mancherial
-
TG SSC: పేపర్ 1 ప్లేస్ లో పేపర్ 2
మంచిర్యాల: తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఆరంభమైన తొలి రోజే జిల్లాలో గందరగోళం చోటు చేసుకుంది. ఒక ప్రశ్నా పత్రం ప్లేస్ లో మరొక ప్రశ్నా పత్రం ఇవ్వడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు(శుక్రవారం)ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇది రెండు పేపర్లు కింది విభజించారు. పార్ట్ 1(పేపర్ 1), పార్ట్ 2( పేపర్2) గా విడదీసి ఒకే రోజు జరపాలని షెడ్యూల్ చేశారు. అయితే పేపర్ 1 ప్లేస్ లో , పేపర్ 2 ఇవ్వడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. సుమారు రెండు గంటల పాటు పేపర్ 2 ఇచ్చిన విషయాన్ని అధికారులు గమనించలేనట్లు సమాచారం. . ఆ తర్వాత తాము చేసిన తప్పును తెలుసుకుని నాలుక్కరుచుకున్న అధికారులు పేపర్ ను మార్చారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు అదనపు సమయం కేటాయించారు. అయితే బయట వేచి చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రలకు ఈ విషయం తెలియక పోవడంతో ఆందోళనకు గురయ్యారు,. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి తీసుకున్నారు. ఈ ఘటనపై డీఈవో, జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఐదు ఉద్యోగాలు సాధించిన సంకీర్తన
మంచిర్యాలటౌన్: చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తూ వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొడ్డు సంకీర్తన. పట్టణంలోని రాంనగర్కు చెందిన బొడ్డు భీమయ్య, మల్లక్క దంపతులకు కుమారుడు సాయికిరణ్, కుమార్తె సంకీర్తన సంతానం. భీమయ్య హమాలి పనిచేస్తూ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. పదోతరగతి మంచిర్యాల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో, డిగ్రీ కోటి ఉమెన్స్ కళాశాలలో చదివిన సంకీర్తన 2023లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. అందులో చేరకుండానే గ్రూప్–4 రాసి మంచిర్యాలలోని జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం సాధించింది. విధులు నిర్వహిస్తూనే మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించిన సీడీపీవో పరీక్షతో పాటు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్వైజర్) గ్రేడ్–1లో రెండు ఉద్యోగాలు సాధించింది. సీడీపీవో ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు, మల్టీజోన్ కేటగిరీలో 7వ ర్యాంకు సాధించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్వైజర్) గ్రేడ్ 1 మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఫలితాలను బుధవారం ప్రకటించగా, రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు, మల్టీజోన్లో 1వ ర్యాంకు సాధించింది. -
బస్సు డ్రైవర్ కు గుండెపోటు..
-
జనాన్ని కాలుష్యంలో ముంచెత్తుతారా?
డిసెంబర్ 19న జరగనున్న ఎన్టీపీసీ 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ జీవించే హక్కుకే వ్యతిరేకం. దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్ టీఎస్టీపీపీ 4,000 మెగా వాట్ల (మె.వా.) విస్తరణలో భాగంగా రెండోదశలో 3గీ800 మె.వా. స్థాపనకు, విద్యుత్పత్తికి పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) పెద్దపల్లి కలెక్టర్ ఆధ్వర్యంలో నియమానుసారం... ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది. కేవలం 13 కి.మీ. దూరంలో గోదావరి నది పక్కన మంచిర్యాల జిల్లా జైపూర్లో ఎస్సీసీఎల్ సొంత 1,200 మె.వా. థర్మల్ ప్లాంట్కు తోడుగా రామగుండం ఎన్టీపీసీలోని 4,200 మెగా వాట్లకు ఇది నూతన స్థాపిత సామర్థ్య ప్రతిపాదన. కొత్తగా టీజెన్కో రామగుండంలో 1,200 మెగావాట్లు, సింగరేణి వారు జైపూర్లోనే మరో 1,200 మెగావాట్ల విస్తర ణకు ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రజామోదంతో ఈ పరిశ్రమల ప్రతిపాదనలన్నీ కార్యరూపానికి వస్తే... కేవలం 13 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు ఆధార విద్యుదుత్పత్తి సామర్థ్యం (10,200 మె.వా.) ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర కాలుష్య కేంద్రంగా మారుతుంది.రాక్షసి బొగ్గు, విద్యుత్తు ప్లాంట్లు, సిమెంటు, ఎరువుల పరిశ్రమలన్నీ దేశాభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. వీటికోసం స్థానికంగా రామగుండం, కమాన్పూర్, మంచిర్యాల మండలాల్లో సేకరించిన 90,000 ఎకరాల భూమికి ఇప్పుడున్న మార్కెట్ ధరలతో పోల్చితే అత్యంత స్వల్ప పరిహారం సమర్పించారు. ఈ 15 కి.మీ. పరిధిలోని దాదాపు 3 లక్షల పైచిలుకు కుటుంబాలలోని 12 లక్షల మంది ప్రజలు తమ శాశ్వత జీవనాధార వ్యవసాయ, ఉపాధులను కారు చౌకగా త్యాగం చేశారు. అయినా స్థానిక యువతకు భూములు కోల్పోయిన కారణాన పరిహారంగా పట్టుమని 100 ఉద్యోగాలు కూడా అందలేదు. ఈ పచ్చినిజాన్ని అసత్యమని ఎవ్వరైనా అనగలరా?విద్యుత్ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం క్రిటికల్, సూపర్, అల్ట్రా సూపర్, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల ఇంధన దహన సామర్థ్యం 35– 40 శాతం లోపే కదా! దూర ప్రాంతాల థర్మల్ విద్యుత్ స్టేషన్లకు బొగ్గు రవాణా చేసే ఖర్చు ఆదా చేయడానికి రామగుండం నుండి 13 కిలోమీటర్ల పరిధిలో 10,200 మె.వా. సాంద్ర స్థాయిన థర్మల్ విద్యుత్పత్తి చేయ డాన్ని, చౌకధరకు (యూనిట్ 12 రూపాయలు) విద్యుత్పత్తి చేసే నెపంతో అనుమతించడమంటే... రామగుండం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో 21,000 మెగావాట్లకు సమానమైన ఉష్ణరాశితో, పరిసరాలను వేడిచేసే హీటర్లతో నిరంతరాయంగా మంటలు పెట్టినట్టే కదా?భారత ప్రభుత్వ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, నవరత్న ఎన్టీపీసీ సంస్థ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారందరూ కలసి స్థానిక ప్రజారోగ్యాలను, జీవన నాణ్యతను రాజ్యాంగ నియమాలను పణంగా పెట్టి ఈ విస్తరణ చేపట్టడం సబబేనా? 15 కిలోమీటర్ల పరిధిలోని పర్యావరణ కాలుష్య మోతాదు తీవ్రతను పరిగణనలోకి తీసుకొన్న తర్వాతే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, ఎమ్ఓఎఫ్ఈసీసీ వారు కొత్త పరిశ్రమలకు, పాతవాటి విస్తరణలకు అనుమతులివ్వా లని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్నెలా విస్మరించారు?సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అధిక లాభాపేక్షతో 706 చ.కి.మీ. విస్తీర్ణంలో అధిక సాంద్ర పారిశ్రా మికీకరణ చేపట్టడమే కదా! తక్కువ స్థలంలో ఎక్కువ ఒత్తిడితో, మనుషులు, జంతువులు కనీసం జీవించలేని పరిస్థితులను సృష్టిస్తున్న వైనాన్ని ప్రశ్నించడం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కే కదా! పక్కనే పారుతున్న గోదావరి నది నీరు నాణ్యతా ప్రమాణాల్లో ఏ, బీ, సీ, డీ కేటగిరీలు దాటి హెచ్ కేటగిరీలోకి చేరింది. ఈ నీరు కనీసం జంతువులు తాగడానికి కూడా పనికి రాదు. 1,465 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే గోదావరిని అతి ఎక్కువగా కలుషితపరిచేది, ట్రీట్మెంట్ చేయకుండా రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి మైన్స్ వాడుకొని వదిలేస్తున్న వ్యర్థ జలాలు. ఇందుకు కారణం అది కాదని, పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చెప్పగలరా?ప్రజారోగ్య సంరక్షణార్థం ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్లు విధిగా థర్మల్ స్టేషన్ల నిర్వహణలో అంతర్భాగంగా నిర్మించాలి. పర్యావరణంలోకి విడుదలవుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను 2022 నాటికే నివారించవలసిందిగా భారత సుప్రీంకోర్టు కఠినమైన డెడ్లైన్ విధించింది. ఇంతవరకు దేశంలో ఎన్నో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వీటి నిర్మాణం ప్రారంభమే కాలేదు. ఉన్నవి కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.ఎన్టీపీసీ వెబ్సైట్లో స్పష్టంగా చెప్పిన ప్రకారం... 76,531 మె.వా. విద్యుదుత్పత్తి కోసం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 17,794. ఒక మెగా వాట్ విద్యుదుత్పత్తికి ఆరుగురికి ఉద్యోగం కల్పిస్తామని ఎన్టీపీసీ సంస్థ ప్రారంభంలో చెప్పారు. ప్రస్తుత ప్రతిపాదిత 2,400 మెగావాట్లకు 96 మందికి ఉద్యో గాలిస్తామని ఈఐఏ రిపోర్ట్ ‘సోషల్ ఇంపాక్ట్’ సెక్షన్లో చెప్పారు. అంటే, 25 మెగావాట్ల స్థాపనకు ఒక ఉద్యోగాన్ని కల్పించగలుగుతారట. రేపు ఆచరణలో ఏం చేస్తారో తెలియదు.చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?ఈ ప్రాంతంలో స్థానికంగా ప్రతిపాదిత ప్లాంట్కు 15 కి.మీ. పరిధిలోని పరిసర ప్రాంతాలలో 12 లక్షల జనాభా ప్రతీ క్షణం పీల్చుకుంటున్న సాధారణ గాలి నాణ్యతా ప్రమాణం 45కు దిగువన ఉందనీ, ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్కు దిగువన, ధ్వని తీవ్రత 50 డెసిబల్స్కు దిగువన ఉన్నాయనీ... అంటే అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని అవాస్తవ సమాచారాన్ని నివేదికలో సమర్పించి, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ద్వారా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందారు. మరిన్ని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజాభిప్రాయ సేకరణకు రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టుకు పూనుకుంటున్నది.ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టులో సుప్రీంకోర్టు ఆర్డర్లు, పర్యావరణ చట్టాలు తెలియనట్లు అమాయక రీతిలో 10 కి.మీ. పరిధిలో సర్వే చేసినామని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిన ప్రాంతంలో... గాలి నాణ్యత 48 ఏక్యూఐ కన్నా దిగువన ఉన్నట్టు, ధ్వని తీవ్రత 40 డెసిబెల్స్ కన్నా తక్కువ ఉన్నట్టు, స్థానికంగా అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లు రాయడం పచ్చి అబద్ధాలే.చదవండి: మళ్లీ తెరపైకి రెండో రాజధాని?నిరూపిత శాస్త్ర సాంకేతిక సత్యాల పరిమితిలో విషయాలను అర్థం చేసుకోవాలి. రామగుండం ఎన్టీపీసీ– టీఎస్ఎస్టీపీపీ ప్రతిపాదిత 2,400 మె.వా. విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయదలచిన వేదికపై ఈ విషయాలన్నీ కలెక్టర్ గారు అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి చొరవ చూపాలి.ఇదివరకే జంతువులు, మనుషులు జీవించడానికి వీలుకాకుండా పరిసరాలు అధిక సాంద్ర పారిశ్రామికీకరణ వల్ల విధ్వంసమైపోయాయి. అందుకే జల, వాయు, ఘన వ్యర్థాల కాలుష్యాన్ని పరిహరించాలి. గాలి నాణ్యతను మెరుగుపరచాలి. సర్వత్రా కలుషితమైన భూగర్భ జలాలనూ, గోదావరి నదినీ మెరుగుపరిచే అన్ని చర్యలూ తీసుకోవాలి. ఇకముందు సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ పరి శ్రమలనే ఈ కాలానికి కావలసినవిగా గుర్తించాలి. దేశాభివృద్ధి కోసం అంతటా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిర్మించాలి.- ఉమామహేశ్వర్ దహగామపర్యావరణ నిపుణులు -
ఏం కష్టం వచ్చింది తల్లీ..
మంచిర్యాలక్రైం: కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఏసీసీ క్రిష్ణకాలనీకి చెందిన అయిండ్ల శ్రీనివాస్ –హేమలత దంపతుల కుమార్తె రోషిని(22)కి బెల్లంపల్లి బూడిదబస్తీకి చెందిన ప్రేమ్కుమార్తో గత ఆగస్టులో వివాహం జరిగింది. ఆరోగ్యం బాగా లేదని గత నెల 27న భర్తతో కలిసి రోషిని పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఇంట్లో అందరితో సరదాగా గడిపిన రోషిని సోమవారం తెల్లవారుజామున బిల్డింగ్ పైకి వెళ్తుండగా రెండో అంతస్తులో నివాసం ఉంటున్న ధర్మాజి రోషినిని పైకి ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించాడు. వాకింగ్ చేసేందుకు వెళ్తున్నాని చెప్పిన రోషిని కొద్ది సేపటికే కిందకు దూకింది. పెద్ద శబ్ధం రావడంతో కిందకు చూసిన ధర్మాజి వెంటనే రోషిని తండ్రికి సమాచారం అందించాడు. తీవ్ర రక్తపు మడుగులో ఉన్న రోషినిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అవయవాల అమ్మకం కథ కంచికేనా?
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా షెట్పల్లికి చెందిన రేవెళ్లి శ్రీకాంత్ అవయవ దానం వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా, అంబులెన్స్ నిర్వాహకులే శ్రీకాంత్ అవయవాలు అమ్ముకున్నారనే చర్చ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదికాస్త రోజు రో జుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆగస్టు 6న ప్రమాదానికి గురైన శ్రీకాంత్ హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చనిపోయాడు. అనంతరం అతడి అవయవాలు అంబులెన్స్ డ్రైవర్లే అమ్ముకున్నారనే చర్చ మొదలైంది. అంబులెన్స్ డ్రైవర్లు మొదటి నుంచీ అవయవాలు దానం చేయాలంటూ ప్రోత్సహించడం మృతుడి కుటుంబ సభ్యులకు అనుమా నం కలిగించింది. అవయవాలను ఎక్కువ ధరకు అమ్ముకొని తమకు తక్కువ డబ్బులు ఇప్పించారేమోననే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 13న ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో అదే నెల 14న ‘అవయవాలు అమ్ముకున్నారు’అనే శీర్షికన ‘సాక్షి’దినపత్రికలో కథనం ప్రచురితం కాగా, సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లోని కార్పొరేట్, కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. గత నెల 19న స్థానిక ఏసీపీ కార్యాలయంలో అవయవాలు అమ్ముకున్నారనే కథనంపై డీసీపీ భాస్కర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అవయవాలు అమ్మకం జరగలేదని, కేవలం జీవాన్దాన్ అనే సంస్థకు శ్రీకాంత్ కుటుంబసభ్యుల ఒప్పందం మేరకు అవయవాలు దానం చేశారని వెల్లడిస్తూ శ్రీకాంత్ను ఆస్పత్రిలో చేరి్పంచడంలో కమీషన్ల కోసం వేర్వేరు ఆస్పత్రులకు తిప్పుతూ కాలయాపన చేసినందుకు, అవయవాలు అమ్ముకున్నారనే అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఆరోపణలు చేసినందుకు కిరణ్, నరేష్, శ్రావణ్, సాయిరాం, సాగర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్పై వదిలేశారు. అవయవాలు అమ్మకం జరగలేదనే విషయాన్ని తేల్చేశారు. రూ.3లక్షలు ఇచ్చింది ఎవరు..? శ్రీకాంత్ అవయవాలు అమ్మకం జరగకపోతే శ్రీకాంత్ మృతదేహాన్ని అప్పగించిన తర్వాత కార్పొరేట్ ఆస్పత్రి సర్జన్.. శ్రీకాంత్ భార్య స్వప్న, కుటుంబ సభ్యులను పిలిపించి ఖర్చులకు తీసుకోమని రూ.3లక్షలు ఇచి్చనట్టు చెబుతున్నారు. అవయవాలు దానం చేస్తే రూ.3లక్షలు ఇవ్వడం ఎందుకు, దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ను కరీంనగర్ ఆస్పత్రి నుంచి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వెళుతున్న క్రమంలో అవయవాలు దానం చేసిన ఆస్పత్రి నుంచి యాదగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి కరీంనగర్ వైద్యులు సూచించిన ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకొని మాయమాటలు చెప్పి ఆ ఆస్పత్రికి రప్పించుకున్నాడు. ఈ యాదగిరి ఎవరనే దానిపై పోలీసులు దృష్టి సారించలేదు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఇచ్చింది ఎవరనేదానిపైనా పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోయారు. రూ.3లక్షల ప్రస్తావన, శ్రీకాంత్ భార్య స్పప్న ఫోన్నంబర్ ఎలా వెళ్లిందనే దానిపై స్పష్టత ఇవ్వకుండా పొంతన లేని సమాధానాలు చెప్పి దాటవేశారు. చివరకు కేసు విచారణ పూర్తి కాలేదని, అంబులెన్స్ నిర్వాహకులను మళ్లీ కస్టడీకి తీసుకొని శాస్త్రీయ ఆధారాలు సేకరించి ఈ కేసులో పూర్తి విచారణ చేపడుతామని పేర్కొనడం గమనార్హం. పూర్తిస్థాయి విచారణ ఏమైంది.. అవయవాలు అమ్ముకున్న కథ కంచికేనా అన్న చందంగా మారింది. విచారణ పేరిట రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీకాంత్ అవయవాలు ఎవరు..? ఎంతకు అమ్ముకున్నారనేది ఇంకా ప్రజల్లో చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. పోలీసులు మాత్రం విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు. గత నెల 27న కరీంనగర్ ఆస్పత్రి నిర్వాహకులు మంచిర్యాలకు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ బన్సీలాల్ను సంప్రదించగా విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో అంబులెన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, అవయవాలు అమ్మకంపై వస్తున్న వదంతులపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నామని, విచారణ సాగుతోందని తెలిపారు. -
పరిహారం రాక.. ప్రాణాలు తీసుకున్నాడు!
జైపూర్: జీవనోపాధి కోసం రూ.6 లక్షలు అప్పు తెచ్చి కొనుగోలు చేసిన ట్రాక్టర్కు గిరాకీ లేదు.. ట్రాక్టర్ కిస్తీలు కట్టలేని పరిస్థితి. అదీగాక ఏడాది క్రితం చెల్లి పెళ్లి కోసం రూ.5 లక్షలు అప్పు తెచ్చాడు. సింగరేణి సంస్థ నుంచి పరిహారం వస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాడు. కానీ, రెండేళ్లుగా పరిహారం విషయం ఎటూ తేలడం లేదు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరీశ్ (28) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తన చావుకు సింగరేణి యాజమాన్యం, గ్రామ పెద్దలు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. అమ్మా నాన్న క్షమించండి.. అక్క, చెల్లి.. అమ్మనాన్నలను బాగా చూసుకోండి అని అందులో పేర్కొన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో జరిగింది. జైపూర్ ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. దుబ్బపల్లి గ్రామానికి చెందిన జాడి బొందాలు–పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు హరీశ్ సంతానం. బొదాలు కూలీనాలి చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశాడు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఏ పని చేయడం లేదు. దీంతో కుటుంబ భారం హరీశ్పై పడింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వస్తుందని...దుబ్బపల్లి గ్రామాన్ని రెండేళ్ల క్రితం సింగరేణి శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణ కోసం సేకరించింది. ఇంటితోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.20 లక్షలు పరిహారం వస్తుందని హరీశ్ భావించాడు. కానీ, రెండేళ్లుగా సింగరేణి యాజమాన్యం పరిహారం విషయం తేల్చడం లేదు. గ్రామ పెద్దలు పరిహారం ఇప్పించే బాధ్యత తీసుకున్నా.. ఎలాంటి పురోగతి లేదు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రేవంత్ సార్ ఒక్కసారి ఇది చూడు...
-
మంచిర్యాల బస్టాండ్ లో ఓవర్ యాక్షన్
-
సీఎంతో ముఖాముఖికి కిష్టాపూర్ విద్యార్థి..
మంచిర్యాల: పదో తరగతి ఫలితాల్లో పది జీపీఏ సాధించిన మండలంలోని కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి రాథోడ్ ఈశ్వర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ముఖాముఖి కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ నెల 9న హైదరబాద్లోని రవీంద్రభారతీలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడని పాఠశాల హెచ్ఎం గుండ రాజన్న తెలిపారు.కార్యక్రమం అనంతరం విద్యార్థిని, తల్లిదండ్రులను ముఖ్యమంత్రి సన్మానిస్తారని తెలిపారు. ఈ నెల 10న హరిహర కళాభవన్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విద్యార్థి, ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రులను సత్కరిస్తారని పేర్కొన్నారు. వందేమాతరం, విద్యాదాత పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. విద్యార్థిని శుక్రవారం ఎంఈవో విజయ్కుమార్, ఉపాధ్యాయులు దాముక కమలాకర్, కమిటీ చైర్మన్ మంగ, ఉపాధ్యాయులు అభినందించారు. -
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
● ఆస్పత్రిలో బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన ● పోలీసుల జోక్యంతో విరమణ మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
బాల్క సుమన్కు మంచిర్యాల పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేసి.. విచారణకు రావాలని ఆదేశించారు. హైదరాబాద్లో సుమన్కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యల చేసిన విషయం తెలిసిందే. అదే రోజు బాల్క సుమన్పై కాంగెస్ పార్టీ మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నేడు పోలీసులు బాల్క సుమన్ నోటీసులు జారీ చేశారు. తనకు వచ్చిన పోలీసు నోటీసులపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ తనపై అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. చదవండి: సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు -
సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు
మంచిర్యాల, సాక్షి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు . సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్, సీఎం రేవంత్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్ అనుచితంగా మాట్లాడారని అంటూనే.. ఈ క్రమంలో సీఎం రేవంత్పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయడంతో.. సుమన్ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డువస్తోందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేశారాయన. ఆ ప్రసంగం వీడియో వైరల్ కావడంతో.. కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లు సమాచారం. 👉: బాల్క్ సుమన్పై ఎఫ్ఐఆర్ -
వారంతా విద్యాధికులే..! ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి..
సాక్షి, ఆదిలాబాద్/మంచిర్యాల: వారంతా విద్యాధికులే.. ఉన్నత లక్ష్యంతో డిగ్రీ, పీజీ, ఎల్ఎల్బీ పూర్తి చేసినవారే. వివిధ వృత్తులు, వ్యాపారాలు చేస్తూనే ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయా పార్టీలో చేరి ప్రస్తుతం అసెంబ్లీ బరిలో నిలిచారు. పార్టీ అభ్యర్థులుగా, స్వతంత్రులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో.. మంచిర్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు 17 మంది బరిలో నిలువగా ఇందులో సగానికి పైగా ఉన్నత విద్యను అభ్యసించినవారే. ప్రధాన పార్టీల అభ్యర్థులు డిగ్రీ, ఆపైన చదివిన వారుండగా, ఉన్నత చదువు చదివి, మంచి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 25 నుంచి 71 ఏళ్లవారున్నారు. వయస్సు, చదువుతో నిమిత్తం లేకుండా రాజకీయాల్లో రాణిస్తున్న వారెందరో ఉండగా, మంచిర్యాల నియోజకవర్గంలో మాత్రం ఉన్నత చదువులతో పాటు, మంచి వృత్తిలో ఉన్నవారు కూడా ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాసేవ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 51 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి పలు కంపెనీలను నెలకొల్పారు. ప్రస్తుతం ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలిచారు. 63 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్సాగర్రావు బీఎస్సీ చదివి వ్యాపారం చేస్తున్నారు. 71 ఏళ్లున్న బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు బీఏ చదివారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవ చేస్తున్నారు. 41 ఏళ్లున్న బీఎస్పీ అభ్యర్థి తోట శ్రీనివాస్ బీఎస్సీ చదివి ఆర్ఎంపీగా, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. 48 ఏళ్లున్న బహుజన రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి చెరుకూరి శాంతశ్రీ ఎమ్మెస్సీ ఎల్ఎల్బీ చదివి సోషల్ వర్క్ చేస్తున్నారు. 39 ఏళ్లున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి దొమ్మటి రవికుమార్ ఎమ్మెస్సీ చదివి వ్యవసాయం చేస్తూ బరిలో నిలిచారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో.. బెల్లంపల్లి బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నలుగురు తలపడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులుగా దుర్గం చిన్నయ్య, గడ్డం వినోద్, అమురాజుల శ్రీదేవి, జాడి నర్సయ్య పోటీలో ఉన్నారు. చిన్నయ్య, గడ్డం వినోద్, శ్రీదేవి ఇదివరకే ఎమ్మెల్యేలుగా గెలిచి చట్టసభలో అడుగు పెట్టారు. 52 ఏళ్లున్న బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యది వ్యవసాయ కుటుంబం. ఐటీఐ చదివి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భార్య, ఇద్దరు కుమార్తెలు కలిగిన చిన్నయ్య మూడోసారి బరిలో ఉన్నారు. 67 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ రాజకీయ, పారిశ్రామిక కుటుంబంలో జన్మించారు. డిగ్రీ చదివిన వినోద్కు భార్య, కుమార్తె ఉన్నారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ ఓసారి విజయం సాధించారు. ప్రస్తుతం బెల్లంపల్లి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. 51 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి అమురాజుల శ్రీదేవి సాధారణ కుటు ంబంలో జన్మించారు. డిగ్రీ వరకు చదివారు. ఆమె భర్త రాజేశ్వర్ సింగరేణిలో అధికారిగా పని చేస్తున్నారు. ఆమెకు నలుగురు సంతానం. మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీదేవి పాత ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి బరిలో ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో.. 74 ఏళ్లున్న నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎల్ఎల్బీ పూర్తిచేసి న్యాయవాద వృత్తి స్వీకరించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 54 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి డిగ్రీ పూర్తి చేశారు. 62 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి కూచాడి శ్రీహరిరావు ఎల్ఎల్బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాద వృత్తిలో ఉండి రాజకీయాల్లోకి వచ్చారు. అ లాగే బీఎస్పీ అభ్యర్థి డీ జగన్మోహన్ ఎల్ఎల్బీ, ఆ లిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి స్వదేశ్ పరికిపండ్ల, యుగ తులసి, ధర్మ సమాజ్, అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫామ్స్ అభ్యర్థులు, స్వతంత్రులుగా బరిలో నిలిచిన వారంతా డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారే. ముధోల్ నియోజకవర్గంలో.. 69 ఏళ్లున్న బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేసి దాదాపు 20 ఏళ్ల పాటు భైంసాలో న్యాయవాదిగా పనిచేశారు. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విఠల్రెడ్డి, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలుపొందారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి, 2018లో గెలిచారు. 64 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి భోస్లే నారాయణరావుపటేల్ ఇంటర్ పూర్తి చేశారు. ముధోల్ ఎమ్మెల్యేగా రెండుసా ర్లు పని చేశారు. 69 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి పవార్ రామారావుపటేల్ డిగ్రీ పూర్తి చేశారు. 2018లో కాంగ్రెస్లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది ముధోల్ బరిలో నిలిచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తదనంతరం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ గతేడాది బీజేపీలో చేరారు. సిర్పూర్ నియోజకవర్గంలో.. 68 ఏళ్లున్న సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప ఇంటర్ వరకు కాగజ్నగర్లో చదివారు. 48 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ 1 నుంచి 10వ తరగతి వరకు కాగజ్నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. హైదరాబాద్లో ఇంటర్, డిగ్రీ బీఏ చదివారు. 44 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు కాగజ్నగర్లోని ఫాతిమా కాన్వెంట్లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. 2004లో ఎంబీబీఎస్, 2010లో ఎంఎస్(ఆర్ధోసిడిక్స్) పూర్తి చేశారు. 2011లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి డీఎన్బీ పట్టా పొందారు. 56 ఏళ్లున్న బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ 1 నుంచి 10వ తరగతి వరకు ఆలంపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. వెటర్నరీ వైద్య వృత్తి కోర్సును హైదరాబాద్ ఎన్టీరంగ యూనివర్సిటీలో చదివారు. 1995లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఇన్ పబ్లిక్లో ఉన్నత చదువు పూర్తిచేశారు. 2020 ఆగస్ట్ 8న తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో.. 54 ఏళ్లున్న ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి పదో తరగతి చదివారు. 36 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి అజ్మీరా ఆత్మారాంనాయక్ బీఎస్సీ(బీజెడ్సీ), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్ విద్యనభ్యసించారు. 53 ఏళ్లున్న కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాంనాయక్ బీఈ, బ్యాచ్లర్ ఆఫ్ జర్నలిజం (ఉస్మానియా), ఎల్ఎల్బీ శాతవాహన యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఎంవీఐగా పనిచేసి ప్రజాసేవ చేసేందుకు కాంగ్రెస్లో చేరారు. ఆయన భార్య రేఖానాయక్ ఖానాపూర్ ఎమ్మెల్యే. -
వ్యతిరేకతను అధిగమించి హ్యాట్రిక్ కొడతారా?
ఆ ఎమ్మెల్యే మీద ఊళ్ళకు ఊళ్ళే తిరగబడుతున్నాయట. మా ఊళ్ళోకి రావద్దని ప్రజలు అడ్డగిస్తున్నారట. పొలిమేరలోనే అడుగుపెట్టనీయడంలేదట. అభివృద్ధి చేయని ఎమ్మెల్యేకు ఈసారి ఓటడిగే హక్కులేదని తేల్చి చెబుతున్నారట. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన నియోజకవర్గం ఎక్కడుంది? మరి ప్రత్యర్థి అయినా అక్కడ బలంగా ఉన్నారా? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం నుండి గత రెండు ఎన్నికలల్లోనూ దుర్గం చిన్నయ్య విజయం సాధించారు. మళ్లీ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నారు. సింగరేణి కాలరీస్ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారికి చిన్నయ్య పట్టాలు ఇప్పించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా నిర్మించి పేదలకు పంపిణీ చేశారు. కొన్ని గ్రామాలకు మాత్రం రోడ్లు నిర్మించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలు మినహా..తన మార్క్ చూపించుకోవడానికి నియోజకవర్గంలో చేసిందేమీ లేదనే అపవాదును ఎదుర్కొంటున్నారు. బెల్లంపల్లిలో మెడికల్ కాలేజ్.. బస్సు డిపో ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. పక్కనే ఉన్న మంచిర్యాలలో మెడికల్ కళశాల నిర్మాణమై తరగతులు కూడా మొదలయ్యాయి. బస్సు డిపో చెన్నూర్ కు మంజూరైనా..బెల్లంపల్లికి మాత్రం రాలేదు. ఎమ్మెల్యే వైఫల్యం వల్లనే మెడికల్ కళాశాల, బస్సు డిపో రాలేదని ప్రజల్లో చర్చ సాగుతోంది. ఇవే కాదు.. మారుమూల ప్రాంతాల్లో ఏమాత్రం ప్రగతి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కనీస వసతులులేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నిర్లక్ష్యానికి గురైన గ్రామాలకు ఎమ్మెల్యే వెళితే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. పదేళ్ళుగా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారా అంటూ..ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ గ్రామంలోకి రాకుండా ఆపివేసి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేయకపోవడం, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడం ఒక భాగం అయితే..అరిజన్ కంపెనీ ప్రతినిధి షేజల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరువు తీసేసాయి. మహిళా ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత పెరిగినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. చిన్నయ్య అసమర్థత, ఆయన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువంటి ఎమ్మెల్యేను ఓడించాలంటూ ప్రజల్లో ప్రచారం చేస్తోంది. అయితే ఎవరెంత ప్రచారం చేసుకున్నా తన విజయాన్ని ఎవరూ ఆపలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే చిన్నయ్య. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి గడ్డం వినోద్ ఓటమి చెందారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ..దుర్గం చిన్నయ్య మీద వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి గడ్డం వినోద్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్కు ఊపు రావడం కూడా వినోద్కు కలిసివస్తుందంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ప్రచారం సందర్భంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందట. ప్రజల స్పందనే వినోద్లో గెలుపు పై ధీమాను పెంచుతున్నాయట. కాని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగరరావు వర్గం వినోద్కు వ్యతిరేకంగా పని చేస్తోందట. పార్టీలోని వర్గ విభేదాలు వినోద్కు ఆందోళన కలిగిస్తున్నాయట. ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ధీటుగా కమలం పార్టీ కూడా ఎన్నికల యుద్ధం చేస్తానంటోంది. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాని బెల్లంపల్లి నియోజకవర్గంలో కమలం పార్టీకి బలం లేదు. మాజీ ఎమ్మెల్యేగా ప్రజల్లో తనకు పలుకుబడి ఉందని..తనకున్న ప్రజాదరణే ఈసారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని శ్రీదేవి భావిస్తున్నారు. అయితే గత ఎన్నికలలో బిజెపికి ఇక్కడ డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి. ముక్కోణపు పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. -
ఎస్సై రివాల్వర్ను కాజేసి మరీ అత్తను కాల్చి..
సాక్షి, హనుమకొండ/మంచిర్యాల: ఆర్థిక లావాదేవీల వ్యవహారంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన అత్తను రివాల్వర్తో కాల్చి చంపిన ఘటన హనుమకొండలో కలకలం రేపింది. అయితే.. ఈ కేసు దర్యాప్తులో ఇప్పుడు కీలక విషయం వెలుగు చూసింది. సివిల్ కానిస్టేబుల్గా పని చేస్తున్న ప్రసాద్.. ఎస్సై రివాల్వర్ను కాజేసి మరీ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. హనుమకొండ జిల్లా గుండ్లసింగారం ఇందిరమ్మ కాలనీలో కమలమ్మ కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె కూతురు రమాదేవిని ప్రసాద్కు ఇచ్చి వివాహం చేశారు. ప్రసాద్-రమాదేవికి ఇద్దరు కూతుళ్లు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో కానిస్టేబుల్గా ప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. గురువారం ఉదయం మంచిర్యాల నుంచి హనుమకొండలోని అత్తింటికి వచ్చిన ప్రసాద్.. కమలమ్మపై ఉన్నట్లుండి కాల్పులకు దిగాడు. ఒక రౌండ్ కాల్పులు జరగ్గా.. ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆపై భార్యాకూతురిపైనా దాడికి యత్నించిన ప్రసాద్ను స్థానికులు అడ్డుకుని చితకబాదారు. గాయపడిన ప్రసాద్ను చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. డబ్బుల విషయంలో గొడవ పెద్దదై.. కుటుంబ కలహాలతో పాటు.. ఆర్థిక లావాదేవీలు ఈ నేరానికి కారణమని తెలుస్తోంది. ప్రసాద్ కమలమ్మకు రూ.4 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బు విషయంలోనే ప్రధానంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పటికే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కమలమ్మపై ప్రసాద్ కాల్పులు జరిపాడని సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ చెబుతున్నారు. నా భర్తను చంపేయండి భర్త ప్రసాద్ నిత్యం తాగొచ్చి గొడవ పడడంతో.. తాను పుట్టింటికి వచ్చేశానని రమాదేవి చెబుతోంది. వారం కిందట భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. ఉదయం పదిన్నర గంటలకు ఇంటికి వచ్చిన ప్రసాద్.. తన కళ్ల ముందే తల్లిని కాల్చి చంపినట్లు రమాదేవి చెప్పింది. అది చూసిన తనపై, తన కూతురిపైనా ప్రసాద్ దాడికి యత్నించాడని తెలిపిందామె. అయితే.. ప్రసాద్ బతకడానికి అర్హుడు కాడని.. అతన్ని చంపేయాలని రమాదేవి కన్నీటి పర్యంతం అయ్యింది. ‘‘నా భర్త పచ్చి తాగుబోతు. నిత్యం తాగొచ్చి వేధిస్తున్నాడనే పుట్టింటికి వచ్చేశా. ఇవాళ ఇంటికి వచ్చి నా తల్లిని పంచాడు. టవల్తో ఉరేసి చంపాలనుకున్నానని.. కానీ, స్థానికులు నన్ను అడ్డుకున్నారు. సివిల్ కానిస్టేబుల్ అయిన ప్రసాద్కు సర్వీస్ రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది?.. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యమూ ఉన్నట్లు స్పష్టమవుతోంది’’ అని ప్రసాద్ భార్య రమాదేవి అంటోంది. ఉన్నతాధికారుల సీరియస్ కానిస్టేబుల్ ప్రసాద్ కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోంది. సంఘటన స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ సందర్శించారు. అయితే పేలిన తూటా గొట్టం కోసం క్లూస్ టీం ఇంకా గాలింపు జరుపుతోంది. మరోవైపు సివిల్స్ కానిస్టేబుల్ ప్రసాద్కు సర్వీస్ రివాల్వర్ ఎలా వచ్చిందనే విషయంపై జరిపిన విచారణలో కీలక విషయం బయటపడింది. కోటపల్లి స్టేషన్ లో ఎస్సై సురేష్ రివాల్వర్ కానిస్టేబుల్ ప్రసాద్ దొంగతనం చేసినట్లు తేలింది. గత రాత్రి తుపాకీని దొంగిలించి.. తన వెంట హనుమకొండకు తీసుకెళ్లాడు ప్రసాద్. ఆ రివాల్వర్తోనే కమలను కాల్చి చంపాడు. దీంతో రివాల్వర్ చోరీ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీస్ స్టేషన్లోనే ఈ చోరీ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు అంటున్నారు. -
ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థుల దాడి.. డిగ్రీ స్టూడెంట్ మృతి
సాక్షి, మంచిర్యాల: ర్యాగింగ్ను నివారించటానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థల వంటివి ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎక్కడోచోట ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సీనియర్ విద్యార్థులు రెచ్చిపోతున్నారు. జూనియర్ విద్యార్థులపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. తాజాగా ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో ఎస్సీ హాస్టల్లో కామెర ప్రభాస్ అనే విద్యార్థి బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో తోటి విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. వేధిస్తూ, దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. -
దెయ్యం పట్టిందని క్షుద్రపూజలు.. యువకుడు మృతి
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూర్లో క్షుద్రపూజలు వికటించి ఓ యువకుడు మృతిచెందాడు. చెన్నూర్ పట్టణం బొక్కగూడెం కాలనీకి చెందిన దంపతులు దాసరి లచ్చన్న, లక్ష్మి కుమారుడు మధు (33) గత 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంచిర్యాలలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మధుకు చేతబడి అయిందని బంధువులు చెప్పడంతో శనివారం సాయంత్రం సీసీసీ నస్పూర్ ప్రాంతానికి చెందిన క్షుద్ర మాంత్రికుడిని ఆశ్రయించారు. ఇంటి వద్ద పూజల్లో భాగంగా మధుపైనుంచి కోడిని తిప్పడంతో అది చనిపోయింది. దీంతో దెయ్యం పట్టిందని, పెద్ద పూజలు చేయాలంటూ చెప్పడంతో ఆదివారం చెన్నూర్ గోదావరి ఒడ్డున మేకతోపాటు పలు క్షుద్రపూజలకు సంబంధించిన సామగ్రితో వెళ్లారు. పూజలు చేసే క్రమంలో మాంత్రికుడు మధుకు గుగ్గిలం (సాంబ్రాణి) పొగ వేసి పైనుంచి దుప్పటి కప్పినట్లు తెలిసింది. పొగతో మధు స్పృహ కోల్పోయి కాసేపటికే మృతిచెందాడు. దీంతో సదరు మాంత్రికుడు పారిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రాత్రి ఇంటికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియల కోసం గోదావరి నదికి తీసుకెళ్లారు. పోలీసులకు విషయం తెలియడంతో నది వద్దే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ వాసుదేవరావును సంప్రదించగా.. క్షుద్రపూజలతో మృతిచెందాడన్న సమాచారం మేరకు పోస్టుమార్టం చేయించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని వివరించారు. చదవండి: చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్తో చిన్నారి మృతి -
మంచిర్యాల: పీఎస్లో కుప్పకూలిన నిందితుడు
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో లాకప్ డెత్ ఘటన కలకలం సృష్టించింది. తాళ్లగుర్జాల పోలీస్ స్టేషన్లో అంజి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన జరగ్గా.. స్టేషన్లోని సీసీ కెమెరాల్లో మృతుడి చనిపోయే ముందు క్షణాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో స్టేషన్ హాల్లో కూర్చున్న వ్యక్తి కొద్దిసేపు ఫోన్ చూస్తూ కనిపించాడు. ఏమైందో ఏమోగానీ కాసేపటికి ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అయితే పోలీసుల తీరుపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వల్లే అంజీ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే నిందితుడిది లాకప్ డెత్ కాదని పోలీసులు చెబుతున్నారు. అతనికి ఫిట్స్ రావడంతో చనిపోయాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వ్యక్తి మరణానికి గల అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. పోలీసులు కొట్టడం వల్లే మరణించాడా? లేక నిజంగానే అతనిది సహజ మరణమా తెలియాల్సి ఉంది. కాగా ఓ మహిళ ఇంటిపై దాడి చేసిన చేసులో అంజీని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
ముధోల్లో బీజేపీకి పట్టు.. బీఆర్ఎస్పై అసంతృప్తి?
ఈ ఎమ్మెల్యే మాకోద్దంటూ స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిదులు సైతం తిరగబడుతున్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మార్చాలంటున్నారు. మార్చకపోతే మాదారి మేము చూసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా అధిష్టానం ఆయనకే మరోసారి బీఆర్ఎస్ టికెట్ కట్టబెట్టింది. దాంతో ముధోల్ గులాబీ దళంలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయట. మరి అధికార పార్టీలోని అసంతృప్తి సెగ కమలం పార్టీకి అనుకూలంగా మారుతుందా? ముథోల్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందా? మాజీ మంత్రి వేణుగోపాల్ ఛారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దిగుతారా? ముధోల్ గడ్డ ఎన్నికల సమరంపై సాక్షి స్పెషల్ రిపోర్టు. నిర్మల్ జిల్లాలో ముథోల్ నియోజకవర్గం ఉంది. ఇది ఒకప్పడు కాంగ్రెస్ కంచుకోట. ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోట గులాబీ సామ్రాజ్యంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ అధిక్యతతో గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజయం సాధించారు. మళ్లీ రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి సత్తా చాటాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తహతహలాడుతున్నారు. నియోజకవర్గంలో ముథోల్, బైంసా రూరల్, బైంసా పట్టణం, కుబీర్, కుంటాల, లోకేశ్వరం, బాసర మండలాలు ఉన్నాయి. వీటిలో 2,26,725 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో మున్నూరు కాపు, ముస్లిం, లంబడా, మరాఠ ఓట్లు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల మద్దతుతో గడ్డేన్నగారి విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ నుండి గెలుపోందారు. మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్లో చేరారు. ముచ్చటగా మూడోసారి.. ముధోల్పై బీఆర్ఎస్ కన్ను! 2018లో జరిగిన ఎన్నికలలో 83,933 ఓట్లతో 46 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ నుండి పోటీ చేసిన రమాదేవి 40,602 ఓట్లతో 22 శాతం ఓట్లు సాధించారు. రమాదేవిపై 43,331 మేజారీటీ రికార్డు స్థాయిలొ విజయం సాధించారు విఠల్ రెడ్డి. మళ్లీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని తహతహలాడుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గ్రామీణ ప్రాంతంలో రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించారు. అదే విధంగా ముథోల్, బైంసా అసుపత్రులలో బెడ్ల సంఖ్య పెంచి రోగులకు వైద్య సేవలు మేరుగుపరిచారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపుకు గురైనా గుండేగామ్ గ్రామస్తులకు పరిహరం మంజూరు చేయించారు. అదే విధంగా బాసర మాస్టర్ ప్లాన్ కోసం యాబై కోట్లు మంజూరు చేయించారు. అభివృద్ధి పథకాలతో పాటు విఠల్ రెడ్డి ప్రజల్లో సౌమ్యుడిగా మంచి పేరుంది. కానీ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి చేసింది అణువంత మాత్రమే అనే విమర్శలు ఏదుర్కోంటున్నారు. ప్రాణహిత చేవేళ్ల 28వ ప్యాకేజీతో నియోజకవర్గంలో సాగునీటి కోసం అప్పట్లో కాల్వలు తవ్వారు. గత కాంగ్రెస్ హయంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా కాల్వలు కనిపిస్తున్నాయి. 28 ప్యాకేజీ పనులు పురోగతి లేదు. రైతులకు సాగునీరు అందడం లేదు. అదేవిధంగా గుండేగామ్ ప్రజలకు పునరావాసం క్రింద నిధులు మంజూరైనా బాధితులకు పరిహరం అందలేదు. బీఆర్ఎస్పై అసంతృప్తి పైగా బాధితులు కోరిన విధంగా పరిహరం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే తీరుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాసర టేంపుల్ సిటీ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మాటలు కోటలు దాటుతున్నాయి. నిధుల మంజూరుతో అనువంత కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే బాసర ట్రిపుల్ ఐటి వివాదాల పుట్టగా మారింది. స్థానిక ఎమ్మెల్యేగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యారని ఎమ్మెల్యే తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విఠల్రెడ్డి వైఫల్యాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. సమస్యలపై అట్టిముట్డనట్లుగా ఉండే ఎమ్మెల్యే తీరు ప్రజలకు నచ్చడం లేదట. దీనితో పాటు పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. ఎకంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తిరుగుబాటు సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ పదవులు, మార్కేట్, బాసర అమ్మవారి ఆలయం పదవులు భర్తి చేయని ఎమ్మెల్యేను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమదారి తాము చూసుకుంటామని పార్టీకి అల్టీమేటమ్ జారీ చేశారట. అయితే విఠల్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకతతో పాటు ముథోల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గంలో బీజేపీ పట్టుందని నిరూపితమైంది. దీనికి తోడు బైంసా మున్సిపల్లో ఎంఐఎంకి పట్టుంది. ఎళ్లుగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుని పాలన సాగిస్తోంది. ఎంఐఎం పాలనకు వ్యతిరేకంగా హిందూ సానుభూతి ఓటర్లు బీజేపీకి మద్దతు పలుకుతుండటం విశేషం. ఇక్కడ బీజేపీ కంటే హిందు వాహిని బలంగా ఉంది. ఇక్కడి నుండి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు బీజేపీ అభ్యర్థి రమాదేవి. గెలుపు ధీమాతో కమలం? అయితే బీజేపీకి నియోజకవర్గంలో ఊపు పెరిగింది. బండి సంజయ్ పాదయాత్ర నియోజకవర్గంలో పార్టీకి బలాన్ని పెంచింది. గెలుపు ఖాయమనే బావన పార్టీ నాయకులలో పెరిగింది. ఒకవైపు సంజయ్ పాదయాత్రకు తోడు కాంగ్రెస్ మాజీ డీసీసీ అధ్యక్షుడు రామరావు పటేల్, మోహన్ రావు పటేల్ పార్టీలో చేరారు. రమాదేవితో పాటు ఈ ఇద్దరు కూడ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారట. పార్టీ అభ్యర్థులుగా ప్రకటించకపోయినా ప్రజల్లోకి ముగ్గురు వెళ్లుతున్నారు. ప్రజల మద్దతు కూడ గడుతున్నారట ఎన్నికలలో పోటీ చేసి విఠల్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమవుతున్నారట ముగ్గురు. టిక్కెట్ కోసం సాగిస్తున్నా పోరు పార్టీని బలహీనం చేస్తోందట. ఏవరికి వారు పోటీ పడి ఈ ముగ్గురు నాయకులు పార్టీని బలహీనం చేస్తున్నారని కార్యకర్తలు దాల్చిన. ఈ ముగ్గురు కలిసి పార్టీ టిక్కెట్ ఇచ్చిన అభ్యర్థి కోసం పనిచేయకపోతే ఓటమి తప్పదని పార్టీ వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. రామారావు పటేల్ కాంగ్రెస్ వీడటంతో ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థి కరువయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకులే పోటీ దిక్కు అన్నట్టు చందంగా మారింది. బలమైన అభ్యర్థి కోసం పార్టీ పెద్దలు అన్వేషణ సాగిస్తున్నారు. వేణుగోపాల్ చారికి బీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోతే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైందట. బీజేపీ టిక్కెట్ పంచాయితీ తనకు అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అంచనా వేసుకుంటున్నారట. బీజేపీ టిక్కెట్ పోరు, ఎంఐఎం మద్దతు అభిస్తే సంక్షేమ పథకాలతో విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు ఎమ్మెల్యే. బీజేపీ మాత్రం హిందూ ఓటు బ్యాంకు, ఎంఐఎం వ్యతిరేక ఓట్లు, సర్కార్ వైఫల్యాలు విజయానికి చెరువచేస్తాయని అంచనా ఉంది. ఈసారి ఆరునూరైనా ముథోల్ గడ్డపై కమలం జెండా ఎగురడం ఖాయమంటున్నారట ఆ పార్టీ నాయకులు. మరి ఈమూడు పార్టీల్లో ఏవరు విజయం సాదిస్తారో చూడాలి. -
మంచిర్యాల: పత్యర్థులపై వ్యూహాస్రాలు.. గెలుపు ధీమాతో పార్టీలు!
ఆ ఎమ్మెల్యే వైఫల్యాల రాజు.. ప్రగతిని పరుగులు పెట్టించలేదని సోంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావును మార్చాలంటున్నారు. మార్చకపోతే మునగడం ఖాయమంటున్నారు. అయినా అధిష్టానం మళ్లీ ఆయనకే టికెట్ కట్టబెట్టింది. సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్న దివాకర్కు కేసీఆర్ ఏ ధీమాతో టికెట్ ఇచ్చారో అర్థం కాని విషయం అంటున్నారు. మరి మంచిర్యాలలో బీఅర్ఎస్ కోటలకు బీటలు పారుతుందా? కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమైందా?మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గుండా గండమే కాంగ్రెస్కుకు గండంగామారిందా? సింగరేణి సమరంలో కమలం సత్తా చాటుతుందా? మంచిర్యాల ఎన్నికల యుద్దంపై సాక్షి స్పేషల్ రిపోర్ట్. మంచిర్యాల నియోజకవర్గం అపారమైనా నల్లబంగారం నిల్వలు ఉన్నా ప్రాంతం. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉపాదినిస్తోంది. అలాంటి నియోజకవర్గంలో మంచిర్యాల, హజీపూర్, నస్పూర్, దండేపల్లి, లక్షిట్పెట మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2,46,982 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో పేరుక సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ. మిగితా కులాల్లో మున్నూరు, ఎస్సీ, యాదవ, గౌడ, పద్మశాలి, సింగరేణి ఓటర్లు ఉన్నారు. పేరుక సామాజిక, సింగరేణి కార్మికుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. అయితే గులాబి పార్టీకి మంచిర్యాల కంచుకోట. ఉద్యమకాలం నుండి ఇప్పటి వరకు కార్మికులు పార్టీకి అండగా నిలుస్తున్నారు. తెలంగాణ రాకముందు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అరవింద్ రెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. తెలంగాణ అవతరణ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండుసార్లు బీఅర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు విజయం సాధించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే దివాకర్ రావు విజయం సాదించారు. 2018 ఎన్నికలలో దివాకర్ రావు 75,360 ఓట్లు సాదించి 45 శాతం ఓట్లు సాదించారు. ప్రేమ్ సాగర్ రావుపై 4,848 ఓట్ల తేడాతో ఓటమి నుండి ఓడ్డేకారు దివాకర్ రావు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు 70,512 ఓట్లతో 42 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునాథ రావు 5018 ఓట్లతో మూడు శాతం ఓట్లు సాదించారు. డిపాజిట్ కోల్పోయారు. దివాకర్ రావు అంతకు ముందు రెండుసార్లు విజయం సాధించారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రోడ్లు, త్రాగునీటి వసతి, జిల్లా కేంద్రంలో మెడికల్ కళశాల సాధించారు. అదే విధంగా నూతన కలెక్టర్ కార్యాలయం పనులు చేసేలా చోరవ చూపారు. జిల్లా అసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. మాతశిశు ఆసుపత్రి గోదావరి తీరంలో నిర్మించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రగతిని పరుగులు పెట్టించలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. మంచిర్యాల వేగంగా విస్తరిస్తున్నా పట్టణం. కానీ అభివృద్ధి లేదు. గోదావరి ప్రక్కన ఉన్నా వేసవి వచ్చిందంటే నీటి కోరతతో కొన్ని కాలనివాసులు ఇబ్బందులు పడుతున్నారు. మాతశిశు ఆసుపత్రి గోదావరి తీరంలో నిర్మించడం వల్ల వర్ష కాలంలో నీటిలో మునిగిపోయింది. పట్టణానికి దూరంగా నిర్మించడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గూడేం ఎత్తిపోతల పథకం నిర్వహణ అద్వానంగా మారింది. నీరందించే పైపులు పగిలిపోతున్నాయి. దాంతో చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మర్మమత్తుల ఎమ్మెల్యే సకాలంలో స్పందించలేదని రైతులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఏకంగా రోడ్లు వేయని ఎమ్మెల్యే మా గ్రామాలకు, కాలనిలకు రావద్దని లక్షిట్పెపెట్, ఇతర ప్రాంతాల్లో ప్రజలు ప్లేక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తమను ఓట్లు అడగవద్దంటున్నారు. ఇవన్ని ఒక ఎత్తయితే మంచిర్యాల ప్రాంతంలో సింగరేణి, సర్కార్ భూములు బీఅర్ఎస్ నాయకులు లూటీ చేశారనే అరోపణలు ఉన్నాయి. పైగా భూముల లూటీల దందాలో ఎమ్మెల్యే పాత్ర ఉందని కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఆరోపణలు సందిస్తుండటం విశేషం. రాబోయే ఎన్నికల్లో బీఅర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు అయితే ప్రతికూల ఫలితం తప్పదని సర్వేలో తెలిందని పార్టీ వర్గాలంటున్నాయి. కానీ మరోసారి ఆయనకే టికెట్ రావడంతో ముధోల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ప్రత్యర్థులు. గత అసెంబ్లీ ఎన్నికలలో దివాకర్ రావు కేవలం 4848 ఓట్లతో ప్రేమ్ సాగర్ రావును ఓడించారు. దాంతో ఈసారి ఎన్నికలలో ఎమ్మెల్యేపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేమ్ సాగర్రావు కసితో ఉన్నారు. ప్రజల్లో దివాకర్ రావుపై వ్యతిరేకత పెరగడం, రుణమాఫి, సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ఇచ్చిన మీలు నేరవేర్చకపోవడం ఇలాంటి ఆంశాలు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతున్నారు. పార్టీకి ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఈసారి ఆరునూరైనా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ప్రేమ్ సాగర్రావు తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. కానీ కొందరు ప్రేమ్ సాగర్ కంటే ఆయన భార్య సురేఖ గెలిచే అభ్యర్థిగా అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఎన్నికలలో తానే పోటీచేస్తానంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. అయితే బీఅర్ఎస్ మాత్రం ప్రేమ్ సాగర్ గెలిస్తె మంచిర్యాలలో రౌడి రాజ్యం వస్తుందని ప్రచారం చేస్తోంది. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా వ్యూహాలు రచిస్తోంది. గులాబీ పార్టీ గత ఎన్నికల మాదిరిగా మళ్లీ అదే అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ఇక బీఅర్ఎస్ తనపై వేసిన రౌడి ముద్రను ప్రేమ్ సాగర్ రావు కొట్టిపారేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామంటున్నారు. ఇక నియోజకవర్గంలో కమలం పార్టీ పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన రఘునాథ రావుకు 5వేల ఓట్లు మించలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది పార్టీ బలం. కానీ ఈసారి పార్టీ అభ్యర్థిని మార్చి సత్తా చాటుతామంటున్నారు కమలం పార్టీ నాయకులు. మూడు పార్టీలు మంచిర్యాలపై జెండాను ఎగురవేస్తామంటున్నారు. మరి ముధోల్లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. -
హుస్నాబాద్: బీఆర్ఎస్కు అవే మైనస్సా?
2014 నుండి హుస్నాబాద్ నియోజకవర్గం రెండుసార్లు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ నుండి వోడితల సతీష్ కుమార్ గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి కూడా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రెడ్డి, రావు, కాపు, ముదిరాజ్, గిరిజన సామాజిక వర్గాలు బలంగా ఉంటాయి. కులాల వారిగా ఓటర్ల శాతం ► బిసి: 60% ► ఎస్సీ: 15% ► ఎస్టీ: 10% ► ఇతరులు: 15% పార్టీల పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ రెబల్స్ లేరు కాంగ్రెస్లో కూడా ఆశావాహులు లేరు బీజేపీ నుండి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు సీపీఐ కూడా పోటీకి ఆసక్తి చూపుతుంది ఆశావహులు బీఆర్ఎస్ నుంచి వోడితల సతీష్ కుమార్ కాంగ్రెస్ నుండి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బీజేపీ నుండి ఇద్దరు (బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు) సీపీఐ నుండి చాడ వెంకటరెడ్డి పోటీకి సిద్దమవుతున్నారు వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు.. గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రారంభించలేకపోవటం IOC భవనంతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా హుస్నాబాద్లో మినీ స్టేడియం, ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయలేకపోవడం గ్రామాల పరిధిలో పూర్తి చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవటం.. అధికార పార్టీ అభ్యర్థి, అనుకూలతలు గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చటం వోడితల సతీష్ కుమార్.. సౌమ్యుడు, మృదుస్వభావ వ్యక్తిత్వం కలిగిన వారవటం. ప్రతికూలతలు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంలో సమయపాలన పాటించడనే విమర్శ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు అనుకూలతలు గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రారంభించకపోవటం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్లను అర్హులకు అందిచక పోవటం.. ప్రతికూలతలు.. అధికారిక పార్టీని గ్రామ స్థాయిలో ఎదురుకొలేకపోవటం. -
మంచిర్యాలలో వివాహిత దారుణ హత్య
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ మహిళను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి.. రాళ్లతో కొట్టి చంపారు. రైల్వే స్టేషన్కు అత్యంత సమీపంలోనే ఈ హత్య జరిగింది. మృతురాలిని గోపాలవాడకు చెందిన శరణ్యగా గుర్తించారు పోలీసులు. ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఆమెపై ఘాతుకం జరిగినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ పక్కనే ఆమె మృతదేహాం పడి ఉంది. సమాచారం అందుకున్న డీసీపీ సుధీర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే శరణ్య భర్త సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే.. వాళ్ల ఇద్దరి మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ ఆ కోణం నుంచే మొదలైంది. -
ఎడతెరిపి లేని వానలతో జలదిగ్బంధంలో మంచిర్యాల
-
బెల్లంపల్లి రాజకీయ చరిత్ర.. గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
బెల్లంపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో 2014లో టిఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య రెండోసారి గెలుపొందారు. ఇక్కడ మాజీ మంత్రి జి.వినోద్ బిఎస్పి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. అంతకుముందు ఆయన టిఆర్ఎస్లో ఉన్నారు. టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతో బిఎస్పి టిక్కెట్ తీసుకుని ఇక్కడ పోటీచేసి ఓటమి చెందారు. చిన్నయ్యకు 11276 ఓట్ల మెజార్టీ వచ్చింది. చిన్నయ్యకు మొత్తం 55026 ఓట్లు రాగా, వినోద్కు 31359 ఓట్లు తెచ్చుకున్నారు. కాగా మూడోస్థానం ఇండిపెండెంట్ అబ్యర్ధిగా ఉన్న కె.వేద పదివేలకుపైగా ఓట్లు తెచ్చుకున్నారు. సిపిఐ సీనియర్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ డిపాజిట్ దక్కించు కోలేకపోయారు. కాంగ్రెస్ ఐ మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. భారీ ఆదిక్యతతో.. బెల్లంపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో 2009లో గెలిచి ఆ శాసనసభలో సిపిఐ పక్ష నేతగా ఉన్న గుండా మల్లేష్ వరసగా ఓటమి చెందారు. 2014లో బెల్లంపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య భారీగా 52,528 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో మల్లేష్ కూడా యాక్టివ్గా ఉన్నా ఫలితం దక్కేలేదు. 2014లో బెల్లంపల్లిలో టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్రకు 9167 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రముఖ బొగ్గు కేంద్రంగా ఉన్న బెల్లంపల్లి 2009లో రిజర్వుడ్ నియోజకవర్గంగా ఏర్పడింది. మల్లేష్ గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం (ఎస్.సి)లో మూడుసార్లు 1983, 1985, 1994లో విజయం సాధించారు.2009లో నాలుగో సారి గెలిచిన తరువాత మల్లేష్ సిపిఐ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మృతదేహం వెంటే మృత్యు ఒడికి.. భార్య శవాన్ని తీసుకొస్తూ భర్త మృతి
సాక్షి, మంచిర్యాల: కడవరకూ తోడుంటానని పెళ్లిలో చేసిన ప్రమాణాన్ని దేవుడు నిజం చేయాలనుకున్నాడో ఏమో.. పిల్లలు చిన్నవారన్న దయ కూడా చూపలేదు. భార్య చనిపోయిందని పుట్టెడు దుఃఖంలో ఆమె మృతదేహం వెంటే స్వగ్రామానికి బయల్దేరాడు భర్త. తెల్లవారితే పిల్లలకు అమ్మ ఏదంటే ఏమని సమాధానం చెప్పాలని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. తనలోని బాధ పిల్లలకు కనిపించకూడదన్న ఆలోచనలో ఉన్నాడు. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. భార్య చనిపోయిన రెండు గంటల వ్యవధిలోనే లారీ రూపంలో అతడిని కబళించింది. ఈ విషా ద సంఘటన లక్సెట్టిపేట మండలంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మరణంతో పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనతో మండలంలోని ఎల్లారం గ్రామంలో విషాదం అలుముకుంది. చిచ్చుపెట్టిన పొరుగింటి గొడవ.. డ్రైవర్గా పనిచేసే భర్త, బంగారం లాంటి ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న ఆమె జీవితంలో పొరుగింటి వారితో జరిగిన గొడవ ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. చివరకు దంపతులిద్దరి మరణానికి కారణమైంది. లక్సెట్టిపేట ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన శరణ్య(28) గృహిణి. ఆమె భర్త మల్లికార్జున్(33) ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరికి ఓంకార్, ఇవాంక సంతానం. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితం ఇంటి పక్కన ఉండే రజినితో శరణ్యకు గొడవ జరిగింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఇద్దరికీ నచ్చజెప్పారు. ఇంతలో మరో మహిళ రాణి గొడవలో జోక్యం చేసుకుంది. రజినిని రెచ్చగొట్టి స్థానిక పోలీస్ స్టేషన్లో శరణ్యపై ఫిర్యాదు చేయించింది. మనస్తాపంతో పురుగుల మందు తాగి.. ఈ విషయం తెలిసిన శరణ్య మనస్తాపం చెందింది. చేయని తప్పుకు తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని మదన పడింది. క్షణికావేశంలో ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శరణ్య శనివారం రాత్రి 11 గంటలకు మృతిచెందింది. కోలుకుని ఇంటికి వస్తుందనుకున్న భార్య కానరాని లోకాలకు వెళ్లడంతో మల్లికార్జున్ కన్నీటిపర్యంతమయ్యాడు. అనంతరం తేరుకుని మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు బంధువు సాయంతో అంబులెన్స్ ఏర్పాటు చేశాడు. అంబులెన్స్ వెనకాలే.. ద్విచక్రవాహనంపై.. అమ్మ త్వరలోనే ఇంటికి వస్తుందని రాత్రి పడుకునే ముందే పిల్లలకు చెప్పాడు మల్లికార్జున్. ఇంతలో శరణ్య మరణించడంతో తెల్లవారి పిల్లలకు ఏం చెప్పాలని దుఃఖాన్ని దిగమింగుతూ తన ద్విచక్రవాహనంపై బంధువుతో కలిసి అంబులెన్స్ వెనకాలే గ్రామానికి బయల్దేరాడు. పిల్లలు రేపటి నుంచి ఎవరిని అమ్మ అని పిలుస్తారని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో లక్సెట్టిపేటలోని ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకున్నారు. మూత్రవిసర్జన కోసం అక్కడ ఆగారు. ద్విచక్రవాహనం రోడ్డు పక్కన నిలిపారు. మల్లికార్జున్ రోడ్డు దాటుతుండగా రాయపట్నం నుంచి లక్సెట్టిపేట వైపునకు వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉన్న బంధువు వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. రెండు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి.. రెండు గంటల వ్యవధిలో భార్య శరణ్య, భర్త మల్లికార్జున్ మృత్యువాత పడడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి మరణంతో పిల్లల గురించి ఆలోచిస్తూ వెళ్లిన తాను కూడా పిల్లలను చూడకుండానే దుర్మరణం చెందడంతో బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇద్దరికీ లక్సెట్టిపేట ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లారు. అమ్మా, నాన్న ఇద్దరినీ విగత జీవులుగా చూసిన పిల్లలు బోరున విలపించడం అందరినీ కలచివేసింది. సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. -
భార్య మరణాన్ని తట్టుకోలేక.. లారీ కిందకు దూకి భర్త సూసైడ్
సాక్షి, మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త లారీ కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం పక్కింటి వాళ్లతో గొడవ పడిన భార్య శరణ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆమె చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. భార్య శవాన్ని ఇంటికి తీసుకువస్తుండగా మధ్య మార్గంలో లక్షిట్ పెట్ ఉత్కూర్ చౌరస్తాలో భర్త మల్లికార్జున్ మనస్తాపంతో లారీ కిందకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, భర్తలు ప్రాణాలు కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పొవడంతో వారు తీవ్రంగా విలపిస్తున్నారు. చదవండి: సంచలనం... నాగేంద్రబాబు హత్యకు వివాహేతర సంబంధమే కారణం... -
చికెన్ కాకుండా వంకాయ కూర వండిందని.. భార్యపై భర్త సీరియస్.. ఆపై
సాక్షి, మంచిర్యాల జిల్లా: చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో నచ్చిన కూర వండలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. రాత్రి చికెన్ వండాలని కోరితే.. వంకాయ కూర వండిందని అదే రాత్రి భార్యను గోడ్డలితో దారుణంగా హత్యచేశాడు. భార్య గాలిపెల్లి శంకరమ్మ (45) నిద్రిస్తున్న సమయంలో భర్త గాలిపెల్లి పోశం (50) గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపి పరారయ్యారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు వీపరీతంగా పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్న కారణాలపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారని, ఇది వరకు మాటలకు పరిమితమయిన వాళ్లు ఇప్పుడు చేతలకు దిగుతున్నారని తెలిపారు. పెరిగిపోతోన్న కోప తాపాలను అదుపులో పెట్టుకోవాలని, భార్యాభర్తలిద్దరికీ ఓపిక, సహనం ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: పెళ్లయిన పది రోజులకే నవవధువు ఆత్మహత్య -
కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం!.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1 స్థాయి మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. రెండేళ్లలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున.. ఆలోపు పెద్ద మున్సిపాలిటీలను కార్పొ రేషన్లుగా అప్గ్రేడ్ చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల పాలనా యంత్రాంగాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు.. బడంగ్పేట, బండ్లగూడ జాగీర్, మీర్పేట–జిల్లెలగూడ, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేటలను ఏర్పాటుచేశారు. ఇవన్నీ హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. మిగతా చోట్ల ఉన్న పెద్ద మున్సిపాలిటీలను అప్గ్రేడ్ చేయలేదు. ఈ క్రమంలో మున్సిపాలిటీలుగానే ఉన్న కొ న్ని జిల్లా కేంద్రాలతోపాటు కొత్త జిల్లా కేంద్రాలుగా మారిన పలు పట్టణాల్లో పెరిగిన జన సాంద్రతకు అనుగుణంగా వాటిని కా ర్పొరేషన్లుగా మార్చాలనే డిమాండ్ వస్తోంది. గ్రేడ్–1, స్పెషల్ గ్రేడ్ స్థాయి మున్సిపాలిటీలలో.. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం.. కనీసం మూడు లక్షల జనాభా గల పట్టణాలను కార్పొరేషన్లుగా మార్చుకునే వీలుంది. రాష్ట్రంలో నల్లగొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, సిద్ధిపేట, మంచిర్యాల పట్టణాలు స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1 స్థాయి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రామాలు, పట్టణాలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్లుగా మార్చుకునే అవకాశముంది. - గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ను కార్పొరేషన్ చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టుదలతో ఉన్నారు. ఆయన సూచనల మేరకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేసి కార్పొరేషన్గా మార్చాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. - ఇదే తరహాలో జనాభా ప్రాతిపదికన నల్లగొండ, ఆదిలాబాద్ మున్సిపాలిటీలను కూడా విస్తరించి కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేయాలన్న చాలా కాలం నుంచీ డిమాండ్లు ఉన్నాయి. ఈసారి ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కార్పొరేషన్లుగా మారితే ఈ రెండు పట్టణాలు సరికొత్తగా మారుతాయని ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు. - కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలలో సిద్ధిపేట, మంచిర్యాల వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే స్పెషల్ గ్రేడ్ స్థాయికి ఎదిగిన ఈ మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల గ్రామాలు, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను విలీనం చేస్తే కార్పొరేషన్లుగా రూపొందుతాయి. మంచిర్యాలకు నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలతోపాటు కొన్ని గ్రామ పంచాయతీలను కలిపితే కార్పొరేషన్గా అప్గ్రేడ్ కానుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్ధిపేటకు మరికొన్ని గ్రామాలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్ హోదా పొందే అవకాశం ఉంది. కరీంనగర్లో మరికొన్ని గ్రామాల విలీనం? కరీంనగర్ పట్టణంలో కలసిపోయి/ ఆనుకుని ఉన్న బొమ్మకల్, చింతకుంట, నగునూరు, మల్కాపూర్, తిమ్మాపూర్ గ్రామాలు వివిధ కారణాల వల్ల కార్పొరేషన్లో విలీనం కాలేదు. పట్టణంలోని హౌజింగ్బోర్డు, ఖార్కాన గడ్డ, బైపాస్ రోడ్డు, చల్మెడ మెడికల్ కాలేజీ ఉన్న ప్రాంతమంతా బొమ్మకల్ గ్రామం పరిధిలోనే ఉంది. ప్రతిమ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉన్న నగునూరు కూడా పంచాయతీగానే కొనసాగుతోంది. ఈ గ్రామాల కంటే దూరంగా ఉన్న వాటిని కార్పొరేషన్లో విలీనం చేసి.. వీటిని రాజకీయ కారణాలతో కలపలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వీటిని కార్పొరేషన్లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు సిద్ధమైనట్టు తెలిసింది. పట్టణీకరణతో మెరుగవుతున్న జీవన ప్రమాణాలు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలను కార్పొరేషన్లుగా మార్చడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మౌలిక వసతులు సమకూరుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. గతంలో 6 కార్పొరేషన్లు మాత్రమే ఉంటే కొత్తగా మరో ఏడింటిని కొత్త నగరాలుగా తీర్చిదిద్దారు. 69 మున్సిపాలిటీలు 128కి పెరిగాయి. ఇప్పుడు కూడా జనాభాకు అనుగుణంగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం. – రాజు వెన్రెడ్డి, మున్సిపల్ చాంబర్స్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్. ఇది కూడా చదవండి: ఉప్పల్ సరే.. మరి లష్కర్? -
శేజల్తో బీఆర్ఎస్ నేతల చర్చలు.. ఎమ్మెల్యే చిన్నయ్యకు షాక్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించారని శేజల్ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా, తమపై కేసులు పెట్టించారని గత రెండు నెలలు నుంచి పలు రకాలుగా ఆందోళన చేస్తున్న ఆరిజన్ నిర్వాహకురాలు శేజల్తో బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం చర్చలు జరిపారు. బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్లు శేజల్, ఆదినారాయణలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ప్రభుత్వ భూమి కొనుగోలు చేసిన డబ్బులు వాపస్, తమపై ఉన్న కేసుల ఎత్తివేత, ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఇందుకు తప్పు చేసిన వారిపై పార్టీలో క్రమశిక్షణ చర్యలుంటాయని, అలాగే ఆమెకు న్యాయం చేస్తామని నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: దుర్గం చిన్నయ్యకు షాక్! -
Mancherial: సాయం పేరుతో రాత్రివేళల్లో చాటింగ్, వీడియో కాల్స్
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బింగి ప్రవీణ్ సాయం చేస్తానంటూ మాటలు కలిపి మోసం చేసేందుకు ప్రయత్నించాడని ఓ మహిళ మంగళవారం మంచిర్యాల పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్ నివాసం ఉంటున్న కాలనీలోనే తాను భర్తతో కలసి ఉంటున్నట్లు పేర్కొంది. తమ మధ్య ఉన్న గొడవను ప్రవీణ్ అనుకూలంగా మలుచుకునేందుకు ఓవైపు తన భర్తతో, మరోవైపు తనతో సన్నిహితంగా ఉంటూ పోలీసులు తెలుసంటూ మోసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. అధికార పార్టీ నేత కావడంతోనే పోలీసులు సైతం ప్రవీణ్ చెప్పినట్లు చేయడం, దీనిని ఆసరాగా చేసుకొని తనకు అర్ధరాత్రి వరకు వాట్సాప్లో చాటింగ్, వీడియో కాల్స్ చేస్తున్నాడని ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారని మహిళ వివరించింది. ఈ విషయమై బింగి ప్రవీణ్ను సంప్రదించగా తన ఇంటి సమీపంలోనే భార్యాభర్తలు ఉంటారని, సాయం చేయాలని కోరితేనే భార్యాభర్తలకు తన వంతు సాయం చేసేందుకు ప్రయత్నించానన్నారు. మహిళ లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నారు. చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ -
CM KCR: వారందరికీ గుడ్న్యూస్.. పెన్షన్ 4వేలకు పెంపు
సాక్షి, మంచిర్యాల : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా కొత్త కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వికలాంగులకు శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పెంచిన పెన్షన్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కాగా, మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలి. తెలంగాణ వచ్చి పదేళ్లు అయ్యింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నాం. ఆసరా పెన్షన్లతో అందరూ బాగున్నారు. వికలాంగులకు ప్రస్తుతం రూ. 3,116 పెన్షన్ ఇస్తున్నాం. వారికి మరో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని నేను సస్పెన్షన్లో పెట్టాను. వచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్ అందుతుంది. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ అందిస్తున్నాం. రైతుబంధు ద్వారా రైతులకు రూ.65వేల కోట్టు అందించాం. వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం తెలంగాణ. 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. సింగరేణి టర్నోవర్ను రూ.33వేల కోట్లకు పెంచాం. సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర. సింగరేణి మన సొంత ఆస్తి. కాంగ్రెస్ హయాంలో సింగరేణి సర్వనాశం అయ్యింది. దేశంలో బొగ్గుకు కొరత లేదు. 361 బిలియన్ టన్నుల బొగ్గు ఉండగా విద్యుత్ను ప్రైవేటు పరం చేస్తామంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచాలని చూస్తోంది. వచ్చే దసరాలో సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనస్ ఇవ్వబోతున్నాం. దేశంలోని చెడ్డ పాలసీలను అంతా కలిసి అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: చెన్నై టూ హైదరాబాద్: అప్సర కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్లు.. -
మంచిర్యాల: కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, మంచిర్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా మంచిర్యాలలో కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మంచిర్యాలలో కొత్త కలెక్టరేట్ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. మంచిర్యాల జిల్లా డిమాండ్ చాలా కాలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్దించింది.. అందుకే మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేశాం. పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇబ్బంది లేకుండా అందాలి. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశారు. కరోనా అతలాకుతలం చేసినా కోలుకున్నాం. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన అధికారులకు కృతజ్ఞతలు. తెలంగాణ అనేక అంశాల్లో నెంబర్ వన్గా ఉంది. కరోనా, నోట్ల రద్దుతో ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగాం. వరి సాగులో పంజాబ్ను దాటేసి నెంబర్ వన్గా ఉన్నాం. కంటి వెలుగు పథకం సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఢిల్లీ, పంజాబ్లో కూడా కంటి వెలుగును కొనసాగిస్తామన్నారు. కుల వృత్తులను ఆదుకునేందుకు చేయూత ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు! -
నేడు మంచిర్యాలకు సీఎం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం, బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం, రెండో విడత దళితబంధును సీఎం కేసీఆర్ మంచిర్యాలలో ప్రారంభించనున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంచిర్యాలలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి మొదట బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించాక, బహిరంగ సభ వేదికపై వివిధ పథకాల లబ్దిదారు లకు లాంఛనంగా చెక్కులు అందజేస్తారు. వీటితోపాటు రూ.1,658 కోట్ల వ్యయంతో, లక్ష ఎకరాలకు సాగునీరందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం, మందమర్రిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్పాం ఫ్యాక్టరీ, రూ.164 కోట్లతో గోదావరిపై నిర్మించనున్న మంచిర్యాల, అంతర్గాం రోడ్డు బ్రిడ్జి, రూ.205 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వైద్యకళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
‘ఆ ఎమ్మెల్యే కామ పిశాచి’.. హైదరాబాద్లో ఫ్లెక్సీల కలకలం..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా హైదరాబాద్లో వెలసిన ఫ్లైక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టడంతో సంచలనంగా మారింది. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుంచి బెల్లంపల్లి ప్రజలను కాపాడండి అంటూ ఆరిజన్ డెయిరీ పేరుతో ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, మీడియా సంస్థలకు విన్నపం. మాకు న్యాయం చేయాలి’’ అని ప్లెక్సీలో ఉంది. ఎమ్మెల్యేపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆడియో -
తెలంగాణ: నిప్పుల కొలిమిలా ఆ జిల్లాలు.. జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో.. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంచిర్యాల(ఉమ్మడి ఆదిలాబాద్), నిజామాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ (ఉమ్మడి ఆదిలాబాద్), నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీ సెంటిగ్రెడ్ పైగా ఉష్ణోగ్ర తలు నమోదు అయ్యాయి. ఆయా జిల్లాల్లో నమోదు అయిన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. మంచిర్యాల కొండాపూర్ లో 45.8 డిగ్రీ సెంటిగ్రేడ్ జన్నారంలో 45.8 డిగ్రీ సెంటిగ్రేడ్ బెల్లంపల్లిలో 45.4 డిగ్రీ సెంటిగ్రేడ్ నీల్వాయి 45.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కొమ్మెర 44.9 డిగ్రీ సెంటిగ్రేడ్ జగిత్యాల జైనా లో 45.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 45.4 డిగ్రీ సెంటిగ్రేడ్, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ 45.1 డిగ్రీ సెంటిగ్రేడ్, నల్లగొండ జిల్లా పజ్జూరులో 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల పాటు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. అయితే.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 38 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 41 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. -
‘దళితబంధు’కు లంచం ఇవ్వొద్దు: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, పెద్దపల్లి: దళితబంధు లబ్ధిదారులు ఆ మొత్తం పొందేందుకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. దళితులు ధనికులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి రూ.10 లక్షలు ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తోందని, తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ ఏం చేశారని అడిగితే.. ప్రతి ప్రజాప్రతినిధి గంటసేపు చెప్పగలరని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో 19 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచిందని గుర్తు చేశారు. నల్లధనం వెనక్కి తెస్తానని, జన్ధన్ ఖాతా తెరిపించి ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన గడ్డం తాత (పీఎం మోదీ) తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల చొప్పున 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తే బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ టూ జెడ్ స్కామ్లు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకగాంధీ తెలంగాణకు వచ్చి అవినీతి గురించి మాట్లాడుతున్నారని, వారిని నమ్మొద్దని కోరారు. కేటీఆర్ సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్లో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు శంకుస్థాపన, బెల్లంపల్లిలో పుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, అర్బన్ మిషన్ భగీరథలకు ప్రారంభోత్సవం చేశారు. సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న ఏడు వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనరేట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లిలో ప్రజా ఆశీర్వాద సభలో, రామగుండంలో నిర్వహించిన ‘రామగుండం నవనిర్మాణ’సభలో ఆయన మాట్లాడారు. ఆ బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలి ‘ప్రధాని, అదానీ అవిభక్త కవలు. ఆ దోస్తును ధనవంతుల్లో 603వ స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనులను అదానీకి కట్టబెట్టేందుకే వేలం పాట నిర్వహిస్తున్నారు. గాలి మోటరులో రామగుండం వచ్చిన మోదీ సింగరేణిని అమ్మబోమని గాలిమాటలు చెప్పారు. ఆ తెల్లారే నాలుగు బొగ్గు గనులను వేలానికి పెట్టారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నామినేషన్ పద్ధతిలో ఇచ్చేస్తున్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని సింగరేణికి కేటాయించాలి. పొరపాటున సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్నిగుండం అవుతుంది.’ అని మంత్రి హెచ్చరించారు. బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయాలి: ‘బొగ్గు గనులను కాపాడుకోవాలంటే బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలి. మోదీ వచ్చాక గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో నెర్రెలు, నెత్తురు పారిన తెలంగాణలో నేడు కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు పారుతున్నాయి. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కథానాయకులు కావాలి.’ అని కేటీఆర్ పి లుపునిచ్చారు. ఆకాశంలో స్పెక్ట్రమ్ నుంచి పాతా ళంలో బొగ్గును విడిచిపెట్టని కాంగ్రెస్ నేతలు ఒక్క చాన్స్ అంటూ అడుగుతున్నారని, మరి పదిసార్లు అవకాశం ఇస్తే ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని మంత్రి ఎద్దేవా చేశారు. పోలీస్ కమిషనరేట్లో జరిగిన సమావేశంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మతోడు ఇక్కడ ఐటీ కంపెనీలంటే నమ్మలే..! ‘బెల్లంపల్లిలో ఐటీ కంపెనీలు ఉన్నాయంటే అమ్మతోడు నేనసలు నమ్మలేదు. ఎమ్మెల్యే చిన్నయ్య తీసుకెళ్లి చూపిస్తే, వాళ్లని చూసి ఎంతో స్ఫూర్తి పొందా. రంగనాథరాజు, శ్రీనాథరాజు, సాయినాథరాజు అనే యువకులు అమెరికా, యూరప్ లాంటి ప్రాంతాల్లో స్థిరపడకుండా పుట్టిన గడ్డకు ఎంతో కొంత చేయాలని అనలటిక్స్ ఐటీ కంపెనీతో 100 మందికి, వెంకటరమణ వాల్యూ పిచ్ కంపెనీతో 200 మందికి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ప్రపంచంతో పోటీ పడేలా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తాం..’అని కేటీఆర్ తెలిపారు. చదవండి: ఇంఫాల్ నుంచి ఇంటికి వచ్చిన తెలంగాణ విద్యార్థులు.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు -
Indrakaran Reddy: అమాత్యుడి మాటల్లో ఆంతర్యం ఏమిటో!
సాక్షి, నిర్మల్: ‘ఇంత వయ సొచ్చినందున ఇక రాజకీయాలంటే ఇష్టం లేదు. భవిష్యత్తులో ఎవరైన వచ్చి నిల్చున్నా అభ్యంతరం లేదు’అంటూ బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పనితీరు, పథకాల గురించి చెబుతూ నిర్మల్ రుణం తీర్చుకునేందుకు ఎన్నో పనులు చేశామన్నారు. ఈ క్రమంలో ఇంత వయసొచ్చినందున ఇక రాజకీయాలంటే ఇష్టంలేదని, రేపొద్దున ఎవరొచ్చి నిల్చున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. దీంతో ఒక్కసారిగా స్టేజీపై, సభలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ‘ఐకేరెడ్డి జిందాబాద్’అంటూ నినాదాలు చేశారు. అందరూ స్టేజీ వద్దకు వెళ్లి మంత్రికి అండగా ఉంటామని చెప్పారు ఈ క్రమంలో కాసేపు ఇంద్రకరణ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ఇటీవలే సీనియర్లు శ్రీహరి రావు, సత్యనారాయణగౌడ్ అసమ్మతివర్గంగా తయారు కావడం, కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డి బీజేపీలో చేరడం, మరోవైపు బీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీ రాజేశ్వర్రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడం, పలువురు కౌన్సిలర్లనూ బీజేపీ టార్గెట్ చేసిన నేపథ్యంలో మంత్రి ఇలా మాట్లాడి ఉంటారన్న చర్చ జరుగుతోంది. చదవండి: మున్సిపాలిటీల్లో మైనారిటీలకు కోటా రాజ్యాంగ ఉల్లంఘనే -
ఉలిక్కిపడిన మంచిర్యాల.. యువకుడి దారుణ హత్య.. ఇదీ జరిగింది!
మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన మహేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కనకయ్య కుటుంబానికి పోలీసులు మద్దతు ఇవ్వడం వల్లనే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. పోలీసుల వైఫల్యం వల్లే కొడుకు హత్య జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. (సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. ముక్కున వేలేసుకున్న కార్యకర్తలు) పోలీసుల భారీ బందోబస్తు మహేష్ బంధువుల ఆందోళన నేపథ్యంలో స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకుడి హత్య కేసులో ప్రమేయమున్న వారిపై చర్యలు తీసుకుంటామని జైపూర్ ఏసీపీ నరేందర్ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు మహేష్ బంధవులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తరలించారు. (ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తా: వైఎస్ షర్మిల) అయిదుగురిపై కేసు మరోవైపు యువకుడి హత్య కేసులో అయిదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కనకయ్యతోపాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని జైపూర్ మండలంలో ఇందారంలో మహేష్ అనే యువకుడిని కత్తులతో దాడి చేసి, బండరాళ్లతో మోదీ హత్య చేసిన ఉదంతం తెలిసిందే. పట్టపగలు అందరూ చూస్తుండగానే బాధితురాలి కుటుంబ సభ్యులు అత్యంత కిరాతకంగా అతడిని అంతమొందించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో సంచలనంగా మారింది. ఇదీ జరిగింది.. ఇందారం గ్రామానికి చెందిన కనకయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెతో ఎం. మహేశ్(24) అనే యువకుడు ప్రేమ వ్యవహారం సాగించాడు. గతేడాది యువతి తల్లిదండ్రులు మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. పైళ్లైనా కూడా మహేష్ను వివాహితను వదిలిపెట్టలేదు. యువతిపై కక్ష పెంచుకొని.. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను తన భర్తకు పంపాడు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి యువతి తన పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. భర్త చనిపోయినా కూడా మహేష్ వేధింపులు ఆపలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు యువకుడిపై జైపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. పలుమార్లు యువతిని మహేష్ వేధిస్తూ వచ్చాడు. కూతురు కాపురం విచ్చిన్నం చేసి.. అల్లుడు మృతికి కారణమైన మహేష్పై కనకయ్య పగ తీర్చుకోవాలనుకున్నాడు. యువకుడి ప్రాణం తీసేందుకు పథకం రచించాడు. ఈ క్రమంలో ఇంటిముందు బైక్పై వెళ్తున్న మహేష్పై కనకయ్య, ఆయన కుటుంబ సభ్యులు ఆయుధాలతో దాడి చేశారు. దీంతో అతడు కిందపడిపోవడంతో కనకయ్య, ఆయన బార్య, కూతురు, కుమారుడు బండరాళ్లతో మోదీ, కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. అయితే ఇంత దారుణం జరుగుతున్నా అడ్డుకోవడానికి స్థానికులెవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. హత్య దృశ్యాలను కొందరు ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటనాస్థలాన్ని ఏసీపీ నరేందర్, ఎస్సై రామకృష్ణ పరిశీలించారు. (దొంగ తెలివి! పని మనిషిగా చేరిన 24 గంటల్లోనే దోపిడీ.. ఎప్పటిలా మళ్లీ సిటీకి) -
మంచిర్యాల: ఇందారంలో లైవ్ మర్డర్
సాక్షి, మంచిర్యాల: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. ఊరంతా చూస్తుండగానే ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణానికి తెగబడింది ఒకే కుటుంబంగా తెలుస్తోంది. వేధింపుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. ముస్కె మహేష్(28) అనే వ్యక్తి బైక్లో పెట్రోల్ కొట్టించుకుని వస్తున్న క్రమంలో.. అడ్డగించిన ఆ నలుగురు దాడికి దిగారు. గొంతు కోసి ఆపై బండ రాయితో తల పగలకొట్టారు. ఆ సమయంలో స్థానికులెవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. పైగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందారం గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, మహేష్కు నడుమ గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. ఆపై ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ యువతి తల్లి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మహేష్ ఫోన్ ద్వారా అసభ్య మెసేజ్లతో వేధిస్తుండడంతో ఆ కుటుంబం భరించలేకపోయింది. ఎంత చెప్పినా అతని తీరు మారలేదు. ఈ క్రమంలో వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో మాటువేసి ఈ ఉదయం మహేష్ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు మహేష్ను చంపిన నలుగురిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఇంకోవైపు మహేష్ వేధింపులపై వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మహేశ్ వేధింపులు ఆగకపోవడంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగబడినట్లు చెబుతున్నారు. -
టీకాంగ్రెస్ నేతలకు క్లాస్ పీకిన ఖర్గే.. మంచిర్యాలలో ఏం జరిగింది?
కాంగ్రెస్ పార్టీ ఆలిండియా అధ్యక్షుడు ఖర్గేకు కోపం వచ్చిందట. మంచిర్యాల సభకు వచ్చిన ఖర్గే టీపీసీసీ నేతలపై కన్నెర్ర చేశారు. సభ నిర్వహించిన తీరు సరిగా లేదని క్లాస్ పీకారు. ఆలిండియా నేతకు కోపం వచ్చేలా మంచిర్యాల సభలో ఏం జరిగింది? పీసీసీ నేతలు చేసిన తప్పేంటి..? కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ.. నాలుగు రోజుల క్రితం మంచిర్యాలలో జై భారత్ సత్యాగ్రహ దీక్ష నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. దీక్షకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా సభలో పాల్గొన్నారు. సభకు జనం కూడా భారీ స్థాయిలో తరలివచ్చారు. అంతా భాగానే ఉన్నా సభ నిర్వహణా సమయాన్ని సరిగా సెట్ చేయకపోవడంతో.. ఖర్గేతో పాటు మిగతా ముఖ్య నేతలు మాట్లాడే సమయానికి జనం ఇంటిబాట పట్టారు. దీంతో నేతలు మాట్లాడుతున్న సమయంలో సభాస్థలిలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జనంలేని సభలో ప్రసంగించిన ఖర్గేకు పీసీసీ నేతల మీద పీకల దాకా కోపం వచ్చింది. మీటింగ్ అయిపోయేయంత వరకు సైలెంట్గా ఉన్న ఖర్గే.. సభ అనంతరం టీ కాంగ్రెస్ నేతలకు క్లాస్ పీకారట. పార్టీ జాతీయ అధ్యక్షుడు క్లాస్తో నేతలంతా ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారట. అయితే, ఖర్గే క్లాస్ తీసుకునే సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క కానీ లేరట.. దీంతో అసలు వాళ్లను అనకుండా మమ్మల్ని అంటే ఏం ఉపయోగం అనుకున్నారట కొందరు నేతలు. ఖర్గే మాట్లాడే సమయానికి జనం లేకపోవడం, ఖర్గే స్పీచ్ కూడా ఆలస్యం కావడంతో ఆయనకు కోపం వచ్చింది. ప్రోగ్రామ్ను ఫర్ఫెక్ట్ గా ఎందుకు ప్లాన్ చేయలేదని ప్రశ్నించారట. మంచిర్యాల చేరుకున్న తర్వాత కూడా గంట సేపు బయట ఎందుకు వెయిట్ చేయించారని ప్రశ్నించారట. మంచిర్యాలకు రాగానే వెళ్లి ఉంటే ఇంకో గంట ముందే సభ ముగించుకునే వాళ్లం కాదా.. మనం ఆలస్యం చేసి జనం సహనానికి పరీక్ష పెట్టామని, ఇంకోసారి ఇలా జరగొద్దని సుతిమెత్తగా చురకలు అంటించారట. కర్ణాటక ఎన్నికల బీజీ షెడ్యూల్లో ఇంత సమయం ఇస్తే మీరు సరిగా వాడుకోలేదని, నేను ఇక్కడకు రావడానికి ఎంతో ఖర్చు అయింది. ఇదంతా వేస్టే కదా అన్నారట ఖర్గే. దీంతో టీపీసీసీ నేతలంతా ఇదెక్కడి గొడవరా బాబు అనుకున్నారట. మొత్తానికి ఖర్గే కోపంతో తర్వాత జరిగే మీటింగ్లను ఫర్ఫెక్ట్ గా చేయాలని భావిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ నేతలు వచ్చినప్పుడు ఎక్కువ మందితో మాట్లాడించకుండా కొద్ది మందితోనే మాట్లాడించాలని డిసైడ్ అయ్యారట. కాంగ్రెస్ అంటే డిఫరెంట్ పార్టీ. ఇవన్నీ మామూలే. శతాబ్దానికిపైగా పాతుకుపోయిన లక్షణాలు అంత త్వరగా వదులుతాయా? వేచిచూడాల్సిందే. -
మంచిర్యాల మాతాశిశు కేంద్రంలో వైద్యులు, వసతులు కరువు
-
దేశంలో మోదీ, తెలంగాణ కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారు : ఖర్గే
-
కొత్త ట్విస్ట్ ఇచ్చిన కోమటిరెడ్డి.. రేవంత్ను సైడ్ చేసే ప్లాన్!
సాక్షి, మంచిర్యాల: కాంగ్రెస్ సీనియర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా పార్టీ వీడుతున్నట్టు ఎన్నోసార్లు ప్రచారం చేశారని, అయినా తాను పార్టీ మారలేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా? అని ప్రశ్నించారు. పార్టీ నుంచి మహేశ్వర్రెడ్డి వెళ్లినా ఎలాంటి నష్టం లేదన్నారు. కాగా, కోమటిరెడ్డి మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదు. దళిత బంధు పథకం బీఆర్ఎస్ నేతలకు దోపిడీగా మారింది. న్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులకు అండగా ఉన్నట్టు కాదు. 16శాతం ఉన్న మాదిగలకు ఇప్పటికీ మంత్రి వర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో దళిత నాయకుడు ఖర్గేను తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. అలాగే, కాంగ్రెస్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. మరోవైపు, రాష్ట్రంలో నా పాదయాత్ర ఉండదు. భట్టి విక్రమార్క పాదయాత్రనే నా పాదయాత్ర. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని ఖర్గేను కోరతాము అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక, తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తానంటే గిట్టనివాళ్లు దుష్ప్రచారం చేస్తుంటారని మండిపడ్డారు. 33 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా.. పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా? అని ప్రశ్నించారు. -
సత్యాగ్రహ దీక్షతో సమరానికి సై అంటోన్న తెలంగాణ కాంగ్రెస్
-
రేపు మంచిర్యాలలో భారీ బహిరంగ సభకు సన్నాహకాలు
-
ఉత్తర తెలంగాణలోని 20 అసెంబ్లీ సీట్లపై కాంగ్రెస్ ఫోకస్
-
మంచిర్యాల ఎమ్మెల్యే సమీప బంధువు దారుణ హత్య
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో పట్ట పగలే దారుణ హత్య చోటుచేసుకుంది. మందమర్రి మండలం గద్దేరాగడిలో లక్ష్మీకాంతరావు అనే రియాల్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో ఆయన్ను కత్తులతో తలపై దాడి చేసి ప్రాణం తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల అసుపత్రికి తరలించారు. మృతుడు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావుకు సమీప బంధవుగాపోలీసులు గుర్తించారు. అయితే ఓ స్థలం వ్యవహారంలో లక్ష్మీకాంతరావుకు స్థానికంగా కొందరితో వివాదం నడుస్తోందని, ఈ క్రమంలోనే ఆయన్ను హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: పెళ్లైన 3 రోజులకే ప్రియుడితో ఉడాయించిన నవవధువు.. భర్త అదృశ్యం -
ఈనెల 14న తెలంగాణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనెల 14న తెలంగాణకు రానున్నారు. మంచిర్యాలలో చేపట్టబోయే నిరసన దీక్షలో ఖర్గే పాల్గొననున్నారు. ఈ నిరసన దీక్షలో ఏఐసీసీ చీఫ్తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా టీకాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టనుంది. కాగా రాహుల్పై అనర్హత వేటుకు నిరసనగా దేశంలోని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహత్మక ప్రయత్నాలు చేస్తున్నారు ఖర్గే. అదానీ వ్యవహారంపై పార్లమెంటు లోపలా, బయటా సమర్థవంతంగా పోరాడుతున్నారు. ఇక ఖర్గే సొంత రాష్ణమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్కు అగ్ని పరీక్షగా మారాయి. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇటీవలి కొన్ని సర్వేలు తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ జాతీయ నేతల్లో ఉత్సాహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిష్ఠ పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. చదవండి: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు -
Mancherial: పాపం సాయిష్మ.. ఎంగేజ్మెంట్ అయ్యిందన్నా ప్రేమోన్మాది వదల్లేదు!
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను హైదరాబాద్ నిమ్స్కు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివరాలు.. మంచిర్యాల జిల్లా దండపేల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సాయిష్మ అనే యువతిని అదే గ్రామానికి చెందిన నలిమేల వినయ్ కుమార్ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తనకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వేధించవద్దని సాయిష్మ కోరినా.. యువకుడు పట్టించుకోలేదు. అంతేగాక తనను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఈనెల 18న యువతికి ఫోన్చేసి నువ్వు చచ్చిపో, బతికి ఉండకంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన సాయిష్మ.. వినయ్ వేధింపులు తట్టుకోలేక శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం కరీంనగర్కు తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయిష్మా మృతి చెందింది. దీంతో వినయ్ కుమార్ వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
పచ్చబొట్టు చెరిగీపోదులే! ‘మేం ఉన్నంతకాలం ఆచారాన్ని కొనసాగిస్తాం’
ఈ తరం వారికి పచ్చబొట్టు అంటే కేవలం ఒంటిపై వేయించుకొనే ఫ్యాషన్ చిహ్నం.. టాటూ పేరుతో చిత్రించుకొనే ప్రత్యేకమైన డిజైన్. కానీ నిన్నటితరం వారికి మాత్రం అది జీవితాంతం గుర్తుంచుకొనే ఒక పదిల జ్ఞాపకం.. ముఖ్యంగా గిరిజనులకైతే అదో సంప్రదాయం.. జీవన విధానంలో ఓ భాగం.. తరతరాల ఆచారం. గిరిజనుల్లో మొదలై మైదాన ప్రాంతాలు, అటు నుంచి మెట్రో నగరాలకు ఓ ఫ్యాషన్ గా మారిన పచ్చబొట్టు పుట్టుక, అందుకు ఉపయోగించే వస్తువుల గురించి తెలుసుకోవాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడేల్లోకి వెళ్లాల్సిందే. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజనుల్లో పచ్చబొట్టు అనేది తోటి అనే తెగలోని ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైన కళ. ఐదేళ్ల నుంచే సూదులు చేతబట్టి, ఒంటిపై ఎలాంటి ఆకారమైనా వేయగల నేర్పు నాటి తరం తోటి మహిళల సొంతం. ఇందుకోసం సన్నని మూడు సూదులను దగ్గర చేర్చి చేతితో పట్టుకొనేలా దారంతో చుట్టగా చుడతారు. అడవిలో దొరికే (పెద్దేగి జాతి చెట్టు) బెరడును తెచ్చి చిన్న కుండలో వేసి మాడిపోయే వరకు వేడి చేస్తే పచ్చని రంగు వస్తుంది. సన్నటి కట్టెపుల్లతో శరీరంపై మొదట ఆకారం వేస్తారు. ఆముదం నూనెను, ఆ రంగులో ముంచి శరీరంపై సూదితో పొడుస్తారు. వేసిన పచ్చబొట్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదంతా ఎంతో క్రమశిక్షణ, ఓర్పుతో వేస్తుంటారు. ఒక్కో బొట్టుకు ఒక్కో ప్రత్యేకత.. ఆది దంపతులైన శివపార్వతుల కల్యాణంలో తోటీలు పచ్చబొట్టు వేశారని పురాణ కథల్లో ఉంది. పార్వతికి నుదుటిపై పచ్చబొట్టు వేశాకే వివాహం జరిగిందని చెబుతుంటారు. ఇదే సంప్రదాయాన్ని రాజ్గోండ్ అమ్మాయిలు పెళ్లిపీటలు ఎక్కేముందు నుదుటిపై సూర్యచంద్రుల ఆకారంలో పచ్చబొట్టు వేయించుకొనేవారు. మూడు నెలల శిశువుకు దిష్టి చుక్కతో మొదలై, మహిళల చేతులపై నవగ్రహాలు, పుష్పాలు రకాల రూపాల్లో సందర్భాన్ని బట్టి వేసుకొనేవారు. రోగాలు, నొప్పులు వస్తే నుదిటి, కణత, గడ్డం, బుగ్గ, మెడ, వీపు, చేతి వేళ్ల మీద నుంచి భుజం వరకు, నడుము తదితర భాగాలపై వేసుకొనేవారు. అలంకారమే కాక, దైవభక్తి, భార్యాభర్తలు, అమ్మనాన్నలు, ఇష్ట దైవం, పేర్లను సైతం ఒంటిపై ముద్రించుకునేవాళ్లు. పూర్వం తమ పిల్లల్ని గుర్తుపట్టేందుకు శిశువుకు 3 నెలలు రాగానే పచ్చబొట్టు వేసేవారని నాటి తరం ఆదివాసీలు చెబుతున్నారు. పూర్వం గిరిజన మహిళలు చేతి నుంచి వీపు, తల వరకు ఒంటికి వేయని దుస్తుల వలే పచ్చబొట్టును వేయించుకొనేవారని గుర్తుచేసుకున్నారు. గిరిజన ప్రాంతాలకు వలసలు మొదలవడంతో గిరిజనేతరులకు సైతం ఈ ఆచారం అలవాటు అయిందని పేర్కొన్నారు. అయితే ఈ తరం గిరిజన మహిళల్లో ఎక్కువ మంది పచ్చబొట్టుపై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ కళ అందితేనే పచ్చబొట్టు పదిలంగా ఉంటుందని చెబుతున్నారు. చరిత్రకారుల ప్రస్తావన.. గతంలో హైమన్ డార్ఫ్, మైఖేల్ యోర్క్ వంటి విదేశీ పరిశోధకులు తమ రచనలు, ఫొటోలు, డాక్యుమెంటరీల్లో పచ్చబొట్టును ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం ఐఐటీ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు పచ్చబొట్టుపై అధ్యయనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్లో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్లు సైతం తమ ఒంటిపై కనీసం ఒక చుక్కనైనా తోటిల వద్ద వేసుకొని మురిసిపోయేవారు. ఆదివాసీల్లో ఒకటైన తోటి తెగ జనాభా 2011 లెక్కల ప్రకారం 4,811గా ఉండగా ప్రస్తుతం 10 వేల వరకు ఉండొచ్చని అంచనా. దేవుడిచ్చిన వరం మా ముందు తరం నుంచే పచ్చబొట్టు వేసే ఆచారం ఉంది.. మా తెగకు దేవుడు ఇచ్చిన వరం ఇది. రాను రాను గిరిజనుల్లో పచ్చబొట్టుపై ఆసక్తి తగ్గిపోయినా మేం ఉన్నంతకాలం ఆచారాన్ని కొనసాగిస్తాం. – వెడ్మ రాంబాయి, ఎదులపాడ్, తిర్యాణి మండలం, కుమురంభీం జిల్లా -
వైరల్ వీడియో: వధువుకు ఎమర్జెన్సీ సర్జరీ.. ఆస్పత్రి బెడ్పైనే తాళి కట్టాడు
-
వధువుకు ఎమర్జెన్సీ సర్జరీ.. ఆస్పత్రి బెడ్పైనే తాళి కట్టాడు
సాక్షి, మంచిర్యాల: అమ్మాయిది నిరుపేద కుటుంబం. అందుకే పెళ్లి అయినా ఘనంగా చేయాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వివాహానికి ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోపు పెళ్లి కూతురు ఆస్పత్రి పాలైంది. ఆ పెళ్లి కొడుకు వధువు కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆసుపత్రి బెడ్పైనే వధువుకు తాళి కట్టాడు వరుడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లంబాడిపల్లికి చెందిన శైలజకు.. భూపాలపల్లికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ముహూర్తం. అయితే.. బుధవారం రాత్రి వధువుకు కడపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే.. ఖర్చు చేసి చుట్టాలందరినీ పిలిపించి.. వివాహ వేడుకను వాయిదా వేయడానికి పెళ్లి కొడుక్కి మనస్సు రాలేదు. అందుకే.. పెద్దలను ఒప్పించాడు. ఆపై ఆస్పత్రి వైద్యులతో మాట్లాడితే.. వాళ్లూ సంతోషంగా అంగీకరించారు. వాళ్ల సమక్షంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఆ జంట. -
Transgender Woman: ట్రాన్స్జెండర్లపై మనసుపడి.. మనువాడి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వారిలో ట్రాన్స్జెండర్ల వర్గమొకటి. ఈ వర్గంవారు ఎక్కువగా భిక్షాటన, ఇతర వృత్తుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారిపై ఆదరణ చూపేవారికన్నా చీదరించుకునే వారే అధికంగా ఉంటారు. ఇలాంటివారికి పెళ్లి భాగ్యం తక్కువే. సాధారణంగా ఇలాంటి వారిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. కానీ ఇటీవల ట్రాన్స్జెండర్లను సైతం కొందరు యువకులు ప్రేమించిపెళ్లి చేసుకుంటున్నారు. కన్నవారిని, సమాజ కట్టుబాట్లను సైతం ఎదురిస్తూ ఇష్టపడిన వారిని మనువాడుతున్నారు. ప్రేమ అంటే పైకి కనిపించే శరీరం కాదని.. అది మనసుకు సంబంధించిన విషయమని అంటున్నాయి ఈ రకపుప్రేమ జంటలు. మూడేళ్లపాటు ప్రేమించి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అనంతతోగుకు చెందిన ట్రాన్స్జెండర్ అఖిల, భూపాలపల్లికి చెందిన రూపేశ్ మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదురించి గత మార్చిలో ఇల్లెందులో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ కలసి ఉంటున్నారు. తమకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. ఒకరినొకరు ఇష్టపడి.. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన ట్రాన్స్జెండర్ దివ్యను జగిత్యాలకు చెందిన అర్షద్ పెళ్లిచేసుకున్నారు. మొదట కొంతకాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. ప్రేమలో ఉండి సహజీవనం చేశారు. చివరకు అర్షద్ తన ఇంట్లో వాళ్లను ఎదిరించి గతేడాది డిసెంబర్లో హిందూ సంప్రదాయం ప్రకారం దివ్యను వివాహం చేసుకున్నారు. తమకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. జాతరలో పరిచయమై.. 2019లో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ ట్రాన్స్జెండర్ను ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాడు. మేడారం జాతరలో చిగురించిన వీరి ప్రేమ చివరకు పెళ్లికి దారి తీసింది. గతంలో కుటుంబాల్లో కట్టుబాట్లకారణంగా ఎక్కువగా బయటకురాని ఈ తరహా జంటలు.. ఇప్పుడు స్వేచ్ఛా సమాజం కారణంగా తమ విషయాలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. చట్టబద్ధత కోసం పోరాటం దేశంలో తొలిసారిగా కేరళలో ఓ ఎల్జీబీటీ పెళ్లి జరిగింది. ఆ దంపతులు తమ పెళ్లిని రిజిస్టర్ చేసి చట్టబద్ధత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ట్రాన్స్జెండర్ల పెళ్లిళ్లపై చర్చ మొదలైంది. ఎల్జీబీటీ హక్కుల చట్టంలో పెళ్లితో సహా, మరికొన్ని అంశాలు చేర్చాలనే పిటిషన్లు సుప్రీంలో విచారణలో ఉన్నాయి. తమకు అన్ని హక్కులు కల్పించాలని ట్రాన్స్జెండర్ల డిమాండ్. -
తల్లి కాటికి.. తండ్రి కటకటాల్లోకి.. ఒంటరిగా మిగిలిన చిన్నారులు
సాక్షి, మంచిర్యాల: ఏం జరిగిందో తెలియదు గానీ ఆ తల్లి ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. కన్నపిల్లలపై మమకారాన్ని చంపుకుని కాటికి చేరింది. తండ్రిపై కేసు నమోదు కావడంతో కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. తల్లిని కోల్పోయి.. తండ్రికి దూరమైన ఇద్దరు చిన్నారులు ఒంటరిగా మిగిలారు. తల్లి మృతదేహం వద్ద దిగాలుగా నిలబడిన పిల్లలను చూసి అక్కడున్నవారు చలించిపోయారు. మంచిర్యాల మున్సి పల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహం వద్ద బంధువులు రోదిస్తుండగా.. ఆమె పిల్లలు రిత్విక్(8), భవిష్య(6) బిక్కుబిక్కుమంటూ అమాయకపు చూపులు చూస్తుండడం అక్కడున్న వారిని కలిచివేసింది. జ్యోతి ఆత్మహత్యకు భర్త బాలకృష్ణ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం రాత్రి 12గంటల ప్రాంతంలో జ్యోతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలకృష్ణపై వరకట్న వేధింపులు 498(ఏ), ఆత్మహత్యకు ప్రేరేపణ 306 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని మంచిర్యాల కోర్టులో హాజరుపర్చగా 14రోజుల రిమాండ్ విధించారు. పోస్టుమార్టం అడ్డగింత మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా ఆమె తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టా రు. దీంతో పోలీసులు జ్యోతి భర్త బాలకృష్ణ, అతడి తండ్రి నల్లమల్ల మురళి, తల్లి కన్నమ్మ, తమ్ముడు హరికృష్ణ, అక్కాచెల్లెలు కృష్ణకుమారి, జ్యోతిపై కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టానికి మృతురాలి అంగీకరించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బాలకృష్ణ స్వగ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవపురం తరలించారు. అక్కడ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. పిల్లలతో జ్యోతి(ఫైల్) మెసేజ్ చేసి డిలీట్ జ్యోతి ఆత్మహత్యకు ముందు వాట్సాప్లో ఓ మెసేజ్ చేసి డిలీట్ చేసిందని బాలకృష్ణ రోదించడం, ఉదయం 9.30గంటలకు తన తల్లికి ఫోన్ చేసిన జ్యోతి చనిపోయే ముందు ఏదైనా చెప్పాలనే ప్రయత్నం చేసి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన సమయంలో బాలకృష్ణతోపాటు ఇంటి పక్కన ఉండే అతడు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో ఆధారాలు కనిపించకుండా చేసి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు ముందు రోజు రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు, జ్యోతిని బాలకృష్ణ కొట్టిన తీరును కూతురు భవిష్య మంచిర్యాల సీఐ నారాయణ్నాయక్కు వివరించింది. దర్యాప్తు కోసం పోలీసులు జ్యోతికి సంబంధించిన రెండు ఫోన్లు, బాలకృష్ణ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అమ్మమ్మ చెంతకు చిన్నారులు.. బాలకృష్ణను రిమాండ్కు తరలించడంతో ఇద్దరు చిన్నారులు రిత్విక్, భవిష్యలను అమ్మమ్మ గంగవరం రవీంద్రకుమారి, తాత రాంబాబు చెంతకు చేరారు. తల్లి మృతదేహంతో మంచిర్యాల నుంచి వెళ్లిపోయారు. కాగా, ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని స్థానిక బీజేపీ నాయకుడు తులా మధుసూదన్రావు డిమాండ్ చేశారు. ఆమె మృతిలో అనుమానాలెన్నో ! ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవ చివరికి ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి(32) మరణం వెనక రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘అమ్మా నన్ను చంపేసేలా ఉన్నాడు’ అని మృతురాలు తన తల్లితో చనిపోయే రోజే బాధగా ఫోన్లో చెప్పడం, ‘నాన్న అమ్మను తరచూ కొడుతూ, తిడుతున్నారని’ చిన్నారి భవిష్య చెప్పడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వీటితోపాటు గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలపై పంచాయతీలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మృతురాలి తల్లితండ్రులు పలుమార్లు కమిషనర్కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇతర మహిళలతో సంబంధాలు నెరపడంపైనా ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిర్మల్ పని చేసినప్పుడు కంటే మంచిర్యాలకు వచ్చాక, ఆర్థికంగా బలపడినట్లుగా చెబుతున్నారు. మొదట కానిస్టేబుల్ ఉద్యోగంతో మొదలై, గ్రూప్ వచ్చి కమిషనర్ స్థాయికి చేరడంతో తన హోదాకు తగిన భార్య కాదని, అతనితోపాటు కుటుంబీకులు కూడా మృతురాలిపై ఆరోపణలు చేయడం పట్ల ఆత్మహత్యనా? లేక హత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఓ ఉన్నతాధికారి భార్య మరణం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారు. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, కాల్డేటా, వాట్సాప్ చాట్, చనిపోవడానికి ముందు రోజు జరిగిన వాటిపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు ప్రేరేపణ, వరకట్న వేధింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని స్థానికులు కోరుతున్నారు. -
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య
ఆదిలాబాద్: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి(32) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. బాలకృష్ణ స్థానిక ఆదిత్య ఎన్క్లేవ్లో భార్య, కుమారుడు రిత్విక్, కూతురు భవిష్యలతో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం విధుల్లోకి వెళ్లిన కమిషనర్ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. అనుమానంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్లో జ్యోతి ఫ్యానుకు చున్నితో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. జ్యోతి మృతదేహాన్ని కిందకు దింపి పోలీసులకు సమాచారం అందించాడు. మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్సైలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ భార్య కావడంతో చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్య కాదు.. హత్యే..! జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంద్రకుమారి, రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆందోళనకు దిగారు. ఉదయం తమ కూతురు వీడియో కాల్ చేసి మాట్లాడిందని, చంపేసేలా ఉన్నాడని రోదించిందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేశవపురానికి చెందిన బాలకృష్ణ కానిస్టేబుల్ ఉద్యోగం చేసేవాడని, 2014, ఆగస్టు 15న పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని, మూడెకరాల పొలం, రూ.2 లక్షల విలువైన బంగారం అందజేసినట్లు తెలిపారు. కమిషనర్గా ఎంపికైన తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయని, తాను కమిషనర్నని, ఎక్కువ కట్నం వచ్చేదంటూ వేధించేవాడని ఆరోపించారు. పలుమార్లు కుటుంబ పెద్దల సమక్షంలో మందలించినట్లు తెలిపారు. జ్యోతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నారాయణ్నాయక్ తెలిపారు. అమ్మా.. ఏమైంది..! మంచిర్యాలటౌన్: ఉన్నత ఉద్యోగి భార్య.. కుమారుడు, కూతురుతో హాయిగా జీవితం సాగిపోతోంది. ఉదయాన్నే ఇద్దరు పిల్లలను రోజూ మాదిరిగా సిద్ధం చేసి, టిఫిన్ బాక్సు పెట్టి నవ్వుతూ టాటా చెప్పి బడికి పంపించింది. ఏం జరిగిందో గానీ మధ్యాహ్నం వరకు ఆ తల్లి విగతజీవిగా మారింది. ఈ దృశ్యాన్ని చూసిన చిన్నారులు రిత్విక్, భవిష్య ‘‘అమ్మా.. ఏమైంది..’’ అంటూ విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. ‘‘అమ్మా లే అమ్మా... ఏమైంది అమ్మా.. ఎందుకు లేస్తలేవు..’’ అంటూ తల్లి మృతదేహం వద్ద విలపించారు. -
ముందస్తు నోటీసులివ్వకపోవడం తప్పే
మంచిర్యాల అగ్రికల్చర్: ముందస్తు వినియోగ ధరావతు (ఏసీడీ) చార్జీల వసూలులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఈఆర్సీ అనుమతితోనే విద్యుత్ సంస్థ వినియోగదారుల నుంచి వసూలు చేస్తోందని ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు స్పష్టం చేశారు. మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం జిల్లా విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వినియోగదారులకు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం విద్యుత్ సంస్థ తప్పేనన్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులు రవాణా, మరమ్మతు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆలస్యమైనప్పుడు సొంతంగా తీసుకొస్తే చార్జీల కింద సంస్థ రూ.700 చెల్లిస్తుందని వెల్లడించారు. -
Mancherial: మందు బాబులకు రిమ్మ దిగిపోయే శిక్ష
సాక్షి, మంచిర్యాల: శిక్షల విధించడంలోనూ ఈమధ్య కొందరు న్యాయమూర్తులు వైవిధ్యతను కనబరుస్తున్నారు. నేరానికి తగ్గట్లు శిక్ష విధించి.. వాటికి పాల్పడుతున్నవాళ్లలో మార్పునకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంచిర్యాలలో మందుబాబులకు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది. తాగి ఊగితే పర్వాలేదు. కానీ, రోడ్ల మీదకు చేరి పబ్లిక్ న్యూసెన్స్కు పాల్పడుతుంటారు కొందరు. అలా తాగి రచ్చ చేసిన 13 మందికి.. వాళ్ల రిమ్మ దిగిపోయేలా జిల్లా పస్ట్ క్లాస్ కోర్టు భలే శిక్ష విధించింది. రెండు రోజుల హాస్పిటల్ క్లీన్ చేయాలని, అలాగే మాతాశిశు ఆసుపత్రిలో రెండు రోజుల పాటు సేవలందించాలని ఆదేశించింది. దీంతో వాళ్లు కంగుతినగా.. ఆదేశాలను పాటించని పక్షంలో.. జైలు శిక్ష, జరిమానా తప్పదని వారించినట్లు తెలుస్తోంది. -
మంచిర్యాల: మమ్మీ.. నా రోగం ఎంతకీ తగ్గదేమోనే!
