రోడ్డు ప్రమాదం: ఇంజిన్‌లో ఇరుక్కున్న విద్యార్థి కాళ్లు | Road Accident: School Bus Hits A Tree In Dichpalli | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: ఇంజిన్‌లో ఇరుక్కున్న విద్యార్థి కాళ్లు

Published Tue, Jan 28 2020 10:38 AM | Last Updated on Tue, Jan 28 2020 3:52 PM

Road Accident: School Bus Hits A Tree In Dichpalli - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నల్లవెల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లవెల్లి నుంచి డిచ్‌పల్లికి వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చెట్టును ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగంలోని ఇంజన్‌లో మున్నా అనే నాలుగో తరగతి విద్యార్థి రెండు కాళ్లు ఇరుక్కుపోయాయి. కొంత సమయం తర్వాత స్థానికులు గ్యాస్‌ కట్టర్‌ సాయంతో విద్యార్థి కాళ్లు బయటకు తీశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలవ్వగా.. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. కాగా బస్‌ డ్రైవర్‌ అతివేగం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement