి అన్ని టికెట్లు భర్తీ అయినట్లు కంపెనీ ఫోర్మెన్లు డిక్లరేషన్లు ఇచ్చారు. అలాగే చిట్ గ్రూపులు ప్రారంభమైనప్పుడు ఖాళీగా ఉన్న టికెట్లను కంపెనీ తనపేరు మీదే ఉంచుకుంటుంది. అలా తన పేరున ఉన్న టికెట్లకు సంబంధించిన చందాలను కట్టాల్సి ఉన్నా.. కమిషన్పోగా కట్టాల్సిన సొమ్మును కట్టకుండా కంపెనీ చందాదారులను మోసం చేసింది. అలా డబ్బు కట్టకపోవడం వల్ల మిగతా గ్రూపుల్లో చిట్లు పాడుకున్న వారికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడంలో తీవ్రజాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. పాట పాడుకున్న చందాదారులకు ఆ సొమ్ము ఇవ్వకుండా రశీదుల పేరుతో ఆ సొమ్మును డిపాజిట్లుగా ఉంచారు. అన్ని నెలలు చిట్ చందా కట్టినవారినే పాటకు అనుమతించాలి. కానీ మార్గదర్శిలో కొన్ని నెలలు కట్టి మధ్యలో కట్టకుండా ఉన్న వారిని కూడా పాటకు అనుమతించి, వారు పాడుకున్న తర్వాత వచ్చిన డబ్బును తమకు చెల్లించాల్సిన దానిగా కట్టించుకున్నారు. కొన్ని గ్రూపుల్లో వేలం పాట నిర్వహించకుండానే ప్రతినెలా చందాలు కట్టించుకున్నారు. ఇవన్నీ చిట్ఫండ్ చట్టానికి విరు ద్ధమే. ఈ ఉల్లంఘనలున్న చిట్ గ్రూపులను రద్దు చేశారు. దీంతో రద్దయిన 23 చిట్ గ్రూపులు సంబంధిత జిల్లాల చిట్ రిజిస్ట్రార్ల నియంత్రణలోకి వస్తా యి. వాటితో కంపెనీకి సంబంధం ఉండదు. ఆ గ్రూపులను చిట్ రిజిస్ట్రార్లే నిర్వహిస్తారు. చందాదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే రామోజీరావు సహా పలువురిపై కేసు నమోదు ఇప్పటికే మార్గదర్శిలో భారీగా అక్రమాలు బయటపడిన విషయం తెలిసిందే. క్వాలిఫైడ్ ఆడిటర్ తని ఖీలు చేసి ఇచ్చిన నివేదికలో మార్గదర్శి యాజమా న్యం రూ.459.98 కోట్లను మ్యూచువల్ ఫండ్స్, ప్ర భుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయింది. చందాదారులు కట్టిన చిట్ల సొ మ్మును తన సొంత ప్రయోజనాల కోసం మళ్లించడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ సొమ్మును వేర్వేరుచోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా చందాదారులను మోసం చేసినట్లు స్పష్టమైంది. మార్గదర్శి బ్రాంచిల్లో తనిఖీల సమయంలో కంపెనీ మేనేజర్లు రిజి స్ట్రేషన్ల శాఖకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టారు. అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా వ్యవహరించారు. సమాచా రం, వివరాలన్నీ హైదరాబాద్లోని కార్పొరేట్ ఆఫీ సులోనే ఉన్నాయంటూ తనిఖీ బృందాలకు సహక రించలేదు. దీంతో అధికారులు కార్పొరేట్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించి సమాచారం సేకరించారు. బ్యాలెన్స్షీట్లు, వెబ్సైట్లో వివరాలను బట్టి మరి కొంత సమాచారం సేకరించారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాత మార్గదర్శికి చెందిన విశాఖ, కాకి నాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం బ్రాంచిలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు. వాటి ఆధారంగా మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ సహా పలువురు బ్రాంచి మేనేజర్లపై సీఐడీ కేసులు నమోదు చేసి అక్రమాలపై మరింత లోతుగా విచారిస్తోంది. జరిగిన ఆడిట్లో మరిన్ని మోసాలు బయటపడడంతో 23 చిట్ గ్రూపులను రిజిస్ట్రేషన్ల శాఖ రద్దు చేసింది. చదవండి: Margadarsi: 1982 చిట్ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు -
పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’
విజయవాడ చిట్టినగర్కు చెందిన నొక్కొజు మల్లేశ్వరరావు కార్పెంటర్. అతనికి జవహార్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) పథకంలో ఇల్లు ఇప్పిస్తానని విజయవాడ 47వ డివిజన్ టీడీపీ నాయకుడు మాకిన విజయ్కుమార్ నమ్మబలికాడు. ఐదేళ్ల క్రితం మల్లేశ్వరరావు నుంచి రూ.1.60 లక్షలు వసూలు చేశాడు. ఇప్పటికీ ఇల్లు ఇప్పించలేదు. విజయ్కుమార్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో పోలీస్ కమిషనరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయవాడ చిట్టినగర్లో బండిపై పూసలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే తమ్మన మాధవికి ఇల్లు ఇప్పిస్తానని విజయ్కుమార్ రూ. 3.20 లక్షలు వసూలు చేశాడు. ఇల్లు ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన బాధితురాలు మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల పేరిట జరిగిన భారీ మోసంలో చిన్న ఉదాహరణలు. ఇలా మోసపోయిన వారు నగరంలో 2 వేల మంది ఉన్నట్లు అంచానా. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ దందా బాధితుల ఫిద్యాదులతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 70 కోట్లు పేదల నుంచి వసూలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో టీడీపీ నాయకులు మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు.రోడ్లు, కాలువలు విస్తరణలో ఇళ్లు కొల్పోయిన పేదలకు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో నివాసం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించాయి. చదవండి: పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా: పేర్ని నాని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం పనులు 2014 వరకు నిర్విరామంగా కొనసాగాయి. విజయవాడ నగరంలో ఇళు కోల్పోయిన పేదల కోసం నగరంలోని జక్కంపూడి, ఆర్ఆర్పేట, సింగ్నగర్, కబేలా ప్రాంతాల్లో వంద ఎకరాల్లో 28,152 జీ ఫ్లస్ త్రి గృహాల నిర్మాణం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టిన టీడీపీ ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. అయితే అప్పటివరకు నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించింది. దీంతో విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఈ ఇళ్లను యధేచ్ఛగా అమ్మేశారు. ఆ నియోజకవర్గాలకు అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నాయకులు జలీల్ఖాన్, బొండా ఉమామహేశ్వరరావు కనుసన్నల్లోనే ఈ బాగోతం జరిగినట్లు తెలుస్తోంది. ఉచితంగా ఇవ్వాల్సిన ఈ ఇళ్లను డివిజన్లలో టీడీపీ నాయకులు ఒక్కొక్కరూ 200 గృహాలు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసి వారు రూ. కోట్లు దండుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు జక్కంపూడి, సింగ్నగర్, ఆర్ఆర్పేట, కబేలా ప్రాంతాల్లో జేఎన్ఎన్ఆర్యుఎం ఇళ్ల కేటాయింపు 2018లోనే పూర్తయింది. అయినా, టీడీపీ నాయకులు నకిలీ డాక్యుమెంట్లు, మునిసిపల్, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇళ్లు లేకపోయినా ఉన్నట్లు ప్రచారం చేసి పేదల నుంచి వసూళ్లు చేశారు. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లోని 41 డివిజన్లలో ఈ తరహా బాధితులు 2 వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరి నుంచి రూ. 60 నుంచి రూ.70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. చాలా మంది బాధితులు ముందుగా కొత్తపేట (టుటౌన్) పోలీసులను ఆశ్రయిస్తున్నాయి. అక్కడా విజయ్కుమార్ మాటే చెల్లుబాటు కావడంతో పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు మాకిన విజయ్కుమార్ బాధితులు 35 మంది ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించారు. ఇతనితోపాటు 41వ డివిజన్లోని నాగోతు రామారావు, 57వ డివిజన్లోని ఎడిబోతు రమణ, 58వ డివిజన్లోని సోమేశ్వరరావు, రామారావు, 60వ డివిజన్లోని భువట ఉమా, శ్రీరాములు, 63వ డివిజన్లోని పైడి శ్రీను పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. -
విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం సృష్టించింది. కిడ్నీ రాకెట్పై విశాఖ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తిరుమల ఆసుపత్రి రిజిస్ట్రేషన్, అనుమతులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండా పరీక్షలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే డాక్టర్ పరమేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. పెందుర్తిలో తిరుమల ఆసుపత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ దందా కొనసాగుతోంది. ఈ కేసులో బాధితుడి నుంచి కిడ్నీకి రూ.8.5లక్షలకు ఒప్పందం చేసుకోగా రూ.2.5లక్షలు చెల్లించారు. విషయం బయటకు రావడంతో ఆసుపత్రి మూసివేసి యాజమాన్యం పరారైంది. మధ్యవర్తులు శ్రీను, కామారాజు, ఎలినా కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
Hyderabad: రూ.4 కోట్ల మోసగాడు.. 28 ఏళ్లకు చిక్కాడు
సాక్షి, హైదరాబాద్: ఓ ఆర్థిక మోసం కేసులో 28 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూర్ పోలీస్ స్టేషన్లో 1995 నమోదైన కేసులో నిందితుడిగా వీఎస్ క్షీర్సాగర్ను అరెస్టు చేసినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్భగవత్ తెలిపారు. బుధవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా, కొత్తూరు మండలం నందిగోన్ గ్రామ పరిధిలో 1995లో వానిసింగ్ కంపెనీ పేరిట ఓ స్టీల్ కంపెనీని స్థాపించారు. స్థానికులకు కంపెనీలో షేర్లపేరిట మొత్తం రూ.4.3 కోట్లు సదరు కంపెనీ నిర్వాహకులు వసూలు చేశారు. ఈ మొత్తంలో రూ.4 కోట్లను 1995లో ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్లో దాదర్ బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న వీఎస్ క్షీర్సాగర్ కొట్టేశాడు. కంపెనీ దివాళా తీయడంతో ఎంతోమంది అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంటును ఎట్టకేలకు అమలు చేస్తూ నిందితుడిని ఇండోర్ పట్టణంలో అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టులో కీలకంగా పనిచేసిన సీఐ డీ ఇన్స్పెక్టర్ ఎస్ వెంకటేశ్, ఎస్సై పి నాగార్జున, హెడ్ కానిస్టేబుల్ ఎం.గోపాల్లను సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అభినందించారు. -
బామ్మా జర భద్రం.. ఆ లింక్స్పై క్లిక్ చేస్తే అంతే! ఈ టోల్ ఫ్రీ నంబర్ మీకోసమే!
విచారంగా కూర్చొని ఉన్న వర్ధనమ్మను చూసి ఏమైందని అడిగింది మనవరాలు హారిక. ‘బ్యాంకు ఖాతా నుండి డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. నేను ఆ డబ్బులు డ్రా చేయలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. బ్యాంకులో అయితే భద్రంగా ఉంటాయనుకున్నా. ఇప్పుడెలా..’ అంది మనవరాలితో దిగులుగా వర్ధనమ్మ. ‘ఎవరైనా నీకు ఇంతకుముందు ఫోన్ చేశారా..’ అడిగింది హారిక. ‘బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. అత్యవసరం అని చెబితే, వాళ్లు పంపిన లింక్ ఫామ్లో వివరాలు ఇచ్చాను. అంత కన్నా ఏమీ చేయలేదు’ అంది వర్ధనమ్మ. బామ్మ సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయిందని అర్ధమై, వెటనే తగిన చర్యలు తీసుకుంది హారిక. ఆ తర్వాత బామ్మకు సైబర్ మోసగాళ్ల గురించి వివరించింది. ఇంట్లో వయసు పైబడిన వారుంటే సైబర్ మోసాగాళ్ల బారిన పడకుండా ఈ విషయాలు తప్పక తెలియజేయాల్సిన అవసరం వారి పిల్లలకు ఉంది. సాధారణంగా జరిగే మోసాల్లో ప్రధానమైంది ఫిషింగ్ సైబర్ నేరగాళ్లు మీ డిజిటల్ సమాచార మొత్తాన్ని పొందడానికి ఆన్లైన్ సేవ లేదా బ్యాంక్ ఏజెంట్ల వంటి విశ్వసనీయ పరిచయాలను పెంచుకుంటారు. కొన్ని ఉదాహరణలు.. సహాయం కోసం రిక్వెస్ట్ అడుగుతారు. మీరు బహుమతిని గెలుచుకున్నారని చూపుతారు. పెన్షన్ ఫండ్ విడుదలకు కెవైసి అవసరం అంటారు. గతంలో తక్కువ ఆదాయపు పన్ను చెల్లించారు, ఇప్పుడు రెట్టింపు ఛార్జ్ పడింది అంటారు. గుర్తింపు చోరీ సైబర్ దాడి చేసే వ్యక్తులు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, చిరునామా, డెబిట్/ క్రెడిట్ కార్డ్ వివరాలు, యుపిఐ, పిన్ నంబర్ మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లాభాలను పొందడానికి ఈ సమాచారం సేకరిస్తారు. దాడుల్లో రకాలు వీటిలో తరచుగా సీనియర్ డేటింగ్, ప్రిస్క్రిప్షన్ మాత్రలు, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు, పెట్టుబడి లేదా ఛారిటీ స్కామ్లు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి నకిలీ ఆర్థిక సహాయ అభ్యర్థనలకు సంబంధించిన మోసాలు ఉంటాయి. చాలా మంది సీనియర్లు ఇలాంటి మోసాలకు లోనవడానికి పెద్ద కారణం ఒంటరితనం, జ్ఞానం లేకపోవడమే. భద్రతా చిట్కాలు ►తెలియని వారి నుంచి వచ్చే ఇ–మెయిల్లలోని లింక్లపై క్లిక్ చేయవద్దు. మీకు తెలిసిన వ్యక్తుల నుండి వచ్చినవి అయినప్పటికీ, వింత లేదా ఊహించని సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇ–మెయిల్లు, వాట్సప్ సందేశాలు లేదా ఎసెమ్మెస్లు, సోషల్ మీడియా పోస్ట్లు అన్నీ హానికరమైన ఫైల్స్ను కలిగి ఉండే చిన్న లింక్లతో ►పంపినవారు మీకు తెలిసినవారే అని దృఢపరుచుకునేవరకు ఏ లింక్లను ఓపెన్ చేయవద్దు. స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల నుండి ఆ మెసేజ్ వచ్చినట్లు కనిపిస్తే, వారు మీకు ఏదైనా పంపినట్లు నిర్ధారించుకోవడానికి తిరిగి వారినే సంప్రదించండి. ►అనుమానిత ఫోన్ కాల్స్, రోబోకాల్స్ను రిసీవ్ చేసుకోకండి. కాలర్ తాను ‘‘టెక్ సపోర్ట్‘ నుండి మాట్లాడుతున్నట్టు మీతో చెప్పవచ్చు. మీ కంప్యూటర్కు వైరస్ సోకిందని, రిపేర్ ఉందని మీకు తప్పుగా చెప్పవచ్చు. మీరు టాక్స్ డిఫాల్టర్ లేదా పెన్షన్ ప్రాసె సింగ్ లేదా కెవైసీ కోసం అడుగుతున్న బ్యాంక్ అధికారి అని కూడా చెప్పవచ్చు. పెన్షన్ ఫండ్ మొదలైన వాటి ప్రాసెసింగ్ అని చెప్పవచ్చు. ►మీ ఫోన్ లేదా కంప్యూటర్లోని పాప్అప్ విండోలకు ప్రతిస్పందించవద్దు లేదా దానిపై క్లిక్ చేయవద్దు. మీ కంప్యూటర్ లేదా ఫోన్లో ‘అత్యవసర‘ పాప్అప్ విండో కనిపిస్తుంది. మీ డిజిటల్ పరికరానికి రిపేర్ అవసరమని లేదా ఒక ఫోన్ను ఆఫర్లో ‘మరొక ఫోన్ను పొందండి’ అంటూ మీలో ఆశను కలిగిస్తాయి. మీ కంప్యూటర్ సిస్టమ్కి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేయమని అడగవచ్చు. ►అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడం లేదా తెలియని వాటిని డౌన్లోడ్ చేసే సమయంలో సురక్షిత బ్రౌజింగ్ పద్ధతులను అనుసరించండి. మీకు తెలిసిన సీనియర్స్కి విశ్వసనీయ వెబ్సైట్లను మాత్రమే సందర్శించమని, వారు సురక్షితమైన సైట్లో ఉన్నారని నిర్ధారించుకోవడానికి httpr://(ప్యాడ్ లాక్ సింబల్) కోసం చూడాలని సలహా ఇవ్వండి. ►రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్లు భద్రతా లోపాలను పరిష్కరించగలవు. వారి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వంటి పరికరాలు, సాఫ్ట్వేర్లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయమని సీనియర్లను ప్రోత్సహించండి. ►యాప్స్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ►ప్రత్యేకమైన పాస్వర్డ్లను (ప్రత్యేక అక్షరాలు, పెద్ద అక్షరాలు, సంఖ్యాపరమైనవి) ఉపయోగించమని వృద్ధులను ప్రోత్సహించండి. వారి పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి సులభంగా ఊహించదగిన సమాచారాన్ని ఉపయోగించవద్దు. ►తెలియని వ్యక్తులతో మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లతో రిమోట్ స్క్రీన్ షేరింగ్ చేయకండి. ►అన్ని ఇ–మెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాల కోసం రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. మోసపోతే ఏం చేయాలంటే.. ఈ టోల్ ఫ్రీ నంబర్ 1930కి వెంటనే (ఒక గంటలోపు) ఫోన్ చేయండి. దీని ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ 1930 సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. దీనికి బదులుగా మీరు మీ స్థానిక సైబర్ క్రైమ్ పోలీసు అధికారుల వద్ద జరిగిన మోసం చెప్పి కంప్లయింట్ ఇవ్వచ్చు. లేదా httpr://www.cybercrime. gov.in లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. స్మార్ట్ఫోన్ నుండి దూరంగా ఉండాలంటే.. ►మీ స్మార్ట్ఫోన్లో నోటిఫికేషన్లను నిలిపి వేయండి. ►మీ పడకగది, భోజనాల గదిని స్మార్ట్ఫోన్ రహిత జోన్గా మార్చండి. ►మీ స్మార్ట్ఫోన్కు బదులుగా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ నుండి సోషల్ మీడియాను యాక్సెస్ చేయండి. ►ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడం కోసం ఆండ్రాయిడ్లో డిజిటల్ వెల్బీయింగ్ యాప్, ఐఓఎస్లో స్క్రీన్ టైమ్ యాప్ని ఉపయోగించండి. ►ప్రజలు తమ స్క్రీన్ వినియోగ సమయం పెరుగుతోందని భావిస్తే గ్రే స్కేల్ మోడ్ ఫీచర్ని ఉపయోగించండి -
హైదరాబాద్ యువతితో నైజీరియన్ స్నేహం.. గిఫ్ట్ల పేరుతో రూ. 1.22 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ పేరుతో మోసానికి పాల్పడ్డ నైజీరియన్ జంటను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 పాస్బుక్లు, 8 చెక్కు బుక్లు, 9 డెబిట్ కార్డులు, 12 మొబైల్ ఫోన్లు, 4 సిమ్కార్డులు, ల్యాప్టాప్, మూడు ఐడీకార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అరెస్టు చేసినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్పేర్కొన్నారు. వివరాలు నైజీరియాకు చెందిన బకయోకో లస్సినా, షోమా పుర్కయస్తా ప్రేమికులు. బకయోకో లస్సినా డాక్టర్ లియనార్డో మ్యాట్టియో అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్ను తెరచి కొందరికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. నగరానికి చెందిన ఓ యువతి అతడి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగా కొంతకాలం ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. తనను లండన్లో డాక్టర్గా పరిచయం చేసుకున్న ఇతగాడు యువతి కోసం సిటీకి వస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీ కస్టమ్స్లో మీ కోసం వస్తున్న డాక్టర్ లియనార్డో మ్యాట్టియోను అరెస్టు చేశామని, అతడి వద్ద వజ్రాలు, విలువైన బహుమతులు, డబ్బును స్వాధీనం చేసుకున్నామంటూ సదరు యువతికి కస్టమ్స్ ఆఫీసర్గా పరిచయం చేసుకున్న షోమా పుర్కయస్తా ఫోన్ చేసి చెప్పింది. ఆమెను భయపెట్టి పలు దఫాలుగా రూ.1.22 కోట్లు పలు బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయినా పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. ఇదే తరహాలో వీరు పలువురిని మోసం చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు. -
వేషం మార్చి.. పేరు మార్చి.. జనాన్ని ఏమార్చి! రూ.10 కోట్ల వరకూ..
సాక్షి, పుట్టపర్తి: మహా మాయగాడి బండారం బయట పడింది. ఊరికో పేరు మార్చుకుంటూ చెలామణి అవుతూ అమాయకులను మోసం చేస్తోంది.. ఒక్కడే అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన బెస్త చిన్న ఓబులేసు అధిక వడ్డీ ఆశ చూపి ఇప్పటికే పలు చోట్ల జనాలను నిలువునా మోసం చేసిన ఘటనలు వెలుగు చూశాయి. ఒక్కో చోట ఒక్కో పేరుతో చెలామణి అవుతుండటంతో ప్రజలు పసిగట్టలేకపోయారు. రోజుల వ్యవధిలోనే రూ.లక్షకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి కొన్ని రోజుల పాటు ఠంఛన్గా సొమ్ము చెల్లించేవాడు. ఆ తర్వాత ఉడాయిస్తాడు. ఇప్పటికే నంద్యాల జిల్లా అవుకు, అనంతపురం జిల్లా కణేకల్లు, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించారు. ఆ తర్వాత బెయిల్పై వచ్చి ఊరు మార్చి.. కొత్త పేరుతో దందా కొనసాగిస్తున్నాడు. గత రెండేళ్లలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డట్టు తేలింది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మనోహర్రెడ్డి పేరుతో రూ.1.7 కోట్లతో పరారయినట్లు బాధితులు ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ భాస్కర్రెడ్డిగా.. ఇక్కడ మనోహర్రెడ్డిగా.. గతేడాది మేలో నంద్యాల జిల్లా అవుకులో భాస్కర్రెడ్డిగా పరిచయమయ్యాడు. అక్కడే ఓ షాపు అద్దెకు తీసుకుని వంటనూనె, చక్కెర, సిగరెట్ల వ్యాపారం చేస్తానని నమ్మబలికాడు. స్టాక్ కోసం పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు కావాలని, రూ.లక్ష తనకిస్తే రోజుకు రూ.5 వేల చొప్పున వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అధిక వడ్డీకి ఆశపడి చాలామంది అతనికి డబ్బులిచ్చారు. అక్కడ సుమారు రూ.3 కోట్ల వరకూ వసూలు చేసుకుని పరారయ్యాడు. అవుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గాలించి గాలివీడులో పట్టుకుని జైలుకు పంపారు. అవుకు కేసు నుంచి బయటికొచ్చాక శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి మకాం మార్చాడు. అక్కడ షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మబలికాడు. అధిక వడ్డీ ఇస్తానని కొన్ని రోజుల పాటు నమ్మించాడు. రూ.లక్షకు రోజుకు రూ.వెయ్యి ఇస్తానని చెప్పాడు. సుమారు రూ.1.7 కోట్లు వసూలయ్యాక పరార్ అవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అంతకుముందు అనంతపురం జిల్లా కణేకల్లు.. ఆత్మకూరులో కూడా అధిక వడ్డీ ఆశ చూపి కొందరితో డబ్బులు వసూలు చేసి పరారైనట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. మొదట్లో జులపాలు.. ఆ తర్వాత గుండు రైల్వే కమ్మీలు చోరీ చేసిన కేసులో కూడా బెస్త చిన్న ఓబులేసే నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు గాలించి అరెస్టు చేసి జైలుకు పంపినా.. ఆ తర్వాత అనంతపురంలోని నాయక్ అనే ఓ లాయర్ను అడ్డు పెట్టుకుని సులువుగా బయటికొచ్చేస్తున్నాడు. చిన్న ఓబులేసు పేర్లు మార్చుకున్నట్లే వేషం కూడా మార్చేస్తాడు. మొదట్లో జులపాల జుట్టుతో ఖద్దర్ చొక్కా వేసి.. చేతికి ఉంగరాలు, మెడలో బంగారు చైన్లు వేసుకుని దర్జాగా తిరుగుతాడు. డబ్బులున్న వారితో టచ్లోకి వెళ్లి అధిక వడ్డీ ఆశ చూపి లూఠీ చేసి పరారవుతాడు. ఆ తర్వాత విహార యాత్రలకు వెళ్లి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు. పోలీసులకు పట్టుబడే సమయానికి గుండుతో ఉంటాడు. నిత్యం డ్రెస్ కోడ్, బాడీ లాంగ్వేజ్ మార్చి విందు, వినోదాల్లో మునిగితేలుతుండాడు. విహార యాత్రల్లో ఉండగానే లాయర్లతో టచ్లోకి వెళ్లి.. కేసులకు సంబంధించి లాబీయింగ్ చేస్తాడని సమాచారం. -
Chanda Kochhar: చందా కొచ్చర్కు భారీ ఊరట
ముంబై: వీడియోకాన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్కు భారీ ఊరట లభించింది. చందాతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్ను సైతం రిలీజ్ చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ చట్టానికి లోబడి జరగలేదని చందా కొచ్చర్ తరపు న్యాయవాదులు వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. వీడియోకాన్ సంస్థకు అక్రమరీతిలో రుణాలు మంజూరీ చేసిన కేసులో చందా కొచ్చార్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చందా కొచ్చారోతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చార్ను డిసెంబర్ 23వ తేదీన సీబీఐ అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూపు సంస్థకు 2012లో సుమారు రూ. 3,250 కోట్ల మొత్తాన్ని అక్రమరీతిలో లోన్ ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.కుటుంబ లబ్ధి కోసం కొచ్చార్ ఫ్యామిలీ చీటింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీడియోకాన్ రుణాన్ని ఎన్పీఏగా భావించి, దాన్ని బ్యాంక్ ఫ్రాడ్గా ప్రకటించారు. బాంబే హైకోర్టులో జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పీకే చావన్లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును ఇచ్చింది. క్రిమినల్ కోడ్లోని 41ఏ సెక్షన్ను ఉల్లంఘించి ఆ ఇద్దరి అరెస్టు చేసినట్లు కోర్టు తెలిపింది. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఇద్దరినీ.. లక్ష రూపాయాల బెయిల్ బాండ్పై విడిచిపెట్టనున్నారు. కొచ్చర్ల పేరుతో పాటు వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ పేరును సైతం సీబీఐ ఇందులో చేర్చింది. క్విడ్ ప్రోకోలో భాగంగా ఇదంతా జరిగిందని అభియోగాలు నమోదు చేసింది. -
విజయవాడలో ఉద్యోగాల వల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలుచేసిన వైనం బయటకొచ్చింది. 30 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగించిన సంస్థ యజమాని దండుబోయిన సిద్ధార్థ్వర్మను, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు.. సిద్ధార్థ్వర్మ విజయవాడ బందరు రోడ్డులో డైల్ ఇన్స్టిట్యూషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోను, విదేశాల్లోను ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులకు వల వేశారు. అమెరికా, ఇంగ్లండ్, దుబాయ్, మలేషియా దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, దేశంలో బీఎస్ఎన్ఎల్, జాతీయ రహదారులు, ఎలక్షన్ కమిషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కేంద్రప్రభుత్వ సంస్థల్లోను, పేరొందిన ప్రైవేటు కంపెనీల్లోను ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికారు. కార్యాలయంలో యువతులను నియమించి వారి మాటలతో బురిడీ కొట్టించి ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. రసీదులు కూడా ఇచ్చారు. నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారికి డబ్బు వాపసు చేస్తూ చెక్కులిచ్చారు. ఆ చెక్కులు చెల్లకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మోసపోయినవారు ఒక్కొక్కరుగా విజయవాడ చేరుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కర్నూలు, గుంటూరు, వైఎస్సార్, ప్రకాశంజిల్లాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సూర్యారావుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు సిద్ధార్థ్వర్మను, కార్యాలయంలో పనిచేసే పలువురు మహిళా ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండేళ్లుగా దందా కాల్ సెంటర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సులను నేర్పుతామని రెండేళ్ల కిందట ఈ ఇన్స్టిట్యూషన్ను సిద్ధార్థ్వర్మ ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్కు వైష్ణవి అనే మహిళ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరు ఎక్కువగా సంస్థ కార్యాలయంలో కనిపించేవారు కాదని, అక్కడి ఉద్యోగినులే వివరాలు చెప్పి డబ్బు వసూలు చేసేవారని బాధితులు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణల్లో దాదాపు వెయ్యిమంది నిరుద్యోగులు వీరి మాటలు నమ్మి మోసపోయారని పేర్కొన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు గుప్పించి తమను ఆకర్షించారని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన బాధితుడు మణికంఠ వాపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో డబ్బు చెల్లించి నెలల తరబడి ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరిగానని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్ద డబ్బు వసూలు చేశారని విజయవాడకు చెందిన ప్రవీణ్ తెలిపారు. ఉద్యోగం రాలేదని డబ్బులు అడిగితే కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులచే ఎదురుదాడి చేయిస్తున్నారని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు. బాధితులకు న్యాయం చేస్తాం.. ఉద్యోగాల పేరుతో మోసపోయామని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డైల్ ఇన్స్టిట్యూషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంస్థ యజమానిని, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాల పేరుతో మోసం చేసే సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి సంస్థల యజమానుల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. – టి.కె.రాణా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆయన పేరు డాక్టర్ దేవేందర్ (పేరు మార్చాం). హైదరాబాద్ సమీపంలోని ఒక ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడు. ఆయనకు నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారు. కా నీ, ఆయన రోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లుగా హాజరుంటుంది. బయోమెట్రిక్ హాజరున్నా తన మాయాజాలాన్ని ఉపయోగించారు. ఫేస్ రికగ్నేషన్ సందర్భంగా తన ముఖాన్ని కాకుండా ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో ఫీడ్ చేయించాడు. అతను వెళ్లకున్నా అక్కడి సిబ్బంది అతని ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో హాజరు కోసం ఉపయోగిస్తున్నారు. మరో డాక్టర్ శ్రవణ్ కుమార్ (పేరు మార్చాం). నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతను వారానికి ఒకరోజు ఆసుపత్రికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తాడు. కానీ, అతను రోజూ వచ్చినట్లుగా హాజరుంటుంది. అతను వేలిముద్ర హాజరును దిద్దుబాటు చేశాడు. తన వేలి ముద్ర బదులుగా అక్కడ రోజూ వచ్చే ఇతర సిబ్బంది వేలిముద్రను ఫీడ్ చేశాడు. దీంతో అతను వెళ్లకుండానే హాజరుపడుతుంది. ఆమె పేరు డాక్టర్ రవళి(పేరు మార్చాం). రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ప్రతీ డాక్టర్ తాను పనిచేసినట్లుగా రోజూ ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆ జిల్లాలో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఒక రోజు వచ్చి తన వ్రస్తాలను ఐదారుసార్లు మార్చి ఇతర వస్త్రాలను ధరించడం, హెయిర్ స్టైల్ను కూడా మార్చి రోగులను చూసినట్లు ఫొటోలు దిగుతారు. వారంలో మిగిలిన రోజులు రాకుండానే ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో వైద్యుల బండారం బట్టబయలు రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 48 ఏరియా ఆసుపత్రులు, 108 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 33 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో ఎండీ, ఇతర సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్యం చేస్తుంటారు. ఆర్థో, కార్డియాక్, గైనిక్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో వంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంటుంది. కొందరు స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా హైదరాబాద్లోనూ, తాము పనిచేసే సమీప పెద్ద నగరాల్లోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు అనేకచోట్ల డాక్టర్లు విధులకు రాకపోవడాన్ని గుర్తించారు. ఈ మేరకు 50 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. హాజరైనట్లుగా తప్పుడు పద్ధతులు కొన్ని ఆసుపత్రుల్లో ఫేస్ రికగ్నేషన్ మెషీన్, కొన్నిచోట్ల వేలిముద్రల మెషీన్లను వైద్యవిధాన పరిషత్ ఏర్పాటు చేసింది. అయితే ఫేస్ రికగ్నేషన్ మెషీన్లో కొందరు డాక్టర్లు ముఖం కాకుండా ఫొటోలను ఫీడ్ చేశారు. ఆ ఫొటోను ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి ఇచ్చి, రోజూ ఫొటోను ఫేస్ రికగ్నేషన్ మెషీన్ ముందు పెట్టి హాజరు వేయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే వారాల తరబడి కూడా ఆసుపత్రుల ముఖం చూడటంలేదని తేలింది. కానీ, హాజరైనట్లుగా మెషీన్లో నమోదవుతుంది. కొన్నిచోట్ల తమకు బదులుగా అక్కడి సిబ్బంది వేలిముద్రలను మెషీన్లలో ఫీడ్ చేయించారు. సిబ్బంది వేలిముద్రల సహాయంతో హాజరైనట్లుగా నమోదు చేయించుకుంటున్నారు. కొందరు డాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులకు వైద్యం చేస్తూ మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లాలో ఒక మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి తన వ్రస్తాలను మార్చి మార్చి ఇతర వ్రస్తాలను ధరించి ఫొటోలు దిగి బయోమెట్రిక్ అటెండెన్స్లో ఫీడ్ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ డాక్టర్పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించగా కొందరు మంత్రుల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొన్ని సంఘాలు కూడా ఇటువంటి డాక్టర్లకు వంతపాడుతున్నాయని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Sankalp Siddhi Case: ఐదుగురి అరెస్ట్.. ఏపీ, తెలంగాణలో రూ.170 కోట్లు సేకరణ
సాక్షి, విజయవాడ ప్రతినిధి: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘సంకల్ప సిద్ధి’ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సంస్థకు చెందిన ఐదు బ్యాం కు ఖాతాలను, 14 ప్రాంతాల్లోని ఆస్తులను, విలు వైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా సోమవారం వెల్లడించారు. ‘సంకల్ప సిద్ధి ఈ–కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను గుత్తా వేణుగోపాల్, అతని సోదరుడు గుత్తా కిషో ర్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ ఇంపోర్ట్ అం డ్ ఎక్స్పోర్ట్ పేరుతో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుం చి అనుమతి తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్లో ఆన్లైన్ వెబ్ పోర్టల్, యాప్ను రూపొందిం చారు. ఈ కంపెనీలో కొందరు డైరెక్టర్లను చేర్చుకుని చట్టవిరుద్ధంగా మనీ సర్క్యులేషన్ స్కీం, మల్టీ లెవల్ మార్కెటింగ్కు తెరతీశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక కో–ఆర్డినేటర్ను నియమించుకుని ఐదు ఆకర్షణీయమైన పథకాలతో ప్రజల నుంచి రూ.170 కోట్ల వరకు వసూలు చేశారు. ఈ మొత్తంలో కొంత నగదును డిపాజిట్దారులకు తిరిగి చెల్లించారు. గత 15 రోజులుగా విత్డ్రాలు నిలిచిపోవడంతో ఐదుగురు ఫిర్యాదు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో విచా రణ నిర్వహించాం. ఆర్బీఐ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపె నీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మోసానికి పాల్పడ్డారని గుర్తించాం.’ అని సీపీ వెల్లడించారు. అరెస్టయినవారు వీరే... ‘ప్రాథమిక విచారణ అనంతరం కంపెనీ సీఎండీలు గుత్తా వేణుగోపాలకృష్ణ (విజయవాడ), గుత్తా కిషోర్ (బళ్లారి, కర్ణాటక), డైరెక్టర్లు గంజాల లక్ష్మి, మావూరి వెంకటనాగలక్ష్మి (విజయవాడ), సయ్యద్ జాకీర్హుస్సేన్ (గుంటూరు)ను అరెస్ట్ చేశాం. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అరెస్ట్ చేసినవారిపై విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. వారి నుంచి రెండు కార్లు, రెండు సెల్ఫోన్లు, 728 గ్రాముల బంగారం, 10.5 కేజీల వెండి, రూ.51 లక్షల నగదు, నాలుగు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఎంత వసూలు చేశారు, ఎంత మేరకు మోసానికి పాల్పడ్డారనేది పూర్తిస్థాయి దర్యాప్తులో తేలుతుంది. ఆ సంస్థ ఆస్తులు, సీజ్ చేసిన బ్యాంకు ఖాతాల్లోని నగదు వివరాలను రాష్ట్ర హోం శాఖకు, న్యాయస్థానానికి తెలియజేస్తాం. న్యాయస్థానం ఆదేశాల మేరకు మోసపోయిన డిపాజిట్దారులకు నగదు చెల్లిస్తాం. ఈ మోసంతో గానీ, సంస్థ నిర్వాహకులతో గానీ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఐదో తరగతి మాత్రమే చదివిన గుత్తా వేణుగోపాలకృష్ణ 1998లో క్వాంటమ్ మనీ సర్క్యులేషన్ స్కీంలో చేరాడు. ఆ తర్వాత మరికొన్ని సంస్థలలో చేరి మనీ సర్క్యులేషన్, మల్టీలెవల్ మార్కెటింగ్పై అవగాహన పెంచుకుని హైదరాబాద్లో సొంతగా ప్లాంట్ ఎన్రిచ్ ఎంటర్ప్రైజస్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత విజయవాడ వచ్చి సంకల్ప సిద్ధి ఈ–కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించాడు.’ అని సీపీ రాణా వివరించారు. -
HYD: కంచే చేను మేసింది.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో పదిమందికి జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: కంచే చేను మేసింది. ఎవరూ గమనించలేదనుకుంది. కానీ, ఎట్టకేలకు పాపం పండింది. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ఓ బ్యాంక్ మేనేజర్తో పాటు పదిమంది దోషులకు న్యాయస్థానం కఠిన కారాగార శిక్షలు విధించింది. తొమ్మిదేళ్ల కిందటి నాటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫ్రాడ్ కేసులో బుధవారం ఎట్టకేలకు శిక్షలు ఖరారు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మోసం కేసులో పదిమందికి జైలు శిక్షలు ఖరారు అయ్యాయి. మొత్తం పది మంది దోషుల్లో ఐదుగురికి ఏడేళ్ల శిక్ష, నలుగురికి మూడేళ్ల శిక్ష, మిగిలిన ఒకరికి ఏడాదిశిక్ష ఖరారు చేసింది. శిక్షతో పాటు దోషులకు జరిమానా సైతం విధించింది. ఇక ఈ కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నష్టానికి కారణమైన ఆరు కంపెనీలకు జరిమానా సైతం విధించింది. ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై దాదాపు అయిదు కోట్ల రూపాయలు(రూ.4.57 కోట్లు) నకిలీ ఖాతాలకు మళ్లించిన స్కామ్ ఇది. ఈ కేసులో సికింద్రాబాద్ బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీనియర్ మేనేజర్ శరత్ బాబు జెల్లీతో పాటు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుహాస్ కళ్యాణ్ రామ్దాసి కూడా దోషులుగా నిర్దారణ అయ్యారు. మొత్తం పది మంది దోషులతో పాటు ఆరు కంపెనీలకు సైతం జరిమానా విధించింది సీబీఐ కోర్టు. శరత్, సుహాస్లు ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై 2013 మార్చిలో.. సీబీఐ కేసు నమోదు చేసింది. 2012 -13 మధ్యకాలంలో.. దాదాపు రూ.5 కోట్లకు వర్కింగ్ క్యాపిటల్ లిమిట్లను మంజూరు చేయడం ద్వారా ఆ నిధులను మంజూరైన వాటి కోసం కాకుండా నకిలీ.. కల్పిత పత్రాలపై మళ్లించినట్లు తేలింది. తద్వారా బ్యాంక్కు నష్టం వాటిల్లింది. ఈ కేసులో 2014 ఆగష్టులో నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. విచారణలో నిందితులను దోషులుగా నిర్ధారించి ఇప్పుడు శిక్షలు ఖరారు చేసింది సీబీఐ కోర్టు. ఇదీ చదవండి: ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.100 కోట్ల నల్లధనం -
రూ.75 లక్షల లాటరీ తగిలింది.. చిన్న ప్రక్రియ అంతే! రూ.34 లక్షలు స్వాహా!
గూడూరు: ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. చిన్న ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ అకౌంట్కు డబ్బులు బదిలీ చేస్తాం...’ అంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్ ద్వారా నమ్మబలికి గూడూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి విడతల వారీగా రూ.34లక్షలు స్వాహా చేశాడు. పది నెలల నుంచి గుట్టుగా సాగుతున్న ఈ మోసం గురించి బాధితుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది జనవరిలో అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. ఆ మొత్తాన్ని మీ అకౌంట్లో జమ చేసేందుకు కొన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేయాల్సి ఉంది’ అని ఫోన్ చేసిన వ్యక్తి నమ్మబలికాడు. దీంతో అతను అడిగిన పత్రాలను బాధితుడు ఆన్లైన్లో పంపించాడు. ఆ తర్వాత ‘మీకు మేము అందజేసే డబ్బులకు ఇన్కమ్ ట్యాక్స్ రూ.5.75లక్షలు ముందుగా కట్టాలి. అప్పుడే ఆ మొత్తాన్ని మీ అకౌంట్కు బదిలీ చేయగలం...’ అని చెప్పాడు. దీంతో అంత మొత్తం తన వద్ద లేదని బాధితుడు చెప్పగా, కాస్త సమయం ఇస్తున్నామని, ఎలాగైనా డబ్బులు చెల్లించి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అజ్ఞాత వ్యక్తి నమ్మబలికాడు. ఎట్టకేలకు బాధితుడు రూ.5.75లక్షలను అజ్ఞాత వ్యక్తి చెప్పిన బ్యాంక్ అకౌంట్లో జమ చేశాడు. మళ్లీ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఆదాయపన్ను చెల్లించామని, జీఎస్టీ కోసం కొంత మొత్తం పంపాలని చెప్పగా, అకౌంట్లో బాధితుడు డబ్బులు వేశాడు. ఇలా పలుమార్లు డబ్బులు జమ చేశాడు. చివరిగా ఇటీవల అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ‘ఇక ప్రాసెస్ మొత్తం పూర్తయింది. రూ.4.5లక్షలు చెల్లిస్తే రూ.75లక్షలు మీ అకౌంట్లో జమ అవుతుంది’ అని చెప్పాడు. దీంతో అంత డబ్బు తన వద్ద లేవని బాధితుడు చెప్పగా, రూ.50వేలు పంపాలని, మిగిలినవి తామే జమ చేస్తామని నమ్మబలికాడు. బాధితుడు మళ్లీ రూ.50వేలు అకౌంట్లో వేశాడు. ఈ విధంగా వివిధ పేర్లు చెప్పి విడతల వారీగా రూ.34లక్షలు అజ్ఞాత వ్యక్తి తన అకౌంట్లలో జమ చేయించుకున్నాడు. అయినా బాధితుడికి లాటరీ డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గూడూరు వన్టౌన్ ఎస్ఐ హజరత్బాబు తెలిపారు. గతంలోనూ మహిళకు టోకరా... అదే విధంగా గతంలోనూ గూడూరు రూరల్ పరిధిలోని కంభంపాటి లక్ష్మీదేవి అనే మహిళకు లాటరీ వచ్చిందని గుర్తుతెలియని వ్యక్తులు నమ్మబలికి ఆమె నుంచి రూ.5.9లక్షలు స్వాహా చేశారు. ఈ మేరకు జనవరిలో గూడూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. -
బాధితులే నిందితులుగా..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.903 కోట్లు వసూలు చేసి దేశం దాటించేసిన ఘరానా స్కామ్ దర్యాప్తులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. గేమింగ్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ల వెనుక చైనీయులు ఉన్నట్లు తేల్చారు. ఒకదాంట్లో బాధితులుగా మారిన వారిని సంప్రదిస్తూ మరో స్కామ్లో తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వారితో అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరిపిస్తూ నిందితులుగా మారుస్తున్నారని అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్తో కలసి మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ విన్తో సహా ప్రత్యేక ప్రో గ్రామింగ్తో కూడిన గేమ్లను అనేక యాప్లను చైనీయులు తయారు చేస్తున్నారు. ఆన్లైన్లో వీటిలోకి ప్రవేశిస్తున్న యువతకు ప్రోగ్రామింగ్ కారణంగా తొలినాళ్లల్లో లాభాలు వస్తాయి. నమ్మకం పెరగడంతో వాళ్లు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతారు. ఆపై అదృశ్యమైపోయే ఆ యాప్లు బాధితుడిని నిలువుగా ముంచేస్తాయి. తొలుత గేమింగ్ యాప్ల్లో నష్టపోయిన వారి చిట్టా ఫిలిప్పీన్స్లోని అలెన్కు చేరుతోంది. ఇతనికి.. రూ.903 కోట్ల ఫ్రాడ్లో ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన చైనీయుడు చుచున్ యోతో సంబంధాలున్నా యి. బాధితుల చిట్టా అందుకున్న అలెన్.. దాన్ని చుచున్కు పంపిస్తాడు. తమకు అవసరమైన బ్యాంక్ ఖాతాలు తెరిచి అందిస్తే నెలకు రూ.60 వేల వరకు జీతం, కమీషన్లు ఇస్తామని బాధితులకు చుచున్ ఎరవేస్తాడు. దీంతో అనేక మంది తమ పేర్లతోపాటు కుటుంబీకులు, బంధువుల పేర్ల తో ఖాతాలు తెరిచారు. వాటి నెట్ బ్యాంకింగ్ వివరాలు, లింకై ఉన్న ఫోన్ నంబర్ సిమ్ కార్డు ముంబైలో ఉన్న చుచున్కు చేరతాయి. అతను వాటిని అలెన్కు పంపిస్తున్నాడు. అక్కడ నుంచి అసలుకథ మొదలవుతుంది. ఖాతాదారుల నుంచి యాప్ల ద్వారా సంప్రదించే అలెన్ ఆ ఖాతాల్లో డబ్బు జమ చేయిస్తాడు. ఆ మొత్తం తమ ఖాతాల్లోకి మారుస్తూ.. సహకరించినవారికి జీతం, కమీషన్ ఇస్తున్నాడు. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. హైదరాబాద్కు చెందిన నాగప్రసాద్ గేమింగ్ యాప్లో రూ.20 లక్షలు నష్టపోయాడు. అదే యాప్ ద్వారా అలెన్ వల్లో పడి ముంబైలో ఉన్న చున్ ద్వారా తన బ్యాంక్ ఖాతా వివరాలు పంపాడు. ఇతడి మాదిరిగానే రామ్ అనే బాధి తు డు తన బావమరిది అనిల్ బ్యాంకు ఖాతా వివరాలు, సాగర్ తన స్నేహితుడైన శ్రీనివాస్ భార్య బ్యాంకు ఖాతా వివరాలు పంపారు. యాప్ల ద్వారా వచ్చే డబ్బు ఈ ఖాతాల్లో పడేలా చేసే అలెన్.. రూ.కోట్లు స్వాహా చేసేవాడు. చున్ విచారణ, అతడి ఫోన్ విశ్లేషణతో ఈ వివరాలు గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రామ్, శ్రీనివాస్, సాగర్, నాగప్రసాద్ను అరెస్టు చేశారు. చుక్తోపాటు అప్పట్లో నగరా నికి చెందిన బ్యాంక్ ఖాతాదారులు సయ్యద్ సుల్తాన్, మిర్జా నదీమ్ బేగ్, పర్వేజ్ పట్టుబడిన విషయం తెలిసిందే. దుబాయ్లో ఉంటున్న ఇమ్రాన్ ద్వారా వీరు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు తేలడంతో పోలీసులు అతడిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఇమ్రాన్ దుబాయ్ నుంచి వస్తూ ముంబై ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్కు చిక్కాడు. ఈ క్రమంలో సిటీ సైబర్క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనతో వీఓఐపీ కాల్స్ ద్వారానే సంప్రదించాలంటూ నాగప్రసాద్తో అలెన్ చెప్పాడని, దీని కోసం ఓ యంత్రాన్ని పంపాడని, దాన్నీ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?
సాక్షి, హైదరాబాద్: కాంబోడియా కేంద్రంగా చైనీయులు సాగించిన ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్’కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మొత్తం పది మంది నిందితులు ఉండగా.. ఒకరికి ఢిల్లీలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చైనా, తైవాన్ జాతీయులు సహా మిగతా తొమ్మిది మందిని గురువారం కోర్టులో హాజరుపర్చి, జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్న సన్నీ, సాహిల్లు హవాలా మార్గంలో దుబాయ్కు రూ.903 కోట్లు పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో సన్నీ ద్వారా వెళ్లిన డబ్బు వరుణ్ అరోరా, భూపేష్ అరోరాలకు చేరినట్టు తేల్చారు. సన్నీని ఢిల్లీ ఎయిర్పోర్టులోనే అరెస్టు చేశారు. ఇక సాహిల్ హవాలా మార్గంలో పంపిన రూ.400 కోట్లు దుబాయ్లో ఎవరికి చేరాయన్నది ఆరా తీస్తున్నారు. కాగా.. ఈ కేసు విషయంగా హైదరాబాద్ ఈడీ అధికారులు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఎఫ్ఐఆర్, ఇతర వివరాలను తీసుకున్నారు. ఐబీ అధికారులు కూడా ఫోన్ చేసి పలు వివరాలను తెలుసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కమీషన్ల కోసం నిబంధనలను పాతర వేసి.. భారతీయ కరెన్సీని తీసుకుని విదేశీ కరెన్సీని ఇచ్చే ‘ఆథరైజ్డ్ మనీ చేంజింగ్ (ఏఎంసీ)’సంస్థలకు రిజర్వు బ్యాంకు లైసెన్సులు ఇస్తుంది. ఈ మనీ చేంజింగ్ కోసం కొన్ని నిబంధనలు పెట్టింది. విదేశాలకు వెళ్లే వారికి వీసా, పాస్పోర్ట్ వంటివి పరిశీలించి నగదును విదేశీ కరెన్సీలోకి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీలో రంజన్ మనీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థలను ఏర్పాటు చేసిన నవ్నీత్ కౌశిక్ ఈ నిబంధనలను పక్కనపెట్టేశాడు. కేవలం ఇద్దరు క్లయింట్లతో ఒప్పందం కుదుర్చుకుని రూ.903 కోట్లను డాలర్లుగా మార్చి ఇచ్చాడు. ఇందుకోసం రూ.1.8 కోట్లు కమీషన్గా తీసుకున్నాడు. అయితే ఇంత భారీగా మనీ చేంజింగ్ జరుగుతున్నా.. రిజర్వు బ్యాంకు, ఈడీ వంటివి పసిగట్టలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
5జీకి మారాలనుకుంటున్నారా? ఆ లింక్ను క్లిక్ చేశారంటే అంతే..
హలో మీరు 5జీకి మారాలనుకుంటున్నారా?, లింక్ను క్లిక్ చేయండి అంటారు. లేదా మీ 5జీ నంబర్ను బ్యాంకు ఖాతాకి లింక్ చేయాలి, ఓటీపీ చెప్పండి ప్లీజ్ అని అడిగితే అది మోసగాళ్ల పనేనని తెలుసుకోండి. 5జీ పేరుతో అప్పుడే సైబర్ నేరగాళ్లు సొమ్ము కాజేసే ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలో 5 జీ మొబైల్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు అప్పుడే రంగంలోకి దిగారు. మీ నెట్వర్క్ను అప్డేట్ చేసుకోండి అని వంచనకు పాల్పడే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఇప్పటికే బెంగళూరు తో పాటు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా 5 జీ నెట్వర్క్ సేవలు ప్రారంభం కావడం తెలిసిందే. ప్రజలు 4 జీ నుంచి 5జీ కి అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని జిల్లాల్లో సైబర్ మోసాల పట్ల జాగృతం చేస్తున్నారు. జిల్లాకేంద్రాల్లో కరపత్రాలు ముద్రించి సార్వజనిక స్థలాల్లో పంచుతున్నారు. లింక్ ఓపెన్ చేయరాదు మొబైల్ 5 జీ నెట్వర్క్కు, బ్యాంక్ అకౌంట్ కు ఎలాంటి సంబంధం ఉండదు. సైబర్ వంచకులు బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన మొబైల్ నంబరును 5 జీ నెట్వర్క్ కు అప్డేట్ చేస్తామంటారు. నమ్మి వారు చెప్పినట్లు చేస్తే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరించారు. లింక్ పంపించి క్లిక్ చేయమంటే స్పందించరాదు. చదవండి: పులితో ఆటలా? అని అనకండి.. ముద్దులాటలు కూడా..! వైరల్ వీడియో నమ్మితే అంతే సైబర్ వంచకులు ఎయిర్టెల్, జియోతో పాటు ఇతర మొబైల్ నెట్వర్క్ కంపెనీల కాల్సెంటర్ల పేరుతో ఫోన్ చేస్తారు. సిమ్కార్డును 5 జీ కి అప్డేట్ చేస్తామని, ఓటీపీ ని చెప్పాలని నమ్మిస్తారు. ఓటీపీ చెప్పారో.. బ్యాంకు ఖాతాలో నగదు మాయం చేస్తారు. ఇటువంటి కాల్స్ను అస్సలు నమ్మరాదని పోలీసులు తెలిపారు. ఇటీవల వస్తున్న మొబైల్ స్మార్ట్ ఫోన్లు 5 జీ నెట్వర్క్ కు సపోర్ట్ చేస్తాయి. కానీ పాత మొబైల్స్ 4జీ నెట్వర్క్కు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో సైబర్ వంచకులు, 4 జీ మొబైల్స్ను 5జీ కి అప్డేట్ చేస్తామని కాల్స్ చేయడం మొదలైంది. వాట్సాప్ మెసేజ్, లింక్లు పంపుతారు. వాస్తవంగా 4జి మొబైల్స్ని 5జీ కి అప్డేట్ చేయడం సాధ్యం కాదు. -
కొంపముంచుతున్న ఇన్సూరెన్స్ మోసాలు.. చెక్ పెట్టండిలా
గత ఆర్థిక సంవత్సరపు (2021–22) ఎకనమిక్ సర్వే ప్రకారం దేశీయంగా జీవిత బీమా పాలసీల విస్తృతి 2.82 శాతం (2019లో) నుంచి 2020లో 3.20 శాతానికి పెరిగింది. గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన అనిశ్చితి భయాల కారణంగా ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా ప్రాధాన్యాన్ని గుర్తించడం పెరిగింది. అయితే, డిజిటలీకరణ నేపథ్యంలో బీమా సంబంధ మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. డేటా అంతా ఆన్లైన్లో దొరుకుతుండటంతో అమాయక కస్టమర్లను స్కామర్లు సులభంగా మోసం చేయడానికి ఆస్కారం ఉంటోంది. వీటిని అరికట్టేందుకు పరిశ్రమ తన వంతు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల మోసాలు, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేదే ఈ కథనం. ఫోన్ మోసాలు: కస్టమర్లను తప్పుదోవ పట్టించి వారిని మోసగించేందుకు స్కామర్లు ఎక్కువగా ఉపయోగించే విధానం ఇది. మోసగాళ్లు తమను తాము ఇన్సూరెన్స్ ఏజంట్లుగా పరిచయం చేసుకుని, వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని, తప్పుడు జీవిత బీమా ప్లాన్లను అంటగడుతూ ఉంటారు. ఈ–మెయిల్ మోసాలు: ప్రీమియంలు కట్టకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోయిందంటూ కస్టమరుకు ఈమెయిల్స్ వస్తుంటాయి. మెయిల్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి, పేమెంట్ చేయడం ద్వారా పాలసీని పునరుద్ధరించుకోవాలని సూచిస్తాయి. నకిలీ వెబ్సైట్లు: కొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా నకిలీ వెబ్సైట్లను సృష్టించి కస్టమర్లను బురిడీ కొట్టిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వెబ్సైట్లు ఎలాంటి పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్, కేవైసీ, హెల్త్ చెక్ లాంటివి ఏమీ అవసరం లేకుండానే పాలసీ ఇచ్చేస్తామని చెబుతుంటాయి. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో సైన్ అప్ చేస్తే చాలని ఊరిస్తాయి. తద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తస్కరిస్తాయి. లబ్ధిదారులకు చెల్లింపులు: ఈ రకం స్కాముల్లో .. ఎవరో దూరపు చుట్టం పాలసీకి సంబంధించి లబ్ధిదారు మీరేనంటూ ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఆ మొత్తాన్ని పొందేందుకు నామమాత్రంగా ముందు కొంత డౌన్పేమెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత డబ్బు కట్టాలని వాటిలో ఉంటుంది. కట్టారో అంతే సంగతులు. ఓటీపీమోసాలు: ఇలాంటి కేసుల్లో.. మోసగాళ్లు తమను తాము ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులుగా పరిచయం చేసుకుని, మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని చెప్పాలని అడుగుతారు. అలాగే, నకిలీ యాప్లు, మాల్వేర్ లింకులను పంపి వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించవచ్చు. అనధికారిక వ్యక్తులు పాలసీలను విక్రయించడం: కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు సిసలైనవిగా అనిపించినప్పటికీ వాటికి ఐఆర్డీఏఐ అనుమతులు ఉండకపోవచ్చు. అలాంటి సంస్థలు అక్రమమైనవి. వాటి నుంచి పాలసీలు తీసుకుంటే మోసపోతారు. తప్పుడు పాలసీలు అంటగట్టడం: మొత్తం ఖర్చుల గురించి మీకు పూర్తిగా వివరించకుండా బీమా పాలసీని అంటగట్టడం ఈ కోవకి వస్తుంది. అంతే గాకుండా పాలసీలో ఆఫర్ చేస్తున్న దానికి మించి మీకు మరిన్ని ప్రయోజనాలు వచ్చేలా చేస్తామంటూ తప్పుడు హామీలు కూడా ఇవ్వొచ్చు. ఇలా చేయండి .. కస్టమర్లు ఇలాంటి మోసాల బారిన పడకుండా బీమా కంపెనీలు తమ వంతు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.అయినప్పటికీ కస్టమర్లు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, సురక్షితంగా ఉండవచ్చు. అవేమిటంటే.. ► పుట్టినతేదీ, బ్యాంకు ఖాతా, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఫోన్లో చెప్పొద్దు. ► గుర్తు తెలియని వారి దగ్గర్నుంచి వచ్చే ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్లో పేమెంట్ లింకులపై క్లిక్ చేయొద్దు. ►మరీ అతిశయమైన ఆఫర్లు ఇచ్చే నకిలి వెబ్సైట్లు, ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమా కంపెనీ వెబ్సైట్లో మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు సమర్పించే ముందు అది సురక్షితమై న, సిసలైన పోర్టలేనా అని ధృవీకరించుకోవాలి. ►మీ క్లెయిమ్ను సెటిల్ చేసేందుకు లేదా లబ్ధిదారులకు చెల్లింపులు జరిపేందుకు బీమా కంపెనీలు ఎటువంటి డౌన్పేమెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజులను కోరవు అని గుర్తుంచుకోండి. ►మీ ఫోన్కి వచ్చే ఓటీపీలను థర్డ్ పార్టీలు లేదా గుర్తు తెలియని వారికి చెప్పకండి. ►సంతకాలు లేదా చెల్లింపులు చేసే ముందు పాలసీ పత్రాలను క్షుణ్నంగా చదువుకోండి. ►బీమా ఏజెంట్లు అసలైన వారేనా కాదా అనేది ధృవీకరించుకునేందుకు వారి ఐడీ ప్రూఫ్లను పరిశీలించండి. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కూడా ఏదైనా జరిగితే సత్వరం ఐఆర్డీఏఐ దృష్టికి కూడా తీసుకు వెళ్లడం శ్రేయస్కరం. అనిల్ పి.ఎం., హెడ్ (లీగల్ అండ్ కాంప్లయెన్స్ విభాగం), బజాజ్ అలయంజ్ లైఫ్ -
తక్కువ ధరకే ఐఫోన్ వస్తుందని.. ఫోన్పే ద్వారా రూ. లక్ష పంపాడు.. తీరా చూస్తే
సాక్షి, నిజామాబాద్: ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ అమ్ముతానని చెప్పిన మాటల వలలో పడి ఓ యువకుడు మోసపోయిన ఘటన ధర్పల్లిలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన చింతనాల్ల ప్రసాద్ ఈనెల 10న ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ ఫ్లాట్ ఫాంలో రషీ ద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ అమ్ముతానని చెప్పడంతో బాధితుడు నమ్మి ఫోన్ పే ద్వారా రూ. లక్ష పంపించారు. చివరికి ఫోన్ డెలివరీ అయిన తర్వాత నకిలీ ఫోన్గా గుర్తించిన బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. సందర్భంగా ఎస్సై మాట్లాడు తూ బాధితుడు ఫిర్యాదు మేరకు సైబర్ హెల్ప్ లైన్ నంబర్ ద్వారా అమౌంట్ ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. -
ఐవోబీ మాజీ ఉద్యోగులకు ఐదేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు ఆదాయ పన్ను(ఐటీ) ధ్రువపత్రాలతో గృహ రుణాలు మంజూరు చేశారన్న కేసులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) హైదరాబాద్ మాజీ చీఫ్ మేనేజర్ సౌమన్ చక్రవర్తి, మాజీ సీనియర్ మేనేజర్ శంకరన్ పద్మనాభన్కు సీబీఐ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు టి.సత్య వెంకట దివాకర్, జూలూరి లక్ష్మయ్యలకు ఐదేళ్ల జైలు, రూ.75,000 జరిమానా, సయ్యద్ ముస్తక్ అహ్మద్, బొర్ర చంద్రపాల్, తోట రవీందర్, ఎం.గోపాల్రావు, బసవన్న రవీంద్రలకు మూడేళ్లు జైలు, రూ.75,000 జరిమానా విధించింది. తప్పుడు పత్రాలు సృష్టించి గృహ రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో 2005లో బ్యాంక్ అధికారులిద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. నకిలీ సేల్ డీడ్లను, గడువు ముగిసిన ఎల్ఐసీ పాలసీలతో రుణాలు మంజూరు చేసినట్లు విచారణలో తేలింది. 2007, నవంబర్లో సీబీఐ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. ఇలా అక్టోబర్ 2003 నుంచి జనవర్ 2004 వరకు ఈ రుణాలు మంజూరు చేసి.. బ్యాంక్కు రూ.2.21 కోట్ల నష్టం కలిగించినట్లు తేలడంతో సీబీఐ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
అభిమానులకు యూట్యూబ్ స్టార్ కుచ్చుటోపీ.. రూ. 437 కోట్లు ముంచేసి
తన డ్యాన్స్ వీడియోలతో అభిమానుల్లో క్రేజ్ తెచ్చుకుంది. యూట్యూబ్లో లక్షలాది మంది ఫాలోవర్స్ను సంపాదించుకుంది. చివరికి వీదేశీ మారకపు వ్యాపారం పేరుతోవేలాది మంది అభిమానులను నట్టేట ముంచింది. తమ పెట్టుబడులపై భారీ రాబడి ఇప్పిస్తానని మాటిచ్చి సుమారు 55 మిలియన్ డాలర్లకు(భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437కోట్లు) కుచ్చుటోపీ పెట్టింది. వివారల్లోకి వెళితే.. (Photo Credits: Nutty Instagram) థాయ్లాండ్కు చెందిన నత్తమోన్ ఖోంగోచక్ అనే యుయవతి తన డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్లో పోస్టు చేయడం ద్వారా లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ముద్దుగా నట్టి అని పిలుచుకునే ఈ బ్యూటీకి ప్రస్తుతం 8,44,000 ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్గా ఎదిగింది. అంతేగాక తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఔత్సాహిక ఫారెక్స్ వ్యాపారుల కోసం ప్రైవేట్ కోర్సులకు ప్రచారం కూడా చేపట్టింది. దీని ద్వారా ఆమె పొందిన లాభాలను సైతం పోస్టు చేసింది. (Photo Credits: Nutty Instagram) View this post on Instagram A post shared by 🎬𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲: Nutty’s Diary (842k) (@nutty.suchataa) అయితే విదేశీ మారకంలో పెట్టుబడి పెడితే 35 శాతం అధికంగా లాభాలు వస్తానని అభిమానులను, ఫాలోవర్లను నమ్మించింది. నట్టి మాటలను నమ్మిన ఆమె ఫాలోవర్స్ దాదాపు 6వేల మంది డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అయితే ఉన్నట్టుండి నట్టి తన చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో.. మే నెలలో పెట్టుబడిదారులకు తాను 1 బిలియన్ భాట్ (27.5 మిలియన్ డాలర్లు) బకాయిపడ్డానని చెప్పింది. చదవండి: పెళ్లి కోసం నడి రోడ్డులో వధూవరుల ఛేజింగ్.. వీడియో వైరల్ (Photo Credits: Nutty Instagram) అంతేగాక బ్రోకర్గా వ్యవహరించిన వ్యక్తి గత మార్చి నుంచి తన ట్రేడింగ్ను ఖాతాను, నిధులను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఫాలోవర్స్ను మోసం చేయడం తన ఉద్ధేశ్యం కాదని త్వరలోనే వారి పెట్టుబడులు తిరిగి చెల్లించేందకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అయితే అధిక మొత్తంలో లాభాలు ఇప్పిస్తానని మాటిచ్చి.. నట్టి మోసం చేసిందని బాధితులు థాయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 102 మంది 30 మిలియన్ భాట్లు(6 కోట్ల 50 వేలు) కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా.. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు తెలిపారు. (Photo Credits: Nutty Instagram) View this post on Instagram A post shared by 🎬𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲: Nutty’s Diary (842k) (@nutty.suchataa) మరోవైపు నట్టిని అరెస్ట్ చేసేందుకు థాయిలాండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గత వారం వారంట్ జారీ చేసింది. అయితే జూన్ నుంచి నట్టి సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో ఆమె దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు. కానీ ఇమ్మిగ్రేషన్ రికార్డుల ద్వారా ఆమె థాయ్లాండ్ విడిచి వెళ్లలేదని తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. -
Hyderabad: సాక్ష్యాలు లేక క్లోజవుతున్న కేసులు.. 2021లో ఎన్నో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నేరం జరిగింది... ఫిర్యాదు అందింది... కేసు నమోదైంది... అయితే నిందితుడిని పట్టుకోవడానికి అవసరమైన సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నగరంలో అనేక కేసులు మూతపడుతున్నాయి. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా 23.66 శాతం కేసులు 2021లో క్లోజ్ అయ్యాయి. నగర కమిషనరేట్ పరిధిలో గత ఏడాది మొత్తమ్మీద 20,142 కేసులు నమోదు కాగా... వీటిలో 4,766 ఈ కారణంగానే మూతపడ్డాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణాన్నే పోలీసు పరిభాషలో ‘ట్రూ బట్ ఇన్సఫీయంట్ ఎవిడెన్స్/అన్ ట్రేస్డ్/నో క్లూ’ అంటారు. ‘ఇలా మూతపడిన కేసులన్నీ గతేడాదికే సంబంధించినవి కాకపోవచ్చు. అంతకు ముందు సంవత్సరాల్లో రిజిస్టరైనవి కూడా ఉండి ఉంటాయి’ అని నగరానికి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రెండు చట్టాల కింద కేసులు.. ► సాధారణంగా పోలీసులు రెండు రకాలైన చట్టాల కింద కేసులు నమోదు చేస్తుంటారు. మొదటిని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అయితే... రెండోది ఎస్ఎల్ఎల్గా పిలిచే స్థానిక చట్టాలు. 2021కి సంబంధించి సిటీలో ఐపీసీ కేసులు 17,951, ఎస్ఎల్ఎల్ కేసులు 2191 నమోదయ్యాయి. వీటిలో 4034, 723 కేసులు ఇలా క్లోజ్ అయినవే. ► మహిళలపై జరిగే నేరాలకు ఇతర కేసుల కంటే ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈ కేటగిరీకి చెందిన కేసులూ ఆధారాలు లేక క్లోజ్ అయిపోతున్నాయి. క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్కి సంబంధించి గతేడాది మొత్తం 2755 కేసులు నమోదు కాగా వీటిలో 598 ఇలానే మూతపడ్డాయి. చిన్నారులపై జరిగిన నేరాలు కేసులు 621 రిజిస్టర్ కాగా... 89 ఇలా క్లోజ్ అయ్యాయి. వృద్ధులపై జరిగిన నేరాల సంఖ్య 314గా, మూతపడినవి 101గా ఉన్నాయి. ► షెడ్యూల్డ్ కులాలపై జరిగిన నేరాలకు సంబధించి 104 కేసులు నమోదు కాగా వీటిలో 34 ఆధారాలు లేక క్లోజ్ అయ్యాయి. షెడ్యూల్ తెగలకు సంబంధించి 28 నమోదు కాగా, 8 ఇలానే మూతపడ్డాయి. ఆర్థిక నేరాల కేసులు 4860 కాగా 1479 ఆధారాలు లభించక మూతపడ్డాయి. సైబర్ నేరాల విషయానికి వస్తే నమోదైన కేసులు 3303, ఇలా మూతపడినవి 1873గా ఉన్నాయి. నగరంలోనే ఎక్కువ.. ► ప్రభుత్వ అధికారుల విధులు అడ్డుకుని, దాడికి పాల్పడిన ఉదంతాలు 2021లో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్లోనే ఎక్కువ నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య హైదరాబాద్ 20గా ఉండగా... ముంబై 10, ఢిల్లీ 8, బెంగళూరు 7 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ప్రవర్తించడం వంటి ఉదంతాలకు సంబంధించిన కేసుల విషయంలోనూ సిటీ మొదటి స్థానంలో ఉంది. ఈ కేటగిరీకి చెందిన కేసులు నగరంలో 28 రిజిస్టర్ కాగా... ఢిల్లీ 17, కోల్కతా 13, బెంగళూరు 10, ముంబై 5 నమోదయ్యాయి. ► వివిధ రకాలైన మోసాలతో కూడిన ఫ్రాడ్స్ కేటగిరీ కేసుల నమోదులోనూ హైదరాబాద్ కమిషనరేట్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఈ కేటగిరీలకు చెందిన 2771 కేసులు నమోదయ్యాయి. ఇతర మెట్రో నగరాలైన జైపూర్, ఢిల్లీ, జైపూర్, ముంబై, బెంగళూరుల్లో వీటి సంఖ్య 1488, 1414, 970, 362గా ఉంది. (క్లిక్: హైదరాబాద్లో మరో నేతపై పీడీ యాక్ట్) -
నిందితుడిని అరెస్టు చేయబోతుండగా... పోలీసులపై దాడి యూనిఫాం చింపి....
గురుగ్రామ్: ఒక వ్యక్తిని ఫ్రాడ్ కేసు విషయమై పోలీసులు అరెస్టు చేసి పోలీస్టేషన్కి తరలిస్తున్నారు. ఇంతలో ఆ నిందితుడు ఇద్దరు చెల్లెళ్లు, తల్లి, సోదరుడు పోలీసులపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటన గుర్గావ్లో చోటు చేసుకుంది. దీంతో ఆ ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు నిందితుడి సోదరుడు తప్పించుకున్నాడని చెప్పారు. ఈ మేరకు సబ్ ఇన్స్పెక్టర్ కరంబీర్ తమ స్టేషన్లో ఒక ఫ్రాడ్ కేసు నమోదైందని తెలిపారు. తాము ఆ కేసు విషయమై గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ కేసుకి సంబంధించి అనుమానితుడు కరణ్ సమదర్శ అనే వ్యక్తిని విచారించినట్లు చెప్పారు. అతను ఉత్తరప్రదేశ్లో తండా గ్రామంలో తన కుటుంబంతో కలసి ఉంటున్నాడని పేర్కొన్నారు. ఐతే అతను పోలీసుల విచారణలో నిందితుడిగా తేలడంతో అతన్ని అరెస్టు చేస్తున్నట్లు అతని కుటుంబానికి తెలియజేసి, పోలీస్టేషన్కి తరలిస్తున్నారు. ఇంతలో అతడి తల్లి ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి పోలీసుల పై దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ సతేందర్ యూనిఫాం చిరిగిపోయింది. దీంతో స్టేషన్ లోపల ఉన్న మిగతా పోలీసులు సదరు నిందితుడి తల్లి, చెల్లెళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కానీ అతని సోదరుడు వరుణ్ తప్పించుకున్నాడని, తొందరలోనే అతన్ని కూడా పట్టుకుంటామని చెప్పారు. (చదవండి: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త ) -
అవినీతి కేసులో దోషిగా మలేసియా మాజీ ప్రధాని.. 12 ఏళ్ల జైలు శిక్ష
పుత్రజయ(మలేసియా): అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ను దోషిగా తేలుస్తూ ఆ దేశ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. దీంతో మాజీ ప్రధానుల్లో చెరసాలకు వెళ్తున్న తొలి వ్యక్తిగా నజీబ్ అప్రతిష్ట మూటగట్టుకోనున్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో ఆయనకు హైకోర్టు గతంలోనే 12 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఆయన చేసిన అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, మనీ లాండరింగ్ నేరాలకు తగిన శిక్షే ఇది’ అని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల ఫెడరల్(సుప్రీం) కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన తన జైలుజీవితం మొదలుపెట్టాలని ఆజ్ఞాపించింది. మలేసియా అభివృద్ధికి ఉద్దేశించిన 1 మలేసియా డెవలప్మెంట్ బెహ్రాత్(1ఎండీబీ) నుంచి ఏకంగా 450 కోట్ల అమెరికన్ డాలర్లను నజీబ్ దోచుకున్నారని, 1ఎండీజీ విదేశీ విభాగమైన ఎస్ఆర్సీ ఇంటర్నేషనల్ నుంచి 94 లక్షల డాలర్లు అక్రమంగా పొందారని దర్యాప్తులో తేలింది. దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి మైమన్ను ఈ కేసు విచారణ ప్యానెల్ నుంచి తప్పించాలంటూ నజీబ్ అంతకుముందు చేసిన అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. ఇదీ చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం! -
పొలిటికల్గా ఓకే కానీ.. సబ్జెక్టులోనే వీక్.. అడ్డంగా బుక్కైన బీజేపీ నేత
సాక్షి, చెన్నై : తన బదులు మరొకరితో పరీక్ష రాయించేందుకు ప్రయత్నించిన తిరువారూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. తిరువారూర్ సమీపంలోని గ్రామ కొండాన్ తిరువికా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఓపెన్ వర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన పొలిటికల్ సైన్స్ రెండో సంవత్సరం పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థిపై ఇన్విజిలేటర్కు అనుమానం వచ్చి హాల్ టికెట్ క్షుణ్ణంగా పరిశీలించారు. అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి విచారించారు. వ్యవహారం తొలుత రహస్యంగానే సాగినా, పోలీసులు రంగంలోకి పోలీసులు దిగి పరీక్షకు హాజరైన వ్యక్తి తిరువారూర్ సభాపతి మొదలియార్ వీధికి చెందిన దినకరన్(39)గా గుర్తించారు. ప్లస్ టూ పూర్తి చేసి, ఫిజికల్ ఎడ్యుకేషన్పై దృష్టి పెట్టిన దినకరన్ అప్పుడప్పుడు రోడ్డు సైడ్ బిర్యానీ కొట్టు నడిపేవాడని తేలింది. పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు స్టేషన్కు తరలించి తమదైన స్టైల్లో విచారించారు. బీజేపీ విద్యార్థిసంఘం నేత రమేష్ తనను పరీక్ష రాయమని పంపించాడని, ఎవరి బదులు పరీక్ష రాస్తున్నానో తెలియదని తెలిపాడు. అర్ధరాత్రి పోలీసులు రమేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా తిరువారూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్ రాయాల్సిన పరీక్షకు దినకరన్ను పంపినట్లు తెలిపాడు. వెంటనే భాస్కర్ను కూడా పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో పట్టు లేకపోవడంతో తన బదులు మరొకరిని పరీక్షకు పంపించినట్టు అంగీకరించాడు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి, ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: బీజేపీకి బిగ్ షాక్.. -
Hyderabad: యువతి ఫోన్కు స్పందించి రహస్యంగా కలిసేందుకు వెళ్లడంతో..
సాక్షి, హైదరాబాద్: మగువ ఫోన్కు స్పందించి రహస్యంగా కలువడానికి వెళ్లిన ఓ బాధితుడు మోసపోయిన సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని మహిళ పాత పాల్వంచ, కొత్తగూడెం–భద్రాద్రి జిల్లాకు చెందిన ఏ2 పల్లపు రోజ, అలియాస్ మానస(24), జనప్రియ వెస్ట్సిటీ, మియాపూర్కు చెందిన ఎడ్ల శ్రీపాల్రెడ్డికి ఫోన్ చేసింది. ఫోన్కు స్పందించి ఆమెను కలువడానికి జూన్ 27న పోచారం మున్సిపాలిటీ శివాలయం దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో అక్కడే కాపుకాసిన హమాలి కాలనీ పాల్వంచ, కొత్తగూడెంకు చెందిన ఏ1 కందుల వంశీ అలియాస్ కుమార్(35), ఏ3 శ్రీరాంపురం, భీమవరం, పశ్చిమగోదావరికి చెందిన సాగి వర్మ (26), ఏ4 పోచారం శివాలయంలో సమీపంలో నివసించే సీతానగర్, పాల్వంచ, పశ్చిమ గోదావరికి చెందిన పల్లపు దేవి(25) అతడిని నిర్బంధించారు. అతడిని బెదిరించి హెచ్డీఎఫ్ డెబిట్ కార్డు ద్వారా రూ.లక్ష, ఏటీఎం ద్వారా పలు దఫాలుగా రూ.2,02,254లు లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పీఎస్లో కేసు నమోదైంది. జూన్ 30న రాత్రి కుషాయిగూడలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా పై కేసులో నిందితులని తేలింది. వారి దగ్గరి నుంచి రూ.1,60,254లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామన్నారు. కాగ ఏ1, ఏ2లు ఒక జంటగా, ఏ3, ఏ4లు భార్యభర్తలు. తక్కువ సమయంలో కేసు చేధించిన సీఐ చంద్రబాబు, డీఐ జంగయ్య, క్రైం ఎస్సై సుధాకర్ సహచర బృందాన్ని రాచకొండ సీపీ మహేశ్భగవత్ అభినందించారు. చదవండి: హైదరాబాద్లో భారీగా తగ్గిన క్యాబ్లు, ఆటోలు! -
రూ. 300 కోట్ల మోసానికి పాల్పడ్డ భారత సంతతి వ్యక్తి అరెస్ట్
$45 Million Investment Fraud: నీల్ చంద్రన్ అనే భారత సంతతి అమెరికన్ దాదాపు రూ. 300 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డాడని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపింది. చంద్రన్ తన కంపెనీలలోని పెట్టుబడుదారులకు అధిక ఆదాయం వస్తుందంటూ తప్పుడూ ఆధారాలను చూపి సుమారు 10 వేలమందిని మోసం చేశాడని పేర్కొంది. నేరారోపణ ప్రకారం..."తన కంపెనీలలోని ఒకటి లేదా రెండు కంపెనీలను 'ViRSE' అనే బ్యానర్తో నిర్వహిచడమేక కాకుండా ఎక్కువ ఆదాయం వస్తున్నట్లుగా చూపించే సాంకేతిక కంపెనీలను చంద్రన్ కలిగి ఉన్నాడు. పైగా ఈ కంపెనీలు సంపన్న కొనుగొలుదారుల కన్సార్టియం ద్వారా కొనగోలు చేయబడుతోందంటూ తప్పుడు సాక్ష్యాలు చూపాడు. వాస్తవానికి అతని కంపెనీలో సంపన్న కొనుగోలుదారులు ఉంటేనే పెట్టుబడుదారలకు ఆదాయం వస్తుంది. కానీ చంద్రన్ కంపెనీలో అలాంటి సంపన్న కొనుగోలుదారులు ఎవరు లేరు. చంద్రన్ పై మూడు ఫ్రాడ్ కేసులు, అక్రమంగా పొందిన ఆస్తిలో లావాదేవీలు జరిపినందుకుగానూ అదనంగా మరో రెండు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ చంద్రన్ పై మోపబడిన ఈ అబియోగాలు రూజువైతే మూడు ఫ్రాడ్ కేసుల్లో ఒక్కొక్క ఫ్రాడ్ కేసుకి 20 ఏళ్లు చొప్పున జైలు శిక్ష , అలాగా అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన రెండు కేసుల్లో ఒక్కొక్క కేసుకి 10 ఏళ్లు చొప్పున శిక్ష పడుతుందని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు చంద్రన్ వద్ద ఉన్న 39 టెస్లా వాహనాలతో సహా 100 వేర్వేరు ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, రియల్ ఎస్టేట్ తదితర ఆస్తులు మోసాలు ద్వారా సంపాదించిన ఆస్తులుగా జప్తు చేయబడతాయని స్పష్టం చేసింది. (చదవండి: పాక్లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు! కారణం ఏంటంటే..) -
Hyderabad: రెస్టారెంట్లో పెట్టుబడులంటూ రూ.13 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లో ఏర్పాటు చేసి క్యూబా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ను చూపిస్తూ అందులో పెట్టుబడుల పేరుతో అనేక మంది నుంచి రూ. 13 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసులో తల్లీకుమారులను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. క్యూబా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్వహించే నాగెల్లి రూపస్ ఆయన భార్య నాగెల్లి సుకన్య, కుమారుడు జసింత్ జీటీఎఫ్ఎల్ మినిస్ట్రీస్ పేరుతో చర్చిల్ని నిర్వహిస్తున్నారు. అక్కడకు వచ్చిన వారిని నమ్మించిన ఈ త్రయం వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేశారు. 2017–18ల్లో దాదాపు 30 మంది నుంచి రూ.13 కోట్ల వరకు తీసుకున్నారు. తమ డబ్బు ఇవ్వమని అడిగిన వారిని బెదిరించడం వారిపైనే కేసులు పెట్టడం చేస్తున్నారు. వీరికి రూ.కోటి వరకు ఇచ్చి మోసపోయిన కేవీ ప్రసాద్ అనే బాధితుడు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఏసీపీ సందీప్కుమార్ బుధవారం సుకన్య, జసింత్లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రూపస్ కోసం గాలిస్తున్నారు. వీళ్లు విదేశాల్లోని వారి నుంచి డబ్బు తీసుకున్నారని, తెనాలీలోనూ వీరిపై కేసులు ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. టెన్షన్.. అటెన్షన్! -
సైబర్ క్రిమినల్... ట్రిపుల్ యాక్షన్!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. నగరానికి చెందిన ఓ మహిళను మోసం చేయడానికి ఉత్తరాదికి చెందిన ఓ సైబర్ క్రిమినల్ ట్రిపుల్ యాక్షన్ చేశాడు. బాధితురాలి నుంచి ఇప్పటికే రూ.3 లక్షలు కాజేసిన అతగాడు మరో రూ.13 లక్షల కోసం బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె సోమవారం సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేసింది. బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ మానసిక నిపుణురాలు. వివాహిత అయినప్పటికీ కొన్నాళ్ల క్రితం అనివార్య కారణాలతో భర్తకు దూరంగా ఉంటోంది. ఈమెకు ఫేస్బుక్ ద్వారా సుమిత్ సిరోహి అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసింది రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడిగా తెలుస్తోంది. నగర మహిళ, సుమిత్ కొన్నాళ్లు ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఆపై ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని వాట్సాప్లోనూ సంప్రదింపులు జరిపారు. తాను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఎస్సైగా సుమిత్ పరిచయం చేసుకున్నాడు. ఒకటి–రెండుసార్లు బాధితురాలితో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడాడు. ఆ సందర్భాల్లో యూనిఫాంలో ఉండి, వెనుక పోలీసులు కనిపించే చేసి ఈమెను పూర్తిగా నమ్మించాడు. అలా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి పదోన్నతి వచ్చాక చేసుకుందామని ఎర వేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఫేస్బుక్ ద్వారానే బాధితురాలికి రవి కపూర్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి, బాధితురాలిని పరిచయం చేసుకున్నదీ సుమిత్గా చెప్పుకున్న సైబర్ నేరగాడే. ఈమెతో చాటింగ్ చేసిన ఇతగాడు ముంబైలో నివసించే తాను ఓ బాలీవుడ్ ప్రముఖుడినని చెప్పాడు. దీంతో సుమిత్కు పదోన్నతి కల్పించాలని ఆమె రవిని కోరింది. అందుకు అంగీకరించిన అతడు సుమిత్ను తనకు పరిచయం చేయమని చెప్పాడు. దీంతో ఇతడి నెంబర్ సుమిత్కు ఇచ్చిన మహిళ ఆయనతో మాట్లాడమని చెప్పింది. ఆ తర్వాత ఈమెకు కాల్ చేసిన రవి పదోన్నతి ఇప్పించడానికి రూ.20 లక్షలు ఖర్చవుతాయని చెప్పాడు. ఇతడు మాత్రం వీడియో కాల్స్ చేయలేదు. ఇదే విషయం సుమిత్కు చెప్పిన బాధితురాలు వీలైనంత ఏర్పాటు చేయమంది. అయితే తన వద్ద కేవలం రూ.13 లక్షలు ఉన్నాయని, ఆ మొత్తం నీకు పంపిస్తానని చెప్పాడు. మిగిలింది కలిపి రవికి పంపాలని, మనం తర్వాత చూసుకుందామని నమ్మించాడు. ఏ దశలోనూ రవి పేరుతోనూ మాట్లాడుతున్నది తానే అని ఈమెకు తెలియనీయలేదు. వివిధ దఫాల్లో రూ.13 లక్షల్ని గూగుల్ పే ద్వారా నగర మహిళకు పంపిన సుమిత్ దానికి మరికొంత జోడించి రవికి పంపాలన్నాడు. ఇది నమ్మిన బాధితురాలు తన బంగారం కుదువపెట్టి రూ.3 లక్షలు జోడించింది. ఈ రూ.16 లక్షల్ని రవి అనే వ్యక్తి చెప్పిన ఖాతాకు పంపింది. ఇలా రెండు పాత్రల్ని పోషించిన సైబర్ నేరగాడు డబ్బు చేతికి అందాక మూడో అవతారం ఎత్తాడు. రవి కపూర్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిగా బాధితురాలికి పరిచయమయ్యాడు. పదోన్నతికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని రోజులు చెప్పాడు. ఆపై హఠాత్తుగా ఫోన్ చేసి రవి కపూర్ హార్ట్ ఎటాక్తో చనిపోయాడన్నాడు. ఆపై అతడి ఫోన్ పని చేయలేదు. ఈ విషయాన్ని బాధితురాలు సుమిత్కు చెప్పింది. ఇలాంటి సందర్భం కోసమే ఇంత కథ నడిపిన సైబర్ నేరగాడు అప్పుడు అసలు ఘట్టం మొదలెట్టాడు. తనకు రవి ఎవరో తెలియదని, నీవే పరిచయం చేశావంటూ ఆరోపించాడు. రూ.13 లక్షలు సైతం నేను నీకే పంపానని, ఆ మొత్తం నువ్వే తిరిగి ఇవ్వాలని బెదిరించాడు. అలా చేయకుంటే ఇంటికి వచ్చి గొడవ చేయడంతో పాటు కేసు పెడతానంటూ భయపెట్టాడు. దీంతో బాధితురాలు సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ మూడు పాత్రలు పోషించింది ఒకే సైబర్ నేరగాడని, అతడి ముఠా సభ్యలు సహకరించారని తేల్చారు. వీరిని పట్టుకోవడానికి సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు. (చదవండి: చుక్కలు చూపించింది! పెళ్లి చేసుకున్న నెలకే గెంటేసి....) -
కుమార్తె కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే.. రూ.లక్ష అడ్వాన్స్ తీసుకుని
సాక్షి, హైదరాబాద్: గూగుల్లో కాల్ సెంటర్ల నెంబర్లే కాదు... వివిధ సంస్థలూ బోగస్వి ఉంటున్నాయి. తన కుమార్తె కోసం డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించాలని భావించిన అత్తాపూర్ వాసి ఇలాంటి సంస్థ వల్లోపడి రూ.లక్ష నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్కు బదిలీ చేయాలని నిర్ణయించారు. అత్తాపూర్కు చెందిన బాధితుడు (62) ఓఅపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. తన కుమార్తెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో వివిధ మాట్రిమోనియల్ సైట్స్లో రిజిస్టర్ చేశారు. దీంతో ఆయనకు అనేక ప్రొఫైల్స్ నుంచి ఇబ్బడిముబ్బడిగా ప్రతిపాదనలు వచ్చాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకున్న ఆయన ముందుగా అతడి పూర్వాపరాలు పరిశీలించాలని భావించారు. దీనికోసం ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ఎంపిక చేసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేశారు. అందులో కనిపించిన నెంబర్ ద్వారా ఓ సంస్థను సంప్రదించారు. తమది ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఏజెన్సీ అని చెప్పిన అవతలి వ్యక్తులు తమకు దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉందని నమ్మబలికారు. వెరిఫికేషన్ కోసం అబ్బాయి వివరాలతో పాటు రూ.లక్ష అడ్డాన్స్గా చెల్లించాలని కోరారు. కుమార్తె భవిష్యత్తు కోసం ఆ మాత్రం ఖర్చు చేసినా పర్వాలేదని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించాడు. ఆ తర్వాత సదరు ఫోన్ నెంబర్ పని చేయకపోవడంతో కొన్ని రోజులు ఎదురు చూసి మరోసారి ప్రయత్నించి మోసపోయానని గుర్తించారు. శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. బాధితుడు నివసించే అత్తాపూర్లోని అపార్ట్మెంట్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అయితే ఆయన వయస్సు తదితరాలను పరిగణలోకి తీసుకున్న ఏసీపీ ప్రసాద్ కేసు నమోదు చేయించారు. దీన్ని దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయాలని శనివారం నిర్ణయించారు. అధికారులు ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఖతర్నాక్ కి‘లేడీ’.. ఖమ్మంలో ఘరానా మోసం
సాక్షి, ఖమ్మం: వదినగారు, అన్నయ్యగారు.. మేము అర్జెంట్గా చుట్టాల ఇంటికి వెళ్తున్నాం.. అసలే దొంగల భయం ఉంది.. ఈ సూట్కేస్ను మీ ఇంట్లో పెట్టండి అంటూ ఆ మహిళ మొదట మాటలు కలుపుతుంది. ఆ తర్వాత ఈ సూట్కేస్ను మీ మీద నమ్మకంతో అప్పగిస్తున్నా.. ఎందుకంటే దీనిలో రూ.10లక్షల బంగారం, రూ.3కోట్లు విలువ చేసే ఇంటి పత్రాలు, 60 ఎకరాల భూమి తాలుకా కాగితాలు ఉన్నాయంటూ అవతలవారు నోరు వెళ్లబెట్టేలా నమ్మబలికిస్తుంది. మరో మూడు రోజుల తర్వాత వచ్చి తన సూట్కేస్ తీసుకుని థ్యాంక్స్ చెబుతూ.. ఎంతో శ్రీమంతురాలిలా కనిపిస్తుంది. మరో రెండు రోజుల తర్వాత సూట్కేస్ పెట్టిన వారికి ఫోన్ చేసి వదిన గారు అర్జెంట్గా రూ. 5లక్షలు కావాలి.. మాకు వచ్చే డబ్బులు ఇంకా రాలేదు.. వడ్డీ ఎంతయినా పర్వాలేదు అంటుంది. అప్పటికే ఆమె హుందాతనాన్ని చూసిన వాళ్లు వెనుకాడకుండా అడిగిన డబ్బులు అప్పుగా ఇస్తున్నారు. అంతేఇక తర్వాత ఇచ్చిన అప్పుకోసం ఫోన్ చేస్తే రేపు, మాపు అంటూ వాయిదాలు వేస్తూ.. ఎక్కడకు పారిపోతాం మా ఇల్లు ఇక్కడే కదా.. అంటూ దబాయించడం మొదలుపెడతారు. ఇదే తరహాలో జరిగిన ఒక సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. నగరంలోని టూటౌన్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ తాను రూ.5, 10 లక్షల చిట్టీలు వేస్తున్నానని చెప్పి రూ.లక్ష వసూలు చేసింది. తీరా ఇస్తానన్న గడువు వచ్చేసరికి బాధితులు తాము ఇచ్చిన అప్పు కోసం ఫోన్లు చేస్తుండడంతో పోరు పడలేక ఆ మహిళ తన తన ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ఆఫ్ పెట్టుకుంది. సుమారు రూ. 5కోట్ల మేరకు ఆమె బాధితులకు కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బాధితులంతా ఆమె భర్తను కలిసి తమ డబ్బుల గురించి అడుగ్గా.. తనకు సంబంధం లేదని ఆమెనే అడగండి అంటూ చెప్పడంతో.. మీకు తెలియకుండా ఇన్ని రూ.కోట్లు ఎలా తీసుకుంది అంటూ వాగ్వాదానికి సైతం దిగారు. అయినా తనకు సంబంధం లేదని చెప్పడంతో వారు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం సివిల్ కోర్టులో తెల్చుకోండని పోలీసులు చెప్పారు. తమ డబ్బు ఎగ్గొట్టేందుకు పలువురు రాజకీయ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు సీపీ విష్ణు ఎస్ వారియర్ను కలిసి తమ గోడు వినిపించగా.. ఆయన విచారణ చేయాలని టూటౌన్ పోలీసులను ఆదేశించారు. కాగా, బాధితుల్లో ఓ పోలీస్ అధికారి కూడా ఉండడం గమనార్హం. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కానిస్టేబుల్ దంపతులు కొంతమంది ఉద్యోగులను మోసం చేసిన తీరు మరవకముందే మరో సంఘటన జరగడంతో దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఈ మాయలేడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
మ్యాట్రిమోనితో వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోని ద్వారా ప్రకటనలు ఇస్తూ మహిళలను పరిచయం చేసుకుని ఒకరికి తెలియకుండా మరొక్కరిని ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకుని మరో మహిళను మోసం చేసిన అప్పలరాజు అలియాస్ విజయ్ బాగోతం తాజాగా బయటపడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... దమ్మాయిగూడలోని అయోధ్యనగర్ కాలనీలో నివాసముంటున్న అప్పలరాజు అలి యాస్ విజయ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి సంతానం కలగలేదు. మ్యాట్రిమోని, పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ మహిళలను మోసం చేస్తు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలిసి సదరు మహిళ అప్పలరాజును నిలదీసింది. చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేస్తున్న విషయం బాధితురాలు తెలసుకుని మహిళా సంఘాల నాయకులతో అప్పలరాజు ఇంటి ఎదుట శుక్రవారం నిరసనకు దిగింది. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
ఓరి భగవంతుడా! కళ్ల ముందే రూ.80 లక్షలు.. కానీ, తీద్దామంటే..!
సాక్షి, హైదరాబాద్: స్నేహితుల మాట విని క్రిప్టో కరెన్సీలో డబ్బు ఇన్వెస్ట్ చేసిన వ్యాపారస్తుడు లక్షల రూపాయిలు మోసపోయాడు. కంటికి లక్షలు కనిపించినా తీసేందుకు ఒక్క రూపాయి రాకపోవడంతో బాధితుడు సోమవారం సిటీ సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీ నగర్కాలనీకి చెందిన మహేష్ వృతిరీత్యా వ్యాపారస్తుడు. తన స్నేహితులు కొందరు ప్రాన్డాట్ ఏసీ డాట్ వెబ్సైట్లో క్రిప్టో కరెన్సీ చేస్తే లాభాలు వస్తాయని సూచించారు. చదవండి👉 ‘మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్.. అమ్మా, నాన్నా క్షమించండి..’ దీంతో వారిచ్చిన టెలిగ్రామ్ లింకులో జాయిన్ అయ్యి చాట్ చేశాడు. తొలుత రూ.30వేలు పెట్టగా రూ.50వేలు వచ్చాయి. ఆశతో పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.80 లక్షలు పెట్టాడు. రూ.80 లక్షలకు కోటికి పైగా లాభం కంటికి కనిపిస్తుందే కానీ తీసేందుకు ఒక్క రూపాయి రావడం లేదు. ఫేక్ అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి👉 వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి -
కాంట్రాక్టర్ చీరవాటం.. ఇంద్రకీలాద్రిపై మరో అవినీతి బాగోతం వెలుగులోకి..
సాక్షి, అమరావతి బ్యూరో: ఇంద్రకీలాద్రిపై అవకతవకలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. రోజుకో అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తున్నా.. దేవస్థానం యంత్రాంగంలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి వివిధ సరుకుల సరఫరా కాంట్రాక్టులో అక్రమాలు బహిర్గతమయ్యాయి. టెండరు షెడ్యూలులో పేర్కొన్న విధంగా నాణ్యమైన సరుకులకు బదులు నాసిరకం పంపిణీ చేస్తుండడం తెలిసిందే. అలాగే కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద కాయలు కొట్టినందుకు కొంతమంది కాంట్రాక్టరుకు చెందిన సిబ్బంది భక్తుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్న వైనం కూడా విదితమే. తాజాగా అమ్మ వారికి భక్తులు మొక్కుబడులుగా సమర్పించిన చీరల విక్రయంలోనూ బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నారు. ఇదీ సంగతి.. అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలను విక్రయించే కాంట్రాక్టును ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. దేవస్థాన ప్రాంగణంలోనూ, ఘాట్ రోడ్డులో ప్రసాదాలు విక్రయించే కేంద్రాల వద్ద చీరల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ‘శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల వస్త్ర ప్రసాద విక్రయ కేంద్రం’ పేరిట ఉన్న ఈ కౌంటర్లలో చీరలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కౌంటర్లలో కొన్ని చీరలకు మాత్రమే ధరను తెలిపే స్టిక్కర్లను అంటిస్తున్నారు. మిగతా చాలా చీరలను ఆ కౌంటర్లో ఉన్న సిబ్బందే ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. చీరల కొనుగోలుకు వచ్చిన భక్తులను ఎంత ఖరీదువి కావాలని వీరు అడుగుతున్నారు. దాన్ని బట్టి కొన్నింటిని చూపిస్తున్నారు. వాటిపై ఎలాంటి ధర లేకుండానే విక్రయిస్తున్నారు. ఇలా పలు చీరలకు వస్త్ర దుకాణాల్లో ధరల కంటే ఎక్కువ ధర చెప్పి.. కాస్త తగ్గించి ఇస్తున్నారు. ఉదాహరణకు షాపులో రూ.600–700కు మించని (ధర స్టిక్కరు లేని) చీర రూ.వెయ్యి చెప్పి వందో, యాభయ్యో తగ్గిస్తున్నారు. రశీదు కూడా లేకుండా.. వాస్తవానికి భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించేటప్పుడు దాని ఖరీదు ఎంతో అడిగి తెలుసుకుని రశీదు ఇస్తారు. వీటిని ఆ ధరపై 20–25 శాతం తక్కువ ధర నిర్ణయించి అమ్మకానికి పెడతారు. ఇలా విక్రయించే చీరలకు విధిగా బిల్లు ఇవ్వాలి. ఇందుకోసం ఈ కౌంటర్లలో ఒక బిల్లింగ్ మిషన్ను కూడా అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ విక్రయించే చీరలకు బిల్లు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.ఇంద్రకీలాద్రిపై అమ్మవారి చీరల విక్రయ కౌంటర్ భక్తుల సెంటిమెంటే ఆయుధం భక్తులు అమ్మ వారి చీర కొనుక్కోవడం అంటే ఎంతో సెంటిమెంటుగా భావిస్తారు. దీంతో చాలామంది చీరలపై ధర లేకపోయినా, బిల్లు ఇవ్వకపోయినా అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖరీదు చేసే చీరలను ఎక్కువ ధరకు అమ్మడం, వాటికి బిల్లు ఇవ్వకపోవడం ద్వారా సదరు కాంట్రాక్టరు భక్తుల నుంచి భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నారు. కళ్లెదుటే ఇంతటి మోసం జరుగుతున్నా దేవస్థానం అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాంట్రాక్టరు దోపిడీకి అడ్డుకట్ట వేయడం లేదు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటాం.. నిబంధనల ప్రకారం అమ్మవారి వస్త్ర ప్రసాదం చీరలపై విధిగా ధర ఉండాలి. విక్రయించిన చీరలకు కచ్చితంగా బిల్లు ఇవ్వాలి. అలా విక్రయించడం తప్పు. వస్త్ర ప్రసాద విక్రయ కౌంటర్లలో అక్రమాలకు తావు లేకుండా చూస్తాం. సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటాం. – భ్రమరాంబ, ఈవో, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం -
చిట్టీల పేరుతో టీడీపీ నాయకుడి మోసం
పొదలకూరు: చిట్టీల పేరుతో ఓ టీడీపీ నాయకుడు వందలాది మంది బాధితులకు రూ.కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు. ఎస్పీ విజయారావు గత సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పొదలకూరుకు చెందిన రత్నం అనే బాధితుడు అరుణాచలంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుల కథనం మేరకు.. పొదలకూరు మజరా గ్రామం చిట్టేపల్లి గ్రామానికి చెందిన అరుణాచలం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. అతడు పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ వ్యాపారిగా ఈ ప్రాంతంలో అందిరికీ సుపరిచితుడు. చాలాకాలంగా నమ్మకంగా బంధువులు, స్నేహితులు, మండలంలోని ప్రముఖుల వద్ద సుమారు రూ.15 కోట్ల వరకు చిట్టీలు కట్టించాడు. ఆరునెలలుగా పాటలు సక్రమంగా పెట్టకపోగా పాడిన వారికి సకాలంలో డబ్బులు చెల్లించలేదు. అప్పటి నుంచి బాధితులు ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతున్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. నెలరోజులుగా బాధితు ల నుంచి ఒత్తిడి పెరగడంతో పరారైయినట్లుగా చెబుతున్నారు. విలాసవంతంగా జీవిస్తున్న ఇతడు గతేడాది ఓ సినిమా నిర్మించేందుకు సైతం బాధితుల నగదును వినియో గించినట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఐ విచారణ కాగా రత్నం ఫిర్యాదును ఎస్పీ పొదలకూరు సీఐ సంగమేశ్వరరావుకు పంపారు. రూ.6 లక్షల చిట్ వేశాడని ఆయనకు రూ.5 లక్షలు అరుణాచలం చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సీఐ గురువారం వెల్లడించారు. -
సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి హోదా.. ఉద్యోగాలు పెట్టిస్తానంటూ.
సాక్షి, ఉప్పల్: తాను ఒక పేరొందిన సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి హోదాలో ఉన్నానంటూ మాదాపూర్, బెంగళూర్లో ఉద్యోగాలు పెట్టిస్తానంటూ అమాయక నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు దండుకున్న మహిళను ఉప్పల్ పోలీసులు రిమాండ్కు తరలించారు. సీఐ గోవిందర్రెడ్డి వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన చంద్రగుంట లలిత పరమేశ్వరి (26), ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ రామంతాపూర్ శ్రీనివాసపురంలో ఉంటుంది. ఈమెతో పాటు తిరుపతిలో నివాసముండే ప్రసాద్, కూకట్పల్లికి చెందిన రామ్, బెంగళూరుకు చెందిన మనోజ్ శర్మలు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రామంతాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆరుగురి నుంచి ఆన్లైన్ ద్వారా దాదాపుగా రూ. 24 లక్షల వరకు వసూలు చేశారు. రేపు మాపంటూ నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి పంపారు. తీరా అక్కడికెళ్లగా అసలు విషయం బయటపడింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఈ నెల 29న ఉప్పల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు సూత్రధారి అయిన లలిత పరమేశ్వరిని బుధవారం రిమాండ్కు తరలించారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ‘ఒంటరిగా ఉన్నాను ఇంటికిరా’.. అంటూ పిలిచి మహిళ నిలువుదోపిడి -
యువతి నుంచి ఫోన్.. కొరియర్ ఓపెన్ చేస్తే స్వీట్ బాక్స్.. అసలేం జరిగింది?
సాక్షి, మెదక్:(దుబ్బాక): సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నా అమాయక ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్కు స్పందించి ఓ వ్యక్తి మోసపోయిన ఘటన తొగుట మండలంలోని వెంకట్రావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తుప్పటి కనకయ్యకు రెండు రోజుల క్రితం ఓ అపరిచిత యువతి ఫోన్ చేసింది. మీ సెల్ నంబర్కు ఆఫర్ వచ్చిందని, రూ.1600లు చెల్లిస్తే రూ.7500 విలువచేసే స్మార్ట్ఫోన్ ఇస్తామని చెప్పింది. కొరియర్ ద్వారా మీ ఇంటికి ఫోన్ వచ్చాకే డబ్బులు చెల్లించమంటూ నమ్మకం కలిగించడంతో కనకయ్య ఇంటి అడ్రస్ తెలిపాడు. గురువారం మధ్యాహ్నం పోస్ట్ రావడంతో డబ్బులు చెల్లించి పార్సిల్ను తీసుకున్నాడు. ఓపెన్ చేసి చూడగా స్మార్ట్ ఫోన్ బదులు స్వీట్ బాక్స్, హనుమాన్ చాలీసా, యంత్రం ఉండడంతో ఖంగు తిన్నాడు. మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. చదవండి: ఆదిలాబాద్: మారుమూల గ్రామ సర్పంచ్కి ఢిల్లీ నుంచి ఆహ్వానం -
పనిచేస్తున్న సంస్థకే కన్నం.. భార్య, బావమరిది పేర్లతో పే రోల్స్.. రూ.2 కోట్లు స్వాహా
సాక్షి, హిమాయత్నగర్: పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. లేని ఉద్యోగులు ఉన్నట్లు చూపి సంస్థకు సంబంధించిన డబ్బును జీతాల రూపంలో కుటుంబ సభ్యుల అకౌంట్లో జమ చేసుకున్నాడు. ఏడాదిన్నర పాటు కోట్ల రూపాయిలు కొట్టేసి ఇటీవల ఉద్యోగం మానేయడంతో.. తోటి ఉద్యోగి ఈ విషయాన్ని యజమాన్యానికి తెలిపాడు. దీంతో విషయం బయటపడి సిటీ సైబర్క్రైం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..హబ్సిగూడలోని ఓ ‘యాప్ అప్లికేషన్’ కంపెనీలో నగరానికి చెందిన యువకుడు అకౌంట్స్లో పనిచేస్తున్నాడు. సంస్థలో ఉద్యోగం చేయకపోయినప్పటికీ చేస్తున్నట్లుగా తన భార్య, బావమరిది, మరో కుటుంబసభ్యుడు, తోటి ఉద్యోగుల పేర్లతో నకిలీ పే రోల్స్ తయారు చేశాడు. వాటిపై ఏడాదిన్నరగా వారు జీతం తీసుకుంటున్నట్లు రూ.లక్షా 60వేలు కాజేశాడు. మరలా జీఎస్టీ పేరుతో సంస్థ నుంచి రూ.46 లక్షలు స్వాహా చేశాడు. మొత్తంగా ఏడాదిన్నరలో రూ.2 కోట్ల 6 లక్షలు కొట్టేసి ఉద్యోగం మానేశాడు. ఆయన ఉద్యోగం మానేసిన తర్వాత ఈ విషయాన్ని ఓ ఉద్యోగి యజమాన్యానికి లీక్ చేశాడు. వారు అకౌంట్స్ సరి చూసుకొని, కంపెనీలో చేయకపోయినా చేస్తున్నట్లు పే రోల్స్ క్రియేట్ చేసి డబ్బు కొట్టేశాడని కంపెనీ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి: గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్, వంట నూనెలు, చికెన్, పచ్చిమిర్చి.. తగ్గేదేలే! ఇన్సూరెన్స్ పేరుతో రూ. 3.5 కోట్లకు టోకరా హిమాయత్నగర్: ఇన్సూరెన్స్ పేరుతో మోసగించిన ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మోతీనగర్కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రామరాజును ఇన్సూరెన్స్ చేసుకోవాలంటూ ముగ్గురు స్నేహితులు వెంటపడ్డారు. పదే పదే కాల్స్ చేస్తుండటంతో రామరాజు విడతల వారీగా వీరికి రూ.3 కోట్ల 50 లక్షలు చెల్లించి ఇస్సూరెన్స్ తీసుకున్నాడు. డబ్బు కట్టిన తర్వాత వచ్చే పత్రాలను రామరాజు అమెరికాలో ఉన్న తన కుమారుడికి పంపాడు. ఆ కంపెనీకి చెందిన అధికార వెబ్సైట్లో తండ్రి రామరాజు వివరాలు ఏవీ లేవు. దీంతో అనుమానం వచ్చి తన తండ్రి రామరాజుకు చెప్పాడు. దీనిపై ఇన్సూరెన్స్ డబ్బు తీసుకున్న కరీంనగర్కు చెందిన మనోజ్, వనపర్తికి చెందిన మహేష్గౌడ్, ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సుబ్రహ్మణ్యంను నిలదీశాడు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో ఇటీవల సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ఈ ముగ్గురినీ శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. -
తక్కువ రేట్లకే బ్రాండెడ్ వస్తువులు.. డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే!
Hyderabad Fraud Shopping Website: బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో కళ్ల జోడు యాడ్ వచ్చింది. దానిపై ప్రముఖ కంపెనీ పేరు ఉండటంతో పాటు క్లియరెన్స్ సేల్ అని కనిపించడంతో ఆయన ముందుకు వెళ్లారు. మార్కెట్లో కనీసం రూ.10 వేలు ఖరీదు చేసే చలువ కళ్లజోడు కేవలం రూ.2 వేలకే అంటూ అందులో ఉంది. ఆ మొత్తం ఫోన్ పే ద్వారా చెల్లించిన ఆయన కొన్ని రోజులకు మోసపోయినట్లు గుర్తించారు. ఇటీవల కాలంలో అనేకమంది ఇలాంటి ఆన్లైన్ ప్రకటనల బారినపడి మోసపోతున్నారు. నష్టపోయేది చిన్న మొత్తాలు కావడంతో పోలీసుల వరకు వెళ్లకుండా మిన్నకుండిపోతున్నారు. ఇదే మోసగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. నగరంలో ప్రతి రోజూ వందలాది మంది ఈ యాడ్స్ బారినపడుతున్నారని తెలుస్తోంది. క్లియరెన్స్ సేల్ పేరుతో... ఫేస్బుక్ సహా వివిధ సోషల్మీడియా సైట్ల ద్వారా నకిలీ కంపెనీలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కళ్లజోళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, ఉడెన్ ఫర్నిచర్.. ఇలా అనేక ఉత్పత్తులకు సంబంధించి ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్న ఆ ప్రకటనల్లో ఉత్పత్తుల ఫోటోలు అదే స్థాయిలో ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్లో దొరికే వాటి కంటే ఆకట్టుకునేలా, అతి తక్కువ రేటుతో కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సేల్స్, క్లియరెన్స్ సేల్ అంటూ మోసగాళ్లు పొందుపరుస్తున్నారు. వీటిని చూసిన ఎవరైనా తక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని అనుమానించట్లేదు. ‘పైన’ ఒకటి.. ‘అడ్రస్’ మరోటి.. ► ఈ ప్రకటనలు సైతం చూసే వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉంటున్నాయి. సదరు వెబ్ పేజీ తెరిచిన వెంటనే పైన ప్రముఖ కంపెనీల పేర్లు దర్శనమిస్తున్నాయి. మోసగాళ్లు ఎక్కువగా ఈ–కామర్స్ రంగంలో పేరెన్నికగన్న కంపెనీల పేర్లు, లోగోలు వాడుతున్నారు. ► ఆయా సైట్లలో షాపింగ్ చేయడానికి పొందు పరచాల్సిన ఫోన్ నంబర్, చిరునామా తదితరాలకు సంబంధించిన అంశాలన్నీ ఈ పేజీలోనూ ఉంటున్నాయి. ఆ పేజీలకు సంబంధించిన అడ్రస్ బార్లో మాత్రం ఆయా కంపెనీ అడ్రస్లు ఉండట్లేదు. ► సాధారణంగా ప్రముఖ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఖరీదు చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు, ఉత్పత్తులకు మినహాయిస్తే మిగిలిన వాటికి ఇది కచ్చితంగా కనిపిస్తుంటుంది. ► బోగస్ వెబ్సైట్లలో మాత్రం ఈ అవకాశం ఉండదు. ఖరీదు చేసే వాళ్లు కచ్చితంగా అప్పటికప్పుడే గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐలు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు చెల్లించిన తర్వాతే ఆర్డర్ ఖరారు అవుతోంది. చదవండి: ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు..హైదరాబాద్లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు ‘మార్కెటింగ్ ఇంటెలిజెన్స్’ ఏమైనట్లు? ► బాధితులు నష్టపోయేది తక్కువ మొత్తాలే కావడంతో కనీసం 5 శాతం మందీ పోలీసు వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. డబ్బు తిరిగి రాదు సరికదా ఠాణా చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు భావిస్తుండటమే దీనికి కారణం. సైబర్ స్పేస్లో జరిగే ఈ తరహా మోసాలను ముందుగానే కనిపెట్టాల్సిన అవసరం ఉంది ► నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, కేసుల దర్యాప్తులో తలమునకలై ఉంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఈ విషయాలు పట్టించుకోవట్లేదు. ఫలితంగా మోసగాళ్లు అనునిత్యం అందినకాడికి దండుకుంటున్నారు. ► ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా టోల్ఫ్రీ నంబర్ 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే... ► డబ్బు చెల్లించిన వినియోగదారులకు కన్ఫర్మేషన్ ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్లు రావట్లేదు. మరోసారి ఆ పేజ్లోకి వెళ్లి తనిఖీ చేయాలని ప్రయత్నిస్తే గతంలో లావాదేవీలు చేసిన పేరుతో కనిపించట్లేదు. ► కొన్నిసార్లు యూపీఐ విధానంలో డబ్బు చెల్లించిన తర్వాత ఆయా సైట్లలోనే ఏదో సాంకేతిక పొరపాటు జరిగింది. మళ్లీ ప్రయత్నించండి’ అంటూ వస్తోంది. ► అప్పటికే చెల్లించిన డబ్బు మాత్రం వినియోగదారులకు తిరిగి రావట్లేదు. అతికష్టమ్మీద షాపింగ్ చేసిన పేజ్ను గుర్తించి, పరిశీలిస్తే మాత్రం రివ్యూల ద్వారా అసలు విషయం తెలుస్తోంది. వాటిలో వందల మంది తాము మోసపోయాంటూ రాస్తున్నారు. -
10 మిలియన్ డాలర్ల మోసం కేసులో ఆపిల్ మాజీ ఉద్యోగి అరెస్టు!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ మాజీ ఉద్యోగి వివిధ పథకాల పేరుతో 10 మిలియన్ డాలర్లకు పైగా మోసం చేసినట్లు యుఎస్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. కాలిఫోర్నియాలోని శాన్ జోస్లోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన ఫైలింగ్ ఆధారంగా భారత సంతతికి చెందిన ధీరేంద్ర ప్రసాదును ఐదు క్రిమినల్ కేసుల ఆధారంగా అరెస్టు చేశారు. దిగ్గజ కంపెనీని మోసగించడానికి ఆపిల్ గ్లోబల్ సర్వీస్ సప్లై చైన్లో ఒక కొనుగోలుదారుగా పేర్కొంటూ కంపెనీలో స్థానం సంపాదించారు. ఆ తర్వాత ఆపిల్ కొనుగోలుదారుగా ప్రసాద్ విక్రేతలతో చర్చలు జరిపి ఆర్డర్స్ పెట్టినట్లు ప్రాసిక్యూటర్లు హైలైట్ చేశారు. అయితే, కంపెనీ కొనుగోలు వ్యవస్థలో అతను నమోదు చేసిన ఇన్వాయిస్ మొత్తాల ఆధారంగా ఆపిల్ చెల్లించింది. ప్రసాద్ ముడుపులు తీసుకొని తప్పుడు రిపేర్ ఆర్డర్లను ఉపయోగించి విడిభాగాలను దొంగిలించాడు. అదే సమయంలో ఆపిల్ కంపెనీ ఎప్పుడూ అందించని వస్తువులు & సేవలకు చెల్లించమని కోరాడు. ప్రాసీక్యూటర్ల ప్రకారం, ఇంకా ప్రసాద్ కూడా పన్నులను ఎగవేశారు. అతను వివిధ పథకాల పేరుతో వచ్చిన 10 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేశాడు. సమర్పించిన కోర్టు పత్రాల ఆధారంగా, ఒక దశాబ్దం తర్వాత 2018 డిసెంబరులో ప్రసాదును ఆపిల్ తొలగించింది. ఆపిల్ వ్యాపారంలో పాల్గొన్న ఇద్దరు విక్రేతల యజమానులు అలాగే టెక్ కంపెనీని మోసం చేయడంలో పాల్గొన్న ఇద్దరు విక్రేతల యజమానులు డిసెంబర్'లో ఈ ఆరోపణలను అంగీకరించారు. ప్రసాద్ ప్రస్తుతం మోసానికి పాల్పడటం, మనీ లాండరింగ్ కు పాల్పడటం, పన్ను ఎగవేతతో పాటు అమెరికాను మోసం చేయడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. అతను మార్చి 24న విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రాసిక్యూటర్ల డిమాండ్ల ప్రకారం.. అతను మిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులను కూడా కోల్పోతాడని భావిస్తున్నారు. (చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ప్రపంచంలోనే మొదటి కంపెనీగా..!) -
షరపోవా, షుమాకర్లపై చీటింగ్, క్రిమినల్ కేసులు.. ఏం జరిగింది?