మంచిర్యాల రూరల్(హాజీపూర్): మాయదారి జబ్బు.. నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక అమ్మాయి జీవితాన్ని బలిగొంది. అదేం జబ్బో అర్థంకానీ తల్లిదండ్రులు.. ఎంతకీ తగ్గదేమో అనే దిగులుతో.. ఆ కుటుంబం వేదనకు గురైంది. మానసికంగా కుంగిపోయిన ఆ టీనేజర్ చివరకు ప్రాణం తీసుకుంది. హాజీపూర్ మండలంలోని దొనబండలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రచన, సత్తయ్య దంపతుల కుమార్తె కోట హారిక (19). మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హారిక డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు పలు ఆస్పత్రులు తిరిగినా.. చికిత్స కోసం ఎంత ఖర్చు చేసినా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హారిక బాబాయ్ కోట స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. సమస్యలొస్తే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
టోల్గేట్ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే హల్చల్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి–363పై మంచిర్యాల జిల్లా మందమర్రి శివారులోని టోల్ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం రాత్రి హల్చల్ చేశారు. చిన్నయ్య మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్తుండగా టోల్ప్లాజా సిబ్బంది వాహ నం ఆపడంతో కారుదిగిన ఆయన ఆగ్రహంతో వా రి పై దాడికి యత్నించారు. కాగా, పక్కనున్న వారు ఆయనను సముదాయించినట్లు తెలుస్తోంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్యను ‘సాక్షి’సంప్రదించగా.. ప్రమా దంలో గాయపడిన తమ బంధువుల అబ్బాయిని అంబులెన్స్లో తరలిస్తుండగా అక్కడి సిబ్బంది టో ల్ వసూలు చేయడంపై మేనేజర్ను కలిసే ప్రయత్నం చేశానని చెప్పారు. ఎవరిపైనా తాను దాడి చేయలేదని తెలిపారు. కాగా, సోషల్మీడియా, టీవీ చానళ్లలో సీసీ ఫుటేజీ వీడియో ప్రసారం కావడంతో ‘రోడ్డు పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేయడంపై స్థానిక ఎమ్మెల్యేగా అక్కడి అధికారులను అడిగా’అని వివరణ ఇచ్చారు. ఎన్హెచ్ఏఐ పీడీ రవీందర్రావును ‘సాక్షి’సంప్రదించగా, ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు. -
మంచిర్యాల: టోల్ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్య కీలక వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్ప్లాజా సిబ్బందిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దాడి వార్తలను ఖండించారు. జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేస్తున్నారని, అంబులెన్స్ను సైతం వదలటం లేదన్నారు. ఈవిషయంపైనే మేనేజర్తో మాట్లాడేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ‘నేను దాడి చేసినట్లుగా టీవీలలో వార్తలు వస్తున్నాయి. జాతీయ రహదారి పనులు పూర్తి కాలేదు. సోమగూడేం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయలేదు. కాని టోల్ ప్లాజాలో నూటయాభై టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ ప్లాజా నుండి అంబులెన్స్ కూడ వదలడం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలపై మేనేజర్తో మాట్లాడానికి వెళ్లాను. మేనేజర్ నుంచి ఎటువంటి స్పందింన లేదు. అంతే కానీ నేను దాడి చేయలేదు. కనీసం టోల్ ప్లాజా ప్రారంభానికి కూడా నన్ను పిలువలేదు’ అని దాడి వార్తలను ఖండించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇదీ చదవండి: వీడియో: మందమర్రి టోల్ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య హల్చల్.. సిబ్బందిపై దాడి -
అమెరికాలో మంచిర్యాల యువకుడు మృతి
అమెరికాలో గత ఏడాది డిసెంబర్ 31న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల రెడ్డికాలనీకి చెందిన పెండ్యాల సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతుల కుమారుడు వంశీకృష్ణ(36) మృతి చెందాడు. పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన అతను ఆరిజోనా స్టేట్లోని ఫోనిక్స్సిటీలో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. 31న రాత్రి స్నేహితులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని రూమ్కి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలోనే ఉంటున్న మృతుడి సోదరి పద్మ దంపతులు ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వంశీకృష్ణ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా.. మంచు అధికంగా ఉండడం వల్ల విమానాలు తగిన సంఖ్యలో నడవడం లేదని తెలిసింది. మృతదేహం మంచిర్యాల చేరేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ప్రియుడితో కలిసి భార్య వేధింపులు.. తట్టుకోలేక ఆర్మీ జవాన్!
సాక్షి, మంచిర్యాల: మనస్తాపంతో ఆర్మీజవాన్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం భగత్నగర్కు చెందిన మార్త అశోక్–పుష్ప దంపతుల కుమారుడు శ్రావణ్కుమార్ (32)కు హాజీపూర్ మండలం ర్యాలిగడ్పూర్కు చెందిన బొద్దు రజితతో 2021జూన్ 24న వివాహమైంది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్కుమార్ ఉద్యోగరీత్యా ఇటీవల అమృత్సర్ వెళ్లాడు. ఈక్రమంలో ర్యాలిగడ్పూర్కు చెందిన బొప్ప రాకేష్తో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఇంటికి వచ్చిన భర్తకు విషయం తెలియడంతో పలుమార్లు పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయతీలో రజితను మందలించారు. అయినా ఆమెలో మార్పురాకపోగా రజిత తల్లి భాగ్య, ప్రియుడు రాకేశ్ కలిసి శ్రావణ్ను మానసికంగా వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. అతని మృతికి భార్య రజిత, భాగ్య, రాకేష్ కారణమని మృతుని తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: Hyderabad: నిప్పంటించుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య -
ఆధారాలు లేకుండా చేయడానికే ఇంటికి నిప్పు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆధారాలు దొరకకుండా హత్య చేసేందుకే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్(గుడిపల్లి) ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురిని బలిగొన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు సజీవ దహనం కేసు వివరాలను మంగళవారం డీసీపీ అఖిల్ మహాజన్.. ఏసీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్తో కలసి వెల్లడించారు. ఈ ఘటనలో ఐదు గురిపై హత్య, కుట్ర, ఒకరిపై అదనంగా అట్రాసిటీ కేసు పెట్టామన్నారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద పరిహారం అందేలా చూస్తా మని తెలిపారు. మూడురోజులు 16 బృందాలు ద ర్యాప్తు చేసి క్షుణ్ణంగా పరిశీలించాయన్నారు. ఏ1గా మేడి లక్ష్మణ్, ఏ2 శనిగరపు సృజన, ఏ3 శ్రీరాముల రమేశ్, ఏ4గా వేల్పుల సమ్మయ్య, ఏ5గా ఆర్నకొండ అంజయ్య ఉన్నారని తెలిపారు. ఏళ్లుగా దంపతుల మధ్య గొడవలు.. మందమర్రి మండలం వెంకటాపూర్ పరిధి గుడిపల్లికి చెందిన మాసు శివయ్య(48) రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ(42) దంపతులు. శ్రీరాంపూర్కు చెందిన సింగరేణి మైనింగ్ సర్దార్ శనిగరపు శాంతయ్య(57) భార్య సృజనతో గొడవల కారణంగా శివయ్య–రాజ్యలక్ష్మితో ఉంటున్నాడు. ఇరువురు పంచాయతీలు, కేసులు పెట్టుకున్నారు. మెయింటెనెన్సు, జీతభత్యం వేరెవరికీ ఇవ్వకుండా కేసులు ఉన్నాయి. అయినా జీతం డబ్బులు, ఆస్తులు రాజ్యలక్ష్మికే ఇస్తున్నాడని భావించిన శాంతయ్య భార్య సృజన.. భర్తను హత్య చేయాలనుకుంది. తండ్రితో కలసి తనకు సన్నిహితుడైన లక్షెట్టిపేటవాసి మేడి లక్ష్మణ్(42)సాయం కోరింది. దీనికోసం 3 గుంటల భూమి రాసిస్తానని చెప్పింది. అలాగే, రెండు దఫాల్లో రూ.4 లక్షలు ఇచ్చింది. రంగంలోకి దిగిన లక్ష్మణ్.. శాంతయ్యను చంపేందుకు రూ.4లక్షలు ఇస్తానంటూ లక్షెట్టిపేటవాసి శ్రీరాముల రమేశ్ (36) సాయం కోరాడు. రోడ్డు ప్రమాదం చేసేందుకు రూ.1.40 లక్షలతో పాత బొలెరోను కొన్నా రు. నెల క్రితం మంచిర్యాల నుంచి శాంతయ్య, రాజ్యలక్ష్మి వెళ్తున్న ఆటోను బొలెరోతో ఢీకొట్టి చంపుదామనుకుని విఫలమయ్యారు. ఇలా రెండుసార్లు విఫలం కావడంతో ఈనెల 16న ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్, రమేశ్ మంచిర్యాలకు బస్సులో వెళ్లారు. శివయ్య, రాజ్యలక్ష్మి, శాంతయ్య ముగ్గురే ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు రమేశ్, సమ్మయ్య ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టారు. నిద్రిస్తున్న వారిలో రాజ్యలక్ష్మి అక్క కూతురు మౌనిక(24), కూతుళ్లు ప్రశాంతి(3), హిమబిందు (13నెలలు) ఉన్నట్లు వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో ఒకరి కోసం ప్లాన్ వేస్తే ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. నిందితులను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో వివరాలు బయటపడ్డాయి. నిందితుల్ని బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
‘సజీవ దహనం’ హత్యగానే భావిస్తున్నాం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మందమర్రి రూరల్: ‘ఆరుగురు సజీవ దహనం’ కేసును విచారణ చేస్తున్నాం. మా ప్రాథమిక విచారణ లో దీనిని హత్యగానే భావిస్తున్నాం. ఆ కోణంలోనే విచారణ సాగుతోంది. అందులో ఎంతమంది ఉన్నారో త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తాం’ అని రామగుండం పోలీసు కమిషనర్ ఎస్.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన రామగుండం సీపీ మీడియాతో మాట్లాడారు. నిందితులు వాడిన పెట్రోల్ క్యాన్లు, పరిసర స్థలాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్రావు ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ నెల 16న అర్ధరాత్రి వెంకటాపూర్ (గుడిపెల్లి) ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో ఆరుగురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. సీన్ రీ కన్స్ట్రక్షన్...: సోమవారం సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత ప్రధాన నిందితులు ముగ్గురితో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. రెండు గంటలపాటు నిందితుల సమక్షంలోనే నేరం జరిగిన తీరు తెలుసుకున్నారు. ఇల్లు కాలిపోయిన చోటికి రెండు వాహనాల్లో వెళ్లారు. ఎవరు సాయం చేశారు? పెట్రోల్ క్యాన్లను ఎలా తీసుకెళ్లారనే విషయాలను నిందితులు వివరించగా, వాటిని ఘటన స్థలంలోనే మరోమారు ధ్రువీకరించుకుని రికార్డు చేశారు. దీంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. -
అంతరించిపోతున్న రాబంధులు.. మనుగడ కోసం పోరాటం!
సాక్షి, మంచిర్యాల: జీవ వైవిధ్యం దెబ్బతింటుండటంతో పర్యావరణ పరిరక్షణలో తోడ్పడే రాబంధులు ప్రస్తుతం రాష్ట్రంలో మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. పూర్వం గ్రామాల్లో ఏదైనా పశువు చనిపోతే గుంపులుగా కనిపించేవి. జీవుల కళేబరాన్ని తిని ప్రకృతి నేస్తాలుగా పర్యావరణ రక్షణకు తోడ్పడేవి. అయితే మానవాళి ప్రకృతి విధ్వంసక చర్యలతో అవి పదుల సంఖ్యకు పడిపోయాయి. గ్రామాల్లో పశువుల సహజ మరణాలు తగ్గిపోయాయి. అవి చనిపోయే వరకు ఆగకుండా ముందే వధశాలలకు తరలిస్తున్నారు. దీంతో రాబంధులకు తిండి దొరక్క చివరకు అటవీ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు కనిపించడం తగ్గిపోయిన రాబంధులు చాలా కాలం తర్వాత 2013లో తొలిసారిగా కుమురంభీం జిల్లా పెంచికల్పేట మండలం నందిగామ శివారులో కనిపించాయి. పెద్దవాగు, ప్రాణహిత నది కలిసే పాలరాపు గుట్టపై గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇందులో 20 పెద్దవి, మరో పది వరకు చిన్నవి ఉన్నట్లు గుర్తించారు. కాగా, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సిరొంచ డివిజన్ కమలాపూర్ రేంజ్ చల్వడాతోపాటు మరో నాలుగు చోట్ల కూడా 60 నుంచి 70 వరకు రాబంధులు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఇందులో పొడుగు ముక్కు (గిప్స్ ఇండికస్), ఓరియంటల్ వైట్ బ్లాక్, స్లెండర్ బిల్డ్ జాతులు ఉన్నట్లు చెపుతున్నారు. కాగా, పొడుగు ముక్కు రాబంధులు ప్రాణహిత తీరంలో సంచరిస్తున్నాయి. రోజుకు వంద కిలోమీటర్లు సులువుగా తిరిగే ఈ పక్షులు నదికి ఇరువైపుల స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. ఇదిలా ఉండగా చాలా కాలానికి నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు పరిసరాల్లోని కృష్ణానది తీరంలో కూడా కొన్ని రాబంధులు కనిపించినట్లు అటవీ అధికారులు చెపుతున్నారు. దెబ్బతీసిన డైక్లోఫినాక్.. గతంలో పశువుల్లో వ్యాధుల నివారణ కోసం డైక్లోఫినాక్ మందును ఎక్కువగా ఉపయోగించేవారు. దీంతో పశువుల కబేళరాలను తిన్న రాబంధులకు తీవ్ర ముప్పు ఏర్పడింది. వాటి మూత్రపిండాలు, పునరుత్పత్తిపై ఈ మందు ప్రభావం చూపడంతో రాబంధుల జాతి అంతరించేందుకు ఇది ప్రధాన కారణమైంది. 2006లో ఈ మందును కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే అప్పటికే 9 రాబంధు జాతుల్లో దేశంలో నాలుగు జాతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) అనే అంతర్జాతీయ పర్యావరణ సంస్థ రాబంధులను అంతరించిపోతున్న జాతుల్లో చేర్చింది. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల సెల్ టవర్లు, విద్యుత్ తీగలకు తాకి ఇవి చనిపోయినట్లు గుర్తించారు. పర్యావరణంలో ప్రముఖ పాత్ర రాబంధులు పర్యావరణ పరిరక్షణలో ప్రకృతి నేస్తాలుగా ఉంటాయి. మృతిచెందిన జీవ వ్యర్థాలను ఇవి ఆహారంగా తీసుకుని.. ఆంత్రాక్స్, రేబిస్, ట్యూబర్క్యులోసిస్ వంటి ప్రమాదకర రోగాలు ప్రబలకుండా కాపాడతాయి. అలాగే కళేబరాలను మట్టిలో కలిసిపోయేలా తోడ్పడతాయి. రాబంధులు ఉండే ప్రాంతాన్ని జీవ వైవిధ్యతకు చిహ్నంగా పర్యావరణ వేత్తలు చెపుతుంటారు. అటవీ శాఖ సంరక్షణ చర్యలు ప్రాణహిత తీరంలో రాబంధుల సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి స్థిరంగా ఉండలేకపోతున్నాయి. ఆ ప్రాంతంలో వేటను నిషేధించారు. అలాగే మనుషుల సంచారాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట ఈ ప్రాంతంలో గుట్టపై ఆరోగ్యకరమైన పశువు మాంసాన్ని ఆహారంగా వేశారు. అయితే అవి తినేందుకు ఇష్టపడలేదు. వానాకాలంలో గుట్టపై గూళ్లు దెబ్బతినడంతో మళ్లీ మహారాష్ట్రకు వైపు వెళ్లాయి. ఇటీవల కొన్ని తిరిగివచ్చాయి. సహజ ఆహార వేట అలవాటుతో అవి అధికారులు వేసిన ఆహారాన్ని ఇష్టపడక పలు చోట్ల సంచరిస్తున్నాయి. రాబంధులు సంచరిస్తున్న ఈ ప్రాంతాన్ని నాలుగేళ్ల క్రితమే ‘జఠాయువు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’గా ప్రకటించాలని అటవీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో అంతరించి పోయే దశలో ఉన్న రాబంధుల సంతతి పెరగకపోతే పర్యావరణానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మంచిర్యాల: చిల్లరతో కాస్ట్లీ బైక్ సొంతం
మంచిర్యాల: జిల్లా కేంద్రం పరిధిలోని కోల్బెల్ట్ ఏరియాలో నివసించే ఒక యువకుడు చేసిన పని.. ఓ బైక్ షోరూం నిర్వాహకులకు షాకిచ్చింది. ఏకంగా వందకు పైగా సంచుల్లో నాణేలు ఇవ్వడంతో నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. తన కలల బైక్ను సొంతం చేసుకోవడానికే తాను ఈ డబ్బుతో వచ్చానని చెప్పడంతో వాళ్లు కంగుతిన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ తారకరామ కాలనీకి చెందిన వెంకటేశ్.. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేశాడు. స్పోర్ట్స్ బైక్పై తిరగాలన్నది అతని కోరిక అట. అందుకోసం దాచుకున్న చిల్లర డబ్బును తీసుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ఓ బైక్ షోరూంకి వెళ్లాడు. 112 సంచు(సీల్డ్ కవర్లు)ల్లో తెచ్చిన చిల్లరను చూసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. అయితే.. చిల్లరంతా లెక్కించిన తర్వాతే బైక్ అందిస్తామని వాళ్లు తెలిపారు. ఆపై.. పదిహేను మంది సిబ్బంది గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నాణేలు లెక్కించారు. రూ.2.85 లక్షల రూపాయి విలువగా తేలడంతో.. విలువైన స్పోర్ట్స్ బైక్ను వెంకటేశ్కు అందించారు. పోగు చేసిన చిల్లరతో తన డ్రీమ్ స్పోర్ట్స్ బైక్ దక్కించుకోవడంతో వెంకటేశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. -
పులి ‘గిరి’ గీసిన పల్లెలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పెద్దపులి అడుగులు కంటపడటంతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే గిరిజనులు జంకుతున్నారు. వారిని పులి సంచారం వణికిస్తోంది. ఈ నెల 17న కుమురంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్కు చెందిన రైతు తన చేనులో పత్తి తీస్తుండగా పులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. అది చిరుతపులి అయి ఉంటుందని మొదటగా భావించినా, పాదముద్రలు, దాడి చేసిన తీరును బట్టి పులిగా నిర్ధారణ అయింది. చేలల్లో పత్తి తీసే సీజన్లో పులుల సంచారం కారణంగా కూలీలు పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో పత్తి ఏరే పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కుమురంభీం జిల్లాలో వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆధిపత్యపోరు, ఆవాసం, తోడు వెతుక్కునే క్రమంలోనే పులుల సంచారం ఎక్కువైందని అధికారులు భావిస్తున్నారు. తాజాగా దాడి చేసిన పులి సైతం మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి వచ్చిందేనని అంటున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే పులి ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్నగర్, సిర్పూర్ టీ, కాగజ్నగర్ మండలాల్లోని 13 గ్రామాల పరిధిలో 37 కిలోమీటర్ల మేర ప్రయాణించినట్లుగా ఆనవాళ్లు లభించాయి. రోజుకు సగటున పది కిలోమీటర్లకుపైగా సంచరించింది. రెండేళ్ల క్రితం ఏ2 అనే వలస పులి ఇలాగే తిరుగుతూ ఇద్దరిని చంపేసిన విషయం తెలిసిందే. లోపమెక్కడ? అటవీ అధికారుల అప్రమత్తత కొరవడటంతో రెండేళ్లలో కుమురంభీం జిల్లాలో ముగ్గురు పులి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17న ఓ లేగ దూడపై, మధ్యాహ్నం ఓ మనిషిపై పులి దాడి చేసింది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తం కావాల్సిన అధికారులు జాప్యం చేశారు. నిత్యం అడవుల్లో సంచరిస్తూ, ట్రాకర్స్, కెమెరాలతో పులులను ట్రాప్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మహారాష్ట్రతో తెలంగాణ సరిహద్దు ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల వరకు యావత్మాల్, చంద్రాపూర్ జిల్లాల్లో తిప్పేశ్వర్, తడోబా, చంద్రాపూర్ అడవులు దాదాపు 150 కి.మీ.పైగా విస్తరించాయి. పెన్గంగా నుంచి ప్రాణహిత తీరం వరకు టైగర్ కారిడార్గా ఉంది. ఈ కొత్త పులులను ట్రాక్ చేసి, రిజర్వు ఫారెస్టులోకి పంపించడం అధికారుల ప్రధాన బాధ్యత. గోప్యత పేరుతో పులుల సంచారంపై వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియనివ్వడం లేదనే వాదనలు ఉన్నాయి. పులి దాడుల్లో మరణాలు 2020 నవంబర్ 11న దహెగాం మండలం దిగిడకు చెందిన విఘ్నేశ్(19)పై దాడి చేసి చంపేసింది. 2020 నవంబర్ 19న పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల(16)పై దాడి చేసి చంపింది. ఈ నెల 17న వాంకిడి మండలం చౌపన్గూడ పరిధి ఖానాపూర్కు చెందిన సిడాం భీము(69)పై దాడి చేసి చంపింది. పులి ఉందంటే నమ్మలేదు.. ఈ ప్రాంతంలో పులి సంచారం ఉందని మేం చెబితే అటవీ అధికారులు నమ్మలేదు. తీరా ఇప్పుడు ఓ ప్రాణం పోయింది. అయినా ఇక్కడ పులి లేదనే అంటున్నారు. పులి భవిష్యత్తులో మనుషులపై దాడులు చేయకుండా చేయాలి. బాధిత కుటుంబానికి పరిహారం, ఉద్యోగం కల్పించాలి. –సిడాం అన్నిగా సర్పంచ్, చౌపన్గూడ, వాంకిడి మండలం, కుమురంభీం జిల్లా అప్రమత్తం చేస్తున్నాం కొత్త పులుల రాకపై అంచనా వేస్తూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇటీవల వచ్చిన పులి దాడి జరిగే వరకు స్థానికుల నుంచి సమాచారం అందలేదు. ప్రస్తుతం ఆ పులి రిజర్వు ఫారెస్టులోకి వెళ్లిపోయింది. ఇక భయం అవసరం లేదు. 12 టీంలతో 50 మంది వరకు సిబ్బంది పులిని పర్యవేక్షిస్తున్నారు. స్థానికులకు జాగ్రత్తలపై మరింత అవగాహన కల్పిస్తాం. –దినేశ్కుమార్, జిల్లా అటవీ అధికారి, కుమురంభీం పులిని చూసి భయపడ్డాను దాడి చేసిన రోజు పులి పశువుల మందపైకి వచ్చింది. మాకు దగ్గరగానే ఉండటంతో భయపడ్డాను. నాకు ఇప్పటికీ భయం పోలేదు. అడవుల్లోకి వెళ్లాలంటే వణుకుపుడుతోంది. –ఆత్రం అన్నిగా, చౌపన్గూడ -
మంచిర్యాలలో నయా దందా
-
ప్రాజెక్ట్ డిజైన్ మార్చి నియోజకవర్గానికి అన్యాయం చేశారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే చెన్నూర్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలలో సాగునీరు అందించాలని అనుకున్నారని, తుమ్మిడిహెట్టి నుంచి సాగు నీరందేదని అయితే సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రాజెక్ట్ డిజైన్ మార్చి చెన్నూర్ నియోజకవర్గానికి అన్యాయం చేశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాదని..బానిస సుమన్ అని దొర పక్కన కూర్చునేసరికి దొరపోకడలు పోతున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు రౌడీ సుమన్ అయ్యారని ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం మంచిర్యాల జిల్లా నెన్నెల, భీమారం మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. రూ.100 కూడా లేవని చెప్పిన బాల్క సుమన్ రూ.100 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కేసీఆర్ జన్మలో ఒక్క మాట నిలబెట్టుకోలేదని, మోసం చేసి 420 అయ్యారని విమర్శించారు. గొల్లవాగు ప్రాజెక్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరందించాలని ప్రాజెక్ట్ కడితే వైఎస్కు పేరొస్తుందని నేటికీ కాలువలు పూర్తి చేయలేని దుస్థితి తెలంగాణ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దుర్గం నగేశ్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
మీ అందరి దీవెనలే షర్మిలను నడిపిస్తున్నాయి : వైఎస్ విజయమ్మ
-
TS: పరిహారం కోసం వెళ్లిన పోశన్నకు షాక్
క్రైమ్: ఉన్నట్లుండి ఇంటి బయట కొట్టంలో ఉన్న గొర్రెలు మాయమైపోతూ వచ్చాయి. చివరకు ఓ కొండచిలువ వాటిని మింగేసిందని తెలుసుకున్నాడు ఆ గొర్రెల కాపరి. నష్టపరిహారం కోరుతూ అతను ఫారెస్ట్ అధికారులను సంప్రదించాడు. అయితే ఉల్టా అతని మీదే కేసు పెడతామని ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో షాక్ తిన్నాడు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కావాల్ గ్రామానికి చెందిన పోశన్న.. ఇంటి ఆవరణలోనే సాదుకుంటున్న నాలుగు గొర్రెలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వారం రోజుల్లో ఆ నాలుగు ఒక్కొక్కటిగా అదృశ్యమైపోతూ వచ్చాయి. ఈ క్రమంలో దొంగల పనిగా భావించిన ఆ కుటుంబం ఒక కన్నేసింది. అయితే.. అక్టోబర్ 30వ తేదీన పోశన్న భార్య ఇల్లు ఊడుస్తున్న టైంలో ఇంటి ఫెన్సింగ్లో ఓ భారీ కొండచిలువ చిక్కుకుని కనిపించింది. దీంతో గొర్రెలను మింగింది కొండచిలువనేనని నిర్ధారించుకుని.. కోపంతో ఊరి జనం సాయంతో దానిని గొడ్డళ్లతో నరికి చంపేశాడు పోశన్న. గొర్రెలు బతికే ఉంటాయన్న ఆశతో దాని కడుపు చీల్చి చూశాడు. అయితే.. అందులో గొర్రెల మృతదేహాలు కనిపించాయి. దీంతో పోశన్న అటవీ అధికారులను నష్టపరిహారం కోసం సంప్రదించాడు. అయితే.. నష్టపరిహారానికి బదులు.. కొండచిలువను చంపిన నేరానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని అధికారులు చెప్పడంతో పోశన్న కంగుతిన్నాడు. -
మద్యం మత్తులో ఎస్సై వీరంగం.. స్నేహితులతో కలిసి పోలీసులపై దాడి
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాలక్రైం: ఓ పోలీస్ ఆఫీసర్ బాధ్యతలు విస్మరించి మద్యంమత్తులో వీరంగం సృష్టించారు. బ్లూకోల్ట్స్ సిబ్బందిపై దాడిచేసి గాయపరిచారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. హాజీపూర్ మండలం వేంపల్లికి చెందిన ఆవుల తిరుపతి సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆయన మంగళవారం రాత్రి మంచిర్యాలలో రోడ్డుపై కారు ఆపి తన ఏడుగురు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ హల్చల్ చేశారు. దీంతో స్థానికులు డయల్ 100కు ఫోన్చేసి సమాచారం అందించగా బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఉస్మాన్, హోంగార్డు సంపత్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని చూసిన తిరుపతి మరింత రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించారు. ‘‘నేను బెజ్జంకి ఎస్ఐని. మీరు ఆఫ్ట్రాల్ కానిస్టేబుళ్లు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’అని బెదిరించారు. కానిస్టేబుళ్లు ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించగా వారివద్ద ఉన్న ట్యాబ్ను, సెల్ఫోన్ ఎస్ఐ లాక్కుని నేలకేసి కొట్టారు. ఉస్మాన్పై దాడి చేశారు. అడ్డుకోబోయిన హోంగార్డును కొట్టారు. దీంతో మరింత మంది పోలీసులు రావడంతో తిరుపతి పారి పోయారు. బుధవారం తిరుపతితోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. -
ఇంటి దొంగలు కాజేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతీ నెలా లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిస్తున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖలో కొందరు ఇంటి దొంగలు ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రూ.కోట్ల సొమ్ము కాజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ కోసం సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) కింద మిల్లర్లు ఇచ్చిన బియ్యాన్ని ఎఫ్సీఐ, పౌరసరఫరా శాఖ ప్రధాన గోదాముల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి మండల స్థాయి గోదాం (ఎంఎల్ఎస్) పాయింట్లు, అటు నుంచి రేషన్షాపులకు బియ్యం సరఫరా అవుతుంది. ఈ రెండు దశల్లో బియ్యం రవాణాకు కాంట్రాక్టర్లు ఉంటారు. చాలా చోట్ల ప్రభుత్వానికి సొంత గోదాములు లేక అద్దెకు తీసుకుంటోంది. కొన్ని చోట్ల ప్రైవేటు, సహకార శాఖ, గిడ్డంగుల సంస్థ, వ్యవసాయ మార్కెట్, జీసీసీ గోదాములను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 170 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, రేషన్ షాపులకు 2.95 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. మొదట ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోలు చొప్పున బియ్యం ఇవ్వగా, కరోనా తర్వాత లబ్ధిదారులకు పది కిలోల చొప్పున ఇవ్వడంతో ఆ కోటా పెరిగింది. ఈ నేపథ్యంలో స్టాక్ పెరగడం, ఉచిత బియ్యం కావడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలు పెరిగాయి. ఆన్లైన్, తనిఖీలు ఉన్నా.. ప్రతీ ఎంఎల్ఎస్ పాయింట్లలో నెల నెలా బియ్యం నిల్వలపై ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. జిల్లాల్లో స్థానిక అదనపు కలెక్టర్ (రెవెన్యూ), పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆర్డీవో, ఎమ్మార్వో లు ఈ పాయింట్లను తనిఖీలు చేయాలి. కానీ ఇది చాలా చోట్ల జరగడం లేదు. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు మాత్రం తేడాలు బయటపడుతున్నాయి. చాలా చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు నేరుగా కొంతమంది రేషన్ డీలర్లు, రైస్మిల్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి నుంచి బియ్యం పక్క దారి పట్టిస్తున్నారు. మిల్లులకు రీ సైక్లింగ్కు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు ఉన్నతాధికారుల అండదండలతోనే హమాలీ, రవాణా చార్జిలు, గన్నీ సంచుల్లోనూ అవకతకవలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్లలోనే బఫర్ స్టాక్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లు నుంచి బియ్యం రాకున్నా వచ్చినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఆసిఫాబాద్లో రూ.3 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో ఉన్నతాధికారుల నుంచి సైతం పరోక్షంగా సహాయ, సహకారాలు అందుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. మరోవైపు నెలా వారీ కోటా బియ్యంలో క్వింటా, అరక్వింటా తక్కువగా వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం సాహసం చేయడం లేదు. ఇలా అక్రమంగా దారిమళ్లించిన బియ్యాన్ని తమకు నమ్మకం ఉన్న డీలర్లకు కోటాకన్నా ఎక్కువగా పంపిస్తూ.. వారి ద్వారా బయట అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గుర్తించిన అక్రమాలు.. ►ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 8,339 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. గత కొంతకాలంగా గోదాంకు బియ్యం రాకున్నా వచ్చినట్లు నమోదు చేస్తూ భారీగా అవకతకలకు పాల్పడ్డారు. వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. అక్కడి ఇన్చార్జి, డీఎస్వో సైతం సస్పెండ్ అయ్యారు. ఇంకా విచారణ జరుగుతోంది. ►మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఎంఎల్ఎస్ పాయింట్లో 218.25 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వచ్చింది. గోదాం ఇన్చార్జిపై విచారణ జరుగుతోంది. ►మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్లో 650 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. దీంతో ఇన్చార్జిని సస్పెండ్ చేసి, బియ్యాన్ని రికవరీ చేశారు. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజనుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్లో ఆదివారం నిర్వహించిన కుమురంభీమ్ 82వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కుమురం సూరు, భీమ్ స్మారక విగ్రహాలకు, సమాధి వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన గిరిజన దర్బార్లో మాట్లాడారు. అటవీ భూములు సాగు చేస్తున్నవారిలో అర్హులను గుర్తించి పట్టాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టు కొట్టివేసిన జీవో 3ను న్యాయపరంగా పరిష్కరిస్తామని తెలిపారు. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. జిల్లాలోని కుమురంభీమ్, వట్టివాగు, చలిమెల తదితర ప్రాజెక్టుల నీటిని పంటచేలకు మళ్లిస్తామని హామీనిచ్చారు. వంద గిరిజన దేవాలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. జోడేఘాట్ వరకు రోడ్డు సౌకర్యం, స్థానికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ఆదివాసీలు వలస వచ్చిన వారితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని, జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు రాహుల్రాజ్, సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు, కుమురంభీమ్ మనవడు సోనేరావు, పాల్గొన్నారు. రద్దైన కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ప్రకారం జోడేఘాట్కు మంత్రి కేటీఆర్ వస్తారని భారీ ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దవడంతో అక్కడున్నవారంతా నిరుత్సాహపడ్డారు. రూ.15 కోట్లతో ఆసిఫాబాద్ పట్టణ అభివృద్ధి శిలాఫలకం, కలెక్టర్ రాహుల్రాజ్ కుమురం భీమ్పై రాసిన పాట ఆల్బం సీడీని మంత్రి ఆవిష్కరించారు. -
పెళ్లి వరకు వెళ్లని ప్రేమ..కారణాలు ఎన్నో!
సాక్షి, ఆదిలాబాద్: ప్రేమ నేటి యువతకు పరిచయం అక్కర్లేని పదం. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణో.. ప్రేమో అర్థం చేసుకోలేక ఆలోచించే పరపక్వత లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పుకోలేక , ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం లేక ప్రియుడు లేదా ప్రియురాలు నిరాకరించడంతో అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించి వారిలో స్నేహభావం పెంపొందిస్తేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సినిమాల ప్రభావంతో.. సినిమాల ప్రభావం నేటి యువతరం మీద ఎక్కువ ఉంది. ప్రేమ అనే అంశం లేకుండా సినిమాలు ఉండటం లేదు. వీటిని చూసిన యువత ప్రేమ పేరుతో ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు సెల్ఫోన్లు ప్రేమికులను మరింత చేరువ చేస్తున్నాయి. చాటింగ్, వాట్సాప్ కాల్, వీడియో కాల్తో ప్రేమికులు నిత్యం కలుసుకునే వీలుగా ఉంటుంది. సోషల్ మీడియా ప్రభావం యువతపై పడుతుంది. తల్లిదండ్రులు స్నేహితులుగా మెలిగితే...: ప్రతి మనిషికి స్నేహితుడి తోడు ఎంతో అవసరం. మంచి, చెడులను వివరించి చెప్పగలిగే స్నేహితుడు దొరికితే వారు చాలా అదృష్టవంతులు. అమ్మా, నాన్నలు తమ పిల్లలను స్నేహితులుగా భావించాలి. వారికి కలిగే చిన్నచిన్న సమస్యలను మొదలుకుని ప్రేమ వ్యవహారాల్లో సైతం స్నేహితుడి పాత్ర పోషించాలి. పెద్దలకు తెలియకుండానే ఏమనుకుంటారనో, ఏమైన చేస్తారనేమో భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని ఘటనలు: ► బెల్లంపల్లి పట్టణం షంషీర్నగర్కు చెందిన సోయం తేజశ్రీ నెన్నెల లంబాడితండాకు చెందిన ధరావత్ రాజ్కుమార్ కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఏం చేయాలో తోచక తేజశ్రీ దసరా పండుగ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ►కుశ్నపల్లికి చెందిన జాడి రవి అనే యువకుడు వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన సత్యశ్రీ అనే ప్రియురాలి మరణవార్త విని నీవు లేనిదే జీవితం వ్యర్థమని భావించి మనస్థాపం చెంది ఈ ఏడాది ఫిబ్రవరి 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ►నెన్నెల మండల కేంద్రానికి చెందిన ఈగం మౌనిక ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్థాపం చెంది 2021, అక్టోబర్ 19న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ►బెల్లంపల్లి పట్టణానికి చెందిన సాజీద్ యశ్వంతిక ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో 2021 అక్టోబర్ 23న జైపూర్ శివారు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ►భీమిని మండలం మల్లీడి గ్రామానికి చెందిన దొబ్బల కల్పన అనే డిగ్రీ విద్యార్థిని అదే గ్రామానికి చెందిన కోట మల్లేశ్ ప్రేమించుకున్నారు. పెళ్లి విషయం వచ్చేసరికి ప్రియుడు నిరాకరించడంతో మనస్తాపం చెంది 2021 డిసెంబర్ 26న పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పేరెంట్స్, టీచర్లు గమనిస్తూ ఉండాలి పిల్లల ప్రవర్తనను ఇంట్లో తల్లిదండ్రులు, బ డిలో టీచర్లు గమనిస్తూ ఉండాలి. పిల్ల లు తప్పు చేస్తే కొట్ట డం, తిట్టడం చేయకుండా ఓపికతో మాట్లాడి నచ్చజెప్పాలి. యువత చెడుమార్గం వైపు వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ చెడు చేస్తే సా మరస్యంగా సమస్యను పరిష్కరించాలి. ప్రే మించుకున్న యువత మొదట తల్లిదండ్రుల మనస్సు గెలుచుకోవాలి. ప్రేమించడంతోపా టు యోగ్యతను సంపాదించాలి. కులం కన్నా ఆర్థిక స్థిరత్వం ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వీలు ఉంటుంది. అనుకున్నది జరగకపోతే తట్టుకునే శక్తి యువతకు ఉండకపోవడంతోనే క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. – డాక్టర్ సునిల్కుమార్, మానసిక వైద్య నిపుణులు, మంచిర్యాల చట్టాలను ఉపయోగించుకోవాలి చట్టాన్ని ఉపయోగించుకొని హక్కులను సాధించుకోవాలి. పిరి కితనంతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ప్రస్తుత కాలంలో పిల్లలు ఆటలకు దూరం కావడం కూడా ఒక కారణం. ఆటలు ఆడటం ద్వారా గెలుపు, ఓటములను తట్టుకునే శక్తి ఉంటుంది. తల్లిదండ్రులు చిన్న నాటి నుంచి గారాబంగా పెంచడం ద్వారా ఏది అడిగిన ఇస్తారులే అనే ఆలోచన ధోరణిలో నేటి యువత ఉంది. ముఖ్యంగా యువత సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్కు దూరంగా ఉండాలి. సమస్యలు ఎదురైతే ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. బతకడానికి ఎన్నో మార్గాలు, చావడానికి ఒకటే మార్గం. ధైర్యంగా ఉండి ముందుకు నడవాలి. – రాజశేఖర్, ఎస్సై(నెన్నెల) -
బాలికపై సామూహిక లైంగిక దాడి! మూడేళ్ల పిల్లాడి కళ్ల ముందే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/భీమిని: వరసకు అన్నయ్య అయ్యే ఓ బాలుడు, అతని స్నేహితుడు కలసి మూడేళ్ల పిల్లాడి కళ్ల ముందే 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపారు. దీన్ని వీడియో కూడా తీశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు ప్రకారం.. నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లో వరసకు కొడుకైన ఓ బాలుడు ఆటో నడుపుతూ నాలుగు నెలలుగా ఉంటున్నాడు. మూడు నెలల క్రితం సదరు వ్యక్తి కూతురుని, మూడేళ్ల బాబును మంచినీళ్లు తీసుకొద్దామని ఆ బాలుడు ఆటోలో బోరింగ్ పంపు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడికి మరో బాలుడు వచ్చాడు. అక్కడి నుంచి నలుగురు ఆటోలో గ్రామ శివారులోని శ్మశాన వాటిక వైపు వెళ్లారు. అక్కడ మూడేళ్ల బాబు సమక్షంలోనే ఇద్దరు బాలురు ఆటో వెనక సీటులో ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేస్తూ సెల్ఫోన్లో వీడియోలు తీశారు. వాటిని స్నేహితులకు పంపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించడంతో విషయం బయటపడలేదు. రెండు రోజుల క్రితం బాలిక.. తన అమ్మమ్మకు ఈ దారుణం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకులా భావించి ఇంట్లో ఉంచుకుంటే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. నిందితులు పరారీలో ఉన్నారు. చదవండి:మరో నిర్భయ.. రన్నింగ్ రైలులో మహిళపై అత్యాచారయత్నం.. ఆ తర్వాత.. -
పెళ్లి కొడుకుకి షాక్ ఇచ్చిన ప్రియురాలు
-
పెళ్లి మండపంలోకి ప్రియురాలి ప్రవేశం.. తాళి కట్టే సమాయానికి
సాక్షి, మంచిర్యాల: ఆర్భాటంగా పెళ్లి జరుగుతోంది. మరో రెండు నిమిషాల్లో వరుడు తాళి కట్టే సమయం.. ఇంతలో వరుడి ప్రియురాలి ప్రవేశం.. అంతే పీటలపైనే పెళ్లి ఆగిపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి భీమా గార్డెన్స్లో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు తెలిపిన వివరాలివి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నివాసం ఉంటున్న రమీణా గతంలో రామకృష్ణాపూర్లో ఉండేది. సింగరేణి కార్మికుడి కూతురైన ఆమె ఇక్కడ ఉంటున్న సమయంలో.. బొద్దుల రాజేష్తో ప్రేమలో పడింది. ఆమెకు 2012లో మరో వ్యక్తితో వివాహం కాగా ఇద్దరూ మనస్పర్థలతో కొద్దిరోజులకే విడిపోయారు. హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న రాజేష్ హన్మకొండలో ఫార్మసీ చేస్తున్న రమీణాతో మళ్లీ సాన్నిహిత్యం కొనసాగించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. రాజేశ్ వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకున్న రమీణా బుధవారం ఏకంగా పెళ్లి మండపానికి వచ్చి పెళ్లిని అడ్డుకుంది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు రంగప్రవేశం చేశారు. మరోవైపు పెళ్లికూతురు బంధువులు రాజేశ్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసినట్టు మందమర్రి సీఐ ప్రమోద్రావు తెలిపారు. చదవండి: నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం.. ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని -
పాములు పడితే రూ.22 వేలు!
సాక్షి, మంచిర్యాల: వరదలతో పాముల బెడద ఏర్పడటంతో వాటిని పట్టేవారికి గిరాకీ ఏర్పడింది. మంచిర్యాల పట్టణం గోదావరి తీరంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలోకి కుప్పలు తెప్పలుగా సర్పాలు కొట్టుకొచ్చాయి. వారం రోజులుగా బురదను శుభ్రం చేస్తున్నప్పుడు ఇవి బయటపడుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని బురదను తొలగిస్తుండగా ఓ మహిళను పాము కాటు వేసింది. దీంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు పాములు పట్టేవారిని రప్పించారు. మూడు రోజుల పాటు పాములు పట్టేందుకు పెద్దపల్లి జిల్లా కల్వచర్లకు చెందిన శ్రీనివాస్, బెల్లంపల్లికి చెందిన సంజీవ్లకు రూ.22 వేలు చెల్లిస్తున్నారు. వీరిద్దరూ బుధవారం సాయంత్రం నాలుగు పాములు పట్టారు. మరో రెండు రోజులు వీరి పని కొనసాగనుంది. ముంపు బాధితులకు కూడా సర్పాల బెడద ఏర్పడటంతో వారు పాములు పట్టేవారిని పిలిపించుకుంటున్నారు. -
వైరల్ వీడియో: దవాఖానాలో పాముల హల్చల్
-
మంచిర్యాల: దవాఖానాలో పాముల హల్చల్.. వీడియో వైరల్
సాక్షి, మంచిర్యాల: భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న ముంపు ప్రాంత ప్రజలను చీడపీడలు దడపుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చుట్టూరా చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్లు ఇళ్లల్లోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పారిశుద్య కార్మికురాలు సునీత పాముకాటుకు గురయ్యారు. ఆసుపత్రికి వరద తాకిడికి గురికావడంతో ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. పనుల్లో సునీత కూడా పాల్గొన్నారు. అదే సమయంలో పాము కాటు వేయడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సునీత అరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిటీకీ, ఫ్లోర్పై పాములు కదులుతున్న వీడియోలు వైరల్గా మారాయి. ఆపరేషన్ థియేటర్, దాని చుట్టుపక్కల పదుల సంఖ్యలో పాములు కనిపించాయని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. వాటిని బయటకు తరిమేశామని వెల్లడించారు. -
తాళాలు పగులగొట్టి.. ఇళ్లు ఆక్రమించి
సాక్షి, మంచిర్యాల: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో విసిగిపోయిన లబ్ధిదారులు తాళాలు పగులగొట్టి ఇళ్లు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో డబుల్ బెడ్రూం ఇళ్లలో ఈ నెల 20న మొదట మూడు కుటుంబాలు ఒక్కొక్క ఇంటిని ఆక్రమించాయి. బుధవారం దాదాపు 40 కుటుంబాల వరకు ఇళ్లు ఆక్రమించగా.. కొందరు అక్కడే ఉండి వంటలు చేసుకున్నారు. రాత్రి కూడా అక్కడే ఉంటామని లబ్ధిదారులు స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నామని, వానాకాలంలో నిలువ నీడ లేని నిరుపేదలమైన తాము ఇక్కడే తలదాచుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సంఘటనపై స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. -
కూలీల జీవితాల్లో పిడుగుపాటు
కాగజ్నగర్/కౌటాల/ కోటపల్లి (మంచిర్యాల): వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలను పిడుగుపాటు రూపంలో మృత్యువు కబళించింది. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. కుమురంభీం జిల్లా కౌటాల మండలం వైగాం గ్రామానికి చెందిన సద్గు రే రేఖాబాయి(44) సోమవారం గ్రామ శివారు లోని ఓ రైతు చేనులో సోయాబీన్ విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. పనులు ముగించుకుని సాయం త్రం కూలీలు రేఖాబాయి, లలితాబాయి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలో వర్షం కురిసి పిడు గు పడింది. రేఖాబాయి అక్కడికక్కడే మృతిచెంద గా, సమీపంలోని లలితాబాయి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు భర్త సురేశ్, కూతురు ఉన్నారు. పెళ్లయిన రెండు నెలలకే.. కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం రాస్పల్లి గ్రామానికి చెందిన సుమన్ సోమవారం ఉదయం తన భార్య అనూష, చిన్నాన్న, చిన్నమ్మ, కూలీలతో కలిసి గ్రామ సమీపంలోని చేనులో పత్తి విత్తనాలు నాటడానికి వెళ్లాడు. సాయంత్రం పిడుగుపడటంతో సుమన్(28) అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య అనూష చేతికి స్వల్ప గాయమైంది. ప్రసాద్ అనే మరో వ్యక్తి స్పృహ కోల్పోయాడు. సుమన్, అనూష దంపతులకు పెళ్లయి రెండునెలలే కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో ఘటనలో ఇదే మండలంలోని అంకుసాపూర్ గ్రామానికి చెందిన నానాజీ(35) గ్రామ శివారులో విత్తనాలు వేసేందుకు వెళ్లి పిడుగుపడి మృతి చెందాడు. ఆయనకు భార్య నీలాబాయి, కుమారుడు సందీప్(10), కూతురు సం«ధ్యారాణి(8) ఉన్నారు. పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లి.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం అంకవ్వ(55) ఇదే గ్రామానికి చెందిన రైతు చేనులో సోమవారం పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం తర్వాత చేనులో విత్తనాలు విత్తేందుకు వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. దీంతో అంకవ్వ అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. -
ఆ జిల్లాలో నకిలీ కరెన్సీ.. వాళ్లే లక్ష్యంగా దందా!
సాక్షి,మంచిర్యాలక్రైం: జిల్లాలో నకిలీ నోట్ల దందా జోరుగా సాగుతోంది. చిరు వ్యాపారులు, రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ముఠా రూ.500, రూ.200 నకిలీ నోట్లను తయారుచేసి యథేచ్ఛగా చలామణి చేస్తున్నారు. ఇందులో అమాయక ప్రజలే తీవ్రంగా మోసపోతున్నారు. కొందరు బడా వ్యాపారులు సైతం దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో అడ్డదారుల్లో వెళ్లి కటకటాల పాలవుతున్నారు. నకిలీ కరెన్సీపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. పోలీసులు, బ్యాంకు అధికారులు నకిలీ నోట్లను గుర్తించే విధానంపై సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగిత్యాల పోలీసుల అదుపులో మంచిర్యాల జిల్లా వాసులు ఈ నెల 5న జగిత్యాల పోలీసులు దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిని మేక శేఖర్, జన్నారం మండలం పుట్టిగూడ గ్రామానికి చెందిన మర్శకోల రాధాకిషన్ ఇందులో ప్రధాన నిందితులు కావడం సంచలనం సృష్టించింది. ఇదే ముఠాలో సిద్దిపేట జిల్లా పుల్లూరి గ్రామానికి చెందిన ఎర్రోల్ల శ్రీనివాస్గౌడ్, హన్మకొండ జిల్లా మెట్టదామెర గ్రామానికి చెందిన విజ్జగిరి భిక్షపతి, గట్లాదామెర గ్రామానికి చెందిన విజ్జగిరి శ్రీకాంత్ హన్మకొండలో నివాసం ఉంటూ లక్సెట్టిపేట కేంద్రంగా దందా నడిపిస్తున్నారు. ఈ ముఠాకు ప్ర«ధాన పాత్రదారులుగా శేఖర్, రాధాకిషన్ వ్యవహరిస్తున్నారు. ఈ నెల 5న లక్సెట్టిపేట నుంచి భిక్షపతి రూ.15 లక్షల దొంగనోట్లు తీసుకుని జగిత్యాలకు రాగా వరంగల్ నుంచి శ్రీకాంత్ రూ.3 లక్షల అసలు నోట్లు తీసుకుని వచ్చాడు. ఇద్దరూ డబ్బులు మార్చుకుంటుండగా జగిత్యాల పోలీసులకు దొరికిపోయారు. రూ.15లక్షల నకిలి కరెన్సీకి బదులుగా రూ. 3లక్షల అసలు నోట్లు ఇచ్చేందుకు వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుని దందాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మంచిర్యాల, గోదావరిఖని, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో మార్పిడి చేసినట్లు సమాచారం. మేక శేఖర్ 2004 నుంచి ఈ దందాను కొనసాగిస్తూ పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడు. మచ్చుకు కొన్ని సంఘటనలు.. 2015 అక్టోబర్ 31న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వారి ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సీసీసీ కార్నర్లోని పరశురాం నగర్కు చెందిన బొ మ్మన రాజశేఖర్ మంచిర్యాలలోని సున్నంబట్టి వా డలో ఓ ఇంట్లో నకిలీ కరెన్సీ తయారు చేసేందుకు తన స్నేహితులైన మహదేవపూర్ మండలం అన్నారంకు చెందిన బేరం చంద్రయ్య, తాండూర్ మండలం అచ్చులాపూర్కు చెందిన పూదారిశ్రీనివాస్, కా గజ్నగర్ మండలం బట్టుపల్లికి చెందిన ముంజ స తీశ్ ముఠాగా ఏర్పడి దొంగనోట్లు చలామణి చే స్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి ప్రింట ర్, రూ.51,100 నకిలీ నోట్లు స్వాధీనంచేసుకున్నారు. దొంగనోటును పట్టించిన రంగు.. 2019 ఫిబ్రవరి 28న మంచిర్యాలకు చెందిన పత్తి వ్యాపారి మల్యాల జగన్మోహన్పై నకిలి నోట్ల చలామణి కేసు నమోదైంది. హాజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన సరిగిరి స్వామి గ్రామాల్లో తిరుగుతూ రైతుల వద్దనుంచి పత్తి కొనుగోలు చేసి జగన్కు అమ్మేవాడు. ఈక్రమంలో స్వామికి రూ.లక్షా 30 వేలు ఇచ్చాడు. లక్సెట్టిపేటలోని ఓ హోటల్లో టిఫిన్ చేసిన స్వామి తడిచిన చేతులతో జగన్ ఇచ్చిన డబ్బులనుంచి రూ.50 నోటు ఇస్తుండగా చేతికి రంగు అంటుకుంది. అనుమానం వచ్చిన హోటల్ యజమాని స్వామి వద్దనున్న మిగతానోట్లను పరిశీలించి నకిలీ నోట్లుగా గుర్తించాడు. దీంతో జగన్మోహన్పై కేసు నమోదైంది. కూరగాయల మార్కెట్లో.. 2021 జనవరి 9న మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బోయిని రాజేందర్ స్థానిక మార్కెట్లో రూ.500ల నకిలీ నో టు ఇచ్చి కూరగాయలు కొనుగోలు చేశాడు. అనుమానం వచ్చిన వ్యాపారి తోటి వ్యాపారులకు చూ పించగా నకిలీ నోటుగా గుర్తించారు. దీంతో రాజేందర్ను పోలీసులకు అప్పగించారు. అతనితో పాటు జైపూర్ మండలం మద్దులపల్లికి చెందిన అట్ల మ ల్లేశ్, జిరాక్స్ మిషన్, రూ.56 వేల విలువైన రూ.500, రూ.200ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను గుర్తించండి ఇలా... ► ఒరిజినల్ నోటు కలర్ థిక్కుగా, కడక్ ఉంటుంది. ► నకిలీ నోటు కలర్ డల్గా ఉంటుంది. కడక్ ఉండదు. ► నకిలీ నోటుపై సిల్వర్ కలర్ లైన్ ఉండదు. ► నోటుపై రిజర్వుబ్యాంకు ముద్రించిన సీరియల్ నంబర్ గుర్తించాలి. ► గాంధీ బొమ్మ పక్కనే 500 అని ఉంటుంది.దీన్ని గమనించాలి. ఇది నకిలీ నోటుకు ఉండదు. ► ప్రతినోటుపై ముద్రణ సంవత్సరం ఉంటుంది. ఇది లేకపోతే నకిలీ నోటుగా గుర్తించాలి. జాగ్రత్తగా ఉండాలి నకిలీ కరెన్సీ చలామణి చేసేవారు రూ.500 నోటుతో కేవలం రూ.50 విలువ చేసే వస్తువులు కొనుగోలు చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్లి పోతారు. ఇలాంటి సమయంలో వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారిపట్ల కన్నేసి ఉంచాలి. ప్రతీ వ్యాపారి క్యాష్ కౌంటర్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసుçకోవాలి. అనుమానం వస్తే 100కు డయల్ చేయాలి. – బి.తిరుపతిరెడ్డి, ఏసీపీ, మంచిర్యాల పేపర్ మందాన్ని బట్టి గుర్తించాలి ఒరిజినల్ నోటు మందంగా కడక్గా, తేజ్గా ఉంటుంది. నకిలీ నోటు పేపర్ పలుచగా, కలర్ డల్లుగా ఉంటుంది. గట్టిగా తడిమి చూస్తే కలర్ వేళ్లకు అంటుకుంటుంది. కొత్త నోట్ల కట్టల్లో మధ్యలో ఎక్కడో ఒకటి, రెండు పెడితే సాధారణ పౌరుడు గుర్తించడం కష్టమే. అనుమానం వస్తే సదరు నోట్ల కట్టలు ఎక్కడి కెళ్లి తెచ్చామనేది గుర్తుంచుకోవాలి. దీంతో కొంత ఫలితం ఉంటుంది. – హవేలి రాజు, లీడ్ బ్యాంకు మేనేజర్, మంచిర్యాల -
టమాటా కిలో రూ.100
మంచిర్యాల అగ్రికల్చర్: మంచిర్యాల మార్కెట్లో సోమవారం టమాటా కిలో రూ.100 చొప్పున విక్రయించారు. మార్చిలో కిలో రూ.20 నుంచి రూ.30 ఉండగా.. ప్రస్తుతం ధర భారీగా పెరిగింది. 20కిలోల బాక్సు గత నెల రూ.800 నుంచి రూ.వెయ్యి పలికింది. సోమవారం రూ.1600 పలికింది. ఎండలతో రెండు మూడు కిలోల వరకు పాడైపోతున్నాయి. దీంతో కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు కూరగాయల వ్యాపారి ఎల్లమ్మ తెలిపింది. -
రెండ్రోజుల్లో యువకుడు వివాహం.. పెళ్లి పత్రికలు పంచుతూ..
సాక్షి, మంచిర్యాల: మరో రెండ్రోజుల్లో ఆ యువకుడు పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. భాగస్వామితో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్న కలలు కల్లలయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కాసిపేట మండలం సోమగూడెం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో నెన్నెల మండలం చిన్నలంబాడితండాకు చెందిన దరావత్ రమేష్(23) మృతిచెందాడు. సోమవారం ఎస్సై నరేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెన్నెల మండలం చిన్నలంబాడితండాకు చెందిన దరావత్ రమేష్ పెళ్లి ఈ నెల 20న జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచడానికి మోటార్సైకిల్పై వెళ్లాడు. సోమగూడెంలో తమ బంధువులకు పత్రికలు పంచి తిరిగి మోటార్సైకిల్పై నెన్నెలకు బయల్దేరాడు. కాసిపేట మండలం పెద్దనపల్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో రమేష్ అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. చదవండి: రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల కరెంట్ బిల్లు.. అసలు విషయమిదే! -
సాక్షి ఎఫెక్ట్: మంచిర్యాల లోన్ యాప్ మృతిపై కేసు నమోదు
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు.. కళ్యాణి అనే వివాహిత మృతి చెందిన ఘటన తాలుకా సాక్షి కథనానికి పోలీసులు స్పందించారు. కళ్యాణి మృతిపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 306 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు. యాప్ వేధింపులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. లోన్ యాప్ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి పిర్యాదు చేయాలని.. వాళ్లపై చర్యలు తీసుకుంటామని డీసీపీ భరోసా ఇస్తున్నారు. చదవండి: మంచిర్యాలలో లోన్ యాప్ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య -
మంచిర్యాల జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు వివాహిత బలి
-
మంచిర్యాల: లోన్ యాప్ కీచక పర్వం.. వివాహిత ఆత్మహత్య
సాక్షి, మంచిర్యాల/ మంచిర్యాల క్రైం: మొబైల్ లోన్ యాప్ సంస్థ వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఆమె చనిపోయిన తరవాత కూడా పదేపదే కాల్స్ చేస్తూ, ఆమె మృతదేహం ఫొటోలు చూపించాలని యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేయడం గమనార్హం. ఈ దారుణం మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాల పట్టణంలోని గోపాల్వాడకు చెందిన వివాహిత బొల్లు కళ్యాణి(30) ‘హలో రూపీ లోన్’యాప్ ద్వారా రూ.5 వేల రుణం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపూర్కు చెందిన ఆమె భర్త బెంగళూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచే 20 రోజుల క్రితం ఆమె మంచిర్యాలకు వచ్చింది. అప్పటి నుంచి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువకావడంతో ఇటీవల రెండు దఫాలుగా రూ.20 వేలు చెల్లించింది. అయినా ఆ చెల్లింపు వివరాలు అప్డేట్ కాలేదంటూ పదేపదే ఆమెను వేధించసాగారు. వేర్వేరు నంబర్లతో రోజుకు వందల సార్లు ఆమెకు కాల్స్చేస్తూ అసభ్య పదజాలంతో దూషించేవారు. ఫోన్కాల్ వస్తోందంటే వణికిపోయి.. కాల్స్ మాట్లాడాలంటే భయంతో వణికిపోయిన కళ్యాణి కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో వాట్సాప్లో ఆమె ముఖాన్ని న్యూడ్ ఫొటోలతో మార్ఫింగ్ చేసి ఆమెకే పంపి, వీటిని అందరికీ షేర్ చేస్తామని బెదిరించేవారు. దీంతో భయాందోళన చెందిన కళ్యాణి ఈ నెల 16న హెయిర్ డై తాగి ఆత్మహత్యకు యత్నించింది. రెండ్రోజులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది 17న సాయంత్రం డిశ్చార్జి అయింది. మళ్లీ అదే తీరుగా యాప్ నిర్వాహకుల వేధించడం మొదలుపెట్టారు. తన ఆరోగ్యం బాగాలేదని, ఇబ్బంది పెట్టొదని బతిమిలాడినా వారు వినిపించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి బుధవారం ఇంట్లోని బాత్రూమ్లోని షవర్కు శాలువాతో ఉరేసుకుంది. మరోవైపు ఆమె చనిపోయిందనే విషయాన్ని నమ్మకుండా యాప్ నిర్వాహకులు పదేపదే కాల్స్ చేశారు. కనికరం లేకుండా ఆమె మృతదేహం ఫొటోలు పంపాలంటూ కుటుంబసభ్యులను ఒత్తిడి చేశారు. అయితే భర్త, అత్తింటివారు తమ కూతురిని డబ్బుల కోసం వేధించడంతోనే యాప్ లోన్ తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, హలో రూపీ లోన్ యాప్తో పాటు మరో ఐదారు యాప్ల నుంచి కూడా ఆమె రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. -
Crime News: మంచిర్యాలలో ‘గంజాయి’ డెత్!
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా సింగరేణి డివిజన్లో గంజాయి కలకలం రేగుతోంది. సింగరేణి ఉద్యోగులు.. ముఖ్యమంగా యువ ఉద్యోగులు గంజాయికి బానిసలవుతున్నారు. తాజాగా ఓ యువ ఉద్యోగి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరేణి ఉద్యోగి అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోదావరి నది నుంచి అతని మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు. గంజాయి మత్తువల్లే అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న దండేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. కోల్బెల్ట్ ఏరియాలో గత కొంతకాలంగా గంజాయి దందా యధేచ్చగా సాగుతోంది. పలు చోట్ల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. తాజా ఘటన నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులకు మాదక ద్రవ్యాల నివారణపై కౌన్సెలింగ్ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
గోదావరిలోకి దూకి సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య
-
వారిద్దరి చివరి మజిలీ ఒకేరోజు ఒకే సమయంలో ముగిసింది
సాక్షి,లక్సెట్టిపేట(మంచిర్యాల)/జగిత్యాలక్రైం: అన్నదమ్ముల అనుబంధాన్ని మృత్యువూ విడదీయలేకపోయింది. వారి ఇద్దరి చివరి మజిలీ ఒకేరోజు ఒకే సమయంలో ముగిసింది. అన్నదమ్ములు ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఎలాంటి విబేధాలు లేకుండా కలిసిమెలిసి ఉండడం.. చివరి క్షణంలోనూ కలిసే శవయాత్ర సాగడం స్థానికులను కంటతడి పెట్టించింది. తమ్ముడి గుండెపోటుతో మృతిచెందాడన్న విషయం తెలిసి అన్న కూడా గుండెపోటుతో చనిపోయాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విషాదం నింపింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లక్సెట్టిపేట మండల కేంద్రంలోని మహాలక్ష్మివాడకు చెందిన గాజుల సత్తయ్య, సత్తవ్వ దంపతులకు భాస్కర్, శ్రీనివాస్, మంజుల సంతానం. పెద్ద కుమారుడు శ్రీనివాస్ జగిత్యాల జిల్లా కేంద్రంలో చిన్న హోటల్ నిర్వహిస్తుండగా, చిన్న కుమారుడు భాస్కర్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో చిరు వ్యాపారం చేస్తున్నాడు. మంజులకు వివాహం జరిగింది. తల్లిదండ్రులు లక్సెట్టిపేటలోనే ఉంటూ శేషజీవితం గడుపుతున్నారు. అప్పుడప్పుడు అందరూ ఇక్కడికే వచ్చి వెళ్తుంటారు. భాస్కర్కు ధర్మపురిలో సోమవారం ఉదయం ఐదు గంటలకు గుండెపోటు వచ్చిందని శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఫోన్ రావడంతో అందరూ ధర్మపురికి చేరుకున్నారు. అప్పటికే భాస్కర్(47) చనిపోవడంతో మృతదేహాన్ని లక్సెట్టిపేటకు తీసుకొచ్చారు. అంతలోనే శ్రీనివాస్(50) స్పృహ కోల్పోయి కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోవడం ఆ దంపతులకు తీరిన దుఃఖాన్ని మిగిల్చింది. కాగా, శ్రీనివాస్కు భార్య, ఇంటర్మీడియట్ చదివే ఇద్దరు కుమారులు, భాస్కర్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతులిద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు జరిగాయి. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, కౌన్సిలర్లు పరామర్శించారు. చదవండి: ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని. -
‘ఆ మేడం మాకొద్దు సార్’
భీమిని: ఈ ఎస్వో మేడమ్ ఉంటే తాము ఉండబో మంటూ కన్నెపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బుధవారం భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. 15రోజుల క్రితం సస్పెండ్ అ యిన ఎస్వో(ప్రత్యేక అధికారి) అమూల్య జిల్లా వి ద్యాశాఖ అధికారి ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరడానికి వచ్చారు. విద్యార్థుల గదుల్లోకి వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో విద్యార్థులు భవనం పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులు, సిబ్బంది న చ్చజెప్పినా వినలేదు. కన్నెపల్లి తహసీల్దార్ రాంచందర్ అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి కిందికి రప్పించారు. మేడమ్ విధుల్లో చేరితే తాము చదువుకోలేమని, గతంలో మీ రిజల్ట్ ఎలా వస్తుందో చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో ఈ నెల 12న ఎస్వో సస్పెండైన విషయం తెలిసిందే. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే విధుల్లో చేరికకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. -
పెళ్లికి నో చెప్పిందని.. మరదలిపై కత్తితో దాడి
నస్పూర్ (మంచిర్యాల): తనతో పెళ్లికి నిరాకరించిందని వరుసకు మరదలైన యువతి(21)పై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి వెళ్తున్న ఆమెపై పట్టపగలు హత్యకు ప్రయత్నించాడు. సోమవారం మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. యువతి బంధువులు, స్థానిక ఎస్సై శ్రీనివాస్ ఈ ఘటన వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి చెందిన యువతి సోమవారం నస్పూర్ గ్రామంలోని తమ బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైంది. కార్యక్రమం ముగిశాక తిరిగి ఇంటికి బయలుదేరింది. ఆమె ఆటో ఎక్కుతున్న సమయంలో వరుసకు బావ అయిన గడ్డం సాయికిరణ్ అక్కడికి వచ్చాడు. కల్లు గీసే కత్తి పట్టుకుని ఒక్కసారిగా ఆమెపై దాడికి ప్రయత్నించాడు. దీనితో ఆమె మెడపై గాయాలయ్యాయి. అది గమనించిన యువతి బంధువులు.. ఆమెను రక్షించి, మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. సాయికిరణ్ను అదుపులోకి తీసుకుని, కత్తిని సీజ్ చేశామని ఎస్సై తెలిపారు. -
భూ సమస్య పరిష్కారానికి పాదయాత్ర
సాక్షి, మంచిర్యాల: తన భూ సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ను కలిసేందుకు మంచిర్యాలకు చెందిన జనగాం శ్రీనివాస్గౌడ్(58) పాదయాత్ర ప్రారంభించాడు. ఫ్లెక్సీపై వివరాలు రాసి మెడకు తగిలించుకుని కాలినడకన మంచిర్యాల నుంచి శుక్రవారం బయల్దేరాడు. మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులో శ్రీనివాస్గౌడ్కు 15ఎకరాల భూమి ఉంది. 1992 వరకు పట్టా భూమిగా, తర్వాత లావుణి పట్టాగా పహానిలో నమోదైంది. 2016 భూ ప్రక్షాళనలో 15 ఎకరాలకు బదులు 13.2 ఎకరాలుగా 2018లో పాస్బుక్లు ఇచ్చారు. తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పలుమార్లు తిరిగినా ఫలితం కనిపించలేదు. ఎండలో నడవడానికి వయసు సహకరించకున్నా రెవెన్యూ శాఖ తప్పిదాలను ఎత్తి చూపేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నాడు. ఈ విషయమై మందమర్రి ఎమ్మార్వో సంపతి శ్రీనివాస్ను ‘సాక్షి’ సంప్రదించగా, గతంలోనే ఆయనకు అసైన్మెంటు కింద పట్టా జారీ అయిందని, ఇప్పుడు మార్చడం వీలుకాదని తెలిపారు. -
సిరులు కురిపిస్తున్న సింగరేణి
సాక్షి, మంచిర్యాల: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) తవ్వేది బొగ్గు గనులే అయినా.. ఇది రాష్ట్రం పాలిట బంగారు గని. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా వందల కోట్ల రూపాయలు అందిస్తోంది. బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు పెరిగే కొద్దీ సంస్థ టర్నోవర్ పెరుగుతోంది. దీంతో సర్కారుకు రాయల్టీ, జీఎస్టీ, డివిడెంట్లు, కస్టమ్స్ డ్యూటీ, స్వచ్ఛభారత్, కృషి కల్యాణ్, క్లీన్ ఎనర్జీ సెస్లు తదితర రూపాల్లో సింగరేణి చెల్లింపులు చేస్తోంది. ఎనిమిదేళ్లలో రూ.40వేల కోట్ల ఆదాయం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గడిచిన ఎనిమిదేళ్లలో సింగరేణి సంస్థ గణనీయంగా అభివృద్ధి సాధించింది. ఈ ఎనిమిదేళ్లలో సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలకు అందించింది. ఇందులో రాష్ట్రానికి రూ.17 వేల కోట్లకుపైనే రాగా, కేంద్రానికి రూ.22 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. గతేడాది నుంచి ఒడిశాలోని నైనీ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడంతో అక్కడ కూడా పన్నులు చెల్లిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి సంస్థ, కోల్ ఇండియాతో పోటీ పడుతోంది. 2014కు ముందు ఏటా 504 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ప్రస్తుతం 680 లక్షల టన్నులకు చేరింది. నికర లాభం రూ.419 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు చేరింది. 2029–30 నాటికి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు ముందు మరింత ఆదాయం రానుంది. ఆరు జిల్లాల్లో నిధుల వరద.. కుమ్రంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అభివృద్ధిలో సింగరేణి భాగం పంచుకుంటోంది. కరోనా సమయంలో ప్రభుత్వ నిధులు నిలిచిపోయినప్పటికీ ఈ జిల్లాల్లో మాత్రం సింగరేణి నిధులతో అభివృద్ధి కొనసాగింది. గతేడాది డిసెంబర్ నాటికి వివిధ రూపాల్లో ఈ ఆరు జిల్లాలకు సింగరేణి రూ.3,248 కోట్లు సమకూర్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోంది. ఆపత్కాలంలో ఆదుకుంటూ.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి నిధులు అందించి అండగా నిలిచింది. ఒడిశాలోనూ ఉత్పత్తి చేస్తున్నందున ఫెని తుఫాన్ వచ్చినప్పుడు రూ.కోటి సాయం చేసింది. వీటికి తోడు కోల్బెల్ట్ పరిధిలోని ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. -
ఇల్లులాంటిదే ఆస్పత్రి
మంచిర్యాల టౌన్: మన ఇల్లు లాంటిదే ఆసుపత్రి అని, ఇక్కడికి వచ్చిన వారు ఆరోగ్యంతో వెళ్లాలి తప్ప.. అశ్రద్ధతో కొత్తగా వ్యాధులను తెచ్చుకోవద్దని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య హితవు పలికారు. శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఐసీయూ వార్డును ఆనుకుని ఉన్న బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నీరు సక్రమంగా రావడం లేదని ఓ రోగి సహాయకుడు ఫిర్యాదు చేయగా స్పందించిన చైర్మన్ వెంటనే వెళ్లి పరిశీలించారు. బాత్రూంల బయట నీరు నిలిచి ఉండటాన్ని గమనించారు. దీంతో పక్కనే ఉన్న స్వైపర్తో ఫ్లోర్పై నిలిచిన నీరు మొత్తాన్ని స్వయంగా తొలగించారు. కొన్ని పనులను స్వయంగా చేసుకోవాలని రోగి సహాయకులకు సూచించారు. ఒక్కొక్క రోగికి సహాయంగా ముగ్గురు, నలుగురు రావడం వల్ల నీరు, పరిశుభ్రత సమస్యలు ఏర్పడతాయని వివరించారు. -
Pranahita Pushkaralu: పుష్కరాలు షురూ.. తరలిన భక్త జనం
సాక్షి, మంచిర్యాల/భూపాలపల్లి /కాళేశ్వరం: ప్రాణహిత పుష్కర సంబురం మొదలైంది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, వేమనపల్లి ఘాట్ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుష్కరాలను ప్రారంభించారు. వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, వైదిక క్రతువులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ వెంట.. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాణహిత నది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రవహించి, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ మేరకు ప్రాణహిత నది వెంట పలుచోట్ల పుష్కరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇతర రాష్ట్రాలవారు మంగళవారం సాయంత్రానికే ప్రాణహిత తీరాలకు చేరుకుని.. తాత్కాలిక గుడారాల్లో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత పుష్కరాలు మొదలవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసి.. పిండ ప్రదానాలు, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. సమీపంలోని ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం నుంచి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాళేశ్వరంలో దేవాదాయశాఖ అధికారులు, వేదపండితులు కాలినడకన కలశాలు, మంగళ వాయిద్యాలతో ప్రాణహిత నదికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.54 గంటలకు పడవలో నదికి అవతలివైపు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నదికి పంచ కలశాలతో ఆవాహనం చేసి.. పుష్కరుడి(ప్రాణహిత)కి చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం పంచ కలశాలల్లో నీటిని తీసుకొచ్చి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివారికి అభిషేకం, పూజలను నిర్వహించారు. ఇక కాళేశ్వరానికి అనుకుని అవతలివైపు ఉన్న మహారాష్ట్ర పరిధిలోని సిరొంచలో ఆ రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యేలు పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని రెండు ఘాట్లలో తొలిరోజు 10 వేల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా. ఇక్కడికి తొలిరోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా తరలివచ్చారని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు నదీ హారతి ఇచ్చారు. అర్జునగుట్ట వద్ద కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కుటుంబసభ్యులతోపాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఇంద్రకరణ్రెడ్డి గోదావరి ఉప నదిగా మనకు ప్రాణహిత పుష్కలంగా నీరందిస్తోంది. స్వరాష్ట్రంలో తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది సంతోషకరం. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు హరిస్తాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు అన్నిరకాల మేలు జరగాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ‘ప్రాణహిత’ ప్రత్యేక టూర్ ప్యాకేజీ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత పుష్కరాల కోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) ప్రత్యేక యాత్ర ప్యాకేజీని బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం వరకు ఈ నెల 24దాకా అంటే 12 రోజుల పాటు ఈ ప్రత్యేక యాత్ర నడుస్తుంది. రోజూ ఉదయం 05:00 బషీర్బాగ్ సీఆర్వో నుంచి బస్సు బయలుదేరుతుంది, 8:30 గంటలకు అల్పాహారం ఉంటుంది. 11:00 గంటల సమయంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 వరకు సిరోంచ పుష్కరఘాట్ వీక్షించేందుకు సమయమిస్తారు. తర్వాత గంటపాటు దర్శన సమయం, 1.45 గంటలకు కాళేశ్వరం హరిత హోటల్లో భోజనం ఉంటాయి. 2.45 గంటలకు తిరుగు ప్రయాణమై రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారు. ఈ యాత్ర ఏసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,760, నాన్ఎసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600గా ఉంటాయని టీఎస్టీడీసీ ప్రకటించింది. -
మార్పు కోరిన తనయుడిని హతమార్చిన తండ్రి.. కొలువు ఇస్తాడనుకుంటే..
సాక్షి, శ్రీరాంపూర్(మంచిర్యాల): తాగుడు మాని, తల్లిని మంచిగా చూసుకో.. ఇప్పటికైనా మారవా...? అని కోరిన కొడుకును తండ్రి హతమార్చాడు. ఈ సంఘటన మంచిర్యాల శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ పోలీస్స్టేషన్ పరిధి కొత్తరోడ్ రాజీవ్నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. సింగరేణి కార్మికుడు కనుకుంట్ల కొమురయ్య తన ఏకైక కుమారుడు రాజ్కుమార్(35)ను దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆర్కే6గనిలో పని చేస్తున్న కొమురయ్యకు భార్య కమల, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రాజ్కుమార్ ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా.. కుమారుడు ఐటీఐ పూర్తి చేశాడు. తల్లిదండ్రులతోపాటు ఇంట్లోనే ఉంటున్నాడు. కొమురయ్య కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. తరచు భార్యతో గొడవ పడుతూ ఆమెకు వివాహేతర సంబంధం అంటగడుతూ వేధించేవాడు. ఈ విషయంలో కొడుకు తండ్రి నిర్వాహకాన్ని ప్రశ్నించే వాడు. దీంతో కొమురయ్య తన కొడుకుపై కూడా కోపం పెంచుకొని తరచూ తిట్టేవాడు. ఎదిగిన తన కొడుకు చెప్పినా మారకుండా వేధింపులకు గురి చేయడంతో ఇబ్బందులు తాళలేక కమల కొద్ది రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో తండ్రికొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం కొమురయ్య తాగివచ్చి తల్లికి మద్దతు ఇస్తున్నావంటూ కొడుకుతో గొడవపడ్డాడు. రాజ్కుమార్ మంచంపై పడుకుని సెల్ఫోన్ చూస్తుండగా కొమురయ్య కర్రతో తలపై చితకబాధాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై రాజ్కుమార్ అక్కడిక్కడే మృతిచెందాడు. కొద్ది సేపటికి కొమురయ్య పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్సై మానస కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొలువు చేద్దామన్న కోరిక తీరలే... రాజ్కుమార్ ఐటీఐ చేయగా.. సింగరేణిలో తండ్రి స్థానంలో వచ్చే కారుణ్య ఉద్యోగం చేస్తానని కలలుగన్నాడు. రెండేళ్ల సర్వీసు కూడా దగ్గరగా వచ్చింది. గతంలోనే కొమురయ్య మెడికల్ బోర్డుకు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. కొన్ని రోజుల్లో బోర్డు పిలుస్తుందని, అన్ఫిట్ అవుతాడని, ఇక తాను తండ్రి స్థానంలో సింగరేణి కొలువు చేస్తానని రాజ్కుమార్ ఎంతో ఆశపడ్డాడు. కొలువు ఇస్తాడనుకున్న తండ్రే కాటికి పంపడం తీవ్ర విషాదం నింపింది. -
దొంగతనం కేసు.. సెల్ఫీ వీడియో తీసి..
సాక్షి,రెబ్బెన(ఆసిఫాబాద్): ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో అసలు దొంగలను పట్టుకోకుండా అన్యాయంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఓ యువకుడు సెల్పీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మండలంలోని తక్కళ్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... తక్కళ్లపల్లి పరిధిలోని కొత్తగూడలో ఇటీవల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. దీంతో రెబ్బెన పోలీసులు దర్యాప్తులో భాగంగా గతంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కేసులో సంబంధం ఉన్న పుప్పాల అంజితో పాటు మరో ముగ్గురిని అనుమానితులుగా భావించి పోలీస్స్టేషన్కు రప్పించి విచారణ అనంతరం తిరిగి ఇంటికి పంపించారు. సోమవారం సైతం మరోసారి స్టేషన్కు రావాలని చెప్పడంతో తనను దొంగతనం కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తక్కళ్లపల్లి రైల్వేగేట్ సమీపంలో సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగాడు. ఆ వీడియోను వాట్సప్ గ్రూప్లో పోస్టు చేయటంతో గమనించిన స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అంజిని బెల్లంపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ఈ విషయమై రెబ్బెన ఎస్సై భవానీసేన్ను వివరణ కోరగా అంజికి గతంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం చేసిన నేర చరిత్ర ఉండడంతో అనుమానంతో పోలీస్స్టేషన్కు పిలింపించి విచారించి వదిలేశాం. అంతకు మించి మాకు సంబంధం లేదు. పురుగుల మందు తాగిన అంజితోనూ మాట్లాడాను అని ఎస్సై తెలిపాడు. చదవండి: భార్యను సంతోష పెట్టడం కోసం రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చి.. -
ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకుంది.. కానీ
సాక్షి, గుడిహత్నూర్(ములుగు): తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ ఆమెను ఉన్నత చదువు చదివించారు. డయాలసిస్ ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసింది. ఇటీవల ఆర్మీలో నర్సు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకుంది. పరీక్ష కోసం కష్టపడి చదివింది. రెండు నెలల క్రితం పరీక్ష రాసింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఇంకా ఫలితాలు వెలువడలేదు. ఫలితాలు వస్తే తనకు జాబ్ వస్తుందో రాదో అని మనస్తాపం చెందింది. (చదవండి: వారసుడొచ్చాడని ఆనందపడ్డారు.. కానీ వారం రోజుల తర్వాత.. ) ఒత్తిడి భరించలేక సోమవారం ఉరేసుకుంది. ఈ ఘటన గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీకి జరిగింది. ఏఎస్సై రెహమాన్ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్నగర్ కాలనీకి చెందిన ముస్కాన్(21) తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముస్కాన్కు చదువుపై ఆసక్తి ఉండడంతో ఇంటర్ పూర్తయిన వెంటనే డయాలసిస్ టెక్నీషియన్ కోర్సు చదివించారు. ఇటీవల ఆర్మీలో నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకుని పరీక్ష కూడా రాసింది. ఫలితాలు రావడం ఆలస్యం అవుతుండడంతో కొన్ని రోజులుగా దిగాలుగా ఉంటోంది. సోమవారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం వెళ్లడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుంది. బంధువులు వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే తండ్రి షేక్ హరూన్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. హరూన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
కూలీల సమస్యకి చెక్ పెట్టిన దంపతులు.. రూ.20 వేలు ఆదా!
సాక్షి,జగిత్యాల అగ్రికల్చర్: సాగులో కూలీల సమస్య రైతులకు ఇబ్బందిగా మారింది. సకాలంలో వ్యవసాయ పనులు చేయలేక, అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక పలువురు రైతులు మధ్యలోనే పంటను వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అలూర్కు చెందిన మెక్కొండ రాంరెడ్డి–లక్ష్మి దంపతులు (9666002222) మల్చింగ్ పేపర్తో కూలీల సమస్యకు చెక్పెట్టి మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. కూలీలతో ఇబ్బందులు రాంరెడ్డి–లక్ష్మి దంపతులకు ఐదెకరాల భూమి ఉంది. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తుంటారు. అయితే, ప్రతీ సీజన్లో కూలీలు సకాలంలో దొరక్కపోవడం, దొరికినా డబ్బులు ఎక్కువగా తీసుకుంటుండటంతో ఖర్చు పెరిగేది. దీనికి తోడు వారానికోసారి పంటలకు నీరు అందించినా నీరంతా ఆవిరి అయ్యేది. రసాయన ఎరువులు వేసినా పెద్దగా ఉపయోగంలోకి రాకపోయేది. దీంతో, పంటకు పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయానికి పొంతనలేకుండా పోయింది. ఎకరంలో మల్చింగ్ పేపర్తో.. మల్చింగ్ పేపర్ వల్ల కూలీల సమస్యకు చెక్ పెట్టవచ్చని తెలుసుకున్న దంపతులు, తొలుత ఎకరంలో రూ.8వేలతో మల్చింగ్ పేపర్ వేశారు. ఇందుకోసం భూమిలో రసాయన, సేంద్రియ ఎరువులు వేశారు. రోటోవేటర్తో దున్ని, మట్టిపెళ్లలు లేకుండా చేసి గట్లు ఏర్పాటు చేశారు. సాగు నీటి కోసం గట్లపై ముందుగా డ్రిప్ పైపులు అమర్చి అనంతరం మల్చింగ్ పేపర్ వేశారు. ఖర్భూజ, బీర సాగు మల్చింగ్ పేపర్ వేసిన తర్వాత గట్టుపై అవసరమున్న చోట రంధ్రాలు చేసి ఖర్భూజ, బీర విత్తనాలు వేశారు. మల్చింగ్ వేయకముందు ఎకరంలో మూడుసార్లు కలుపు తీసేందుకు కనీసం 30 మంది కూలీలకు రూ.15 వేలు ఖర్చయ్యేవి. ప్రస్తుతం కూలీల అవసరం లేకుండా పోయింది. రెండుమూడు పంటలకు వాడుకునేలా మల్చింగ్ను ఏర్పాటు చేశారు. కాగా, మల్చింగ్పై సిల్వర్ కోటింగ్ ఉండటంతో సూర్యరశ్మి తగిలి పంటలకు పెద్దగా పురుగులు, తెగుళ్లు ఆశించలేదు. అన్నిరకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో దిగుబడులు సైతం రెట్టింపు అయ్యాయని రైతులు దంపతులు పేర్కొన్నారు. ఒక్కో పంటకు కూలీలకు అయ్యే రూ.20 వేల ఖర్చును తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతం మల్చింగ్ కింద వేసిన పంటల ద్వారా దాదాపు లక్ష వరకు ఆదాయం రావచ్చని సదరు దంపతులు చెప్పారు. నూతన పద్ధతులతోనే ఆదాయం సంప్రదాయ, నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తేనే రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మల్చింగ్తో ఒక్క పంటకు రూ.20 వేల వరకు ఆదా అవుతాయి. ప్రస్తుతం పంటలపై ఒకరిని చూసి మరొకరు పెడుతున్న పెట్టుబడులు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతాయన్న విషయాలను గ్రహించాలి. – మెక్కొండ రాంరెడ్డి–లక్ష్మి -
వినూత్న ‘పెండ్లిపత్రిక’.. పారేయకండి.. మట్టిలో పాతిపెడితే..
సాక్షి, నిర్మల్: పెళ్లిపత్రిక.. ఆ పెళ్లి తేదీ, వివాహ వేదిక చూస్తే చాలు.. మళ్లీ దాన్ని ఎక్కడో పడేస్తాం. కొన్నిసార్లు సదరు పెళ్లి కాకముందే చెత్తబుట్టల్లోకి చేరిపోతుంటాయి. అలా.. కాకుండా మట్టిలో చేరి, మొక్కగా ఎదిగి, తమను ఆశీర్వదించిన వారింట పచ్చదనం నిండేలా పత్రిక ఉండాలనుకున్నారు. ఆ దిశగా.. ప్రయత్నం చేసి అనుకున్నది సాధించారు. వినూత్నంగా పర్యావరణ పెళ్లిపత్రికను రూపొందించి, బంధుమిత్రులనే కాదు.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అల్లం వనమాల, దేవీదాస్ దంపతుల కుమారుడు ప్రవీణ్ హైదరాబాద్లో మెడికల్షాప్ నిర్వహిస్తుంటాడు. ఈనెల 27న ఆయన పెళ్లి ఉంది. ఇందుకు వినూత్నంగా ఆహ్వానం పలకాలని, తామిచ్చే పత్రిక ఉత్తగా చెత్తలోకి వెళ్లకుండా ఉపయోగపడాలని భావించారు. బంతి, తులసి, గులాబీ, పాలకూర విత్తనాలతో ప్రత్యేకంగా పెళ్లిపత్రికను తయారు చేయించారు. చదవండి: కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: హరీష్ రావు ఏంచేయాలో.. తమ పెళ్లి తర్వాత తామిచ్చిన పత్రికను పారేయకుండా.. ఓ గంట నీటిలో నానబెట్టి, పూలకుండీలో పెట్టాలని ప్రవీణ్ చెబుతున్నారు. అలా మట్టిలో కలిసిన తర్వాత ఆ పత్రికలో ఉన్న విత్తనాల నుంచి మొలకలు వస్తాయని, వాటికి నిత్యం నీటిని పోస్తే మొక్కలుగా ఎదుగుతాయని వివరిస్తున్నారు. ఈ విధానాన్ని పత్రిక కింది భాగంలో ముద్రించారు. కోయంబత్తూరు నుంచి.. ఈ పర్యావరణ పత్రికను ఆన్లైన్లో చూశామని, తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేయించామని చెప్పారు. ఒక్కో పత్రికకు రూ.50వరకు ఖర్చు అయిందన్నారు. పర్యావరణ హితమైన ఈ పత్రిక కవర్పైన దేశనాయకులైన వివేకానంద, శివాజీ, భగత్సింగ్, కుమ్రంభీమ్ తదితరుల ఫొటోలను ముద్రించడం వల్ల తమ దేశభక్తినీ ప్రవీణ్ చాటుకున్నారు. చదవండి: రెండోసారి మండలి ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్రెడ్డి -
మంచిర్యాల: కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ హత్య
-
కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్య
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కొత్తపల్లి వీఆర్ఏ దుర్గం బాబును దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కక్షలతో వీఆర్ఏ హత్య జరిగిందా లేదా రెవెన్యూ అధికారుల మధ్య విబేధాలతో హత్య చోటుచేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా దుర్గం బాబు కొత్తపల్లి వీఆర్ఏగా పనిచేస్తున్నాడు, కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఫస్ట్ టైం క్రిమినల్స్: సినిమాలు, యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు అయితే కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా చంపేస్తామని బెదరిస్తున్నారని, అదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని దుర్గంబాబు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని ఆరోపణలు చేస్తున్నారు. చదవండి: Banjara Hills: సీఎం శిలాఫలకానికే దిక్కులేదు.. ఇప్పటికైనా సాధ్యమేనా..? -
పేరుకే స్పోర్ట్స్ క్లబ్.. లోపల పేకాట హబ్
సాక్షి, మంచిర్యాల: పత్తాలాట రాష్ట్రంలో పత్తాలేకుండా పోయినా సరిహద్దుల్లో దాని జాడలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేకాట, మట్కా వంటి జూదాలను ప్రభుత్వం నిషేధించడంతో సరిహద్దుల్లో పేకాట స్థావరాలు వెలిశాయి. మన రాష్ట్రంలో రహస్యంగా ఎక్కడైనా ఆడితే పోలీసు, టాస్క్ఫోర్స్కు చిక్కే ప్రమాదముందని భయపడిన జూదరులు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర సరిహద్దుల్లో ‘చేతివాటం’ప్రదర్శిస్తున్నారు. చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో స్పోర్ట్స్ క్లబ్ల పేరుతో పేకాట దందా సాగుతోంది. భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆనుకుని మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా అంకీసా, దుబ్బపల్లి, నందిగాంలో, నిర్మల్ జిల్లా సరిహద్దు నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్టణం, బాసర సమీప గ్రామం నవీపేటలో పేకాట జోరుగా నడుస్తోంది. రోజూ వందలాది మంది జూదరులు రూ.లక్షలు పెట్టి పేకాట ఆడుతున్నారు. జూదరుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ, సినీప్రముఖులు, అధికారులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. క్లబ్లో సకల సౌకర్యాలు పత్తాలాట నిర్వాహకులు ఏసీ గదుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆడిఆడి అలసిపోతే అక్కడే పడుకోవచ్చు. టాయిలెట్లు, బాత్రూముల వసతి కూడా ఉంది. తాగునీరు, టీ, స్నాక్స్, జ్యూస్లు, చికెన్, మటన్తో కోరిన భోజనం అందిస్తుంటారు. కొందరైతే రోజుల తరబడి అక్కడే బస చేస్తున్న సందర్భాలున్నాయి. జూదరుల జేబులు ఖాళీ అయితే నమ్మకస్తులకు ఒంటి మీది బంగారం, వాహనం కుదవ పెట్టుకుని అప్పులు కూడా ఇస్తుంటారు. ఆటలో నగదుతోపాటు గూగుల్ పే, ఫోన్ పే తోనూ చెల్లిస్తున్నారు. జూదరులకు రానుపోను వాహన ఖర్చులు, ప్రతి ఒక్కరికీ రూ.వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఇస్తున్నారు. సిరోంచకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా, ఇటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి జూదరులు వస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాకు చెందిన జూదరులు సరిహద్దు ఉన్న ధర్మాబాద్ వైపు వెళ్తున్నారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్గఢ్లోనూ ఓ క్లబ్ వెలిసినప్పటికీ మావోయిస్టుల ప్రభావంతో దానిని మూసివేశారు. మహారాష్ట్రలో మైండ్ గేమ్గా.. దేశంలో ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867’ప్రకారం నేరుగా డబ్బులతో ఆటలు ఆడటం నిషేధం. చాలా రాష్ట్రాలు పేకాటను పూర్తిగా నిషేధించాయి. మహారాష్ట్ర, గోవా లో షరతులతో కూడిన మైండ్గేమ్గా పిలిచే రమ్మీ ఆడుకోవచ్చు. కానీ, డబ్బులు పెట్టి ఆడటం నిషేధం. మహారాష్ట్రలో ఇండోర్ స్పోర్ట్స్ క్లబ్ల సభ్యులకు పేకాట అనుమతి ఉన్నా డబ్బులు పెట్టి ఆడరాదు. దీనిని ఆసరా చేసుకుని మహారాష్ట్రలో చట్టబద్ధమైన ఆట అని ప్రచారం చేస్తూ తెలంగాణ పేకాట రాయుళ్లకు వల వేస్తున్నారు. గడ్చిరోలి జిల్లా సిరోంచ, నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్ట ణం, శివారు నవీపేటలో గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాలకు చెం దిన వాళ్లే క్లబ్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల చంద్రాపూర్ జిల్లా రాజురా, పోడ్సా క్లబ్లను అక్కడి అధికారులు మూసివేశారు. రోజుకు రూ. లక్షల్లో ఆర్జన పేకాట నిర్వాహకులకు రోజుకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. క్లబ్లో కనీసం రూ.5 వేలు నుంచి రూ.20 వేలతో పేకాట ఆడే టేబుళ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్కు తొమ్మిది మంది చొప్పున ఉంటారు. ఇందులో ఒకరి డబ్బులు నిర్వాహకులు తీసుకుంటారు. ఐదువేల టేబుల్కు రూ.ఐదు వేలు, రూ.20 వేల టేబుల్కు రూ.20 వేలు తీసుకుంటారు. ఆటలో గెలిచినవారికి మిగతా డబ్బులు ఇస్తారు. ఒక్కో క్లబ్లో కనీసం ఆరు నుంచి పది టేబుళ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్కు ఓ డీలర్ ఉంటాడు. అతడు పేక ముక్కలు పంచడం, లెక్కలు వేయడం, డబ్బులు తీసుకోవడం చేస్తుంటాడు. రోజూ మధ్యాహ్నం మొదలై తెల్లవారు జామున 4 గంటల వరకు పత్తాలాట సాగుతోంది. గతంలో నిమిషాల్లో రూ.లక్షలు ఆవిరి చేసే కట్ పత్తా లాంటి ఆటలు ఆడగా, ప్రస్తుతం రమ్మీ మాత్రమే నడుస్తున్నాయి. ఈ దందాకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు దండిగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ప్రేమ వివాహం.. నాలుగేళ్ల క్రితం విడాకులు.. అప్పటి నుంచి..
సాక్షి,తాండూర్: మండల కేంద్రమైన తాండూర్లోని కొత్త గుడిసెల ఏరియాకు చెందిన మంచి కట్ల భారతి(33) శని వారం ఆత్మహత్య చేసుకుంది. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతికి పన్నెండేళ్ల క్రితం ఐబీకి చెందిన మేడి వినయ్ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్ల క్రి తంవిడాకులు తీసుకుంది. అప్పటి నుంచి మతిస్థిమితం లేక ఇంట్లోనే ఉంటోంది. శనివారం ఉదయం రేచి నీ రోడ్ రైల్వేస్టేషన్ శివారు ప్రాంతా నికి వచ్చి భాగమతి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జీఆర్పీ హెడ్కానిస్టేబు ల్ సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. గుర్తు తెలియని వ్యక్తి మృతి సిర్పూర్(టి): మండలంలోని వేంపల్లి గ్రామ సమీపంలోని రైల్వేగేటు సమీపంలో శనివారం ఉద యం గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతిచెందినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సురేష్గౌడ్ తెలి పారు. మంచిర్యాల వైపు నుంచి బల్లార్షా వైపునకు వెళ్లే గుర్తు తెలియని రైలు కిందపడి చనిపోయాడని, 55 నుంచి 60ఏళ్ల వయస్సు ఉంటుందని పేర్కొన్నారు. నల్లని చుక్కలు గల తెలుపు రంగు షర్టు, సిమెంటు కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతదేహం సమీపంలో ముస్లిం టోపి ఉందని తెలి పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి వివరాలు తెలిసిన వారు పట్టణంలోని జీఆర్పీ పోలీసుస్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. మృతదేహం సిర్పూర్(టి) ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో భద్రపర్చామని వివరించారు. -
కవ్వాల్ జంగిల్ లో సందడిగా సాగిన పక్షుల పండుగ
-
ఏటా బర్డ్ వాక్ ఫెస్టివల్: శోభ
సాక్షి, మంచిర్యాల: ప్రకృతి, వన్యప్రాణి ప్రేమికులను ప్రోత్సహించేలా ఏటా బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తామని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఆర్.శోభ అన్నారు. ఆదివారం తెల్లవారుజామునే ఔత్సాహికులతో కలసి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ పులుల అభయారణ్యంలోని బైసన్కుంట పరిసరాల్లో వివిధ రకాల పక్షులను స్వయంగా వీక్షించారు. అనంతరం రెండ్రోజులుగా సాగిన బర్డ్ వాక్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి చిన్నా, పెద్దా, మహిళలు అనే భేదం లేకుండా ప్రకృతిపై ప్రేమతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఔత్సాహికులను చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. రాష్ట్రంలో యువ ఫారెస్టు అధికారులు చక్కగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రస్తుతం కలప అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయిందని, పులుల సంతతి పెరుగుతోందని ఆనందం వ్యక్తంచేశారు. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్, నిర్మల్ సర్కిల్ సీఎఫ్ వినోద్కుమార్ మాట్లాడుతూ పులుల అభయారణ్యంలో కోర్ అవతలి కొంత భాగాన్ని ప్రకృతి ప్రేమికులు పర్యటించేలా ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ సీఎఫ్ రామలింగం, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి డీఎఫ్వోలు శివాని డోగ్రా, శాంతారామ్, వికాస్ మీనా, రాజశేఖర్, నిఖిత బోగ, ఉమ్మడి జిల్లాలోని ఎఫ్డీవోలు, ఎఫ్ఆర్వోలు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రియురాలి మరణవార్త విని.. నీవు లేని లోకంలో ఉండలేనంటూ..
‘మనసులు ఏకమయ్యాయి.. కలకాలం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం... నాకు నువ్వు, నీకు నేను తోడుగా కొత్త జీవితం ప్రారంభిద్దామనుకున్నాం.. నీ ఊపిరే నేనని.. నా ఊపిరే నీవని ఊహలపల్లకిలో తేలిపోయాం.. కానీ నీ అకాల మరణం నన్ను ఒంటరిని చేసింది.. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. నీవులేని జీవిత శూన్యం.. నీవెంటే నేను వస్తున్నా..’ అంటూ ప్రియురాలి ఎడబాటును జీర్ణించుకోలేని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని నెన్నెలలో చోటుచేసుకుంది నెన్నెల ఎస్సై సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి చెందిన జాడి రవి(18) ఈనెల 2న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన దుర్గం సత్యశ్రీ , రవి ఏడాదిగా ప్రేమించుకున్నారు. సత్యశ్రీ అనారోగ్యంతో ఈనెల 2న మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న రవి ప్రియురాలు లేని జీవితం వ్యర్థమని గ్రామ శివారుకు వెళ్లి పురుగుల మందు తాగాడు. బంధువులు వెంటనే అతడిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. రవి సోదరుడు జాడి మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. -
ఒకే గ్రామానికి చెందిన యవతితో ప్రేమ.. ఎన్నిసార్లు తిరిగినా ఒప్పుకోవడం లేదని..
సాక్షి,జన్నారం(మంచిర్యాల): ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్లో జరిగింది. ఎస్సై సతీశ్, మృతుడి తల్లి సత్తవ్వ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన గొలాట రమేశ్ – సత్తవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కార్తీక్ సంతానం. జన్నారం ప్రభుత్వ పాఠశాలలో కార్తీక్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఎన్నిసార్లు తిరిగినా యువతి అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన కార్తీక్ ఈనెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు. తర్వాత తన స్నేహితుడు నాగుల హరీశ్కు ఫోన్చేసి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే హరీశ్ తన స్నేహితులు రమేశ్, వెంకటేశ్తో కలిసి కార్తీక్ ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ప్రైవేట్ వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ సూచన మేరకు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కార్తీక్ తల్లి సత్తవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. చదవండి: ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్.. భర్తపై అనుమానంతో.. -
ప్రాణం తీసిన చైనా మాంజా.. మంచిర్యాలలో విషాదం
సాక్షి, మంచిర్యాల: సంక్రాంతిపూట గాలిపటాల పండుగ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న దంపతులకు గాలిపటం (చైనా మాంజ) దారం అడ్డు తగిలింది. ఆ దారం మెడకు చుట్టుకోవడంతో భీమయ్య అనే వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా గొల్లపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో యువతి.. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో శనివారం గాలిపటంలోని చైనా మాంజా 20 ఏళ్ల యువతి గొంతు కోయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఉజ్జయినిలోని మాధవ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జీరో పాయింట్ బ్రిడ్జి వద్ద ఓ మహిళ తన స్నేహితుడితో కలిసి బైక్పై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాలిపటం దారం గొంతును కోసేయడంతో తీవ్ర రక్తస్రామై యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు. -
ఉత్సాహంగా బర్డ్ వాక్ ఫెస్టివల్
సాక్షి, మంచిర్యాల: బర్డ్ వాక్ ఫెస్టివల్కు విశేష స్పందన వచ్చింది. శనివారం తెల్లవారు జామున 5 గం. నుంచే అడవుల్లో సందర్శకుల సందడి మొదలైంది. పక్షులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, వాటి కూతలు వినేందుకు వివిధ ప్రాంతాల నుంచి వంద మందికిపైగా పేర్లు నమోదు చేసుకోగా, అధికారులు కోవిడ్ కారణంగా 60 మందికే అనుమతి ఇచ్చారు. తొలి రోజు కొమురంభీం జిల్లా కాగజ్నగర్, సిర్పూర్ టీ, బెజ్జూరు, పెంచికల్పేట అడవుల్లో బర్డ్ వాక్ కొనసా గింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, సిద్దిపేటతోపాటు ఇతర ప్రాంతాల పక్షి ప్రేమికులు అడవుల్లో కలియదిరిగారు. కెమెరాల్లో పక్షుల ఫొటోలను బంధించారు. ఆసిఫాబాద్ డీఎఫ్వో ఎస్.శాంతారామ్ మాట్లాడుతూ.. కరోనాతో అనేక మంది చాలా కాలం ఇంటికే పరిమితమయ్యారని అలాంటి వారు ప్రకృతితో గడిపేందుకు ఈ సందర్శన మంచి అవకాశమని అన్నారు. ఆదివారం కూడా ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. -
తెల్లారితే లోకం చూడాల్సిన పసికందు.. అమ్మా ఎందుకిలా చేశావ్!
తొమ్మిది నెలలు నీ ఊపిరితో పెంచావు.. ఎందుకు లోకాన్ని చూడనివ్వలేదు... గర్భిణి కడుపులో పసికందుకు మాటలొస్తే ఇలానే ప్రశ్నిస్తుందేమో? సాక్షి, ఆదిలాబాద్: అమ్మ.. ఈ పిలుపులో ఎంతో మాధుర్యం ఉంది. ఈ పిలుపు కోసం.. మాతృత్వపు మాధూర్యాన్ని ఆస్వాదించడం కోసం పెళ్లయిన ప్రతీ మహిళ పరితపిస్తుంది. పెళ్లయి ఏళ్లు గడిచినా గర్భందాల్చక వేలాది మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ తన కడుపులో పసికందుకు ప్రాణం పోసిన ఆ తల్లి.. నవమాసాలు మోసింది. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందని, మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమో అన్న చిన్న అనుమానంతో.. తెల్లారితే లోకం చూడాల్సిన పసికందుతో సహా తనూ ప్రాణం తీసుకుంది. పోస్టుమార్టంలో కడుపులో ఉన్నది మగబిడ్డే అని తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంబంధిత వార్త: ఆడపిల్ల పుడుతుందని నిండుగర్భిణి ఆత్మహత్య! తీరా పోస్టుమార్టంలో.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ కదిలిస్తోంది. లోకాన్ని చూడకుండానే.. తల్లి గర్భంలోనే తనువు చాలించి.. తల్లితో కలిసి చితిమంటల్లో కాలి బూడిదైన ఆ పసికందుకు మాటలొస్తే.. తాను చేసిన తప్పేంటని? ప్రశ్నించేదేమో. ‘నీ కడుపులో ఊపిరి పీల్చుకోవడమే నేను చేసిన నేరమా?.. నీ రక్తం పంచుకోవడ మే పాపమా?.. రక్తపు ముద్దగా ఉన్న నాకు అవయవాలు ఇచ్చి రూపం ఇచ్చావు.. తొమ్మిది నెలలు నేను ఎంత ఇబ్బంది పెట్టినా భరించావు.. కడుపులో తంతుంటే సంతోషపడ్డావు కదమ్మా... కేవలం ఆడపిల్ల అన్న అనుమానంతో నాతోపాటు నీ ఊపిరి తీసుకున్నావ్. కానీ నేను మగబిడ్డనే.. లోకం ఆడపిల్ల, మగబిడ్డ అనే తేడా చూస్తుందని నాకు తెలియదు. లోకం తీరు నాకు తెలిస్తే.. దేవుడు నేను ఆడో మగో చెప్పే అవకాశం నాకు ఇస్తే తప్పకుండా నీకు విషయం చెప్పే వాడిని.. ఇప్పుడు నీ ప్రాణం తీసుకుని నా ఊపిరి ఆపేశావు.. అక్కకు నీ ప్రేమను దూరం చేశావ్. ఎందుకమ్మా ఇంత పనిచేశావ్. -
పిట్ట నడక.. చూద్దాం రండి!
సాక్షి, మంచిర్యాల: ‘‘ఓ పుల్లా, ఓ పుడకా, ఎండుగడ్డి, చిన్నకొమ్మ, చిట్టిగూడు.. పిట్ట బతుకే ఎంతో హాయి’’ అంటూ తన పాటతో పక్షుల జీవితాన్నో ఉత్సవం చేశాడు ప్రజావాగ్గేయకారుడు గోరటి. అలాంటి పక్షుల జీవితాన్ని చూడాలనుకునేవారికో మంచి అవకాశం బర్డ్వాక్ ఫెస్టివల్. సహజ సిద్ధ ఆవాసాల్లో పక్షుల కిలకిల రాగాలు, విభిన్న పిట్టల గుంపులు, జంట పక్షుల తుళ్లింతలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం అటవీశాఖ కల్పిస్తోంది. ఈ నెల 8, 9న రెండోవిడత బర్డ్వాక్ ఫెస్టివల్ను ఆసిఫాబాద్ జిల్లా అటవీఅధికారులు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల పాటు కవ్వాల్ టైగర్ రిజర్వు, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఈ బర్డ్వాక్ సాగనుంది. కాగజ్నగర్ అడవుల్లో పక్షుల సందడి పాలరాపుగుట్ట సహా... తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అడవుల్లో పక్షుల ఆవాసాలు చూడొచ్చు. దేశంలో అంతరించిపోయే స్థితిలో ఉన్న పొడుగు ముక్కు రాబంధుల ఆవాసమైన పాలరాపుగుట్టతో సహా ఎంపిక చేసిన 21 ప్రాంతాల్లో ఈ బర్డ్ వాక్ జరగనుంది. సిర్పూర్, బెజ్జూరు, పెంచికల్పేట, మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో ఎన్నో అరుదైన పక్షులున్నాయి. 250పక్షి జాతులు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే కర్ణాటక, నాగ్పూర్, చంద్రాపూర్, హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి వన్యప్రాణి, ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు తమ ఆసక్తిని చూపించారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా అవకాశం.. కోవిడ్ నేపథ్యంలో పరిమితంగా ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఒకరికి రూ.2వేలు ఫీజు. వివరాలకు డీఎఫ్వో (ఆసిఫాబాద్) 9440810099, ఎఫ్డీవో(జన్నారం) 9440810103 నంబరులో సంప్రదించవచ్చు. ఈ నెల 7న కాగజ్నగర్ అటవీ ఆఫీసులో నేరుగా మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. వీక్షకులకు అంతర్గత రవాణా, వసతి సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. పక్షుల సంరక్షణకు దోహదం పక్షుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజెప్పడంతో పాటు కొత్త పక్షుల గుర్తింపు, అధ్యయనం కోసం ఈ బర్డ్వాక్ దోహదపడుతుంది. ఎంపిక చేసిన ప్రాం తాల్లో సందర్శకులు అధికారుల సమక్షంలో పక్షులను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. వన్యప్రాణి నిపుణులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు పాల్గొనవచ్చు. – ఎస్.శాంతారామ్, జిల్లా అటవీ అధికారి, ఆసిఫాబాద్ -
దేశంలో.. సింగరేణి ఆ ఘనత సాధించి నెంబర్ వన్గా నిలిచింది
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2021–22లో డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నంబర్వన్గా నిలిచింది. అత్యధిక సామర్థ్యం(పీఎల్ఎఫ్)తో విద్యుదుత్పత్తి జరపడం తో ఈ ఘనత సాధించింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) ర్యాంకింగ్లో సింగరేణి విద్యుత్ కేంద్రం 2021 ఏప్రిల్– డిసెంబరు మధ్యకాలంలో 87.18% పీఎల్ఎఫ్ సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) 73.98% తో రెండో, 70.29 % తో పశ్చిమ బెంగాల్ జెన్కో మూడో స్థానంలో నిలిచాయి. 29% వృద్ధి.. 2020–21లో డిసెంబర్ నా టికి సింగరేణి కేంద్రం 5,335 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా, 2021–22 డిసెంబర్ నాటికి 29% వృద్ధి తో 6,904 ఎంయూల విద్యు దుత్పత్తి చేసింది. విద్యుత్ అమ్మకాలు రూ.2,386 కోట్ల నుంచి 20% వృద్ధితో రూ.2,879 కోట్లకు పెరి గాయి. మంగళవారం ఆయన ఇక్కడ సమీక్షించా రు. శ్రీరాంపూర్ రైల్వేలైన్ విద్యుదీకరణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, లోయర్ మానేర్ డ్యాంపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ సర్వే పనులను నెలాఖరులోగా, డీపీఆర్ను ఫిబ్రవరిలోగా పూర్తి చేసి మార్చి లో టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. -
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి మృతి
లక్సెట్టిపేట(మంచిర్యాల): ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్సెట్టిపేటకు చెందిన రాజు(30) మృతిచెందాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఉద్యోగం సాధించి స్థిరపడిన సమయంలో ఒక్కసారిగా మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్సెట్టిపేట పట్టణంలోని అంగడిబజార్కు చెందిన చీకటి కొమురయ్య, కమల దంపతులు పిండిగిర్ని నడుపుతూ పిల్లలను చదివిస్తున్నారు. కుమార్తెకు వివాహం జరుగగా.. పెద్ద కుమారుడు రాజు ఆస్ట్రేలియా దేశంలో ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం సంపాదించాడు. చిన్న కుమారుడు సాయికిరణ్ ఎంబీఏ చదువుతున్నాడు. రాజు ఇంటర్మీడియెట్ వరకు పట్టణంలో, హైదరాబాద్లో బీటెక్ పూర్తిచేసి ఎంఎస్ చదవడానికి 2018లో ఆస్ట్రేలియా వెళ్లాడు. రెండేళ్లలో ఎంఎస్ పూర్తి చేసి గత సంవత్సరం అక్కడి పోస్టల్ డిపార్టుమెంటులో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఆదివారం రాత్రి స్నేహితులతో కారులో ఇతర ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా సిడ్నీ పరిధి క్యూస్ల్యాండ్ వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో రాజు మృతిచెందాడు. ఈ విషయం అతడి స్నేహితుల ద్వారా తెలిసింది. మార్చిలో స్వదేశానికి వచ్చి పెళ్లి చేసుకోవాల్సి ఉండగా ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో రాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తెప్పించాలని కోరుతున్నారు. సాయం చేయండి రాజు మృత దేహాన్ని ఇండియాకు రప్పించేందుకు సాయం చేయాల్సిందిగా మృతుడి సన్నిహితులు మంత్రి కేటీఆర్ను ట్విట్టర్ ద్వారా కోరారు. వెంటనే స్పందించిన మంత్రి ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి తగు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ టీనేజర్ల మృతి -
పైనాపిల్, చాక్లేట్, వెనీలా.. నోరూరించే కెవ్వు కేక్స్..
సాక్షి,మంచిర్యాలటౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా కేకులు సులభమైన పద్ధతులలో ఎన్నో రకాలుగా మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. పేస్ట్రీలు, మెరింగ్యూస్, కస్టర్డ్స్, ఫ్రూట్స్, నట్స్, డెజర్ట్ సాస్, బటరక్రీమ్, క్యాండీడ్ ఫ్రూట్స్తో ఎన్నో రకాల కేక్లను త యారు చేసి, ప్రజలకు అందిస్తున్నారు. రుచితో పాటు, ఇట్టే ఆకర్షించేలా పలు ఆకృతులతో పాటు, మనకు నచ్చిన రూపంలోనూ కేక్లను తయారు చేసి ఇస్తున్నారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా లక్షలాది కేక్లను కట్ చేస్తుంటారు. పోటీతత్వంతో హైదరాబాద్ వంటి నగరాల్లో లభించే కేక్లను మంచిర్యాలలో ప్రజలకు అందిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఒక్కరోజే వేలాది కేక్లు అమ్మకా లు సాగితే, సాధారణ రోజుల్లో వందలాది కేక్లు అమ్ముడుపోతున్నాయి. ప్రజల్ని ఆకర్షించేందుకు కేక్లను ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీలతో సిద్ధం చేస్తున్నారు. రుచిని బట్టి ధరలు పైనాపిల్, బటర్స్కాచ్, చాక్లేట్, వెనీలా, బ్లాక్ ఫారెస్ట్, రెడ్విల్వెట్, ఫ్రెష్ఫ్రూట్, చాక్లెట్ చాపర్ చిప్స్, వైట్ ఫారెస్టు, గమ్పేస్ట్, ఫౌంటేయిన్ వంటి రకాల కేకులు రూ.500లకు కేజీ నుంచి రూ. 1200ల వరకు లభిస్తున్నాయి. కొత్త వెరైటీతో వస్తున్న గమ్పేస్ట్, ఫౌంటేయిన్ కేక్లు కేజీకి రూ.1000 నుంచి రూ.1200ల వరకు లభిస్తున్నాయి. ఇక వీటితో పాటు రెగ్యులర్ కేక్లు కేజీకి రూ.200ల నుంచి రూ.400ల వరకు లభిస్తుండగా, కూల్ కేక్లు రూ.500ల నుంచి రూ.1000ల వరకు లభిస్తున్నాయి. చాలా వెరైటీలు చేస్తున్నాం ప్రజలు కొత్తకొత్త వెరైటీ కేక్లను ఇష్టపడుతున్నారు. అందుకే ధర ఎక్కువైనా రుచికరమైన కొత్త వాటిని తయారు చేస్తున్నాం. గమ్పేస్ట్, ఫౌంటేయిన్, చాక్లెట్ చాపర్స్ వంటి లేటెస్ట్ రకాలను తయారు చేస్తున్నాం. వీటి ధర రూ. వెయ్యికి పైగా ఉన్నా, వీటినే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. బార్బీ బొమ్మ, బాంబుల రూపంలో ఉన్న కేక్లను చేస్తున్నాం. – కొండపర్తి రమేశ్, బేకరీ నిర్వాహకుడు, మంచిర్యాల వెరైటీ కేక్లంటే ఇష్టం ఏదైనా శుభసందర్భంలో కేక్లను తింటుంటాం. ఎప్పుడో ఒకసారి ఈ కేక్లను తింటాం కాబట్టి, వెరైటీ కేక్లను తినడం ఇష్టం. అందుకే అప్పుడప్పుడు కొనే కేక్లలో వెరైటీగా, కొత్త రుచులతో వచ్చే కేక్లను కొంటున్నాం. – మహేందర్, రామకృష్ణాపూర్ చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది -
చిన్నారి ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ స్పందన
సాక్షి,మంచిర్యాలటౌన్: పాతమంచిర్యాలకు చెందిన బోర్లకుంట అక్షిత(9) బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతోందని ఈ నెల 20న ‘సాక్షి’లో ప్రచురితం కాగా, మంత్రి కే.తారకరామారావుకు పలువురు ట్వీట్ చేశారు. మంత్రి స్పందిస్తూ.. ఆ చిన్నారి వైద్యానికి అవసరమైన సాయం తన బృందం సభ్యు ల ద్వారా అందిస్తానని ట్విట్టర్ ద్వారా తెలి పారు. మంత్రి కార్యాలయం నుంచి చిన్నా రి ఆరోగ్యంపై ఫోన్ చేసి ఆరా తీయగా, చికిత్సకు అవసరమయ్యేందుకు సహాయం అందిస్తామని భరోసా కల్పించారు. మరో ఘటనలో.. వ్యసనాలకు బానిసై భవితను నాశనం చేసుకోవద్దు’ బెల్లంపల్లి: దుర్వ్యసనాలకు బానిసై బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసు ఆధ్వర్యంలో ‘యువత భవిత’ కార్యక్రమం స్థానిక ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ లక్ష్యాన్ని ఎంచుకుని సాధించడానికి కఠోర సాధన చేయాలని సూచించారు. లక్ష్యం లేకుండా సరదా లు, సెల్ఫోన్లు, మద్యం, డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని, ఈ తీరు అత్యంత దురదృష్టకరమని అ న్నారు. బెల్లంపల్లి షీటీమ్ ఇంచార్జి, ఎస్సై మానస మాట్లాడుతూ బాల్య వివాహాలు, ఆన్లైన్ మోసాల సమాచారాన్ని డయల్ 100 కు అందించాలని, 6303923700 షీటీమ్ నంబర్కు వాట్సాప్ చేయాలని తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సీఐ కె.జగదీష్, ఎస్సైలు సమ్మయ్య, గంగాధర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ పాల్గొన్నారు. చదవండి: ‘కొడుకా.. ఎంత పనాయె.. నీ పిల్లలకు దిక్కెవరు బిడ్డా’ -
వేమనపల్లి ప్రాణహిత తీరంలో ఏళ్లనాటి డైనోసార్ శిలాజాలు
కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఎన్నో జీవజాతులు పరిణామ క్రమంలో కాలగర్భంలో కలిసిపోయాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకునే రాకాసి బల్లులు ఒకప్పుడు మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని ప్రాణహిత తీరం వెంబడి రారాజులుగా వెలుగొందాయి. వేమనపల్లిలో గుర్తించిన డైనోసార్ శిలాజాన్నే ప్రస్తుతం హైదరాబాద్లోని మ్యూజియంలో భద్రపర్చారు. దీంతోపాటు నత్తగుళ్లలు, చేప, వృక్ష, తాబేలు శిలాజాలను శాస్త్రవేత్తలు ఇక్కడ కనుగొన్నారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించిన కొందరు చరిత్రకారులు తీరం వెంబడి తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత వీటి ఉనికిని పట్టించుకోకపోవడంతో అధికవర్షాలు, కబ్జాల కారణంగా మట్టిలో కలిసిపోతున్నాయి. సాక్షి, వేమనపల్లి(బెల్లంపల్లి)ఆదిలాబాద్: వేమనపల్లి మండలంలోని రాజారం, మంగెనపల్లి, దస్నాపూర్, సుంపుటం, ప్రాణ హిత ప్రాంతాల్లో 16 కోట్ల ఏళ్ల క్రితం నాటి ఎన్నో రకాల శిలాజాలు ఇప్పటికీ విసిరేసిన ట్లు పడి ఉన్నాయి. 1925లో మలాన్ అనే జర్మ న్ శాస్త్రవేత్త కోటసారస్గా పిలిచే డైనోసార్ (రాకాసి బల్లి), ఫైసా అనే నత్తగుళ్ల, చేప, వృక్ష, తాబేలు ఆకృతుల్లో ఉన్న శిలాజాలను గు ర్తించారు. ఆ ఆనవాళ్ల ఆధారంగా 1970–85 మధ్య జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో యాదగిరి అనే శాస్త్రవే త్త స్థానిక కూలీల సాయంతో తవ్వకాలు జరి పారు. అప్పట్లో గుర్తించిన డైనోసార్ శిలాజా న్ని హైదరాబాద్లోని బిర్లా మ్యూజియానికి తరలించారు. వీటితోపాటు మండలాన్ని ఆనుకుని ఉన్న మత్తడి ఒర్రె, ప్రాణహిత తీరం వెంట విభిన్న ఆకృతుల శిలాజాలు ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో సేకరించిన వృక్ష శిలాజాలు అటవీశాఖ సంరక్షణ వేమనపల్లి, రాజారాం పరిసరాల్లో దొరికిన శి లాజాల రక్షణకు అట వీ శాఖ ప్రత్యేక చర్యలు తీ సుకుంది. మూడు సంవత్సరాల క్రితం డీఎఫ్ఓ గా పనిచేసిన ప్రభాకర్రావు వృక్ష, తాబేలు శి లాజాలను బొక్కలగుట్ట గాంధారి వనం, హైదరాబాద్ మ్యూజియానికి తరలించారు. సతీశ్బక్షి అనే జియాలజిస్ట్ ఈ ప్రాంతంలో దొరికే శిలాజాలపై పరిశోధనలు చేశారు. నత్తగుల్ల, వృక్ష, దారు, చేప శిలాజ అవశేషాలను పరిశోధనల నిమిత్తం తీసుకెళ్లారు. ఇటీవల ఔత్సాహిక పరిశోధకుడు సముద్రాల సునీల్ బృందం కూడా శిలాజ ఆనవాళ్లు, ఇతర అంశాలపై వేమనపల్లిలో పరిశోధనలు నిర్వహించారు. ప్రాణహిత తీరంలో నత్తగుళ్లు, తాబేళ్ల శిలాజాలు ఫాసిల్ పార్క్లతో రక్షణ.. మన దేశంలో హిమాచల్ ప్రదేశల్లోని శివాలిక్ ఫాసిల్ పార్కు, ఉత్తర్ప్రదేశ్లోని సల్కాన్ ఫాసిల్ పార్కు, గుజరాత్లోని ఇంద్రోడా ఫాసిల్ పార్కు, మధ్యప్రదేశ్లోని మాండ్లే ప్లాంట్ ఫాసిల్స్ నేషనల్ పార్కు, తమిళనాడులోని సతనూర్ నేషనల్ ఫాసిల్ పార్కులు ఉన్నాయి. మన రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మాత్రమే జియాలజికల్ పార్కులు ఉన్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా తాలూకాలో సైతం శిలాజ ఆనవాళ్లు గుర్తించి, వర్తమాన్ ఫాసిల్ పార్కు ఏర్పాటుచేశారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ప్రాణాహిత, గోదావరి బేసిన్లో ఉన్న వడోధామ్లో సారోపోడ్స్ సరీసృపాలు, వృక్షజాతుల శిలాజ జాడలు వెలుగుచూశాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని వడ్ధామ్ ఫాసిల్ పార్కుగా మార్చింది. ఇది కొండపల్లి గ్రామానికి సరిహద్దుగా ఉండడంతో స్థానిక వృక్షశిలాజాలు కూడా వాటి కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. అరుదుగా ఉండే ఫాసిల్ వుడ్స్ కొండపల్లి ప్రాంతాన్ని, రాకాసి బల్లులు, ఇతర పురాతన జంతుజాలం తిరిగిన వేమనపల్లిని ఫాసిల్ పార్కుగా తీర్చిదిద్దాలని పరిశోధకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొండపల్లి అటవీప్రాంతంలో వృక్షశిలాజం, వృక్షశిలాజాలను పరిశీలిస్తున్న కలెక్టర్ చంపాలాల్(ఫైల్) కోట్ల ఏళ్ల నాటి జీవజాతులు పెంచికల్పేట్ మండలం కొండపల్లి అటవీప్రాంతంలో 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న కోనిఫర్ జాతికి చెందిన వృక్ష శిలాజాలను 2014లో అటవీశాఖ అధికారులు కనుగొన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో ఆరున్నర కోట్ల ఏళ్ల నాటి శిలాజాలను గుర్తించారు. వర్షాలకు చిన్నవాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు పది అడుగుల లోతులో ఉన్న వీటి ఉనికి బయటపడింది. ఇందులో కొన్ని 10 నుంచి 25 అడుగుల పొడవు ఉంటే మరికొన్ని 50 అడుగుల వరకు పొడవు ఉన్నాయి. సంరక్షణ అందరి బాధ్యత శిలాజ సంపద సంరక్షణ విషయంలో అందరూ భాగస్వాములు కావాలి. అటవీశాఖ ఆధ్వర్యంలో గతంలో వృక్ష, ఇతర శిలాజాలను వెలికితీయించాం. వాటిని మంచిర్యాల గాంధారి వనంలో సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచాం. వీటి సంరక్షణకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. – బాబుపటేకర్, డీఆర్ఓ, వేమనపల్లి సంరక్షణ అందరి బాధ్యత 40 ఏళ్ల కింద మంగెనపల్లి జంగట్ల రాక్షసి బల్లి బొక్కలు ఉన్నాయంటే త వ్వకాల కోసం కూలీ పనులకు వెళ్లాం. పెద్దసార్లు వచ్చి రాజారాం, మంగెనపల్లికి చెందిన కూలీలను తీసుకెల్లారు. తవ్వకాల్లో దొరికిన వాటిని హైదరాబాద్కు తీసుకెళ్లిండ్లు. అప్పట్లో జీపుల్లో వచ్చి తవ్వకాలు జరిపించేవాళ్లు. సర్కారు పట్టింపు చేసి వాటిని బయటకు తీయాలే. – పాలే శంకర్, వేమనపల్లి -
మహిళతో వివాహేతర సంబంధం.. ఎంత నచ్చజెప్పినా మారలేదని..
సాక్షి,రెబ్బెన(ఆసిఫాబాద్): మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడనే అనుమానమే రెబ్బెన మండలంలోని నవేగాంకు చెందిన వేల్పుల ఇందూర్ అలియాస్ ఇంద్ర(18) హత్యకు దారి తీసింది. ఎంత నచ్చజెప్పినా ఇందూర్ పద్దతి మార్చుకోకపోవడంతో కక్ష పెంచుకున్న వేల్పుల రాజలింగు దారుణంగా హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నవేగాంకు చెందిన హతుడు వేల్పుల ఇందూర్, నిందితుడు వేల్పుల రాజలింగులు పాలి అన్నదమ్ముల కొడుకులు. తమ సంబంధికులకు చెందిన మహిళతో ఇందూర్ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడన్న అనుమానంతో రాజలింగు కక్ష పెట్టుకున్నాడు. ఈక్రమంలో ఈనెల 1న సాయంత్రం ఇంటి ఎదుట ఉన్న చావడిలో ఇందూర్ కాళ్లు చేతులు కడుక్కునే పనిలో ఏమరపాటుగా ఉండడాన్ని గమనించిన రాజలింగు పదునైన కత్తితో కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై కిందపడిపోగా వెంటనే కర్రతో తలపై బలంగా మోదడంతో ఇందూర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి మధునయ్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందుతుడి అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రెబ్బెన సీఐ సతీష్కుమార్, ఎస్సై భవానీసేన్ ఉన్నారు. చదవండి: ఆ భూమి మాది, నేను మంత్రి గన్మెన్ని.. తలుచుకుంటే.. -
కబళించిన కరెంటు తీగ
దండేపల్లి (మంచిర్యాల): ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యానికి ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ బలయ్యాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలో పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైపోయింది. మంగళవారం మేదరిపేటకు చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మడావి లక్ష్మణ్ (26)ను పిలిచారు. ట్రాన్స్ఫార్మర్పై నుంచి రెండు విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి. లక్ష్మణ్ కిందనున్న లైన్కు మరమ్మతులు చేస్తూ.. ప్రమాదవశాత్తు పైనున్న 11కేవీ విద్యుత్ తీగలను తాకాడు. ఆ సమయంలో పైలైన్కు విద్యుత్ సరఫరా ఆపలేదని, దీనివల్లే లక్ష్మణ్ బలైపోయాడని స్థానికులు ఆరోపించారు. ఘటన స్థలానికి వచ్చిన ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ లింగాపూర్ వద్ద రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మృతుని కుటుంబానికి పరిహారం అందిస్తామని ట్రాన్స్కో అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
మల్టి ‘ఫుల్’ జోష్
సాక్షి, మంచిర్యాల: వరి వేస్తే కొంటారో కొనరో తెలియదు. కొన్నా పెట్టుబడి కూడా వస్తుందో లేదోనని భయం. పత్తి పండిస్తే తెగుళ్ల బెడద. సమయానికి కూలీలు ఉంటారో లేరోనని ఆందోళన. ఈ కష్టాల నుంచి గట్టేక్కేందుకని ఉమ్మడి ఆదిలాబాద్ రైతులు ఒకసారి ప్రత్యామ్నాయ పంటలు వేసి చూశారు. అంతే.. మునుపటి పంటలతో పోలిస్తే మంచి లాభాలు రావడంతో వెనక్కి చూడలేదు. మిశ్రమ పంటలు వేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. మార్కెట్లో డిమాండ్ను బట్టి కూరగాయలు, పండ్లు, పూలు కూడా పండిస్తున్నారు. ప్రభుత్వ విధానాలెలా ఉన్నా మార్కెట్ను తట్టుకొని నిలబడుతున్నారు. కొందరైతే డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్ లాంటి పంటలూ పండించడం మొదలుపెట్టారు. కూరగాయలతో రోజూ ఆదాయం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తాటిగూడెంకు చెందిన శ్రీనివాస్ తన రెండెకరాల భూమిలో వానాకాలంలో వరి పంట సాగు చేస్తున్నాడు. యాసంగిలో వరి కాకుండా రకరకాల ఆహార పంటలేస్తున్నాడు. ఎకరా భూమిలో పాలిహౌస్ను ఏర్పాటు చేశాడు. అంతర పంటల సాగు , పంట మార్పిడి పద్ధతితో రోజువారీగా ఆదాయాన్నీ పొందుతున్నాడు. ప్రతి ఏడాది యాసంగిలో సుమారు రూ. 2.55 లక్షలకు పైబడి సంపాదిస్తున్నాడు. టమాట సాగు ద్వారా రూ.18,500, మిరప నుంచి రూ.14,500, క్యాబేజీతో రూ.14,000 కాకర, బీరతో రూ.53,000, దోసతో రూ.15,000 వరకు ఆర్జిస్తున్నాడు. వీటితోపాటు పాలు, గుడ్లు, పశుపోషణతో మరో రూ.1.36,000 పొందుతున్నాడు. ఖాళీ ఉంటే పంట వేయడమే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారంకు చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ తన పదెకరాల భూమిలో విభిన్న పంటలు వేస్తున్నాడు. ఐదెకరాల్లో మామిడి, నాలుగెకరాల్లో వరి, ఎకరంలో కంది, మిర్చి, వంకాయ, టమాటతో పాటు మొత్తం 25 రకాల మిశ్రమ కూరగాయాలు పండిస్తున్నాడు. పొలం గట్టుల చుట్టూ, ఖాళీ ప్రదేశాల్లో జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, పనాస, అల్లనేరేడు, ఆపిల్ బేర్, చింతతో పాటు అనేక రకాలు మొక్కలు నాటాడు. బంతి పూలూ సాగు చేస్తున్నాడు. ఇంటి అవసరాలకు పోను మార్కెట్లోను సేంద్రియ పండ్లను అమ్ముతున్నాడు. ఈ యాసంగిలో కొత్తగా కుసుమ సాగుకు సిద్ధమయ్యాడు. సేంద్రియ సాగు కాబట్టి కూరగాయాలకు, పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. డిమాండ్ను బట్టి పంటలను మార్చుతున్నాడు. డ్రాగన్ ఫ్రూట్.. 30 ఏళ్లదాకా పండ్లే పండ్లు మంచిర్యాల జిల్లా కన్నెపల్లికి చెందిన జాడి సాయితేజ, విశ్వతేజ ఓవైపు చదువుకుంటూనే వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. తండ్రి రాజలింగు అకాల మరణంతో డ్రాగన్ ఫ్రూట్ పండించాలనే ఆయన కలను కొడుకులు సాకారం చేస్తున్నారు. వారికున్న భూమిలో రెండెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు మొదలుపెట్టారు. ప్రత్యేకంగా అధ్యయనం చేసి మరీ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ కిలో రూ.150 నుంచి 200 పలుకుతోంది. సేంద్రియ పద్ధతిలో పండిస్తే నగరాల్లో మరింత డిమాండ్ ఉంటుంది. ఒకేసారి పెట్టుబడి పెట్టి ఎక్కువకాలం సాగు చేసుకోవచ్చు. ఒకసారి విత్తుకుంటే 30 ఏళ్ల పాటు ఫలాలనిస్తాయి. సంప్రదాయ పంటలకు పూర్తిగా భిన్నమైన పంట డ్రాగన్ ప్రూట్. వరికి మించి లాభం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని రెబ్బెన గ్రా మానికి చెందిన గట్టు భీమా గౌడ్ వరి పంటకు పరిమి తం కాకుండా వాణిజ్య పం టలైన మిరప,మొక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు. మూడెకరాల్లో వరి, 4 ఎకరాల్లో పత్తితో పాటు ఎకరం మిరప తోట, అరెకరం మొక్కజొ న్న, మరో అరెకరంలో కూరగాయల సాగు చేస్తున్నాడు. మిర్చి, మొక్కజొన్న, కూరగాయల సాగు లో ఎకరాకు వరి కన్నా రూ.20 వేలు పైనే లాభం వస్తోందని చెబుతున్నాడు. సొంతూరితో పాటు చుట్టుపక్కల ప్రజలూ మిర్చి, కూరగాయలు, మొక్కజొన్న కంకులు కొనుగోలు చేస్తుండటంతో మంచి ఆదాయం వస్తోందని అంటున్నాడు. చుట్టూ సోయా.. మధ్యలో కంది పత్తి సాగు చేస్తే గులాబీ పు రుగు ఉధృతి, తెగుళ్లతో ది గుబడి రావట్లేదు. పైగా కూలీల కొరత. అందుకే సో యా, కంది పంటలను సా గు చేస్తూ లాభాలు పొందు తున్నాడు ఆదిలాబాద్ జిల్లా తాంసికి చెందిన యువ రైతు సామ రాహు ల్ రెడ్డి. తనకున్న 8 ఎకరాల్లో సోయా, అందులో అంతర పంటగా కందిని సాగు చేస్తున్నాడు. సోయా సాగుకు ఖర్చు ఎక్కువేం లేదు. యాసంగిలో సాగు చేసిన సోయా, కంది పూర్తయ్యాక రబీలో జొన్న, పెసర పంటలనూ సాగుచేస్తున్నాడు. ప్రస్తుత యాసంగిలో సోయా 65 క్వింటాళ్లు వచ్చిందని రాహుల్ రెడ్డి చెప్పాడు. -
సింగరేణిలో సమ్మె సైరన్
శ్రీరాంపూర్ (మంచిర్యాల): సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సుదీర్ఘ విరామం తర్వాత సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి సమ్మెకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రైవేటుకు అప్పగించేం దుకు చేస్తున్న ప్రయత్నాలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చర్యలను నిరసిస్తూ డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్లో 5 జా తీయ సంఘాలతోపాటు సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు జేఏసీగా ఏర్పడి ఈ నిర్ణయం తీసుకున్నారు. టీబీజీకెస్ నేతలు ఇప్పటికే కొద్దిరోజుల కిందట సమ్మెనోటీసు ఇచ్చారు. జేఏసీ కూడా సింగరేణి యాజమా న్యానికి మంగళవారం మరో నోటీసు ఇవ్వనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామస్వామి తెలిపారు. కార్మిక నేతలు మొత్తం 9 డిమాండ్లను నోటీసులో పేర్కొన్నారు. -
చిన్నయ్య గుట్ట: ఎంత గట్టిగా చప్పట్లు కొడితే.. అంత నీరు
లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలంలోని హన్మంతుపల్లి గ్రామ పంచాయతి పరిదిలోగల చల్లంపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా సుమారు 150 సంవత్సరాల క్రితం నుండి కొలువు పొందుతున్న గిరిజనుల ఆరాధ్య దేవుడు చిన్నయ్య దేవుడు. ఈ ప్రాంతంలో చిన్నయ్య దేవుడు ఎంతో ప్రసిద్ధి గాంచాడు. చారిత్రాత్మకంగా వెలిసిన చిన్నయ్య దేవుడు గిరిజనుల ఆరాధ్య దైవంగా ఇప్పటికి సేవలందుకుంటూనే ఉన్నాడు. ప్రాచీన కాలంలో పాండవులు ఇక్కడ వ్యవసాయం చేసేవార..ని ద్రౌపది స్నానం చేయడానికి కొల్లుగుంటలు, పరుపుబండపైన వ్యవసాయం చేసినట్లు నాగళి సాళ్ళు, గుడి లోపల దొనలో పట్టె మంచం దేవుని విగ్రహాలు ఉన్నట్లు ఇప్పటికి పూర్వీకులు చెబుతుంటారు. వర్షాకాలం ప్రారంభం సమయంలో సుదూర ప్రాంతాల నుంచి దర్శనానికి వస్తుంటారు. రైతులు వరదపాశం బోనాలు వండి దేవునికి తీర్ధ ప్రసాదాలు వడ్డిస్తారు. పంట పొలాలకు వ్యాధులు సంభవిస్తే ఇక్కడి తీర్ధపు నీరు పంటపొలాలపై చల్లితే రోగాలు పోతాయనే నానుడి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వెల్లడానికి దారి.... పట్టణంనుండి చందారం గ్రామం మీదుగ 10 కిలోమీటర్లు వాహనాలపై చల్లంపేట వరకు చేరుకుని అక్కడి నుండి అటవీ ప్రాంతం గుండా సుమారు 3 కిలో మీటర్లు కాలినడకన నడిచి వెల్తే చిన్నయ్య గుట్ట దేవుడి గుడిని చేరుకోవచ్చు. సమీప ప్రాంతంలో నీళ్ళ సదుపాయం చిన్నపాటి బుగ్గ వాగు లాంటిది ఉంటుంది అందులోని నీటిని త్రాగడానికి వాడుతారు. ఇప్పటికి అక్కడ గిరిజనులే పూజారులుగా కొనసాగుతుంటారు. ప్రతి ఆదివారం, గురువారం ఇక్కడ పూజలు పెద్ద మొత్తంగా నిర్వహిస్తారు. వివిద గ్రామాలనుండి మేకలు, కొళ్ళు లాంటివి తెచ్చుకుని దేవుడికి బోనం వండి మొక్కలు చెల్లించి కొంచెం దూరంగా వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. చిన్నయ్య దేవుడి ప్రత్యేకత... చిన్నయ్య దేవుడి ప్రత్యేకత ముఖ్యంగా పంట పొలాలు దుక్కి దున్నేముందు దేవుడి దర్శనం చేసుకుని బండారు(పసుపు) తెచ్చుకుని ధాన్యం వేసేటప్పుడు అందులో కలిపి వ్యవసాయం సాగు చేస్తారు. మరల పంట చేతికి వచ్చిన తర్వాత దినుసును దేవుడికి అప్పజెప్పి మొక్కిన మొక్కును చెల్లించుకుంటారు. వేసవి కాలం ముగుస్తుందనే సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది చిన్నయ్య గుడి. అల్లుబండ.... గుడిలో అల్లుబండ ప్రత్యేక స్థానాన్ని కల్గిఉంది. అక్కడికి వచ్చిన భక్తులు మనసులో కొరికను కోరుకుని అల్లుబండ లేపితే సులభంగా లేచినట్లైతే కోరిక నెరవేరుతుందని అల్లుబండ బరువుగా ఉంటే కోరిక నేరవేరదనేది నమ్మకం. అల్లుబండ ప్రదేశం వద్ద భక్తులు వారి కొర్కెలను కోరుకుంటారు. చిన్నయ్య దేవుని గుడి వద్ద నుండి సుమారు మూడు కిలీమీటర్లు అటవీ ప్రాంతంలో నుండి నడుచుకుంటు వెల్లితే మంచు కొండలు దర్శనమిస్తాయి. అక్కడికి వెల్లిన భక్తులు ఎంత గట్టిగ చప్పట్లు, కేకలు, ఈళలు వేస్తే అంత నీరు కిందకు వస్తుంది. అక్కడి నీటిని భక్తులు తెచ్చుకుని పంటపొలాల్లో జల్లుకుంటే పంట దిగుబడి అధికంగా వస్తు చీడ, పీడలు రావని రైతుల నమ్మకం. పర్యాటక కేంద్రంగా తీర్చాలి.... పచ్చని అటవీ ప్రాంతం పక్షుల కిలకిల రావాలు, అడవి జంతువుల శబ్దాలు చూడడానికి వేసవి విడిదిగా అనిపించే చిన్నయ్య గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని పలువురు కోరుతున్నారు. రహదారి మధ్యలో మత్తడి నీటిని నిల్వచేసి వాటికి అనుకూలంగా రహదారిని ఏర్పాటు చేస్తే పుణ్యక్షేత్రంగాను పర్యాటక కేంద్రంగాను ఏర్పడుతుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప భూకంపం
జ్యోతినగర్(రామగుండం)/మంచిర్యాలటౌన్/మంచిర్యాలఅగ్రికల్చర్: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలకు ఇంట్లో ఉన్నవారు భయపడి బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఐదో డివిజన్ మల్కాపూర్, నర్రాశాలపల్లె, అన్నపూర్ణ కాలనీతోపాటు మేడిపల్లి ప్రాంతంలోని ఓపెన్కాస్ట్ గనిలో ప్రతిరోజు బొగ్గు వెలికితీయడానికి బాంబు పేలుళ్లు జరుగుతుంటాయి. ఈ క్రమంలో శనివారం సంభవించిన భూ ప్రకంపనలను బాంబుపేలుళ్లు కావచ్చని చాలామంది భావించారు. అయితే అది భూకంపమని తర్వాత తేలింది. భూకంప లేఖిని(రిక్టర్ స్కేల్)పై 4.0గా నమోదైనట్లు గుర్తించారు. మధ్యాహ్నం 2.03 గంటల ప్రాంతంలో కరీంనగర్కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో.. జిల్లా కేంద్రమైన మంచిర్యాలతోపాటు నస్పూర్, శ్రీరాంపూర్లోని పలు ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల కలెక్టరేట్లో కుర్చీలు, టేబుళ్లు, బీరువాలు కదిలినట్లు అనిపించడంతో సిబ్బంది భయాందోళన చెందారు. శ్రీరాంపూర్, నస్పూర్ ప్రాంతాల్లోని ప్రజలు మొదట దీన్ని ఓసీపీ బ్లాస్టింగ్గా భావించారు. 2016 నవంబర్లో నస్పూర్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు పలువురు గుర్తు చేసుకున్నారు. మంచిర్యాల కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు. భూకంపం వచ్చిన ప్రాంతం -
మానసిక వికలాంగుడిపై లైంగిక దాడి
సాక్షి, జైపూర్(చెన్నూర్): మానసిక వికలాంగుడిపై ఐదుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మండలంలోని ఇందారంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మానసిక వికలాంగుడైన యువకుడిపై అదే గ్రామానికి చెందిన చెందిన గడ్డం నందు, కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్, మహ్మద్ సాధిక్, బొగె రాయలింగు కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతూ వేంధిపులకు గురిచేస్తున్నారు. మోటార్సైకిల్పై రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా హింసించి ఇంట్లో ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవారు. సదరు యువకుడు అనారోగ్యానికి గురి కావడంతో విషయం బయటపడింది. యువకుడి తల్లిదండ్రులు శనివారం జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ తెలిపారు. బాలికకు యువకుడి లైంగిక వేధింపులు సోన్: మండలంలోని సిద్ధులకుంట గ్రామానికి చెందిన బాలికను ఇదే గ్రామానికి చెందిన తిరుమల భోజన్న(23) కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పగా గతంలో యువకుడిని మందలించారు. మళ్లీ శనివారం వేధింపులకు గురి చేయడంతో తల్లికి చెప్పింది. దీంతో గ్రామస్తులు భోజన్నను పట్టుకుని చితకబాదారు. డయల్100కు సమాచారం అందించగా ఎస్సై ఆసీఫ్ గ్రామానికి చేరుకుని భోజన్నను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట
ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లాలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట చేలలోకి వరద నీరు చేరింది. గోదావరి నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బుధవారం చేపల వేటకు అధికారులు అనుమతించలేదు. అయితే కొందరు మత్య్సకారులు నీరు నిలిచిన పొలాల్లో చేపల వేట కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. పరివాహక ప్రాంతంలోని పంట చేలలో వరద నీటిపై తెప్పలు వేసుకుని వెళ్లి మత్య్సకారులు చేపలు పట్టారు. తమ రెక్కల కష్టం వరద పాలైందని రైతులు వాపోతున్నారు. పంట నష్టం జరిగిన పొలాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పత్తి ఏరాల్సిన చోట చేపలు పట్టడం వింతగా ఉంది. - సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల -
మంచిర్యాలలో 'మహానటి'.. CMR షాపింగ్ మాల్ ప్రారంభం
-
CM KCR: కేసీఆర్ గుడి అమ్మబడును!
సాక్షి, మంచిర్యాల (ఆదిలాబాద్): ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానంతో ఓ వ్యక్తి గుడి కట్టించాడు. అయితే తనకు పార్టీలో గుర్తింపు లేదని, కనీసం కేసీఆర్, కేటీఆర్లను కలిసే అవకాశం కూడా రాలేదని గుడిని, గుడిలోని కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్ కేసీఆర్పై ఉన్న అభిమానంతో తన ఇంటి ఆవరణలో గుడి కట్టించాడు. అందులో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేస్తున్నాడు. అంతలా అభిమానం చాటుకున్న తనకు కేసీఆర్, కేటీఆర్ను కలిసే అవకాశం కూడా రావడం లేదని, టీఆర్ఎస్ పార్టీలోనూ గుర్తింపు దక్కలేదని నిరాశ చెంది కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరాడు. అప్పటి నుంచి కేసీఆర్ విగ్రహానికి ముసుగు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొని అప్పుల పాలయ్యానని, అప్పులు తీర్చేందుకు కేసీఆర్ గుడిని, విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు ఫేస్బుక్లో పోస్టు చేశాడు. చదవండి: డ్రగ్స్ వార్: రేవంత్పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా -
టూవీలర్పై వెళ్తున్న వ్యక్తులపై పిడుగుపాటు.. ఇద్దరు మృతి
మంచిర్యాల(ఆదిలాబాద్): మంచిర్యాల జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కాగా, జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్ బ్రిడ్జ్పై వర్షంలో టూవీలర్పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఒకే కుటుంబంలో ఇద్దరు పిడుగుపాటుకు గురై చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: Tragedy: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి -
బతికుండగానే చంపేశారు..
బెల్లంపల్లి(మంచిర్యాల): అధికారుల తప్పిదంతో మండల కేంద్రానికి చెందిన గజెల్లి భూదేవి అనే పండు వృద్ధురాలు పదినెలలుగా ఆసరా పింఛన్ దూరమైంది. ఏళ్లుగా ఒంటరిగా జీవనం కొనసాగిస్తూ పింఛన్పై ఆధారపడిన ఆమెకు ఆకస్మాత్తుగా పింఛన్ నిలిపివేశారు. ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే.. రికార్డుల్లో నువ్వు చనిపోయావని ఉందని, అందుకే తొలగించామని అధికారులు పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచక పది నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలు తిరుగుతూ ఆసరా కోసం అధికారుల కాళ్లావేళ్లా పడుతోంది. రెండుసార్లు కలెక్టర్ను కలిసినా ఫ లితం లేదని వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. దా దాపు 25 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా.. కుమార్తెలకు వివాహం చేసి పంపించింది. కుమారులు లేకపోవడంతో రూ.200 పింఛన్ ఉన్నప్పటి నుంచి వాటిపైనే ఆధారపడి ఒంటరిగా ఉంటుంది. ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ పునరుద్ధరించడంతోపాటు పదినెలల నగదు ఇప్పించాలని వేడుకుంటుంది. దొంగిలించిన బైక్పైనే దర్జాగా చక్కర్లు మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో బైక్ను దొంగలించి దానిపైనే చక్కర్లు కొడుతున్న దొంగల ఫొటోను మంచిర్యాల పోలీసులు సోషల్మీడియాలో పోస్టుచేయగా శుక్రవారం వైరల్గా మారాయి. బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రామకృష్ణాపూర్కు చెందిన పులి సంతోష్ బైక్ను ఆగస్టు 31న జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వర టాకీస్ వద్ద దొంగిలించారు. బైక్ యజమాని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బైక్ దొంగిలించిన వ్యక్తులను పట్టుకునేందుకు వారి ఫొటోను సోషల్మీడియాలో పోస్టు చేశారు. నిందితులను గుర్తు పట్టిన వారు 9440795042, 9440908844 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్.. అయినా స్మోక్ చేయకూడదు! -
క్షణక్షణం.. భయంభయంగా గడిపాం
లక్సెట్టిపేట(మంచిర్యాల): ‘‘తాలిబన్ల చేతిలోకి అఫ్గానిస్తాన్ వెళ్లడంతో అక్కడ ఉంటున్న భారతీయులు చాలా ఇబ్బందులుపడ్డారు. ఇండియన్ ఎంబసీలో కమాండోలుగా ఉన్న మేం కూడా అవస్థలు పడ్డాం. తాలిబన్లకు అధికారం రావడంతో ఇండియన్ ఎంబసీని పట్టించుకునేవారే కరువయ్యారు. చివరి రెండ్రోజులు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. తాగడానికి నీరు, తినడానికి తిండి, ఏ ఇతర సౌకర్యాలనూ తాలిబన్లు కల్పించలేదు’’అంటూ అక్కడి ఇండియన్ ఎంబసీ సెక్యూరిటీ కమాండోగా విధులు నిర్వర్తించిన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ఎంబడి సురేశ్ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించారు. ‘‘నిత్యం అధికారులకు రక్షణ కల్పించడంలో ఇబ్బందులుండేవి. ఎప్పుడేం జరుగుతుందోనని క్షణక్షణం భయంభయంగా గడిపేవాళ్లం. ఎటు నుంచి దాడులు, బాంబులు పడతాయోనని అప్రమత్తంగా ఉండేవాళ్లం. అన్ని దేశాల ఎంబసీలు వెళ్లిపోయిన తర్వాతే, చివరగా ఇండియన్ ఎంబసీ ఇక్కడికి వచ్చేసింది. అప్పటివరకు విధుల్లో నిర్విరామంగా ఉన్నాం. ఇండియన్ ఎంబసీ తీసుకున్న నిర్ణయంతో 130 మంది కమాండోలు, 70 మంది భారతీయులతో సీ–17 బోయింగ్ ఎయిర్ఫోర్స్ యుద్ధ విమానంలో 17న ఢిల్లీకి చేరుకున్నాం’’అని సురేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని హెడ్ ఆఫీస్ క్యాంపు భవ నంలో హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. -
ఘరానా మోసం: ఐపీఎస్ స్వాతి లక్రా పేరుతో నియామక పత్రాలు
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఘరానా మోసం బయటపడింది. నిరుద్యోగ యువతులను పోలీస్ శాఖలో ఉద్యోగాలంటూ బురిడి కొట్టించిన ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఐపీఎస్ స్వాతి లక్రా పేరుతో నియామక పత్రాలు సృష్టించి పోలీస్ శాఖలో ఉమెన్ సేప్టీ వింగ్ లొ ఉద్యోగాలు పొందినట్టు 10 మంది నిరుద్యోగ యువతులకు భూక్యా తిరుపతి అనే వ్యక్తి నియామక పత్రాలు జారీ చేశాడు. తీరా ఈ నియామక పత్రాలు నకిలివని తేలడంతో మోసపోయామని తెలుసుకున్న యువతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు బండారం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గుడిపేట గ్రామానికి చెందిన భూక్యా తిరుపతి అనే నిందితుడు అమ్మ ఫౌండేషన్ పేరుతో ఈ మోసాలకు పాల్పడ్డట్టు తేలింది. నిర్మల్ జిల్లాకు చెందిన 5 గురు యువతులు , ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్, ఇచ్చోడకు చెందిన 6 గురు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మరో ఏడుగురి వద్ద నుండి పోలీసు శాఖలొప ఉద్యోగాల పేరుతో 2 లక్షలు వసూలు చేసినట్టు తేలింది. బాధిత యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిపోలీసులు 24 గంటల్లో నిందితుడు తిరుపతి మంచిర్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అనంతరం మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి పూర్తీ వివరాలు వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి ఒక సెల్ పోన్, 10 నకిలీ ఉద్యోగ దృవికరణ పత్రాలు, 58 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిపై 420, 468, ఐపీసీ సెక్షన్ 66, 66డీకింద కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు. -
మరో 20 రోజుల్లో పుట్టినరోజు.. రెండేళ్లకే నూరేళ్లు నిండాయి
మంచిర్యాలక్రైం: ఓ చిన్నారి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లి వరండాలోని గ్రిల్స్పైకి ఎక్కి జారిపడి మృత్యుఒడికి చేరింది.. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ‘మా విందుభోజనం’ హోటల్ యజమాని కొండబత్తుల ప్రవీణ్కుమార్, వాణి దంపతులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీసీ ప్రాంతంలోని ఎస్ఆర్ రెసిడెన్సీ నాలుగో అంతస్తులో ఉంటున్నారు. వీరికి కుమారుడు ఆయన్(5), కూతురు శాని్వ(23 నెలలు) ఉన్నారు. గురువారం ఉదయం కుటుంబసభ్యులు ఎవరి పనుల్లో వారు ఉండగా.. శాన్వి నిద్రలేచి వరండాలోకి వచి్చంది. రెసిడెన్సీ ముఖ ద్వారం వైపు వెళ్లి సిమెం టు గ్రిల్స్ పట్టుకుని కొంతదూరం పైకి ఎక్కింది. అక్కడ గ్రిల్స్ సందుల్లో నుంచి కిందికి చూస్తూ అదుపుతప్పి కింద పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండో బర్త్డేకు ముందే మృత్యువాత శాన్వి 2019 సెప్టెంబర్ 9న జన్మించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న రెండో పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పుట్టినరోజు వేడుకలతో వెలిగిపోవాల్సిన ఆ ఇంట ఇప్పుడు చీకట్లు కమ్ముకున్నాయి. -
వామ్మో.. ఆ దూకుడు ఏందిరా నాయనా!
