
సీజేఐ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణతో బాబు భేటీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఎన్వీ రమణతో చంద్రబాబు భేటీ అయ్యారు
ఉదయం 8.30 సమయంలో న్యాయమూర్తులు కూడా తిరుమల నుంచి తిరుగుప్రయాణమయ్యారు. వీరికి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, చిత్తూ రు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, టీటీడీ లీగల్ ఆఫీసర్ వెంకట్రమణ, జిల్లా జడ్జి దుర్గాప్రసాద్, ప్రొటోకాల్ జడ్జి శేషాద్రి వీడ్కోలు పలికారు. గురువారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత న్యాయమూర్తులు తిరుమలలోనే బసచేశారు.