రష్యన్ టెన్నిస్ దిగ్గజం మరియా షరపోవాతో పాటు ఫార్ములావన్ మాజీ చాంపియన్ మైకెల్ షుమాకర్లపై గుర్గావ్ పోలీస్ స్టేషన్లో చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని చత్తార్పూర్ మినీఫామ్కు చెందిన షఫాలీ అగర్వాల్ అనే మహిళ ఫిర్యాదు మేరకు గుర్గావ్ పోలీసులు షరపోవా, షుమాకర్ సహా 11 మంది వ్యాపారులపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షఫాలీ అగర్వాల్ మాట్లాడుతూ.. రియల్టెక్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమని మోసం చేసిందని తెలిపారు. సెక్టార్ 73లోని షరపోవా ప్రాజెక్ట్ పేరిట షుమాకర్ టవర్స అపార్టమెంట్లో ఒక ఫ్లాట్ కోసం కంపెనీ ప్రతినిధులు సుమారు రూ.80 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. 2016లో ఫ్లాట్ను అందిస్తామని నమ్మించి ఇంతవరకు మాకు అందించలేదని తెలిపారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను ఎన్నిసార్లు సంప్రదించినా న్యాయం జరగలేదని.. జాతీయ వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించగా.. వారిపై క్రిమినల్, చీటింగ్ కేసులు నమోదు చేయమని కోర్టు వెల్లడించిందని పేర్కొన్నారు. కాగా 2016లో సదరు కంపెనీకి షరపోవా, షుమాకర్లు అంబాసిడర్గా వ్యవహరించడంతో పాటు భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలుమార్లు కంపెనీ ప్రతినిధులతో కలిసి షరపోవా, షుమాకర్లు డిన్నర్ పార్టీల్లో పాల్గొన్నట్లు తేలింది. ఫార్ములావన్లో మెర్సిడెస్కు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన మైకెల్ షుమాకర్ ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్గా నిలిచాడు. ప్రస్తుత చాంపియన్ లుయీస్ హామిల్టన్ కూడా ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్షిప్ను గెలిచాడు. ఇక షుమాకర్ రికార్డులు పరిశీలిస్తే.. 2012లో రిటైర్ అయ్యేవరకు 91 విజయాలు, 155 ఫోడియమ్స్, 1566 కెరీర్ పాయింట్లు, 68 పోల్ పోజిషన్స్, 77 ఫాస్టెస్ట్ లాప్స్ అందుకున్నాడు. ఇక మహిళల టెన్నిస్ విభాగంలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరచుకుంది. 2001లో అంతర్జాతీయ టెన్నిస్లో అరంగేట్రం చేసిన షరపోవా.. టెన్నిస్లో అందాల రాణిగా నిలిచింది. 2001-2020 మధ్య ఐదుసార్లు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గడంతో పాటు 18 ఏళ్ల వయసులోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 2005లో 21 వారాలపాటు షరపోవా మహిళల టెన్నిస్ నెంబర్వన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఇక కెరీర్ గ్రాండ్స్లామ్(యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్) అందుకున్న క్రీడాకారిణిగా షరపోవా చరిత్ర సృష్టించింది. చదవండి: PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు -
క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.కోటి ఖాళీ
హిమాయత్నగర్: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రూ.కోట్లు సంపాదించవచ్చునని ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఐదుగురి వ్యక్తుల నుంచి సుమారు రూ.కోటికి పైగా కొట్టేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సిటీ సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కవాడిగూడకు చెందిన శ్రీనివాస్ను ఇటీవల ఓ వ్యక్తి టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశాడు. సదరు గ్రూప్లో నిత్యం క్రిప్టో కరెన్సీపైనే చర్చ జరుగుతుండేది. కొద్దిరోజుల తర్వాత శ్రీనివాస్తో మాటలు కలిపిన సైబర్ నేరగాడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. ‘కేకాయిన్’ అనే యాప్ను శ్రీనివాస్ మొబైల్లో డౌన్లోడ్ చేయించి పెట్టుబడి పెట్టించాడు. పలు దఫాలుగా రూ.73లక్షలు పెట్టుబడి పెట్టాడు. రూ.73లక్షలకు గాను అతడి సైట్లో ఇతని పేరుపై రూ.4కోట్లు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని మార్చుకునేందుకు, డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో శ్రీనివాస్ అతడిని నిలదీశాడు. మరింత పెట్టుబడి పెడితే ఒకేసారి రూ.కోట్లు తీసుకోవచ్చని చెప్పాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబర్పేటకు చెందిన రాజు ఇతని స్నేహితులు మరో ముగ్గురు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. రాజుకు తెలిసిన వ్యక్తి సహకారంతో రూ.28లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు చూపించకపోగా ఇచ్చిన సొమ్మును వెనక్కి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. (చదవండి: పెళ్లి పేరుతో వంచన...పరారైన ప్రియుడు) -
అల్లరిపిల్ల: ఫేస్బుక్ ఐడీతో పురుషులకు వల.. నగ్నంగా కాల్స్
చిత్తూరు అర్బన్: పురుషుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఓ యువతి ‘అల్లరిపిల్ల’ అవతారం ఎత్తింది. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్ పంపి మొబైల్ స్క్రీన్ షేరింగ్ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు కొల్లగొట్టింది. ఈ బాగోతంలో కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్న ఎనిమిది మంది మధ్యవర్తులను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. డీఎస్పీ సుధాకర్రెడ్డి, సీఐ యుగంధర్ మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫేస్బుక్లో అల్లరిపిల్ల అనే ఐడీ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చేవి. వీటిని అంగీకరించిన కొద్దిరోజుల్లోనే ఓ అజ్ఞాత యువతి మెసెంజర్ ద్వారా వాయిస్కాల్స్ చేసి, మత్తెక్కించే మాటలతో అవతలి వాళ్లను తన బుట్టలో వేసుకునేది. అనంతరం వీడియో కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుకోవడం, నేరుగా కలవడానికి నమ్మకం వచ్చాక ప్రమాదకరమైన స్పై (నిఘా) యాప్స్ లింకులను పురుషుల మొబైళ్లకు పంపేది. ఆ లింకులను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత అవతలి వ్యక్తి మొబైల్లో ఏం చేసినా అల్లరిపిల్ల తన సెల్ఫోన్ నుంచే చూసేది. వివరాలను వెల్లడిస్తున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, వెనుక అరెస్టయిన నిందితులు మరికొందరికి క్రెడిట్కార్డులు ఇప్పిస్తామంటూ నిఘా యాప్స్ పంపేది. ఆపై ఫోన్పే, గూగుల్పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేసేది. ఈ డబ్బులను నేరుగా తన బ్యాంకు ఖాతాకు కాకుండా కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకుని వారి ఖాతాల్లోకి మళ్లించేది. ఇలా ఓ పది బ్యాంకు ఖాతాల నుంచి అల్లరిపిల్ల ఖాతాలోకి నగదు వెళ్తుంది. చిత్తూరు నగరానికి చెందిన సీకే మౌనిక్ అనే వ్యక్తి సైతం అల్లరిపిల్ల మాయలోపడి ఆమె పంపిన నిఘా యాప్స్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతే.. రూ.3.64 లక్షలు బ్యాంకు నుంచి మాయమయ్యాయి. ఈనెల 3న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. మాయమైన నగదు ఏయే ఖాతాల్లో జమయ్యిందో తెలుసుకుని విశాఖ జిల్లాకు చెందిన ఎ. సాంబశివరావు (32), బి.ఆనంద్మెహతా (35), జి. శ్రీను (21), సి. కుమార్రాజు (21), ఎల్.రెడ్డి మహేష్ (24), జి. శివకుమార్ (21), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సి. సుధీర్కుమార్ అలియాస్ సుకు (30), వరంగల్కు చెందిన టి.శ్రావణ్కుమార్ (31) అనే మధ్యవర్తులను పోలీసులు అరెస్టుచేశారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్లను డీఎస్పీ అభినందించారు. ఈ ఎనిమిది మందికి కూడా ఆ అల్లరిపిల్ల ఎవరో తెలియకపోవడం కొసమెరుపు. వీరందరితో నెట్కాల్స్ ద్వారా మాట్లాడి కమీషన్ ఇచ్చి నగదు లావాదేవీలు జరపడానికి ఏజెంట్లుగా నియమించుకుంది. బాధితుడి ఫిర్యాదు, అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా అల్లరిపిల్లను ఓ యువతిగా గుర్తించిన పోలీసులు ఆమెను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
సోనాక్షిపై నాన్ బెయిలబుల్ వారెంట్, స్పందించిన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైందని, తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించిన సోనాక్షి వాటిని ఖండించింది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన కథానాల్లో ఎమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటన ఇచ్చింది. ‘నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. నాపై కావాలనే అబ్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చదవండి: రాధేశ్యామ్ షూటింగ్లో ప్రభాస్తో గొడవ, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే దీనిపై నా స్టెంట్మెంట్ కూడా తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర చేస్తున్నాడు. కాబట్టి అన్ని మీడియా హౌజ్లు, జర్నలిస్టులకు నా వినతి ఏమిటంటే. ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు. ఒకరి వ్యక్తిగత అజెండాకు వేదిక కల్పించవద్దు. సదరు వ్యక్తి ప్రచారం కోసం, నా నుంచి డబ్బును రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలపై దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. చదవండి: కండోమ్ టెస్టర్గా రకుల్, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే.. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే’ అంటూ సోనాక్షి తెలిపింది. కాగా ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న సోనాక్షి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా ఈవెంట్ నిర్వాహకుడు అడగడంతో సోనాక్షి మేనేజర్ నిరాకరించినట్లు అతడు ఆరోపించాడు. దీంతో సోనాక్షిపై కేసు నమోదైంది. -
చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాదంలో చిక్కుకుంది. చీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న దబాంగ్ నటి ఆ కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. దీంతో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగినా అందుకు సోనాక్షి మేనేజర్ తిరస్కరించాడు. ఈ విషయంపై సోనాక్షిని స్వయంగా సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలు చేశాడు. కేసు విచారణ నిమిత్తం సోనాక్షి మొరాబాద్కు రావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. దీంతో స్థానిక కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
14 మందిని పెళ్లాడిన ఘనుడు.. 7 రాష్ట్రాలకు అల్లుడు.. చివరికి!
Man Married 14 Woman: పెళ్లంటే ఇద్ద్దరు కలిసి జీవితాంతం కలిసుండేందుకు వేసే తొలి అడుగు. అయితే ఇటీవల పెళ్లంటే మూణాళ్ల ముచ్చటగా సాగుతోంది..వివాహేతర సంబంధాలూ ఎక్కువైపోతున్నాయి.. కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి నిత్య పెళ్లి కొడుకు అనే పదాన్ని నిత్యం రుజువు చేస్తూనే ఉన్నాడు. ఒకరు, ఇద్దరు కాదు. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని ఇలా ఏకంగా 14 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎంతకాలమని ఇతర భార్యలకు తెలియకుండా ఈ విషయాన్ని దాచగలడు.. చివరికి ఆరోజే రానే వచ్చింది. తనను పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ నిత్య పెళ్లి కొడుకు ఎవరూ? ఇదంతా ఎక్కడ, ఎలా జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఒడిశాలోని కేంద్రపర జిల్లాకు చెందిన బిధు ప్రకాష్ స్వైన్(54) అనే వ్యక్తి తనను తాను డాక్టర్గా చెప్పుకుంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఇతను ఒడిశాలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా నివసిస్తుంటాడు. పంజాబ్, ఢిల్లీ, అస్సాం, జార్ఖండ్, ఒడిశాలకు చెందిన మహిళను తన వలలోకి దింపి రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. మధ్య వయసున్న మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలే ఇతని టార్గెట్. కేంద్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగినని చెబుతూ మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా మహిళలకు ఎర వేస్తుంటాడు. అంతేగాక బాగా చదువుకొని ఉన్నావారు, ప్రవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వారిని మాత్రమే సంప్రదిస్తాడు. ఇలా వారిని వంచించి పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా వారి డబ్బు మీద ఉన్న ఆశతో ఇంతటి పనికి ఒడిగడుతుంటాడు. పెళ్లయిన తర్వాత కొద్దిరోజులు వారి వద్దే ఉండి తరువాత ఏదైనా పని నిమిత్తం భువనేశ్వర్కు వెళతాననే నెపంతో మహిళలను తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లేవాడు. అయితే జులై 2021లో ఢిల్లీకి చెందిన ఓ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూఢిల్లీలోని ఆర్యసమాజ్ ఆలయంలో స్వైన్ తనను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు భువనేశ్వర్లోని ఖండగిరి ప్రాంతంలోని ఓ ఇంట్లో అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలోనూ నిందితుడు షాకింగ్ నిజాలు వెల్లడించాడు. తను వివిధ మ్యాట్రిమోనియల్ సైట్లు మరియు సోషల్ మీడియాలో పరిచయమైన మరో 13 మంది మహిళలను మోసగించినట్లు తేలింది. చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్.. నిందితుని నుంచి 11 ఏటీఎం కార్డులు, 4 ఆధార్ కార్డులు, స్కూల్ సర్టిఫికెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామనీ నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు స్వైన్ గతంలో హైదరాబాద్లోనూ అరెస్టయ్యాడు. అతను సెంట్రల్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా నటిస్తూ దేశమంత అనేక మంది వ్యక్తుల నుండి రూ.2 కోట్ల మేరకు వసూలు చేశాడు. కేరళలోని ఎర్నాకులంలో ఓకేసులోనూ అరెస్టయ్యాడు. చదవండి: హోటల్లో ప్రేయసితో భర్త.. భార్య చేసిన పనికి పరార్ స్వైన్ బాధితుల్లో సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది, సీనియర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు.2018లో పంజాబ్కు చెందిన సీఏపీఎఫ్ అధికారిని పెళ్లి చేసుకుని దాదాపు రూ.10 లక్షల మేర మోసం చేశాడు. అనంతరం గురుద్వారాకు చెందిన మహిళను పెళ్లి చేసుకొని ఆసుపత్రి మంజూరు చేస్తానని చెప్పి రూ.11 లక్షలను మోసం చేశాడు. అయితే స్వైన్ ఐదుగురు పిల్లలకు తండ్రి కాగా అతను 1982లో మొదటి సారి వివాహం చేసుకున్నాడు. అప్పటితో మొదలైన ఆయన పెళ్లి బాగోతలు 20 ఏళ్ల వరకు కొనసాగాయి. ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఎంతో మంది మహిళలతో స్నేహం చేసి వారిని దొంగ వివాహం చేసుకున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం: భార్య తల నరికిన భర్త.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి.. -
మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో..
సాక్షి, హైదాబాద్: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మరణానంతరం ఆమె పేరుతో నకిలీ గిఫ్ట్ డీడ్ సృష్టించిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో పాటు ఆమె భర్త బ్యాంకు ఖాతాల్లోని రూ.33.5 లక్షలు కాజేశారు. దీనిపై ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.తదుపరి దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) బదిలీ చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాకత్పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్తర్ హుస్సేన్ ఆరోగ్య శాఖ పరిధిలోని స్టేట్ హెల్త్ ట్రాన్స్ఫోర్ట్ ఆర్గనైజేషన్లో సర్వీస్ ఇంజినీర్గా పని చేశారు. 2003లో రిటైర్ అయిన ఆయన 2015 అక్టోబర్లో చనిపోయారు. అక్తర్ భార్య నూర్జహాన్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2020 జూన్ 2న ఆమె కన్నుమూశారు. గజ్వేల్ జిల్లా నుంచి వచ్చి ఆసిఫ్నగర్ ప్రాంతంలో నివసిస్తున్న అన్నదమ్ములు మహ్మద్ సమియుద్దీన్, ఫసియుద్దీన్లు నూర్జహాన్ పేరుతో నకిలీ గిఫ్ట్ డీడ్ రూపొందించారు. వీటిని రెండు బ్యాంకుల్లో సమర్పించి నూర్జహాన్ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు పొందారు. ఓ బ్యాంకుల్లో ఉన్న నూర్జహాన్ ఖాతా నుంచి రూ.3.5 లక్షలు, మరో బ్యాంకులో ఉన్న అక్తర్ ఖాతా నుంచి రూ.30 లక్షలు దఫదఫాలుగా డ్రా చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న నూర్జహాన్ కుమారుడు జకీర్ హుస్సేన్ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తన తల్లి ఏ సందర్భంలోనూ ఎవరికీ హిబా ఇవ్వలేదని, ఆ పేరుతో నిందితులు తప్పుడు పత్రాలు సృష్టించారని జకీర్ ఆరోపించారు. ఈ మేరకు నమోదైన కేసును మలక్పేట పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్కు బదిలీ చేశారు. దీంతో దీన్ని రీ–రిజిస్టర్ చేసుకున్న సీసీఎస్ ఏసీపీ ఎం.శ్రీనివాస్ రావు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్ వచ్చేస్తా.. సీన్ కట్ చేస్తే..
సాక్షి, హైదరాబాద్: ఇన్స్ట్రాగామ్లోని యాడ్స్ డిగ్రీ చదువుతున్న ఆమెను ఆకర్షించింది. రూ.100 పెడితే రూ.200 వస్తాయన్న ప్రచారంతో ముందు కొద్దిగా డబ్బులు కట్టింది. మొదటగా వారు కొద్ది కొద్దిగా లాభాలు ఇచ్చి బుట్టలో పడేశారు. దీంతో ఆమె ఇంట్లోని తండ్రికి చెప్తే..ఆయన కూడా ప్రోత్సహించాడు. ఇంకేముంది కట్ చేస్తే తాము ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు లాభాలు ఇవ్వట్లేదని..చేసిన డబ్బు ఇవ్వట్లేదంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు మల్లేపల్లికి చెందిన తండ్రీ, కూతుర్లు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ యువతి ఇటీవల ఓ యాప్లో ఇన్వెస్ట్ చేసింది. పలు దఫాలుగా రూ.12లక్షలు కట్టింది. వాటికి లాభాలు ఇవ్వకపోగా ఆ డబ్బును కూడా బ్లాక్ చేశారు. దీంతో సిటీ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధు తెలిపారు. చదవండి: గొంతుకు చున్నీ బిగించి.. రెండో వివాహం పేరుతో రూ.10 లక్షలు స్వాహా.. ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నగరానికి చెందిన మహిళకు లండన్లో ఉంటానంటూ ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఎక్కువ రోజులు ఉండలేనని రెండు రోజుల్లో హైదరాబాద్ వచ్చేస్తా..ఢిల్లీ మీదుగా వచ్చేప్పుడు మనం కలసి బతికేందుకు పెద్ద ఎత్తున డబ్బు కూడా తెస్తున్నా అన్నాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఢిల్లీ కస్టమ్స్ కాల్స్ చేసి ఆ మహిళ నుంచి రూ.10లక్షలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మధు చెప్పారు. చదవండి:ఇమ్రాన్ఖాన్ను ఆధారాలు కోరవచ్చు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎస్బీఐ కేవైసీ అప్డేట్ అంటూ రూ.6లక్షల 40వేలు మాయం.. ఎస్బీఐ కైవైసీ అప్డేట్ చేసుకోమంటూ తార్నాకు చెందిన ఓ వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు వల వేశారు. బ్యాంకు వివరాలను సేకరించి ఆయన ఖాతా నుంచి రూ.6లక్షల 40వేలు కాజేశారు. -
మహేష్ బ్యాంక్ కేసులో కీలక నిందితుడు
-
రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు మరో లిమిటెడ్ సంస్థకు చెందిన పనులు ఇప్పిస్తామంటూ నగరానికి చెందిన వ్యక్తిని మోసం చేసిన ముఠాపై హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.579 కోట్ల పనులు సబ్–కాంట్రాక్ట్కు ఇస్తామంటూ రూ.3 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజినీర్ కె.జగదీశ్వర్ దాదాపు పదహారేళ్లుగా సాయిడక్స్ ఇంజినీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నారు. శివప్రసాద్ అనే దళారి ద్వారా ఈయనకు గతేడాది సెప్టెంబర్ 21న డీఎన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ డి.నరేష్ చౌదరి కలిశారు. ఆ సందర్భంలో మహానంది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన రూ.539 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించారు. ఆ కాంట్రాక్టు తనకే వచ్చిందంటూ నమ్మబలికాడు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన రూ.40 కోట్ల కాంట్రాక్టునూ సబ్–కాంట్రాక్టుకు ఇస్తానంటూ చెప్పాడు. బేరసారాల తర్వాత జగదీశ్వర్, నరేష్లు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత నరేష్ నుంచి జగదీశ్వర్కు ఆ రెంటితో సంబంధం లేని పనులకు సంబంధించిన వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. అదేమని ప్రశ్నిస్తే జీఎస్టీ ఇబ్బందుల నేపథ్యంలో అలా ఇవ్వాల్సి వచ్చిందంటూ చెప్పాడు. చదవండి: యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..? గరిష్టంగా వారం రోజుల్లో అసలు పనులు ప్రారంభిద్దామంటూ అందుకు అవసరమైన ఖర్చుల నిమిత్తం కావాలంటూ రూ.1.4 కోట్లు తీసుకున్నాడు. ఈ నగదు తీసుకునే సమయంలో నరేష్తో పాటు అతడి భార్య లావణ్య, బంధువు రాకేష్లతో పాటు చైతన్య అనే వ్యక్తి కూడా వచ్చారు. ఆపై సరుకు సరఫరా పేరుతో ఉమా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీ, ఏకదంత రిటైలర్స్ ప్రైవేట్ లిమిటెడ్లకు రూ.50 లక్షలు, రూ.1.1 కోట్లు చొప్పున నగదు, పర్చేజ్ ఆర్డర్లు ఇప్పించాడు. ఈ చెల్లింపుల తర్వాత జగదీశ్వర్కు ఎలాంటి సరుకు సరఫరా కాలేదు. కొన్నాళ్లు ఎదురు చూసిన ఈయన తన సబ్–కాంట్రాక్టులు, నగదు విషయంపై నరేష్ను సంప్రదించారు. అయితే అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించారు. దీంతో ఆరా తీయగా... నరేష్ నేతృత్వంలోని ముఠా అనేక మందిని ఇదే పంథాలో మోసం చేసిందని, దాదాపు ప్రతి సందర్భంలోనూ నకిలీ లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్లు చూపించినట్లు తేలింది. దీంతో ఆయన సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో నరేష్, లావణ్య, రాకేష్, స్వాతి, చైతన్య, శివప్రసాద్లతో పాటు ఉమా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీ, ఏకదంత రిటైలర్స్ ప్రైవేట్ లిమిటెడ్లపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
పేమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది.. చెక్ చేసుకోకుండానే ఓకే చెప్తే అంతే!