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో స్కూళ్లు లేకపోవడంతో పిల్లల ఆటపాటలతో భలే ఎంజాయ్ చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే పనిలేకపోవడంతో ఆటలతో సేద తీరుతున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గడ్పూర్ గ్రామ పంచాయతీ దుబ్బగూడెం వద్ద గల వ్యవసాయ బావిలో విద్యార్థులు ఇలా ఈత కొడుతూ కేరింతలు కొట్టారు. అయితే, బావుల్లో దిగడం, ఈత కొట్టడం ప్రమాదమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సుమా!. – గెల్లు నర్సయ్య యాదవ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల అమ్మో డైనోసార్ సంగారెడ్డి రాజంపేట నుంచి నాగాపూర్ వెళ్లేదారిలో ఓ రైతు పొలం పక్కన పిచ్చిమొక్కల తీగలు చెట్టుపై డైనోసార్లా అల్లుకున్నాయి. దూరం నుంచి చూస్తే డైనోసార్ అనిపించేలా ఈ తీగలు అల్లుకున్నాయని స్థానికులు అంటున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి పొలం పచ్చగా..కడుపు నిండగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో ఎటుచూసినా వరి పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. పొలాల మధ్యలో నల్ల తల కలిగిన పక్షులు సైతం తిరుగుతూ సందడి చేస్తున్నాయి. పొలం నీళ్ల మధ్య బురదలోని కీటకాలను తింటూ కడుపు నింపుకుంటున్నాయి. రైతుల చప్పుడు కాగానే గాలిలో రివ్వున ఎగిరిపోతున్నాయి. – బి.శివప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి. -
దారుణం: 16రోజులు... నాలుగు హత్యలు..
సాక్షి, మంచిర్యాలక్రైం: నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తి కోసం క్షణికావేశంలో అయిన వారినే కడతేరుస్తున్నారు. అనుమానంతో ఒకరు.. వివాహేతర సంబంధంతో మరొకరు.. పాత కక్షలతో ఇంకొకరు... ప్రేమ వ్యవహారంలో మరొకరు... ఇలా కారణాలు ఏవైనా కావచ్చు ఇలా చంపేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో గతనెల 18 నుంచి ఇప్పటి వరకు 16 రోజుల్లో నాలుగు హత్యలు జరగడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. జిల్లాలో నేర ప్రవృత్తి పెరుగుతోందనడానికి ఈ ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు హత్యోదంతాల్లో బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కుటుంబాన్ని పోషించే తండ్రి, కన్నవారిని చూసుకునే తల్లి, కడవరకు కష్టాలు, కన్నీళ్లలో తోడుంటానని బాసలు చేసిన ప్రేమికుడు చివరకు చిన్నచిన్న పొరపాట్లతో క్షణికావేశానికిలోనై హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చిన్నచిన్న సమస్యలకే క్షణికావేశంలో చేసిన పొరపాటు వల్ల నిండు ప్రాణాలు బలవుతున్నాయి. అవగాహనలేకనే హత్యలు చట్టాలపై అవగాహన లేకపోవడం వల్లే హత్యలు జరుగుతున్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అధికంగా వివాహేతర సంబం«ధాలు, భూసమస్యలు, పాతకక్షలు, మద్యం మత్తులో క్షణికావేశంలో జరిగే హత్యలు అనేకం. పోలీస్స్టేషన్ను ఆశ్రయిస్తే సమస్య సులువుగానే పరిష్కారం అవుతుంది. – ఉదయ్కుమార్రెడ్డి, డీసీపీ, మంచిర్యాల పకడ్బందీగా చట్టాలు అమలు చట్టాలు చాలా పకడ్బందీగా అమలవుతున్నాయి. నేరం చేసిన వారు ఎంతటి వారైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు. నేరాలు పెరగడానికి కారణం మానవ విలువలు కోల్పోవడం. మనిషిలో అహం, బంధుత్వ విలువలు కోల్పోవడంతో స్వార్ధం పెరిగింది. మనుషుల్లో విలువలు పెరగాలి. – పులి రాయమల్లు, న్యాయవాది, మంచిర్యాల ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ► గత నెల 18న జిల్లా కేంద్రంలోని బృందవన్ కాలనీకి చెందిన పూదారి విజయలక్ష్మి, రవినాల జంటహత్యలు సంచలనం సృష్టించింది. రవినా భర్త నిజామాబాద్కు చెందిన అరుణ్కుమార్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అరుణ్కుమార్పై వరకట్నం కేసు నమోదైంది. తన భార్య కాపురానికి రాకుండా అత్త విజయలక్ష్మి అడ్డుపడడమే కాకుండా అబార్షన్ చేయించిందన్న కోపంతో ఇరువురిని కిరాయి ముఠాతో హత్య చేయించాడు. ► ఈ నెల1న జైపూర్ మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన కాతం లింగయ్య తన భార్య లక్ష్మికి మంత్రాలు వస్తాయన్న అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. ► ఈ నెల 3న జిల్లా కేంద్రంలోని సాయికుంట లో నివాసం ఉంటున్న కొప్పుల నాగరాజు (39)ను వివాహేతర సంబంధం పెట్టుకొని కు టుంబాన్ని పట్టించుకోవడం లేదని అతని భార్య స్వరూప హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. క్షణికావేశంలో.... ► గతేడాది జూన్2న మంచిర్యాల జిల్లా బెల్లంపెల్లి మండలంలోని రంగంపేటకు చెందిన దాగం సురేందర్ తన ప్రహారి గోడకు ప్లాస్టింగ్ చేయిస్తుండగా చల్లూరి దుర్గయ్య తన భూమిలోకి వచ్చి పనులు చేసుకోవద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. క్షణికావేశంలో సురేందర్ దుర్గయ్య తలపై బండరాయితో కొట్టి హత్యచేశాడు. ► కట్టుకున్న భార్యను, పిల్లలను పట్టించుకోవడంలేదని గతేడాది జూన్ 11న కన్నతండ్రినే కుమారుడు గొడ్డలితో నరికి చంపిన ఘటన మంచిర్యాల జిల్లా రాపల్లి స్టేజివద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్(40) అతని కుమారుడి చేతిలో హత్యకు గురయ్యాడు. చదవండి: సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.94 లక్షలు మాయం.. ట్వీస్ట్ ఎంటంటే.. -
ప్రైవేట్ టీచర్లకు నగదు సాయమేది..!
సాక్షి, మంచిర్యాల: ప్రైవేట్ విద్యాసంస్థ బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందించే నగదు సాయంలో జాప్యం జరుగుతోంది. కరోనా అపత్కాలం కింద ఉపాధ్యాయులు, సిబ్బందికి రూ.2వేల ఆర్థిక సాయం, 25 కిలోల సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ నుంచి ప్రతీ నెల 20 నుంచి 22లోపు సాయం అందిస్తోంది. జూన్లో బియ్యం పంపిణీ చేసినా నగదు సాయం బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. జూలై నెల ప్రారంభమైనా రాకపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదురు చూడకతప్పడం లేదు. తొలివిడతలో 2115, మలివిడతలో 1500 మందికి ఈ సాయాన్ని అందిస్తూ వచ్చారు. తొలివిడతలో యూడైస్లో పేర్లు నమోదై ఉన్నవారికి మాత్రమే దక్కడంతో మిగిలిన వారిలో ఆందోళన మొదలైంది. బ్యాంకుల అనుసంధానంతో ఐఎఫ్ఎస్ నెంబర్లు మారడం.. కొందరు రేషన్కార్డు, దుకాణం నంబర్ల నమోదులో తప్పులు దొర్లడంతో సాయానికి దూరం కావాల్సి వచ్చింది. దీంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు సవరణలు చేసి డీఈవో కార్యాలయంలో అందజేశారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన అధికార యంత్రాంగం డైస్లో నమోదు కానీ ప్రైవేట్ ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వానికి నివేదించడంతో మిగిలిన వారందరికీ రెండో విడత సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి 25 కిలోలు, రూ.2వేల నగదు అందుతోంది. ప్రస్తుతం రోజులు గడుస్తున్నా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జూన్ నెలకు బియ్యం పంపిణీ చేసి నగదు రూ.2వేలు అందజేయకపోవడంపై ప్రైవేట్ ఉపాధ్యాయ, సిబ్బందిలో నిరాశ నెలకొంది. అధికారులు చోరవ తీసుకుని ప్రత్యక్ష బోధన జరిగే వరకు ఈసాయం అందించాలని కోరుతున్నారు. అపత్కాల భృతి అందించాలి కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ప్రకటించిన అపత్కాల భృతి జూన్ నెలకు సంబంధించి రూ.2వేల నగదు ఉపాధాయులు, సిబ్బంది ఖాతాలో జమకాలేదు. ప్రభుత్వ సాయం రాకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అధికారుల తప్పిదం వల్ల చాలమంది ప్రీప్రైమరీ ఉపాధ్యాయులు, డ్రైవర్లు, క్లీనర్లకు ఇప్పటివరకు అపత్కాల భృతి రాలేదు. మిగిలిన వారికి కూడా ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – రాపోలు విష్ణువర్థన్రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఆర్థిక సాయం అందించాలి ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే వరకు అపత్కాల భృతి అందించాలి. మూడు నెలలకు సంబంధించి బియ్యం సకాలంలో అందించి, నగదు రూ.2వేలు రెండు నెలలు చెల్లించి, జూన్ మాసం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రభుత్వం అందించే సాయం క్రమం తప్పకుండా అందించి ఆదుకోవాలి. – సుజాత, ఉపాధ్యాయురాలు చదవండి: ఏపీలో విద్య.. మహోన్నతం -
మంచిర్యాల : భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
-
27 ఏళ్ల తర్వాత.. ఫేస్బుక్ ద్వారా
మంచిర్యాలరూరల్ (హాజీపూర్): వారు అన్నదమ్ములు.. చిన్నప్పుడే విడిపోయారు.. ఇన్నాళ్లు ఎక్కడు న్నారో ఏమయ్యారో తెలియదు. 27 ఏళ్ల తర్వాత వారిని ఫేస్బుక్ కలిపింది. తల్లిదండ్రులు చనిపోవడంతో... మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూర్ గ్రామానికి చెందిన ఆడెపు శంకరయ్య, శంకరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు గురువయ్య, లక్ష్మణ్, సతీశ్, కూతురు రమ్య ఉన్నారు. 27 ఏళ్ల క్రితం శంకరయ్య, శంకరమ్మ దంపతులు రెండేళ్ల వ్యవధిలో చనిపోయారు. పిల్లల పోషణ బాధ్యతలను బంధువులు తలా ఒకరు తీసుకున్నారు. అప్పుడు రెండేళ్ల వయసున్న రమ్య బాధ్యతను శంకరయ్య సోదరుడు తీసుకోగా..అప్పటికి 15 ఏళ్ల వయసున్న గురువయ్య లక్సెట్టిపేటలోని బంధు వుల వద్ద, మిగతా ఇద్దరు నంనూర్లోనే బంధువుల వద్ద ఉండిపోయారు. గురువయ్య కొన్నాళ్లు బంధువుల వద్ద ఉండగా.. వారి ఇబ్బందులు, వేధింపులు తట్టుకోలేక చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. వరంగల్, హన్మకొండలలో హోటళ్లలో పనిచేస్తూ వంట మాస్టర్గా పేరు సంపాదించి చివరికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో స్థిరపడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. చిన్ననాటి ఫొటోతో గుర్తించి.. చిన్నవాడైన సతీశ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తూ మెరుగైన స్థితిలో ఉన్నాడు. తన ఇంటి పేరుతో ఫేస్బుక్లో ఎవరైనా ఉన్నారా అని సతీశ్ వెతకగా ఓ వ్యక్తిని గుర్తించాడు. ఆ వ్యక్తి ప్రొఫైల్ చూడగా..అందులో ఓ ఫొటో సతీశ్ వద్ద ఉన్న ఓ ఫొటో రెండూ ఒకేలా ఉండటంతో అతడి నుంచి వెంటనే ఫోన్ నంబర్ తీసుకుని వివరాలు తెలుసుకోవడంతో అతను తన పెద్దన్నయ్య గురవయ్య అని నిర్ధారణకు వచ్చాడు. తన రెండో సోద రుడు లక్ష్మణ్కు చెప్పి ఇతర బంధువులతో కలసి శుక్రవారం హుస్నాబాద్కు వెళ్లి సోదరుడిని కలుసు కుని అతడిని నంనూర్ గ్రామానికి తీసుకువచ్చారు. బంధువులందరూ గురువయ్యను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. -
నట్టేట ముంచిన నకిలీ విత్తనం..!
సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్: నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులను నట్టేట ముంచాయి. మొలకెత్తకపోవడంతో వేలాది రూపాయలు మట్టిపాలయ్యాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే గుర్తింపు లేని విత్తనాలు కొనుగోలు చేసినందుకు కేసు నమోదు చేస్తారనే భయంతో ఆవేదనను దిగమింగుతున్నారు. సీజన్ ఆరంభానికి ముందే గుర్తింపు లేని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నా రైతులను చేరాయి. లూజుగా దొరికే పత్తి విత్తనాలు కిలో రూ.2 వేల నుంచి రూ.2,200 చొప్పున కొనుగోలు చేసి విత్తుకున్నారు. ఎవరి వద్ద కొనుగోలు చేశారో వారిని నిలదీస్తే.. డబ్బు ఇవ్వడం కుదరదని, దాచిన విత్తనాలు ఏమైనా ఉంటే మళ్లీ వేసుకోవాలని, వచ్చే ఏడాది మంచి విత్తనాలు ఇస్తామని సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో మళ్లీ దుక్కి దున్ని విత్తనాలు వేసుకుంటున్నారు. సీజన్ ముందే అందడంతో.. నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు, గ్లైపొసెట్ గడ్డిమందు పట్టుకొని పీడీ యాక్టు వంటి కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమార్కులను జైలుకు పంపించారు. గతంలో కంటే ఈ ఏడాది 70 శాతం రైతుల దరిచేరకుండా చూసినా మరో 20 నుంచి 30 శాతం వరకు ఫిబ్రవరి, మార్చి నెలలోనే గ్రామాల్లోకి విత్తనాలు చేరాయి. మారుమూల ప్రాంతాల్లో, చేన్లలో కవర్లతో భద్రపరిచారు. ఎవరికీ అనుమానం రాకుండా గుర్తింపు ఉన్న కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లలో కలిపి నకిలీ విత్తనాలు వేసుకున్నారు. జూన్ రెండో వారం నుంచి కురిసిన భారీ వర్షాల అనంతరం విత్తుకున్నారు. కొన్ని చోట్ల విత్తనం మొలక శాతం 90 శాతం ఉండగా భీమిని, కన్నెపెల్లి, నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాల్లో కొన్ని చొట్ల 10 నుంచి 30 శాతమే మొలక వచ్చిందని రైతులు వాపోతున్నారు. విత్తనం నాటిన వారం రోజుల్లో మొలక రావాల్సి ఉంటుంది. నేలలో తేమ శాతం బాగానే ఉన్నా 15 రోజుల నుంచి 20 రోజులు గడిచినా మొలక రాలేదని ఆందోళన చెందుతున్నారు. దుఃఖాన్ని దిగమింగి.. నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ రైతు 20 ఎకరాల్లో వేసేందుకు ఈ విత్తనాలు రూ.50 వేలకు కొనుగోలు చేశాడు. దుక్కి, విత్తన సాల్లకు రూ.10 వేలు, విత్తేందుకు కూలీలకు రూ.8 వేలతో వెచ్చించాడు. 10 నుంచి 20 శాతం మాత్రమే మొలక రావడంతో రూ.80 వేల వరకు నష్టపోయాడు. బయటకు చెప్పుకోలేక.. బయటకు వస్తే అధికారులకు తెలిసిపోతుందని దుఃఖాన్ని దిగమింగి మరోసారి విత్తనాలు వేసేందుకు దున్ని సిద్ధపడ్డాడు. చదవండి: జీఎస్టీతో తగ్గిన పన్నుల భారం -
బంపర్ ఆఫర్: ఒక్క ట్వీట్తో నాలుగేళ్ల వేతనం..
సాక్షి, నెన్నెల(మంచిర్యాల): ఉపాధి హామీ పథకం నాలుగేళ్ల కూలీ డబ్బులు ఒక్క ట్వీట్తో వచ్చేశాయి. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య ట్వీట్టర్లో పరిష్కారమైంది. మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం కూలీ జమ్మిశెట్టి రజితకు నాలుగేళ్ల కూలి రూ.12వేలు రావాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో పెండింగ్లో పడింది. ఎంపీడీవో, మంచిర్యాల డీఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. చివరికి ఆమె సోదరుడు సతీష్ ఈ విషయాన్ని ట్విట్టర్లో కేటీఆర్, కలెక్టర్కు పోస్టు చేశాడు. కలెక్టర్ డీఆర్డీవోకు పంపించడంతో అధికారులు స్పందించారు. రెండు రోజుల్లో సమస్య పరి ష్కారం అవుతుందని సతీష్కు సమాచారం పంపించారు. బ్రాంచ్ పోస్టుమాస్టర్ నరేష్ బుధవారం గ్రామానికి వచ్చి రజితకు రూ.12వేలు అందజేశారు. చదవండి: నలుగురి ప్రాణాలు తీసిన క్షణికావేశం -
ఇంటికి రాని భార్య.. మనస్తాపంతో భర్త..
సాక్షి, దండేపల్లి(మంచిర్యాల): భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని లింగాపూర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే లింగాపూర్కు చెందిన శివరాత్రి రాజ్కుమార్(25), అతని భార్య సంధ్య, తల్లిదండ్రులకు 15 రోజుల క్రితం కరోనా సోకింది. అందరూ ఇంట్లో క్వారంటైన్లో ఉండగా సంధ్య పుట్టింటికి వెళ్లింది. సోమవారం మళ్లీ కరోనా టెస్ట్లు చేసుకోగా అందరికి నెగెటివ్ వచ్చింది. దీంతో రాజ్కుమార్ సంధ్యను తీసుకురావడానికి వాళ్ల అత్తగారింటికి వెళ్లగా తిరిగి రావడానికి సంధ్య నిరాకరించింది. మనస్తాపం చెందిన రాజ్కుమార్ మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు. భార్యకు నయం కావడం లేదని భర్త ఆత్మహత్య కోటపల్లి: భార్య అనారోగ్యంతో బాధపడుతుందని మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రాపన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు(35) అనే వ్యక్తి భార్య సుమలత గత ఆరేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. చికిత్స చేయించినా భార్యకు నయం కాకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందిన నాగరాజు మంగళవారం ఉదయం పంట చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్యాముల్ తెలిపారు. చదవండి: భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. -
యూట్యూబ్లో పరిచయం.. పక్కా స్కెచ్.. భార్య, అత్తలను..
సాక్షి, మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 18న జరిగిన తల్లీకూతుళ్ల జంటహత్యల మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మంచిర్యాలకు చెందిన తల్లీకూతురు విజయలక్ష్మి, రవీనాలను రవీనా భర్త అరుణ్కుమార్ యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఇద్దరు వ్యక్తులతో కలిసి హత్యచేశాడు. మంగళవారం స్థానిక డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. పబ్జీ గేమ్తో ప్రేమ.. పెళ్లి.. నిజామాబాద్ జిల్లా శక్కర్నగర్కు చెందిన కాలేరు అరుణ్కుమార్ పబ్జీ గేమ్ ఆడుతుండగా మంచిర్యాలకు చెందిన పూదారి రవీనా(26)తో 2019 సెప్టెంబర్లో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్ వరకు వెళ్లి అనంతరం ప్రేమ... ఆ తర్వాత పెళ్లికి దారితీసింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే 2020 జూన్ 11న వివాహం జరిగింది. కొద్ది నెలలకు రవీనా గర్భం దాల్చడంతో అరుణ్కుమార్ కట్నం కోసం వేధించసాగాడు. రవీనా తన తల్లి విజయలక్ష్మి(47)కి చెప్పడంతో గత ఏడాది డిసెంబర్ 20న ఆమె కూతురును మంచిర్యాలకు తీసుకొచ్చింది. అయినా అరుణ్కుమార్ డబ్బుల కోసం ఫోన్లో వేధించడంతో రవీనా మంచిర్యాల మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పలుమార్లు మహిళా పోలీస్స్టేషన్, సఖీ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా అరుణ్లో మార్పు రాకపోవడంతో కేసు నమోదు చేశారు. అబార్షన్ చేయించినందుకే.. కౌన్సెలింగ్ సమయంలో రవీనా గర్భం విషయం ప్రస్తావనకు వచ్చింది. రవీనా తల్లి విజయలక్ష్మి తన భార్యకు అబార్షన్ చేయించిందని, వారిద్దరిని చంపేస్తానంటూ బెదిరించాడు. అప్పటి నుంచి రవీనా, వి జయలక్ష్మీలపై సోషల్ మీడియాలో, తనకు తెలిసిన వారికి, బంధువులకు వారి ప్రవర్తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. దీనిపై విజయలక్ష్మి స్థానిక పోలీస్స్టేషన్లో అరుణ్పై మరో కేసు పెట్టింది. బిట్టు, సుబ్బు, అరుణ్ల నేరచరిత్ర.. ఈ కేసులోని నిందితులకు ఇదివరకే నేర చరిత్ర ఉంది. గుంటూర్ జిల్లా వైకుంటపురానికి చెందిన జుజ్జవరపు రోషయ్య ఉరఫ్ బిట్టు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు తీసుకొని చాలమందిని మోసం చేశాడు. పందెంకోళ్లు ఆడించేవాడు. గుంటూర్ జిల్లా తెనాలికి చెందిన దండం వెంకటసుబ్బరావ్(సుబ్బు) ఓ మహిళ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అరుణ్పై గతంలో అమ్మాయిలను వేధించిన రెండు కేసులు నిజామాబాద్లో నమోదయ్యాయి. అరుణ్ ఓ రోజు సెల్ఫోన్లో యూట్యూబ్ చూస్తున్న క్రమంలో ఓ న్యూస్ చానల్లో గన్కల్చర్ కార్యక్రమాన్ని చూస్తుండగా కామెంట్ బాక్స్లో ఒక వ్యక్తి సుపీరియర్ కిల్లర్ విజయవాడ అనే ఐడీతో వీ సేల్ వెపన్స్ అండ్ మర్డర్, అండ్ కిడ్నాప్అని ఒక ఇంటర్నేషనల్ నంబర్ ఉంచాడు. దీంతో అరుణ్ ఆ నంబరుకు వాట్సాప్ కాల్ చేసి మాట్లాడగా అవతలి వ్యక్తి తాను గుంటూరుకు చెందిన బిట్టుగా పరిచయం చేసుకున్నాడు. తన భార్య, అత్తమ్మను హత్య చేయాలని అరుణ్ చెప్పగా.. రూ.10లక్షలు ఇస్తే హత్య చేస్తానని, ముందుగా రూ.2లక్షలు ఇవ్వాలని పేర్కొన్నాడు. తన వద్ద అంత డబ్బు లేదని, అత్తమ్మ ఇంట్లో 20 తులాల బంగారం, రూ.4లక్షల నగదు ఉంటుందని నమ్మించాడు. దీంతో బిట్టు తనకు ఆన్లైన్లో పరిచయం ఉన్న తెనాలికి చెందిన సుబ్బుతో వచ్చి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 15న అరుణ్, బిట్టు మాట్లాడుకుని మంచిర్యాలకు వచ్చేందుకు రైలు రిజర్వేషన్ కోసం అరుణ్ రూ.1200 పేటీఎం చేశాడు. 17న బిట్టు, సుబ్బు మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఉదయం 10:30 గంటలకు దిగారు. ముగ్గురూ కలుసుకుని స్థానిక లాడ్జిలో గది అద్దెకు తీసుకుని మందుతో విందు చేసుకుని సాయంత్రం రెక్కీ నిర్వహించారు. హత్యకు అవసరమైన తాడు, హ్యాండ్గ్లౌస్ కొనుగోలు చేసి లాడ్జికి చేరుకొని రాత్రి హత్యకు పథకం వేశారు. తెల్లవారు జామున విజయలక్ష్మి నల్లా నీటి కోసం బయటకు రాగా.. ఆమె వెనకాలే ఇంట్లోకి వెళ్లిన బిట్టు, సుబ్బు ఆమెపై దాడి చేసి మెడకు తాడు బిగించి హత్య చేశారని సీపీ వివరించారు. రవీనా అరిచే ప్రయత్నం చేయగా అరుణ్ ఆమెపై దాడి చేసి గొంతు నొక్కాడు. బిట్టు, సుబ్బు అదే తాడుతో రవీనా మెడకు బిగించి హత్యచేశారని తెలిపారు. ఇంట్లో డబ్బులు, బంగారం లభించకపోవడంతో ల్యాప్టాప్తో బుల్లెట్పై హైదరాబాద్ వైపు పారిపోయారు. షామీర్పేట వద్ద ఆగి ఒప్పందం ప్రకారం రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26 నుంచి 28లోపు విజయవాడకు వచ్చి డబ్బులు ఇవ్వాలని బిట్టు అరుణ్కు అడ్రస్ చెప్పాడు. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన ఏసీపీ అఖిల్ మహాజన్ను సీపీ అభినందించారు. చదవండి: భార్య వేధింపులు తాళలేక ‘భర్త ఆత్మహత్య’.. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు రూ.కోటి టోకరా..
సాక్షి, నస్పూర్(మంచిర్యాల): నస్పూర్ పట్టణంలోని ఎస్బీఐలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.కోటి టోకరా వేసిన ముఠా గుట్టును సీసీసీ పోలీసులు రట్టు చేశారు. గురువారం సీసీసీ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. సీసీసీ నస్పూర్కు చెందిన రంగు అరుణ్కుమార్ బ్యాంకులో 2014 నుంచి బంగారం లోన్ అప్రైజర్గా పని చేస్తున్నాడు. అప్పుల పాలు కావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని తన స్నేహితుడు బ్రహ్మనందచారి సలహా తీసుకున్నాడు. ఇతడు గతంలో మంచిర్యాలలోని ఇండియన్ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న కేసులో ఉన్నాడు. బ్రహ్మనందచారి సలహా మేరకు అరుణ్కుమార్ తన స్నేహితులైన బొమ్మ అన్వేష్, మంకెన లక్ష్మారెడ్డి, కొంగల లింగారెడ్డి, అమ్మ సంతోష్కుమార్, కాడే జీవన్కుమార్ పేరిట నకిలీ బంగారంతో రూ.1,01,36,551 రుణం తీసుకున్నాడు. బ్యాంకు మేనేజర్ నేహశర్మ ఫిర్యాదు మేరకు మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు అరుణ్కుమార్తోపాటు బొమ్మ అన్వేష్, కొంగల లింగారెడ్డి, కాడే జీవన్కుమార్లను అరెస్ట్ చేశారు. మరో అమ్మ సంతోష్కుమార్, మంకెన లక్ష్మారెడ్డిలు పరారీలో ఉన్నారు. సీఐ కుమార్స్వామి, ఎస్సై శ్రీనివాస్లను ఏసీపీ అభినందించారు. చదవండి: పెళ్లై మూడువారాలు.. బాయ్ఫ్రెండ్ మెసెజేస్.. కట్ చేస్తే.. -
ప్రభుత్వ జాగా.. వేసేయ్ పాగా!
సాక్షి, చెన్నూర్(మంచిర్యాల): ప్రభుత్వ జాగా కన్పిస్తే చాలు కొందరు అక్రమార్కులు పాగా వేస్తున్నారు. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే అన్యాక్రాంతమైంది. రోజురోజుకూ ప్రభుత్వ భూములు కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్తున్న అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెన్నూర్ పట్టణ సమీపంలోని గెర్రె కాలనీతో పాటు 63వ జాతీయ రహదారి పక్కన, బావురావుపేట వెళ్లే రహదారి, కత్తరశాల రోడ్డులోని 869 సర్వే నంబర్లో సుమారు రెండు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది. కొందరు రియాల్టర్లు ప్రభుత్వ స్థలాల్లో ముందుగా అక్రమార్కులు చిన్నచిన్న షేడ్లు నిర్మించి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో పక్క నిర్మాణాలు చేపడుతున్నారు. అనంతరం రియల్ దందాకు తెరతీస్తున్నారు. ఈ వ్యవహారం కొందరు అధికారులు కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు లేకపోలేదు.. విలువైన వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. భూముల ధరలకు రెక్కలు... గెర్రె కాలనీ సమీపంలోని భూముల ధరలకు రెక్కలచ్చాయి. గతంలో పది వేలకు గుంట ధర పలుకని భూమి 63వ జాతీయ రహదారి నిర్మాణంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం గెర్రెకాలనీ సమీపంలో గుంట భూమి ధర రూ.10 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఖాళీ స్థలం కన్పిస్తే చాలు కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణాలకు అనుమతి ఎలా..? పట్టా భూములతో పాటు రిజిస్ట్రేషన్ స్థలాలు గల వారు ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు మున్సిపాలిటీ నుంచి అనుమతి లభించాలంటే నెల నుంచి రెండు నెలలు పడుతుంది. ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాలకు మున్సిపాలిటీ అధికారులు అనుమతి ఎలా ఇస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. మున్సిపాలిటీ ఏర్పడకముందు చెన్నూర్లోని అన్ని భూములు అబాది భూములే ఉన్నాయి. 100 ఏళ్లకు పైగా నిర్మాణాలు కలిగి ప్రస్తుతం మున్సిపాలిటీ రికార్డల్లో ఆ ఇంటి నంబర్లు ఉన్నప్పటికీ పాత ఇంటి స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపడితే మున్సిపాల్ అధికారులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ అసైన్డ్ భుముల్లో ఇంటి నిర్మాణాలకు ఏ ప్రతిపాదికన అనుమతి ఇస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. చెన్నూర్ పట్టణంలోని జెండవాడకు చెందిన సమ్మయ్య అనే వ్యక్తి తనకున్న అబాది భూమిలో ఇంటి నిర్మాణం కోసం మున్సిపాలిటీకి రూ.10వేల పన్ను చెల్లించి నిర్మాణం చేపట్టాడు. అబాది భూముల్లో ఇంటి నిర్మాణానికి ముందుగా అనుమతించిన మున్సిపాల్ అధికారులు ఇటీవల అడ్డుకున్నారు. గెర్రె, జాతీయ రహదారి, కత్తరశాల రోడ్డులలో రెండంతస్తులు భవనాలు నిర్మిస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కట్టడాలు నిలిపివేస్తున్నాం ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటున్నాం. నా దృష్టికి వచ్చిన నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశాం. అక్రమ నిర్మాణాల విషయంలో లాలూచి పడినట్లు ఆరోపణలు వచ్చిన ఇద్దరు వీఆర్ఏలను సస్పెండ్ చేశాం. అక్రమాలను పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేదిలేదు. –జ్యోతి, తహసీల్దార్, చెన్నూర్ -
వామ్మో.. ఇంటి కరెంటు బిల్లు రూ.6.69 లక్షలు
మంచిర్యాల అగ్రికల్చర్: ఓ ఇంటి యజమాని ఏకంగా రూ.6.69 లక్షలు కరెంట్ బిల్లు చూసి బెంబేలెత్తిపోయాడు. మంచిర్యాల పట్టణం గౌతమినగర్కు చెందిన ముప్పుడి రాజేందర్ ఇంటికి సోమవారం బిల్ రీడర్ వచ్చాడు. మీటర్ నంబరు 63118–55668 రీడింగ్ నమోదు చేయగా.. ఇందులో 42 రోజుల వ్యవధికి 70,188 యూనిట్లు వినియోగానికి గాను రూ.6,69,117 బిల్లు అందజేసి వెళ్లిపోయాడు. దీన్ని చూసి రాజేందర్ నిర్ఘాంతపోయాడు. గత నెల 5న రూ.2,528 బిల్లు చెల్లించాడు. ఎలాంటి పెండింగ్ బిల్లూ లేదు. ఈ విషయమై సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాస్ స్పందిస్తూ.. అధికంగా బిల్లు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, మీటర్ రీడింగ్ను మరోసారి పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. -
మధ్యవర్తులదే హవా.. నెల రోజుల్లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్..
సాక్షి, మంచిర్యాల: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు ఘటనల్లోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో వారిపై వేటు పడింది. లక్సెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటి సబ్రిజిస్ట్రార్ ఇక్బాల్ సెలవుల్లో ఉండగా ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా రతన్ విధుల్లో చేరారు. ఈయన గత నెల 11న రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదంగా మారింది. ఒకే రోజు 39 రిజిస్ట్రేషన్లు చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఫిర్యాదులు వెళ్లాయి. రియల్టర్లకు అనుకూలంగా రిజిస్ట్రేషన్లు చేశారని స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆఫీసు ముందు నిరసనలు వ్యక్తం చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. జూన్ 15న మంచిర్యాల సబ్రిజిస్ట్రార్ అప్పారావు సైతం సస్పెండ్ అయ్యారు. ఈయన క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో అమర్వాది శివారులోని సర్వే నంబర్ 3లో 847గజాల ప్లాట్లో లే అవుట్ లేకుండానే మూడు ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్లు చేశారనే ఫిర్యాదుతో సస్పెండ్ అయ్యారు. ‘పాత పద్ధతి’తో సాగని రియల్ వ్యాపారం జిల్లాలో బొగ్గు గనులు, అనుబంధ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలకు పుష్కలమైన అవకాశాలు ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపార వృద్ధికి ఊతమిస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాలు, జాతీయ రహదారులకు అనుకుని ఉన్న గ్రామాలు శర వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం జిల్లా ఆవిర్భావం కంటే ముందు నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతోంది. దీంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక అక్రమాలకు తెరలేపారు. దీంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం కొందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తమ ఆధిపత్యం నడిపించారు. జిల్లాలో చాలా చోట్ల ప్రభుత్వ, లావుణి, నాలా అనుమతి లేకుండానే అడ్డగోలుగా అక్రమంగా వెంచర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయించారు. మున్సిపల్, రెవెన్యూ, నాలా, డీటీసీపీ అనుమతులు పొందకుండానే పెద్ద ఎత్తున ప్లాట్లు చేతులు మారాయి. మంచిర్యాలతోపాటు గద్దెరాగడి, తిమ్మాపూర్, మందమర్రి, నస్పూర్, హాజీపూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, జైపూర్తోపాటు అనేక ప్రాంతాల్లో లే అవుట్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు సాగాయి. ప్రభుత్వం గత అక్టోబర్ నుంచి వ్యవసాయ భూములకు ధరణి పోర్టల్లో ఎమ్మార్వో కార్యాలయాలకు అనుమతి ఇచ్చింది. వ్యవసాయేతర భూములకు మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం ఇచ్చారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ పథకంపై ఎటువంటి చర్యలు తీసుకొవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎల్ఆర్ఎస్కు బ్రేక్ పడింది. దీంతో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధనతో సామాన్యులకు ఇబ్బందిగా మారింది. ప్లాట్ కొనలేక, అమ్మలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం డాక్యుమెంట్టు డాక్యుమెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. అంటే కొత్త ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయరాదు. గతంలో రిజిస్ట్రేషన్లు చేసిన ప్లాట్లకు మాత్రమే చేయాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో అన్ని అనుమతులు, లే అవుట్ అనుమతి ఉన్న వాటికే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో జిల్లాలో రియల్ లావాదేవీలకు దెబ్బ పడింది. గతంలోనే జిల్లాలో లే అవుట్ లేని ప్లాట్లు అనేకంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇతర జిల్లాల్లో పాత పద్ధతిలోనే చేస్తున్నారని ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఇక్కడి రియల్వ్యాపారులు పలుమార్లు కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ కేవలం పాత డాక్యుమెంట్లకే రిజిస్ట్రేషన్లు చేశారు. లక్సెట్టిపేటలో రియల్ వ్యాపారులకు తలొగ్గి రాత్రికి రాత్రే అధిక రిజిస్ట్రేషన్లు చేయడం, మంచిర్యాల పరిధిలో తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్లు చేయడం లేదనే కారణంతో ఓ పథకం ప్రకారం సస్పెండ్ చేయించినట్లు అనుమానాలు ఉన్నాయి. అక్కడంతా వారిదే రాజ్యం.. జిల్లాలోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తులు, రియల్ దళారులు, అనధికార వ్యక్తుల హవానే నడుస్తోంది. భూమి, స్థిర ఆస్తి, సంస్థలు, వివాహ, సొసైటీలు తదితర రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్ సేవలు అందుబాటులో వచ్చినప్పటికీ మధ్యవర్తుల హవా తగ్గడం లేదు. ఒక్కో డాక్యుమెంట్కు ఒక రేటు ఫిక్స్ చేసి వసూళ్లు సాగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు ఇదంతా తెలిసినా నోరు మెదపరు. ప్రస్తుతం లే అవుట్ అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో చాలావరకు రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. కరోనాకు ముందు, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు మంచిర్యాలలో రోజుకు 80వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం 50నుంచి 60వరకు జరుగుతున్నాయి. లక్సెట్టిపేట పరిధిలో రోజుకు రెండు మాత్రమే అవుతున్నాయి. దీంతో చాలామంది ఆదాయ వనరులు దెబ్బతిన్నాయి. చదవండి: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘాటైన గ్యాస్ లీక్ -
స్మార్ట్ఫోన్ కొనివ్వలేదని ఒకరు.. ఫోన్ నాకే కావాలంటూ మరొకరు
సాక్షి, హైదరాబాద్( వికారాబాద్ల): తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బార్గమ్ గ్రామానికి చెందిన గులాం, షాహిన్ దంపతులకు ఓ కుమారుడు, కూతురు షేక్ ముస్కాన్(17) ఉన్నారు. ఉపాధి కోసం మూడేళ్ల క్రితం ఇక్కడకు వచ్చారు. గులాం, షాహిన్లు ఓ ఫౌల్ట్రీఫారంలో పనిచేస్తున్నారు. తనకు స్మార్ట్ఫోన్ కావాలని బాలిక తల్లిదండ్రులను కోరగా, కొనిస్తామని చెప్పి ఊరుకున్నారు. వారినుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురైన ముస్కాన్, బుధవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫోన్ కోసం తోబుట్టువుల గొడవ సెల్ఫోన్ కోసం తోబుట్టువుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుధాకుర్థులో ఈ సంఘటన చోటుచేసుకుంది. బుధాకుర్థుకు చెందిన టేకుమట్ల వరలక్ష్మి, సత్యనారాయణ దంపతులకు కూతురు స్నేహిత, కుమారుడు శివ ఉన్నారు. స్నేహిత పాలిటెక్నిక్ డిప్లొమా, శివ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. గురువారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో స్నేహిత, శివ మధ్య సెల్ఫోన్ కోసం గొడవ జరిగింది. దీంతో స్నేహిత (20) తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుంది. చదవండి: ఇన్స్పెక్టర్కు రౌడీషీటర్ దమ్కీ.