తిరుపతిలో టెన్త్‌ విద్యార్ధినుల అదృశ్యం.. తీవ్ర కలకలం! | Three Tenth Class Girl Students Missing In Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో టెన్త్‌ విద్యార్ధినుల అదృశ్యం.. తీవ్ర కలకలం!

Published Thu, Jan 3 2019 5:35 PM | Last Updated on Thu, Jan 3 2019 6:00 PM

Three Tenth Class Girl Students Missing In Tirupati - Sakshi

అదృశ్యమైన పదో తరగతి విద్యార్ధినులు

ఉదయం స్కూలుకు వెళుతున్నామని చెప్పి వెళ్లిన ముగ్గురు పదో తరగతి విద్యార్ధినులు

సాక్షి, తిరుపతి : నగరంలో విద్యార్థినుల మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. ఉదయం స్కూలుకు వెళుతున్నామని చెప్పి వెళ్లిన ముగ్గురు పదో తరగతి విద్యార్ధినులు అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురానికి చెందిన గౌరీ, కడపకు చెందిన నాగమ్మ, కోర్లగుంటకు చెందిన సాయి ప్రియలు ఉదయం స్కూలుకు వెళుతున్నామని చెప్పి వెళ్లి కనిపించకుండా పోయారు.

వీరిలో ఇద్దరు ప్రభుత్వ బాలబాలికల సంరక్షణ గృహానికి చెందిన వారు కాగా మరొక అమ్మాయి ప్రైవేటు స్కూలుకు చెందిన విద్యార్ధిని. సంరక్షణ గృహం నుంచి వెళ్లిపోతున్నట్లు రాసిన ఓ లేఖను సంరక్షణ గృహ సిబ్బంది గుర్తించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కనపడకుండా పోయిన విద్యార్ధినుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement