
రైలులో ప్రయాణికుడిపై హిజ్రాల దాడి
వ్యాపార నిమిత్తం నాగపూర్ నుంచి ఒంగోలుకు అండమాన్ ఎక్స్ప్రెస్ రైలులో బయల్దేరాడు. జమ్మికుంటలో ఈ రైలులోకి ఎక్కిన హిజ్రాలు ఓం ప్రకాష్ ను డబ్బులు ఇవ్వమని అడగగా ఇవ్వకపోవడంతో అతడిని కాళ్లతో తన్ని కిటికి వద్దకు నెట్టేశారు. దీంతో అతడికి తలకు తీవ్రగాయాలై రక్త స్రావం జరిగింది. హిజ్రాలు కాజీపేట–వరంగల్ మధ్య దిగి పరారయ్యారు. కాజీపేట జీఆర్పీ పోలీసులు ఓం ప్రకాష్ను ఆస్పతికి పంపించారు. పరారైన హిజ్రాల కోసం గాలిస్తున్నారు.