‘ఇటీవల వనస్థలిపురంలో ఓ మొబైల్ షాప్లోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఒకట్రెండు ఉత్పత్తులను కొనుగోలు చేయగా.. రూ.2,800 బిల్లు అయింది. స్పూఫింగ్ పేటీఎం యాప్ నుంచి షాప్ వివరాలను నమోదు చేయగానే యజమానికి బిల్లు చెల్లించినట్లు సందేశం వచ్చింది. దీంతో యజమాని తన ఖాతాలో చెక్ చేసుకోకుండానే ఓకే అనడంతో ఆ ఇద్దరు కస్టమర్లు అక్కణ్నుంచి వెళ్లిపోయారు. తాపీగా బ్యాంక్ ఖాతాలో చూసుకుంటే బిల్లు జమ కాలేదు. మెసేజ్ వచ్చింది కదా నగదు క్రెడిట్ కాకపోవటమేంటని బ్యాంకులో ఆరా తీస్తే.. అది నకిలీ మెసేజ్ అని తేల్చేశారు. దీంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు.. ఇలా ఒకరిద్దరు కాదు నగరంలో రోజుకు పదుల సంఖ్యలోనే రిటైల్ యజమానులకు స్పూఫింగ్ పేమెంట్ యాప్లతో టోపీ పెడుతున్నారు కొందరు వినియోగదారులు’ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి నగదు లభ్యత తగ్గడంతో చాలా మంది డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా మహమ్మారితో ఈ వినియోగం మరింత పెరిగింది. చిన్న కిరాణా షాపులు, కూరగాయల బండ్ల మీదా పీటీఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లు కనిపిస్తున్నాయి. యాప్ పేమెంట్ వినియోగం విరివిగా అందుబాటులోకి రావటంతో మోసగాళ్లు వీటినీ అవకాశంగా మలుచుకుంటున్నారు. కస్టమర్ కేర్ నంబర్లు, వెబ్సైట్లు, ఈ– మెయిల్ ఐడీలతో పాటూ ఈ– వ్యాలెట్లు కూడా స్పూఫింగ్ చేస్తున్నారు. చదవండి: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్ ఎలా చేస్తారంటే.. ►స్పూఫింగ్ యాప్లను మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్ఫామ్ల నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. షాపింగ్ చేశాక కొనుగోలుదారుల మొబైల్లోని స్పూఫింగ్ ఈ– వ్యాలెట్లో షాప్ పేరు, ఫోన్ నంబర్, అమౌంట్ వంటి వివరాలను నమోదు చేసి ఎంటర్ చేస్తారు. దీంతో షాప్ యజమాని ఫోన్ నంబర్కు పేమెంట్ పూర్తయినట్లు నకిలీ నోటిఫికేషన్ వెళుతుంది. వాస్తవానికి యజమాని బ్యాంక్ ఖాతాలో మాత్రం నగదు జమ కాదు. ► బ్యాంక్ అకౌంట్ను ఓపెన్ చేసి డబ్బు జమ అయిందో లేదో యజమాని చూసుకునే సమయం ఉండదు. ఎందుకంటే వేరే కస్టమర్లు ఉండటంతో బిజీగా ఉండిపోతారు. తీరా ఖాళీ సమయంలో అకౌంట్లో చూసుకుంటే ఆ నోటిఫికేషన్ తాలుకు పేమెంట్ జమై ఉండదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకుంటాడు. ఒకవేళ షాప్ యజమాని చూసుకున్నా.. డేటా, సాంకేతిక సమస్య వల్ల ఖాతాలో అప్డేట్ కావడంలో ఆలస్యం అవుతుందని ఈ కేటుగాళ్లు యజమానిని ఒప్పిస్తున్నారు. చదవండి: దేశమంతటా మన పథకాలే సౌండ్ బాక్స్తో పరిష్కారం.. నకిలీ లావాదేవీలకు సౌండ్ బాక్స్తో చెక్ పెట్టొచ్చని పేటీఎం నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా పేటీఎంకు 2.3 కోట్ల మంది వర్తకులు పార్ట్నర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. పేమెంట్ జరిగిందా లేదా అని తక్షణమే తెలుసుకునేందుకు సౌండ్ బాక్స్ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్, వాలెట్, డెటిట్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ యాప్లు ఏ మాధ్యమం ద్వారా అయినా సరే పేమెంట్ చేయగానే, ఖాతాలో నగదు జమ కాగానే లావాదేవీల వివరాలు సౌండ్ బాక్స్లో వాయిస్ రూపేణా వినిపిస్తాయి. దుకాణా యజమానులు ప్రతి లావాదేవీ వివరాలు ప్రతిరోజూ లేదా వారానికోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ పూర్తయ్యాక బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే వివరాలనూ తెలుసుకోవచ్చు. -
కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్బీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. మదుపరుల అనుమతి లేకుండా వారి షేర్లను బదలాయించడంతోపాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న బ్యాంకు రుణాలను వ్యక్తిగత, షెల్ కంపెనీలకు మళ్లించిన నేరంలో ఆయనను సోమవారం ఉదయం బెంగళూర్లో పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు. కార్వీలో జరిగిన కుంభకోణంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథితోపాటు ఇతర డైరెక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే తరహా కేసులో బెంగళూర్ పోలీసులు కూడా పార్థసారథిని పీటీ వారెంట్పై తీసుకెళ్లి విచారించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సెప్టెంబర్, అక్టోబర్ల్లో కార్వీకి చెందిన 14 కార్యాలయాలు, ఎండీ, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. కార్వీ షేర్లు కొన్న మదుపరుల పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారికి తెలియకుండా షేర్లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదలాయించుకొని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు రుణంగా పార్థసారథి పొందినట్టు ఈడీ గుర్తించింది. ఐసీఐసీఐ, ఇండస్ బ్యాంకుల ద్వారా పొందిన రూ.1,100 కోట్ల రుణంను తన ఖాతాలతోపాటు షెల్ కంపెనీలైనా కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మరో 7 కంపెనీలోకి మళ్లించి మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. డీమ్యాట్ అకౌంట్లు బ్లాక్ లిస్ట్లో ఉన్నా పార్థసారథి సెబీ నిబంధనలు ఉల్లంఘించి ఇలా తనఖా పెట్టి షేర్ల ద్వారా రుణాలను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్ గతేడాది సెప్టెంబర్లో ఈడీ రూ.700 కోట్ల విలువైన కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లను ఫ్రీజ్ చేసింది. కస్టమర్లకు తెలియకుండా బదలాయించుకున్న షేర్లకు సంబంధించిన రూ.1,906 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోకి బదలాయించినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. మిగిలిన రూ.1,800 కోట్ల లావాదేవీలపై విచారణను ముమ్మరం చేసింది. డబ్బును ఎక్కడికి మళ్లించారు, దేనికి వాడారో తేల్చేందుకు పార్థసారథిని మరింత లోతుగా విచారించనుంది. ఇందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను షెల్ కంపెనీకు మళ్లించిన ఆధారాలను ఆటోమేటెడ్ డిలీట్ సాఫ్ట్వేర్తో పార్థసారథి ధ్వంసం చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. వీటిని వెలుగులోకి తేవాల్సి ఉందని ఈడీ భావిస్తోంది. -
చీటింగ్ కేసులో తిరుమల ఏఎస్పీ.. నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపి...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుమల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (ఏఎస్పీ) పని చేస్తున్న ఎం.ముని రామయ్యపై హైదరాబాద్ సెంట్రల్ క్రై మ్ స్టేషన్లో (సీసీఎస్) చీటింగ్ కేసు నమోదైంది. ఓ డమ్మీ డీఎస్పీని రంగంలోకి దింపి, హైదరాబాద్కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ వై.వెంకట్రెడ్డి నేరానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ముని రామయ్యకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. మరోపక్క ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ఏపీ అధికారులకు సమగ్ర నివేదిక సమర్పించారు. భారీ మొత్తం వస్తుందని ఆశ చూపి... మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్కుమార్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈయన స్నేహితుడైన కోడటి జయప్రతాప్ 2018 డిసెంబర్లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లా ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే ఆయన వివిధ పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్ల తిరిగి ఇస్తాడని చెప్పాడు. ఈ మాటల్ని సునీల్కుమార్ పట్టించుకోలేదు. దీంతో 2019 అక్టోబర్ 28న ముని రామయ్యను తీసుకుని జయ ప్రతాప్ హైదరాబాద్ వచ్చారు. హిమాయత్నగర్లోని సునీల్ కుమార్ కార్యాలయానికి వెళ్లి ఆయన్ను కలిశారు. అప్పట్లో ముని రామయ్య సీఐడీ విభాగంలో తిరుపతి డీఎస్పీగా పని చేస్తున్నారు. సునీల్ కుమార్తో పెట్టుబడుల విషయం చెప్పిన ముని రామయ్య కచ్చితంగా లాభం వస్తుందని, రూ.1.2 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ నమ్మబలికాడు. అవతలి వ్యక్తి ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్ కుమార్ ప్రశ్నించారు. చదవండి: ఎఫ్ఐఆర్లను ఆన్లైన్లో ఉంచని పోలీసులు.. ‘సుప్రీం’నే ధిక్కరిస్తారా! నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపి... దీంతో ముని రామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు. కేవీ రాజు అనే వ్యక్తిని తీసువచ్చి టాస్క్ఫోర్స్ డీఎస్పీగా పరిచయం చేశాడు. గతంలో తామిద్దరం కలిసి అనేక ఎన్కౌంటర్లు చేశామంటూ నమ్మబలికాడు. అవతలి వ్యక్తి నగదు ఇవ్వకపోతే అతడిని కనిపెట్టి, డబ్బు వసూలు చేయడం రాజుకు పెద్ద పనేంకాదంటూ చెప్పాడు. దీనికితోడు ముని రామయ్య రూ.1.2 కోట్లకు తాను గ్యారెంటీగా ఉంటానంటూ రూ.3 కోట్లకు ఆర్టీజీఎస్ ఫామ్ రూపొందించి తన ఫోన్ ద్వారా సునీల్కుమార్కు పంపాడు. దీంతో పాటు ఆర్కే క్లీన్ రూమ్స్ ప్రై వేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో రూ.3 కోట్లకు రాసిన చెక్కులు ఇచ్చాడు. దీంతో రూ.1.2 కోట్లు ఇవ్వడానికి సునీల్ కుమార్ అంగీకరించారు. దీంతో 2019 నవంబర్లో ఓ గుర్తుతెలియని వ్యక్తిని రూ.1.2 కోట్లు ఇచ్చి పంపేలా ముని రామయ్య చేశారు. ఈ సందర్భంలోనే జయప్రతాప్ ఖమ్మంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పత్రాలు ఇచ్చారు. ఆరా తీయగా అసలు విషయం తెలిసి... ఇది జరిగిన తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా ఎదురు చూసినా సునీల్కుమార్కు డబ్బు తిరిగి రాలేదు. దీంతో సునీల్కుమార్ ముని రామయ్యపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తన కుమార్తె పేరుతో ఉన్న ఓ స్థలం పత్రాలు ఇచ్చిన ఆయన దానిపై రూ.2 కోట్లు రుణం తీసుకోవాలని చెప్పారు. అయితే వాటిని పరిశీలించిన బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పటి నుంచి ముని రామయ్య అందుబాటులోకి రాకపోవడంతో సునీల్కుమార్ అనుమానించారు. ఆరా తీయగా కేవీ రాజు అనే పేరుతో డీఎస్పీ లేరని తేలింది. చదవండి: Chain Snatcher: ఉమేష్ ఖతిక్ను ఇచ్చేదేలే దీంతో ఆయన తాను మోసపోయానని గుర్తించి సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో జయప్రతాప్, మునిరామయ్య, కేవీ రాజు తదితరులపై కేసు నమోదు చేసిన ఏసీపీ వై.వెంకట్రెడ్డి దర్యాప్తు చేసి నేరం జరిగినట్లు నిర్థారించారు. ఓపక్క ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా ముని రామయ్య రెండుసార్లు సునీల్కుమార్ను కలిశారు. అప్పటి వరకు తానో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పుకున్న ఆయన హఠాత్తుగా కాళ్ల బేరానికి వచ్చారు. సదరు కేసులో తనను సాక్షిగా చేర్చాలంటూ ప్రాధేయపడ్డాయి. అయితే డబ్బు విషయం మాత్రం తేల్చలేదు. -
యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని
సాక్షి, హిమాయత్నగర్: యూకేలో ఉద్యగమంటూ నమ్మించారు.. డాక్యుమెంట్లకు డబ్బులన్నారు. అలా ఆశ పెట్టి నగర వాసి నుంచి ఉన్నవన్నీ ఊడ్చేశారు సైబర్ నేరగాళ్లు. నగర వాసి ఉద్యోగం కోసం తన రెజ్యూమ్ని ఆన్లైన్ పెట్టాడు. రెజ్యూమ్ చూసిన సైబర్ నేరగాడు నగర వాసితో మాటలు కలిపాడు. యూకేలో అయితే మంచి హోదా, ప్యాకేజీతో మీ చదువుకు తగిన ఉద్యోగం వస్తుందన్నాడు. అతను చెప్పిన మాయ మాటలకు బుట్టలో పడ్డాడు. డాక్యుమెంట్స్ కోసమని, వీసా కోసమని డబ్బులు కావాలన్నాడు. ఆ తర్వాత తాము చెన్నై ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని మరికొన్ని డాక్యుమెంట్స్ అవసమరమన్నారు. ఇలా డాక్యుమెంట్స్ పేరు చెప్పి నగర వాసికి ఆశ చూపి పలు దఫాలుగా రూ.11లక్షల 14వేలు కాజేశారు. మరో వ్యక్తి ఆర్బీఎల్ బ్యాంక్ కస్టమర్ కేర్ కోసం ప్రయత్నించగా..తాము సాయ పడతామని చెప్పారు. మొబైల్లో ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేయించి నగర వాసి అకౌంట్లో నుంచి రూ.2లక్షల 56వేలు స్వాహా చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. చదవండి: సాయితో సోనీ వివాహేతర సంబంధం.. చంపుతానని భర్త బెదిరించడంతో.. -
తెలంగాణలో మరో భారీ నిధుల గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో నిధుల గోల్మాల్కు భారీ కుట్ర జరిగింది. ఫిక్సిడ్ డిపా జిట్లు కాజేసేందుకు జరిగిన ప్రయత్నం విఫలమైంది. తెలుగు అకాడమీలో జరిగి న నిధుల గోల్మాల్ వెనుక ఉన్న సూత్రధారే పాత్రే ఇక్కడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. తెలుగు అకాడమీలో కోట్ల రూపాయలకు పైగా నిధులను పక్కదారి పట్టించగా, తా జాగా గిడ్డంగుల సంస్థకు చెందిన రూ. 3.98 కోట్లు కాజేసేందుకు కుట్ర పన్నారు. అయితే ఇదే సమయంలో గిడ్డంగుల సంస్థ ఫిక్సిడ్ డిపాజిట్ చేసి సంవత్సరం కావడంతో విత్ డ్రా కో సం అధికారులు బ్యాంకును సంప్రదించగా, అధికారులు ఇచ్చిన రశీదులు నకిలీవని తేలింది. దీంతో గిడ్డంగుల సంస్థ డిపాజిట్లను కాజేసేందుకు కుట్ర జరిగినట్లు బహిర్గతమైంది. బ్యాంకుల్లో డిపాజిట్లు... రాష్ట్ర గిడ్డంగుల సంస్థ తమకు వచ్చే ఆదాయా న్ని ఖర్చులకు పోను మిగతా మొత్తాన్ని పలు బ్యాంకుల్లో సంస్థ తరఫున ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తుంది. ఇందులో భాగంగానే హైదరా బాద్ కార్వాన్ ఏరియాలోని యూనియన్ బ్యాంక్లో గతేడాది జనవరి 6న రూ. 1.90 కోట్లు, 7న మరో 1.90 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఈ నెల 6, 7 తేదీలకు ఏడాది కావడంతో డిపాజిట్లను విత్ డ్రా చేసుకునేందుకు సంస్థ అధికారులు బ్యాంకును సంప్రదించి, రశీదులు చూపించగా అవి నకిలీవని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆన్లైన్ వివరాలను బ్యాంకు అధికారులకు చూపించారు. పరిశీలించిన బ్యాంకు నకిలీ రశీదు స్థానంలో మరో రశీదును అందించి, అనంతరం నిధులను సంస్థ ఖాతాలో వడ్డీతో కలిపి జమచేశారు. అదే బ్యాంకులో అకాడమీ గోల్మాల్ తెలుగు అకాడమీ నిధుల వ్యవహరం, గిడ్డంగుల సంస్థ వ్యవహారం రెండూ కార్వాన్ ఏరియాలోని యూనియన్ బ్యాంకులోనే జరగడంతో నిధుల గోల్మాల్లో గత అధికారి పాత్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిడ్డంగుల సంస్థ బ్యాంకులో నగదును డిపాజిట్ చేసిన సమయంలో తెలుగు అకాడమీ నిధులను కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు అధికారే ఉండడం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది. ఇందుకు సంబంధించి ఈ కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. -
గేమ్ పేరుతో రూ.1,100 కోట్లు నొక్కేసిన చైనా కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: గేమ్ ఆఫ్ చాన్స్గా పరిగణించే ‘కలర్ ప్రెడిక్షన్’ను ఆన్లైన్లో నిర్వహించిన చైనా కంపెనీలు ఇక్కడివారి నుంచి కాజేసిన మొత్తంలో రూ.1,100 కోట్లు హాంకాంగ్కు తరలించేశాయి. ఢిల్లీలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి పేర్లతో ముంబైలో బ్యాంకు ఖాతాలను తెరిచిన కేటుగాళ్లు నకిలీ ఎయిర్ వే బిల్లుల సహకారంతో ఈ పని పూర్తి చేశారు. 2020లో ఈ కలర్ ప్రిడెక్షన్ గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసులు నమోదు చేసి చైనీయులు సహా ఉత్తరాదికి చెందిన పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుల ఆధారంగా ముందుకు వెళ్లిన ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది. దీంతో నకిలీ ఎయిర్ వే బిల్లుల విషయం బయటపడింది. మోసానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేకపోవడంతో హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈడీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ బి.రవీందర్రెడ్డి లోతుగా దర్యాప్తు చేయడంతో రూ.1,100 కోట్లు దేశం దాటినట్లు తేలింది. ఈ–కామర్స్ కంపెనీల పేరుతో... భారత్లో కలర్ ప్రెడిక్షన్ (రంగు సెలక్షన్ ప్రక్రియతో కూడిన జూదం) దందా నడపాలని నిర్ణయించుకున్న చైనీయులు ఢిల్లీ, ముంబైకి చెందిన కొందరితో కలిసి పథకం ప్రకారం వ్యవహరించారు. లింక్యున్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, డోకీపే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పాట్పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఈ–కామర్స్ వ్యాపారం పేరుతో వెబ్సైట్స్ను రిజిస్టర్ చేశారు. వీటి ముసుగులోనే ఆన్లైన్ గేమ్ కలర్ ప్రిడెక్షన్ను నిర్వహించారు. ఆ 3 సంస్థల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోషల్మీడియా ద్వారా సర్క్యులేట్ అయిన ఈ గేమ్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా యువతను నిండా ముంచింది. పేమెంట్ గేట్వేల నుంచి.. ఈ గేమ్ ఆడేవాళ్లు ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఈ పేమెంట్ గేట్వేల ద్వారానే చేపట్టారు. వీటి ద్వారా గేమ్ ఆడినవాళ్ల నుంచి దోచుకున్న సొమ్మును లింక్యున్, డోకీపే, స్పాట్పే ఖాతాల్లోకి మళ్లించారు. ఈ సంస్థల నుంచి సొమ్ము మళ్లించడానికి ఢిల్లీలో గ్రేట్ ట్రాన్స్ ఇంటర్నేషనల్, ఏషియా పసిఫిక్ కార్గో కంపెనీ, రేడియంట్ స్పార్క్ టెక్నాలజీస్, ఆర్చీవర్స్ బిజ్ ఇంటర్నేషనల్, కనెక్టింగ్ వరల్డ్ వైడ్, జెనెక్స్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటికి ముంబైలో బ్రాంచ్లు ఉన్నట్లు పత్రాలు సృష్టించి వెస్ట్ ముంబై జోగీశ్వరి ప్రాంతంలోని ఎస్బీఐ, ముంబైలోని నారీమన్ పాయింట్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ రహేజా సెంటర్లో 6 ఖాతాలు తెరిచి సొమ్ము తరలించారు. ఈ ప్రకియంతా నకిలీ పత్రాలతోనే నడిపారు.