రెస్టారెంట్‌లో దారుణం.. వర్కర్స్‌ని రూమ్‌లో బంధించి | Restaurant Owners Behave Cruelly On Workers In Mancherial | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్‌లో దారుణం.. వర్కర్స్‌ని రూమ్‌లో బంధించి

Published Mon, Jul 23 2018 7:10 AM | Last Updated on Mon, Jul 23 2018 8:19 AM

Restaurant Owners Behave Cruelly On Workers In Mancherial - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మంచిర్యాల : పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్‌ యాజమాన్యం అక్కడ పనిచేస్తున్న కుకింగ్‌ మాస్టర్స్‌, వేటర్స్‌ను గదుల్లో బంధించి చిత్రహింసలకు గురి చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల పట్టణం హైటెక్‌ కాలనీ సమీపంలోని టేబుల్‌7 రెస్టారెంట్‌లో పనిచేస్తున్న మొత్తం 11మందిని మూడు గదుల్లో బంధించి యాజమాన్యం విచక్షణా రహితంగా చితకబాదింది. రెస్టారెంట్‌ ఓనర్‌ ప్రవీణ్‌కు వీడియో కాల్‌లో చిత్రహింసల దృశ్యాలను చూపిస్తూ యాజమాన్యం కిరాతకంగా వ్యవహరించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులు 100కు డయల్‌ చేయటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని రక్షించారు. అయితే పనివాళ్లను చిత్రహింసలకు గురిచేయటానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement